-
HYD Long Queues At Petrol Pumps:హైదరాబాద్లో వాహనదారులకు పెట్రో ట్రబుల్స్ (ఫొటోలు)
-
375 ఏళ్లకు బయటపడిన 8 వ ఖండం ఏది?
మనిషి భూమి నలుచెరగులా తిరిగాడని, ఇక చూడాల్సినది ఏమీ లేదని అనుకుంటే అది తప్పే అవుతుంది. నేటికీ భూమిపై అన్వేషించేందుకు చాలా రహస్యాలు దాగివున్నాయి. 375 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఇటీవలే శాస్త్రవేత్తలు భూమికి గల 8వ ఖండం అయిన జిలాండియాను కనుగొన్నారు. ఈ ఖండం చాలా పెద్దది. పలు చిన్న దేశాలకు ఇందులో వసతి కల్పించవచ్చు. ఈ ఖండానికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఇది చాలా ఏళ్లుగా దాగున్న ఖండం అని చెబుతారు. 2017 సంవత్సరం వరకు ఈ ఖండం గురించి ఎవరికీ తెలియదు. అయితే ఈ ఏడాది కొందరు శాస్త్రవేత్తలు దీని గురించి ప్రస్తావించడంతో ప్రపంచం దృష్టి ఈ ఖండంవైపు మళ్లింది. ఈ 8వ ఖండం 49 లక్షల చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉందని పలు శాస్త్రవేత్తలు తమ పరిశోధనలో గుర్తించారు. దీని ఉనికి విషయానికొస్తే ఈ ఖండం దాదాపు 55 కోట్ల ఏళ్ల క్రితం ఏర్పడి ఉండవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. శాస్త్రవేత్తలు తెలిపిన వివరాల ప్రకారం ఈ ఖండంలోని 94 శాతం భూభాగం నీటిలో మునిగిపోయింది. 6 శాతం భూమి మాత్రమే అందుబాటులో ఉంది. ఇది న్యూజిలాండ్ మాదిరిగా కనిపిస్తుంది. ఈ ఖండం చాలా ప్రత్యేకమైనది. అగ్నిపర్వత శిలలు ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ కనిపించే జంతువులు, జీవులు ప్రపంచంలోని ఇతర జీవులకు భిన్నంగా కనిపిస్తాయి. ఈ ఖండంలో దాగున్న రహస్యాలను వెలికితీసేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. ఇది కూడా చదవండి: భారత్లో ఆఫ్ఘన్ ఎంబసీ మూసివేత! -
త్రాచును మించిన జడ.. పడగ కూడా..!
లక్నో: కురులంటే ఆడవారికి ఎంతో ఇష్టం. అవి వారి అందాన్ని మరింత పెంచుతాయి. అందుకే ఎంతో ప్రత్యేకంగా వాటిని కాపాడుకుంటుంటారు. నిండైన జడ కోసం ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు. ఇది ఒకవైపు.. మరోవైపు కురులకు ఆధ్యాత్మికంగా కూడా ఎంతో ప్రధాన్యత ఉంటుంది. అయితే.. తాజాగా ఉత్తరప్రదేశ్లోని బృందావన్ ధామ్లో ఓ మహిళ కురులు త్రాచుపాము అంతటి పరిమాణంలో ఉండి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. బృందావన్ ధామ్ ఆధ్యాత్మికంగా హిందువులకు ఎంతో ప్రధాన్యత కలిగిన ప్రదేశం. కృష్ణుని జన్మస్థానంగా పేర్కొంటారు. ఇక్కడ ఓ మహిళ జుట్టు చాలా పెద్ద పరిమాణంలో పెరిగింది. దాదాపుగా త్రాచుపాము లాగే కనిపిస్తోంది. నిత్యం ఆధ్యాత్మిక చింతనలో ఉన్న ఆ మహిళ తన జుట్టును ఏ మాత్రం పట్టించుకోకున్నా.. ఇంతటి పరిమాణంలో పెరిగింది. జడలు కట్టి ఉన్న ఈ మహిళ పాదాలకు భక్తులు నమస్కారం చేస్తుంటారు. తమకు తోచినంత సహాయం చేస్తుంటారు. View this post on Instagram A post shared by Meri Yamuna Ji (@meriyamunaji) సోషల్ మీడియోలో ఈ మహిళ తెగ వైరల్ అవుతోంది. ఆమె జుట్టుపై నెటిజన్లు తెగ కామెంట్లు చేశారు. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవారు జుట్టుకు ఎలాంటి పోషణ చేయకున్నా.. ఇంతటి స్థాయిలో పెరగడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. నాగుపాము ఆకారంలో జడ ఏర్పడటంతో ప్రణామాలు చేస్తున్నారు. నిజంగా ఇది చాలా వింత కదా..! ఇదీ చదవండి: ప్రతి గణేష్ విగ్రహానికీ క్యూఆర్ కోడ్ -
లాంగ్రేంజ్ ఎలక్ట్రిక్ స్కూటర్.. ఒక్క చార్జ్తో 200 కిలోమీటర్లు!
నోయిడా: ఎనిగ్మా ఆటోమొబైల్స్ కంపెనీ యాంబియర్ ఎన్8 ఎలక్ట్రిక్ స్కూటర్ను అధికారికంగా విడుదల చేసింది. ఇది ఒక్క చార్జ్తో 200 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని సంస్థ ప్రకటించింది. అంతేకాదు బ్యాటరీని వేగంగా 2–4 గంటల్లోనే చార్జ్ చేసుకోవచ్చని, ఎలక్ట్రిక్ స్కూటర్ పరిశ్రమలో విప్లవాత్మక మార్పును తీసుకొస్తుందని పేర్కొంది. మార్కెటింగ్లో పనిచేసే వారు, రెండు పట్టణాల మధ్య ప్రయాణించే వారి అవసరాలను దృష్టిలో పెట్టుకుని యాంబియర్ ఎన్8ను తీసుకొచ్చినట్టు తెలిపింది. పర్యావరణ అనుకూలమైన వాహనా న్ని ఆకర్షణయమైన ధరకే అందిస్తున్నట్టు పేర్కొంది. దీని ఎక్స్షోరూమ్ ధర రూ.1,05, 000 నుంచి రూ.1,10,000 మధ్య ఉంది. 100 వాట్ మోటార్తో వచ్చే ఈ స్కూటర్ గరిష్టంగా 50 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. సీటు కింద 26లీటర్ల స్టోరేజీ స్పేస్ కూడా ఉంది. -
ఆమెకు 4 అడుగుల 7 అంగుళాల కురులు.. 100 ప్రపోజల్స్, రూ.2.6 కోట్ల ఆఫర్!
మన మధ్యలో కనిపించే కొందరికి కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి. ఒకరికి స్కిన్ టోన్ బాగుంటే, మరొకరు మంచి ఎత్తులో ఉంటారు. ఈ కోవకు చెందినదే ఇంగ్లండ్కు చెందిన జాస్మిన్ లార్సన్. ఈమె నిజజీవితంలో డిస్నీప్రిన్సెస్. జనం ఆమె కురులకు ఫిదా అయిపోతుంటారు. ఈ నేపధ్యంలోనే ఆమెకు లెక్కలేనన్ని పెళ్లి ప్రపోజల్స్ వస్తుంటాయి. 22 ఏళ్ల జాస్మిన్ 2017 నుంచి తన కురులను పెంచడం ప్రారంభించింది. ఇప్పుడు ఆమె ఆకర్షణీయమైన కురుల పొడవు 4 అడుగుల 7 అంగుళాలు. ఈ పొడవైన కురులు ఆమె మోకాళ్ల వరకూ ఉంటాయి. తన కురులను చూసి ముచ్చటపడిన 100 మందికిపైగా కుర్రాళ్లు తనకు ఆన్లైన్లో ప్రపోజల్స్ పంపారని జాస్మిన్ ఆనందంతో పొంగిపోతూ చెప్పింది. తన కురులను కట్ చేయించుకుంటే £250,000 (రూ. 2.6 కోట్లు) ఇస్తామంటూ కూడా ఆఫర్లు వచ్చాయని ఆమె తెలిపారు. దీనికి తాను ఒప్పు కోలేదని, తన జట్టు కత్తిరించి, దానిని ఎవరికో పంపాలని అనుకోవడం లేదని, ఈ కురులను ఎంతో అపురూపంగా చూసుకుంటున్నానని ఆమె పేర్కొన్నారు. బ్రిస్టల్లో ఉంటున్న జాస్మిన్ సోషల్ మీడియాలో తన కురులకు చెందిన ఫొటోలను షేర్ చేస్తుంటుంది. ప్రపంచంలోని చాలామందిని ఇవి ఆకర్షిస్తుంటాయని, ముఖ్యంగా ధనవంతులు తన కురులకు ఆకర్షితులవుతున్నారని జాస్మిన్ తెలిపింది. ఇన్స్టాగ్రామ్లో జాస్మిన్కు 10వేల మందికిపైగా ఫాలోవర్స్ ఉన్నారు. పలు బ్రాండ్స్ ఆమెతో కొలాబ్రేషన్కు సంప్రదిస్తుంటాయి. కాగా జాస్మిన్ ఒక కంపెనీలో ప్రొడక్షన్ అసిస్టెంట్గా పనిచేస్తున్నారు. ఇది కూడా చదవండి:11 రోజుల ప్రేమ.. 10 వేల కి.మీ. ప్రయాణం.. సరిహద్దులు చెరిపేసిన ప్రేమ కథ
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పక్కాగా పరిశీలన..
జనజాతర సభ సైడ్లైట్స్
కాంగ్రెస్కు అండగా ఉండాలి..
తలసేమియాపై అవగాహన
కాంగ్రెస్కు ఓటేస్తే దండగ
పకడ్బందీగా ఈవీఎంల కమిషనింగ్
నాణ్యమైన విద్యుత్ తీగలు వినియోగించాలి
‘వంశీని గెలిపిస్తే జిల్లా పేరు మారుస్తారు’
● కాంగ్రెస్ ‘జనజాతర’ విజయవంతం ● రాహుల్గాంధీ సభకు భారీగా జనం ● ఉమ్మడి జిల్లాను దత్తత తీసుకుంటాం ● సభలో సీఎం రేవంత్రెడ్డి ● తుమ్మిడిహెట్టి, సీసీఐలపైనా హామీ ● బీజేపీపై విరుచుకుపడిన నాయకులు
Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
తప్పక చదవండి
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- Prajwal Revanna: 4 రోజులు సిట్ కస్టడీ
- పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
Advertisement