Locker services
-
లక్షల్లో సంపాదన.. ఇస్మార్ట్ ఆటోవాలాకు బిగ్ షాక్
ఆటో నడపకుండానే.. కత్తిలాంటి ఐడియాతో నెలకు లక్షల్లో సంపాదిస్తున్నాడంటూ ఓ ఆటోవాలా గురించి సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరిగింది. నిజనిర్ధారణలోనూ.. అది వాస్తవమేనని తెలిసేసరికి వహ్ అనుకున్నారంతా. ప్రముఖులు సైతం బ్రిలియంట్ అంటూ మెచ్చుకున్నారు. అయితే ఆ ప్రచారమే ఇప్పుడు అతని పాలిట శాపంగా మారింది. లింక్డిన్లో వెన్యూమోంక్ కో ఫౌండర్ రాహుల్ రుపానీ ఆ ఆటోడ్రైవర్ కథనాన్ని షేర్ చేశారు. బంద్రాకుర్లా కాంప్లెక్స్లోని యూఎస్ కన్సులేట్ బయట ఆటోను పార్క్ చేసి.. వచ్చిపోయే సందర్శకుల సామాన్లను క్లాక్ రూమ్ తరహాలో ఆటోలో భద్రపరిచి సంపాదన చేస్తున్నాడతను. అలా ఒక్కో కస్టమర్ దగ్గరి నుంచి రూ.1000 చొప్పున.. నెలకు రూ.ఐదు లక్షల నుంచి 8 లక్షల దాకా సంపాదిస్తున్నాడంటూ ఆయన స్టోరీ షేర్ చేశారు. హర్ష్ గోయెంకాలాంటి ప్రముఖులు సైతం ఆ ఆటోవాలా బుర్రకు ఫిదా అయిపోయారు.అయితే అతని కథనాలకు ముంబై పోలీసులు స్పందించారు. ఆ ఆటో డ్రైవర్ లాగే మరో 12 మంది అక్కడే అదే పనిలో ఉన్నట్లు తెలుసుకున్నారు. తక్షణమే ఆ జాగా ఖాళీ చేయాలంటూ అందరికీ సమన్లు జారీ చేశారు. ‘‘యూఎస్ కన్సులేట్ బయట భద్రతా కారణాల దృష్ట్యా పార్కింగ్ నిషేధిస్తున్నాం. ఆటో డ్రైవర్లు కేవలం ప్యాసింజర్లను అక్కడ దించి వెళ్లిపోవాలే తప్ప ఆ పరిసర ప్రాంతాల్లో కనిపించకూడదు అంటూ ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ నిర్ణయంపై విమర్శలు రావడంతో ముంబై పోలీసులు మళ్లీ స్పందించారు. ‘‘ఆ ఆటో డ్రైవర్కు లైసెన్స్ ఇచ్చింది ఆటో నడుపుకోవడానికి. అంతేగానీ లాకర్ సేవలు అందించడానికి కాదు. అతను మాత్రమే కాదు.. అతనిలా మరికొందరు డ్రైవర్లు అదే పనిలో ఉన్నారని మా విచారణలో తేలింది. కేవలం డ్రైవర్లకు మాత్రమే కాదు.. సమీపంలోని దుకాణాదారులకు కూడా లాకర్ సర్వీసులు నడిపించేందుకు అనుమతులు లేవు. ఒకవేళ ఎవరైనా అలా నడిపిస్తే కఠిన చర్యలు తప్పవు’’ అని ముంబై పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. పాపం.. బ్రిలియంట్ ఐడియాతో వైట్ కాలర్ జీతగాళ్లకు కూడా దక్కని సంపాదనతో బిజినెస్ చేస్తున్నాడని పొగిడేలోపే ఆ ఆటో డ్రైవర్కు బిగ్ షాక్ తగిలింది. -
‘న్యూ ఇయర్ నుంచి జరిగే మార్పులు ఇవే’.. తెలుసుకోకపోతే మీకే నష్టం!
మరికొద్ది రోజుల్లో 2023 ముగిసి.. 2024 కొత్త ఏడాదికి స్వాగతం పలకబోతున్నాం. ఈ తరుణంలో రోజూవారి జీవితంతో ముడిపడి ఉన్న ఆర్ధికపరమైన అంశాల్లో అనేక మార్పులు చోటు చేసుకోనున్నాయి. ముఖ్యంగా బ్యాకింగ్, స్టాక్ మార్కెట్ మార్కెట్, బ్యాంక్ లాకర్, ఆధార్లో మార్పులు వంటి అంశాలు ఉన్నాయి. అయితే, డిసెంబర్ 31 ముగిసి న్యూఇయర్లోకి అడుగు పెట్టిన అర్ధరాత్రి నుంచి చోటు చేసుకునే మార్పుల కారణంగా ఎలాంటి ఆర్ధికరపరమైన ఇబ్బందులు లేకుండా ఉండాలంటే డిసెంబర్ నెల ముగిసే లోపు తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. వాటిల్లో ప్రధానంగా డీమ్యాట్ అకౌంట్కు నామిని : మీరు ఇప్పటికే స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేస్తున్నా.. లేదంటే కొత్త ఏడాది నుంచి మొదలు పెట్టాలనే ప్రణాళికల్లో ఉంటే మాత్రం తప్పని సరిగా డీమ్యాట్ అకౌంట్లో నామిని వివరాల్ని అందించాల్సి ఉంటుంది. సాధారణంగా పెట్టుబడిదారులు స్టాక్స్ను అమ్మాలన్నా, కొనాలన్నా.. సెక్యూరిటీస్ని అమ్మాలన్నా, కొనాలన్నా ఎలక్ట్రానిక్ ఫార్మాట్లో చేసుకోవచ్చు. స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ఆదేశాల మేరకు డిసెంబర్ 31 లోపు నామినీ వివరాల్ని అందించపోతే ఇకపై మీరు ఎలక్ట్రానిక్ ఫార్మాట్లో చేసేందుకు అర్హులు, పైగా స్టాక్స్ను అమ్మలేరు, కొనలేరు. బ్యాంక్ లాకర్ అగ్రిమెంట్ : ఆర్బీఐ నిబంధనల ప్రకారం.. బ్యాంక్ లాకర్ అగ్రమిమెంట్లో డిసెంబర్ 31,2023లోపు సంతకం చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం సంబంధిత బ్యాంకుల్ని సంప్రదించాలి. నిబంధనల్ని పాటించకపోతే లాకర్ ఫ్రీజ్ అవుతుంది. ఖాతాదారుల ఇబ్బందుల దృష్ట్యా ఆర్బీఐ డెడ్లైన్ను పొడిగించే అవకాశం ఉంటుందని అంచనా. ఆధార్ కార్డ్లో మార్పులు : భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్ కార్డ్లో ఏదైనా మార్పులు, చేర్పులు ఉంటే ఉచితంగా చేసుకోవచ్చని సెప్టెంబర్ 14, 2023 వరకు గడువు ఇచ్చింది. ఆ తర్వాత ఆధార్ కార్డ్దారుల సౌలభ్యం మేరకు ఆ గడువును డిసెంబర్ 31 వరకు పొడిగింది. కొత్త ఏడాది ప్రారంభం నుంచి ఆధార్లో మార్పులు చేసుకోవాలంటే రూ.50 సర్వీస్ ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. రూ.50 సర్వీస్ ఛార్జీ అంటే సులభంగా తీసుకోవద్దు. దేశంలో రోజూవారి కార్మికులు ఎంత సంపాదిస్తున్నారని తెలుసుకునేందుకు ప్లీటాక్స్ ఆనే సంస్థ సర్వే చేసింది. ఆ సర్వేలో దినసరి కూలి రూ.178 అని తేలింది. కాబట్టే డిసెంబర్ 31 లోపు ఆధార్లో మార్పులు ఉంటే చేసుకోవచ్చని యూఐడీఏఐ తెలిపింది. సిమ్ కార్డ్లో మార్పులు : వచ్చే ఏడాది జనవరి 1 నుంచి కొత్త సిమ్ కార్డ్ తీసుకోవడం మరింత సులభతరం కానుంది. ఇప్పుడు మనం ఏదైనా టెలికాం కంపెనీ సిమ్ కార్డ్ కావాలంటే పేపర్లకు పేపర్లలో మన వివరాల్ని నమోదు చేయాల్సి ఉంటుంది. ఇకపై ఈ ప్రాసెస్ అంతా అన్లైన్లోనే జరుగుతుందని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ (డాట్) తెలిపింది. కెనడాలో మారనున్న నిబంధనలు : ఈ నిర్ణయంతో జనవరి 1 నుంచి భారత్తో పాటు ఇతర దేశాల విద్యార్ధులు కెనడాకు వెళ్లాలంటే కాస్త ఇబ్బందే అని చెప్పుకోవాలి. కెనడాలో చదువుకునేందుకు స్టడీ పర్మిట్ కావాలి. ఇందుకోసం దరఖాస్తు చేసుకోవాలంటే విద్యార్ధుల వద్ద 10వేల డాలర్లు ఉంటే సరిపోయేదు. కానీ జనవరి 1,2024 ఆ మొత్తాన్ని 20,635 డాలర్లకు పెంచింది. ఈ నిబంధన జనవరి 1, 2024 నుంచి అమల్లోకి వస్తుందని కెనడా ప్రభుత్వం తెలిపింది. -
లాకర్లపై బ్యాంకుల కుమ్మక్కు...ఫిర్యాదు కొట్టివేత
న్యూఢిల్లీ: సేఫ్టీ లాకర్ల సేవల విషయంలో రిజర్వ్ బ్యాంక్తో పాటు 19 ప్రభుత్వ రంగ బ్యాంకులు కుమ్మక్కై వ్యవహరిస్తున్నాయంటూ వచ్చిన ఫిర్యాదును కాంపిటీషన్ కమిషన్ (సీసీఐ) కొట్టివేసింది. లాకర్లు అద్దెకు లేదా లీజుకిచ్చినప్పుడు .. కస్టమర్లకు వాటిల్లో దాచుకునే విలువైన వస్తువులు పోయినా లేదా దెబ్బతిన్నా తమ పూచీ ఉండదంటూ బ్యాంకులు అగ్రిమెంట్లో షరతు విధించడాన్ని ప్రధానంగా సవాల్ చేస్తూ ఢిల్లీకి చెందిన వ్యక్తి.. సీసీఐకి ఫిర్యాదు చేశారు. అయితే, ఆయా సంస్థలు స్వతంత్ర నిర్ణయాల ఆధారంగా పాటిస్తున్న విధానాలు దాదాపు ఒకే రకంగా ఉన్నంత మాత్రాన.. అవన్నీ కుమ్మక్కయినట్లుగా భావించనక్కర్లేదని, ఆయా విధానాలు పరిశ్రమలో సాధారణంగా పాటించేవిగానే పరిగణించాల్సి ఉంటుందని సీసీఐ పేర్కొంది. సమాచార హక్కు చట్టం కింద ప్రతివాదులు ఇచ్చిన వివరణలు బట్టి చూస్తే.. లాకర్లలోని విలువైన వస్తువులు పోతే.. బ్యాంకులు పూర్తిగా తమ బాధ్యత లేదంటూ దులిపేసుకునే అవకాశం ఉన్నట్లు కనిపించడం లేదని సీసీఐ అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో ఫిర్యాదును కొట్టివేస్తున్నట్లు పేర్కొంది. ఆర్బీఐతో పాటు ఎస్బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర మొదలైన వాటిపై ఈ ఫిర్యాదు దాఖలైంది.