-
లాయిడ్ బ్రాండ్ అంబాసిడర్లుగా దీప్వీర్ జంట
న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ దిగ్గజం హావెల్స్ ఇండియాకు కన్య్సూమర్ డ్యూరబుల్స్ బ్రాండ్ అయిన లాయిడ్ ప్రచార కర్తలుగా రణ్వీర్సింగ్, దీపికా పదుకొనేలు వ్యవహరించనున్నారు. దీప్వీర్ జంట తమ ఉత్పత్తులైన ఎయిర్ కండిషనర్లు, వాషింగ్ మిషన్లు, టెలివిజన్లకు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించనున్నారని లాయిడ్ సీఈఓ శశి అరోరా ప్రకటించారు. అమితాబ్ బచ్చన్ స్థానంలో వీరు నియమితులైనట్లు తెలిపారు. -
లాయిడ్ కొనుగోలు కలిసొచ్చింది
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ఎఫ్ఎంసీజీ దిగ్గజం హావెల్స్ ఇండియాకు కన్జూమర్ డ్యూరబుల్స్ బ్రాండ్ లాయిడ్ను కొనుగోలు చేయటం బాగానే కలిసి వచ్చింది. ఎందుకంటే దాదాపు నాలుగు నెలల సమయంలో ఈ బ్రాండ్ ద్వారా రూ.267 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. మున్ముందు ఈ బ్రాండ్ మరింత వృద్ధిని నమోదు చేస్తుందని కంపెనీ అంచనా వేస్తోంది. హావెల్స్, క్యాబ్ట్రీ, స్టాండర్డ్, సిల్వేనియా బ్రాండ్లతో గృహ, వాణిజ్య ఎలక్ట్రికల్ ఉపకరణాల తయారీలో ఉన్న హావెల్స్.. ఇటీవలే యూరోపియన్ బ్రాండ్ సిల్వేనియాను రూ.241.94 కోట్లకు చైనాకు చెందిన ఫైలో అకౌస్టిక్స్కు విక్రయించేసింది. కొత్త ఉత్పత్తులు, కొత్త ప్లాంటు వంటి రకరకాల వ్యూహాలతో ముందుకెళ్లు తున్న నేపథ్యంలో హావెల్స్ సీఎండీ అనిల్ రాయ్ గుప్తాను ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధి ఇంటర్వ్యూ చేశారు. ఇంటర్వ్యూ ముఖ్యాంశాలివీ... లాయిడ్ను హావెల్స్లో కలిపేస్తారా.. లేక ప్రత్యేక బ్రాండ్గానే కొనసాగిస్తారా? అలాంటిదేమీ లేదు. లాయిడ్ను ఈ ఏడాది మే 8న రూ.1,600 కోట్లు వెచ్చించి కొనుగోలు చేశాం. అప్పటి నుంచి సెప్టెంబర్ వరకూ రూ.267 కోట్ల ఆదాయాన్ని దానిద్వారా ఆర్జించాం. ఆ బ్రాండ్, తయారీ ప్లాంట్, నెట్వర్క్, బృందం వంటివన్నిటినీ ఇప్పటికీ ప్రత్యేకంగానే కొనసాగిస్తున్నాం. విలీనం చేసే యోచన కూడా లేదు. ఏపీ, తెలంగాణల్లో మీ బ్రాండ్ల హవా ఎలా ఉంది? గత ఆర్థిక సంవత్సరంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో రూ.380 కోట్ల ఆదాయాన్ని ఆర్జించాం. ఈ ఆర్ధిక సంవత్సరం ముగిసేనాటికి 20 శాతం వృద్ధిని లకి‡్ష్యంచాం. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో 600 మంది డిస్ట్రిబ్యూటర్లున్నారు. 2020 నాటికి ఈ సంఖ్యను రెట్టింపు చేయాలనుకుంటున్నాం. ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లో 38 హావెల్స్ గెలాక్సీ షోరూమ్లున్నాయి. త్వరలోనే మరో 10 షోరూమ్లు ప్రారంభిస్తాం. ఈ గెలాక్సీ షోరూమ్లో స్విచ్ గేర్ల నుంచి వాటర్ హీటర్ల దాకా హావెల్స్ ఉత్పత్తులన్నీ లభ్యమవుతాయి. ఈ మధ్య మీ మార్కెట్ వాటా ఏమైనా తగ్గుతోందా? కొత్త ఉత్పత్తులేమైనా తెస్తున్నారా? మార్కెట్ వాటా తగ్గటమనే ప్రసక్తే లేదు. ఏటా 20 శాతం వరకూ వృద్ధిని నమోదు చేస్తున్నాం. మా వ్యాపార వృద్ధిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు చాలా కీలకం. సౌర విద్యుత్, స్మార్ట్ ఎలక్ట్రిక్ ఉపకరణాలకు ఈ రెండు రాష్ట్రాల్లో పుష్కలంగా డిమాండుంది. అందుకే ఇటీవల ఇంటర్నెట్ ఆధారిత ఉత్పత్తులైన (ఐఓటీ) వాటర్ హీటర్లు, ఫ్యాన్లు ఇక్కడే లాంచ్ చేశాం. నవంబర్ తరవాత కేరళ, హైదరాబాద్, చెన్నై నగరాల్లో కొత్త ఉత్పత్తులను విడుదల చేస్తాం. మార్కెట్ అవసరాలకు తగ్గట్టుగా లాయిడ్ బ్రాండ్ కింద ఏసీ, టీవీ వంటి వాటిని విడుదల చేస్తూనే ఉంటాం. బెంగళూరు ప్లాంటు ఎంతవరకూ వచ్చింది? ఎప్పుడు సిద్ధమవుతుంది? ప్రస్తుతం మాకు దేశంలో 12 ప్లాంట్లున్నాయి. హరిద్వార్లో ఫ్యాన్లు, హిమాచల్లోని బడ్డిలో డొమెస్టిక్ స్విచ్గేర్లు, నోయిడాలో కెపాసిటర్లు, ఫరీదాబాద్, సాహిబాబాద్లో డిస్ట్రిబ్యూషన్ బోర్డులు, ఇండస్ట్రియల్ స్విచ్గేర్లు, అల్వార్లో కేబుల్స్, వైర్లు, గువాహటిలో స్విచ్గేర్లు, నిమ్రానాలో లైటింగ్స్, ఫిక్చర్స్, మోటార్స్, సీఎఫ్ఎల్, ఎల్ఈడీ, ఎలక్ట్రిక్ వాటర్ హీటర్లు తయారవుతున్నాయి. హావెల్స్ ఉత్పత్తుల్లో 95 శాతం మేడిన్ ఇండియావే. దక్షిణాది రాష్ట్రాల్లో మార్కెట్ను బలోపేతం చేసుకోవటానికే బెంగళూరులో ప్లాంట్ను ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటికే తుముకూరులో 50 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేశాం. స్థలం, ప్లాంట్, మిషనరీ కోసం రూ.1,059 కోట్లు ఖర్చు చేస్తున్నాం. ప్లాంట్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఏడాదిన్నరలో అందుబాటులోకి వస్తుంది. ఇక్కడ కేబుల్స్, వైర్లు, సోలార్ లైట్లు తయారవుతాయి. మున్ముందు మీ వ్యాపారాభివృద్ధి ఎలా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు? గత ఆర్థిక సంవత్సరంలో రూ.6 వేల కోట్ల టర్నోవర్ను నమోదు చేశాం. 2017–18 తొలి త్రైమాసికంలో 9 శాతం వృద్ధితో రూ.1,593 కోట్ల స్టాండెలోన్ వ్యాపారాన్ని సాధించాం. గత ఆర్ధిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఇది రూ.1,467 కోట్లు. 2020 నాటికి రూ.20 వేల కోట్ల టర్నోవర్ను లక్ష్యంగా నిర్ధేశించుకున్నాం. మీకు అత్యధిక వ్యాపారం ఏ విభాగం నుంచి వస్తోంది? కన్జూమర్ డ్యూరబుల్స్ వాటా ఎంత? హావెల్స్ ఆదాయంలో అత్యధికం కేబుల్స్దే. ఇది 39 శాతం. ఇక స్విచ్గేర్స్ 23 శాతం, లైటింగ్ – ఫిక్చర్స్ 16 శాతం వాటా అందిస్తున్నాయి. ఎలక్ట్రిక్ కన్జూమర్ డ్యూరబుల్స్ వాటా 22 శాతం. -
ట్విట్టర్పై అమెరికా కోర్టులో కేసు
శాన్ఫ్రాన్సిస్కో: సోషల్ మీడియాలో ఐసిస్ టెర్రరిస్టుల ప్రచారాన్ని ‘ట్విట్టర్’ ఉద్దేశపూర్వకంగా అనుమతిస్తోందని ఆరోపిస్తూ ఐసిస్ కాల్పుల్లో మరణించిన ఫ్లోరిడా డిఫెన్స్ కాంట్రాక్టర్ లియాడ్ కార్ల్ ఫీల్డ్స్ జూనియర్ కుటుంబ సభ్యులు బుధవారం శాన్ఫ్రాన్సిస్కో జిల్లా కోర్టులో కేసు దాఖలు చేశారు. అమెరికా ప్రభుత్వ నిధులతో నడుస్తున్న అమ్మాన్లోని అంతర్జాతీయ పోలీసు శిక్షణా కేంద్రంలో గత నవంబర్లో జోర్డాన్ భద్రతా దళాలను శిక్షణ ఇస్తున్న సందర్భంగా టెర్రరిస్టులు జరిపిన కాల్పుల్లో లియాడ్తోపాటు మరో డిఫెన్స్ కాంట్రాక్టర్ మరణించారు. ఈ కాల్పులకు తామే బాధ్యులమంటూ ఐసిస్ వర్గాలు అధికారికంగా ప్రకటించాయి కూడా. తీవ్రవాదుల భావాజాలాన్ని ప్రచారం చేయడానికి, ఆన్లైన్లో నిధులు సేకరించేందుకు, కొత్త నియామకాలను జరుపుకునేందుకు కొన్నేళ్లుగా ఐసిస్ టైస్టులు ‘ట్విట్టర్’ ఖాతాలను ఉపయోగించుకుంటున్నాయని, ఇది తెలిసినా ట్విట్టర్ యాజమాన్యం ఉద్దేశపూర్వకంగా ఆ ఖాతాలను అనుమతిస్తోందని కేసు అభియోగాల్లో అరోపించారు. ట్విట్టర్లో ఐసిస్ టెర్రరిస్టులకు దాదాపు 70 వేల ఖాతాలు ఉన్నాయని, వాటిలో 79 ఖాతాలు అధికారికంగా ఉన్నాయని, ప్రతి నిమిషానికి 90 ట్వీట్లను టెర్రరిస్టులు పోస్ట్ చేస్తున్నారని దావాలో పేర్కొన్నారు. ట్విట్టర్ ఆ ఖాతాలను అనుమతించక పోయినట్లయితే నేడు ఐసిస్ ప్రపంచవ్యాప్తంగా ఇంతగా విస్తరించేది కాదని దావాలో పిటిషనర్ వాదించారు. ఈ ఆరోపణల్లో నిజం లేదంటూ ట్విట్టర్ యాజమాన్యం స్పందించింది. ‘లియాడ్ కుటుంబానికి జరిగిన అపార నష్టాన్ని మేము అర్థం చేసుకోగలం. ప్రపంచ ప్రజలలాగే మేము బాధ పడుతున్నాం. టెర్రరిస్టు గ్రూపుల సాగిస్తున్న హింసాకాండకు మేమూ భీతిల్లుతున్నాం. టెర్రరిజం ప్రచారానికి, హింసాత్మక బెదిరింపులకు మిగతా సోషల్ మీడియాలాగే ట్విట్టర్లో కూడా చోటులేదు. ఈ విషయాన్ని మా నిబంధనలే స్పష్టం చేస్తున్నాయి. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకునేందుకు మా టీమ్లు ప్రపంచవ్యాప్తంగా పని చేస్తున్నాయి. ప్రభుత్వ శాంతిభద్రతా సంస్థలకు కూడా ఈ విషయంలో సహకరిస్తున్నాం. మా మీద ఇలాంటి కేసు దాఖలు చేయడం ఇదే మొదటి సారి’ అని ట్విట్టర్ యాజమాన్యం వ్యాఖ్యానించింది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
వరల్డ్కప్ సెలక్టయ్యాడు.. వరుసగా రెండో మ్యాచ్లో గోల్డెన్ డక్
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (05-05-2024)
సైబర్ మోసం.. తెలిసి మరీ లక్షలు పోగొట్టుకున్న నటుడి భార్య
స్కూల్లో బెత్తం దెబ్బలు తిన్నా: సుప్రీం చీఫ్ జస్టిస్
చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
IPL 2024 PBKS VS CSK: రుతురాజ్ను వెంటాడుతున్న దరిద్రం
ఉంగరంతో ఆరోగ్యం పదిలం!
Shobha Shetty Engagement: గ్రాండ్గా ప్రియుడితో సీరియల్ నటి శోభా శెట్టి ఎంగేజ్మెంట్ (ఫోటోలు)
తప్పక చదవండి
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వంటకం! ఎలా చేస్తారంటే..?
- ఇదేం ఫ్యామిలీ రా సామీ! ఏకంగా కోబ్రాకే నేరుగా..!
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement