-
వైరల్ ఫోటో ; మండిపడుతోన్న నెటిజన్లు
ఇస్లామాబాద్ : గత కొన్నిరోజులుగా సోషల్మీడియాలో ఒక ఫోటో తెగ వైరలవుతోంది. ఆ ఫోటో చూసిన జంతు ప్రేమికులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇంతకు ఆ ఫోటోలో ఏం ఉంది అంటే ఒక ఎద్దును క్రేన్ సాయంతో మూడంతుస్తుల భవనం మీద నుంచి కిందకు దించుతున్నారు. ప్రమాదంలో ఉన్న దాన్ని కాపాడటం కోసం కిందకు దించుతున్నారనుకుంటే పోరపాటే. ఎందుకంటే వారు ఆ ఎద్దును త్యాగం(వధించడం) కోసం తీసుకోస్తున్నారు. అసోసియేటెడ్ ప్రెస్ ఫోటోగ్రాఫర్ ఒకరు తీసిన ఈ ఫోటో గురించే ఇప్పుడు నెట్టింట్లో పెద్ద చర్చ జరుగుతోంది. వివరాల ప్రకారం మరికొద్దిరోజుల్లో ముస్లింలు పవిత్రంగా భావించే ఈద్ అల్ అధా/బక్రీద్ పండుగ సందర్భంగా కరాచీకి చెందిన ఒక వర్తకుడు తన ఎద్దును స్థానిక పశువుల సంతలో అమ్మాలనుకున్నాడు. అందుకోసం తన మూడంతుస్తుల బిల్డింగ్ మేడ మీద ఉన్న ఎద్దును క్రేన్ సాయంతో కిందకు దించుతున్నాడు. అందులో భాగంగా ఎద్దును తాళ్లతో బంధించాడు. దాని మూతిని కూడా తాడుతో కట్టి క్రేన్తో కిందకు దించాడు. అంతేకాక దాని కొమ్ములకు పాకిస్తాన్ జెండాలను కట్టాడు. ఈ ఫోటో చూసిన జంతు ప్రేమికులు.. ‘క్రూరమైన చర్య’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా.. మరి కొందరు మాత్రం ‘నువ్వు శాఖాహారివి కాబట్టే జంతు సంరక్షణ అంటూ మాట్లాడుతున్నావు. అయితే నీ మాటలను ఎవరూ పట్టించుకోరు. జీవహింస అంటూ కూర్చుంటే ఇంత రుచికరమైన మాంసం ముక్కలు ఎక్కడి నుంచి వస్తాయి’ అంటూ ప్రశ్నిస్తున్నారు. ఈద్ అల్ అధా/ బక్రీద్ను ముస్లింలు త్యాగానికి ప్రతీకగా జరుపుకునే పండుగ. ఈ రోజే ఇబ్రహీం ప్రవక్త తన కుమారిన్ని బలి ఇవ్వడానికి సిద్దపడ్డారు. అందుకు గుర్తుగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ముస్లింలు ఈ రోజున బక్రీద్ పండుగను జరుపుకుంటారు. మన దేశంలో ఈ నెల 22న బక్రీద్ను జరుపుకోనున్నారు. -
రారండోయ్..పెబ్బేరు సంతకు
ప్రత్యేకం.. పశువుల సంత పెబ్బేరు(కొత్తకోట): మండల కేంద్రంలో ప్రతి శనివారం నిర్వహించే సంత తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద సంతగా పేరొందింది. ఈ సంతలో అటు రైతులకు ఇటు సాధారణ ప్రజలకు అవసరమయ్యే అన్ని రకాల వస్తువులు, పనిముట్లు లభిస్తుండడంతో వివిధ ప్రాంతాల నుంచి వ్యాపారులు, కొనుగోలుదారులు భారీగా తరలివస్తుంటారు. పండగలు, శుభకార్యాల కోసం కావాల్సిన వస్తువులు, వ్యవసాయ పరికరాలు, నిత్యావసర వస్తువులు ఇలా అన్ని రకాల వస్తువులు లభించడం పెబ్బేరు సంత ప్రత్యేకత. 44వ నెంబర్ జాతీయ రహదారిపై ఉండడంతో పాటు వివిధ ప్రాంతాలకు కేంద్రంగా ఉన్న పెబ్బేరు సంత రాష్ట్రంలోనే ప్రసిద్ధి గాంచింది. పెబ్బేరు సంత మూడు విభాగాల్లో కొనసాగుతోంది. పశువుల సంత, గొర్రెల సంత, తైబజారు పేరున ఉంటాయి. పశువుల సంతలో వివిధ రకాల ఆవులు, గేదెలు, ఎద్దులు అమ్మడం, కొనడం చేస్తుంటారు. పశువుల సంతలో వివిధ రకాల పశువులు రూ.10వేల నుంచి లక్షన్నర రూపాయల వరకు ధర పలుకుతుంటాయి. వాటిలో సేద్యం చేసే ఎద్దులతో పాటు ఒంగోలు గిత్తలు, బండలాగుడు ఎద్దులు ఉంటాయి. వాటిని కొనుగోలు చేసేందుకు హైదరాబాద్, కేరళ, బెంగళూరు, రాయలసీమ తదితర ప్రాంతాల నుంచి భారీగా వ్యాపారులు, కొనుగోలుదారులు వస్తుంటారు. దీంతో పాటు ముర్రా జాతి గేదెలు, సాధారణ గేదెలు, జెర్సీ ఆవులు అమ్మడం, కొనడం జరుగుతుంటుంది. రూ.2.7కోట్లకు చేరిన ఆదాయం పెబ్బేరు సంత ద్వారా స్థానిక గ్రామపంచాయతీకి ప్రస్తుతం వస్తున్న ఆదాయం రూ.2.7కోట్లకు చేరింది. 1984 సంవత్సరంలో మొదట రూ.10వేలతో ప్రారంభమైన సంత ఆదాయం ఏడాదికేడాదికి పెరిగి ప్రస్తుతం రూ.2.7కోట్లకు చేరింది. అత్యధిక ఆదాయంతో పాటు అతిపెద్దగా పెబ్బేరు సంతకు పేరు రావడంతో రోజు రోజుకు అభివృద్ధి చెందుతోంది. పెబ్బేరు సంత ద్వారా మొత్తం మూడు విభాగాల్లో కాంట్రాక్ట్ పొందుతూ సుమారు 300 కుటుంభాలు పరోక్షంగా జీవనోపాధిని పొందుతున్నాయి. సంతలో పూర్తిస్థాయిలో సౌకర్యాలు ఏర్పాటు చేసి వ్యాపారులు, కొనుగోలుదారుల సమస్యలను తీర్చేందుకు అధికారులు కృషిచేయాల్సి ఉంది. కోళ్ల సందడి పెబ్బేరు సంతలో వివిధ రకాల నాటు కోళ్లు సందడి చేస్తున్నాయి. వాటిలో సాధారణ నాటు కోళ్లతో పాటు సీమ కోళ్లు, టర్కి కోళ్లు, గిరిరాజ కోళ్లు, చిత్తూరు కోళ్లు, పందెం కోళ్లు ఉంటాయి. పందెం కోళ్లు రూ.3వేల నుంచి 5వేల వరకు ధర పలుకుతున్నాయి. చిత్తూరు కోళ్లు రూ.1200 నుంచి రూ.1500వరకు లభిస్తున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వ్యాపారులు గిరిరాజ, సీమ, టర్కి కోడి పిల్లలను విక్రయిస్తున్నారు. నాటు కోళ్లతోపాటు కోడిపిల్లలను కోనుగోలు చేస్తుంటారు. తాజా కూరగాయలు పెబ్బేరు సంతలో చుట్టుపక్కల గ్రామాల నుంచి రైతులు పండించిన తాజా కూరగాయలు ఇక్కడ లభ్యమవుతాయి. వారంలో ప్రతి శనివారం స్థానికులు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తాజా కూరగాయలు, ఆకుకూరలను కొనుగోలు చేస్తుంటారు. తాజా కూరగాయలతో పాటు ప్రజలకు నిత్యావసర వస్తువులు, కిరాణా సామాగ్రి, వంటసామాగ్రి లభిస్తుంటాయి. గొర్రెలు ఫేమస్ గొర్రెల సంత పండగలకు ప్రత్యేకంగా మారింది. మతానికి సంబంధించిన పండగలు వచ్చినా మంచి రుచికర మాంసం కోసం పొట్టేళ్లు, గొర్రెలు, మేకలు తీసుకెళ్తుంటారు. వివిధ ప్రాంతాలకు చెందిన రైతులు, గొర్రెల కాపరులు ఇక్కడి నుంచి జీవాలను కొనుగోలు చేసి మేపడం కోసం తీసుకెళ్తుంటారు. సాధారణ జాతి గొర్రెలతో పాటు కొండ పొట్టేళ్లు ఇక్కడ లభిస్తాయి. అందుబాటులో వ్యవసాయ పరికరాలు పెబ్బేరు సంతలో రైతులకు కావాల్సిన అన్ని రకాల వ్యవసాయ పనిముట్లు, పరికరాలు లభిస్తాయి. సరసమైన ధరలలో తాళ్లు, నాగళ్లు, గొర్రు, గుంటికలు, పశువుల అలంకరణ వస్తువులు దొరుకుతాయి. దీంతో రాయలసీమ, కర్ణాటక, ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చి వారికి కావాల్సిన పరికరాలను కొనుగోలు చేయడం, అమ్మడం చేస్తుంటారు. అంతేకాకుండా గృహోపకరణాలు తలుపులు, కిటికీలు, మంచాలు కూడా లభిస్తాయి. రైతులకు, పశువుల కాపరులకు, గొర్రెలకాపరులకు అవసరమయ్యే ఉన్నితో చేసిన గొంగళ్లు, జాడీలు, ప్లాస్టిక్ కవర్లు అందుబాటులో ఉంటాయి. -
ఇద్దరు పశు వ్యాపారుల హత్య
రాంచీ: దాద్రీ ఘటన మరువక ముందే జార్ఖండ్లో ఇద్దరు పశువ్యాపారుల హత్య సంచలనం సృష్టిస్తోంది. జార్ఖండ్ రాజధాని రాంచీకి సమీపంలోని లతేహార్ జిల్లా బలూవ ుత్ అటవీ ప్రాంతంలో ఇద్దరు ముస్లిం పశువుల వ్యాపారులు దారుణ హత్యకు గురయ్యారు. పోలీసుల కథనం ప్రకారం.. పశువుల వ్యాపారులైన మహమ్మద్ ముజ్లూమ్ (35), ఆజాద్ ఖాన్ అలియాస్ ఇబ్రహీం(15) శుక్రవారం రాంచీకి సమీపంలోని పశువుల మార్కెట్కు గేదెలను తీసుకె ళ్తుండగా, గుర్తుతెలియని కొందరు వీరిని అడ్డగించి హత్య చేశారు. ముఖాలకు గుడ్డకట్టి, చేతుల్ని వెనక్కి విరిచి వీరిని చెట్టుకు ఉరితీసినట్లు జిల్లా ఎస్పీ అనూప్ బర్తారీ మీడియాకు చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి ఐదుగురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామన్నారు. నిందితుల్లో ఒకరైన మిథిలేశ్ ప్రసాద్ సాహుకు, స్థానిక పశు సంరక్షణ బృందంతో సంబంధముందని పేర్కొన్నారు. కాగా, మృతదేహాలను కిందికి దించుతున్నప్పుడు అక్కడి గ్రామస్తులు పోలీసులపైకి రాళ్లు రువ్వారు. పరిస్థితి అదుపుతప్పకుండా పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి లాఠీచార్జీ చేశారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. హత్యల వెనుక హిందూ శక్తులున్నట్లు జార్ఖండ్ వికాస్ మోర్చా(ప్రజాతంత్రిక్) పార్టీకి చెందిన ఎమ్మెల్యే ప్రకాశ్ రామ్ ఆరోపిస్తున్నారు. కేవలం పశువుల వ్యాపారులు కావడం వల్లనే వీరిని లక్ష్యంగా చేసుకున్నారన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
హీరామండి సిరీస్లో పెద్ద తప్పులు.. ఇవి కూడా చూసుకోరా?
భూకబ్జాలు చేసేవారికి ఈ యాక్ట్ రావడం ఇష్టముండదు: సజ్జల
ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. 25 ఏళ్లలో..
రేపు దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష.. ఏపీలో 29 పరీక్షా కేంద్రాలు
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (03-05-2024))
లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
తప్పక చదవండి
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement