breaking news
licensed weapons
-
తనిఖీల్లో రూ.7 కోట్లు దాటిన నగదు
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల కోడ్ సందర్భంగా రాష్ట్రంలో పోలీసుల తనిఖీలు సాగుతున్నాయి. ఆదివారం నాటికి పోలీసులు స్వాధీనం చేసుకున్న నగదు రూ.7 కోట్లు (రూ. 7.20 కోట్లు) దాటడ మే నిదర్శనం. శనివారం నాటికి పట్టు కున్న మొత్తం రూ.5.3 కోట్లు కాగా, 24 గంటల్లోనే రూ.1.88 కోట్లు పట్టుకోవడం గమనార్హం. శనివారం 8,153గా ఉన్న లైసెన్స్డ్ ఆయుధాలు ఆదివారాని కి 8,267కి చేరాయి. ఆదివారం ఒక్కరోజే 114 ఆయుధాలు డిపాజిట్ చేయడం విశేషం. మొత్తం 18,128 బైండోవర్ కేసులు నమోదయ్యాయి. రూ.1.49 కోట్ల నగదు స్వాధీనం జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలో ఎఫ్ఎస్టీ టీమ్ ఏఎస్ఐ సామ్యూల్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహిస్తుండగా..అడిక్మెట్ నివాసి, అకౌంటెంట్ గోపినాథ్, సాఫ్ట్వేర్ ఉద్యోగి రాఘవేందర్ అనే వ్యక్తులు శనివారం రాత్రి యాక్టివాపై పెద్దమ్మ గుడి సమీపం నుంచి వెళ్తున్నారు. తనిఖీల్లో భాగంగా వారిని చెక్ చేయగా బ్యాగ్లో రూ. 4.49 కోట్ల నగదు లభించింది. డబ్బుకు సంబంధించి వారు లెక్కలు చెప్పలేదు. వా రు రమేశ్ అనే రియల్ ఎస్టేట్ వ్యా పారి నుంచి డబ్బు తీసుకెళ్తున్నట్లు చెప్పారు. కాగా, పోలీసులు దీనిపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. -
ఆయుధాలు ఇచ్చేయండి
-
ఆయుధాలు ఇచ్చేయండి
♦ నయీమ్ కేసులో నేతలు, పోలీసు అధికారుల చుట్టూ బిగుస్తున్న ఉచ్చు ♦ నాయకుల లైసెన్స్డ్ ఆయుధాల స్వాధీనానికి సర్కారు నిర్ణయం ♦ పలువురికి నోటీసులు.. ఆయుధ లైసెన్సులు రద్దు! ♦ సర్వీసు రివాల్వర్లు ఇచ్చేయాలంటూ 8 మంది పోలీసు అధికారులకు ఆదేశాలు ♦ వీరిలో ఇద్దరు అదనపు ఎస్పీలు, ముగ్గురు డీఎస్పీలు, ముగ్గురు ఇన్స్పెక్టర్లు ♦ కేసు నుంచి బయటపడేందుకు నేతల యత్నాలు ♦ సీనియర్ న్యాయవాదులతో మంతనాలు ♦ పదవుల నుంచి తప్పుకోనున్న కొందరు టీఆర్ఎస్ నేతలు సాక్షి, హైదరాబాద్: గ్యాంగ్స్టర్ నయీమ్తో అంటకాగిన నాయకులు, పోలీసు అధికారుల చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఈ కేసు విషయంలో ప్రభుత్వం సీరియస్గా ఉండడంతో నయీమ్తో లింకులు ఉన్న వారందరిపై సిట్ డేగకన్ను వేసింది. ఇందులో భాగంగా అధికార టీఆర్ఎస్తోపాటు ఇతర రాజకీయ పార్టీలకు చెందిన నాయకుల లెసైన్స్డ్ ఆయుధాలు స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇప్పటికే పలువురు నేతలకు నోటీసులు జారీ చేసి, కొందరి ఆయుధ లెసైన్సులు కూడా రద్దు చేసినట్లు తెలిసింది. అటు పోలీసు అధికారుల్లో కూడా ఎనిమిది మందికి మెమోలు ఇచ్చినట్లు సమాచారం. సర్వీస్ రివాల్వర్లను సరెండర్ చేయాలని వారి ని అధికారులు ఆదేశించినట్లు సమాచారం. వీరిలో ఇద్దరు అదనపు ఎస్పీలు, ముగ్గురు డీఎస్పీలు, ముగ్గురు ఇన్స్పెక్టర్లు ఉన్నట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. త్వరలో మరో 13 మందికి మెమోలు ఇచ్చి వారి నుంచి కూడా సర్వీసు రివాల్వర్లు స్వాధీనం చేసుకోవాలని పోలీసు శాఖ యోచిస్తోంది. త్వరలో తాఖీదులు! నయీమ్ ఎన్కౌంటర్ తర్వాత వెలుగులోకి వచ్చిన అంశాలన్నీ సంచలనాత్మకంగానే ఉన్నాయి. రాజకీయ నాయకులు, పోలీసు అధికారుల అండతో గ్యాంగ్స్టర్ అనేక అరాచకాలకు పాల్పడ్డట్టు వెలుగులోకి వచ్చింది. పార్టీలకతీతంగా కొందరు ఎమ్మెల్యేలు, మరికొందరు ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, మాజీ పోలీసు బాసులు ఇలా అందరికీ గ్యాంగ్స్టర్తో సంబంధాలు ఉన్నట్లు బయటపడింది. విచారణలో తేలిన అంశాలను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం.. ఆయా నేతలందరికీ నోటీసులు జారీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా ముందుగా పలువురు నేతల వ్యక్తిగత లెసైన్సు ఆయుధాలను స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు సిట్ నుంచి ఆయా జిల్లాల ఎస్పీలకు సమాచారం అందింది. దీంతో ఎస్పీలు కలెక్టర్లకు పరిస్థితిని విన్నవించారు. ఇప్పటికే కొందరు కలెక్టర్లు తమ పరిధిలో ఉన్న ఆయుధ లెసైన్సులు రద్దు చేశారని సమాచారం. కేసులెలా ఎదుర్కొందాం! నయామ్తో సంబంధాలున్నాయని ప్రచారమైన నేతలు కొందరు ఈ కేసు నుంచి బయటపడేందుకు వివిధ మార్గాలు అన్వేషిస్తున్నారు. ఒకవేళ అరెస్టు అయితే పరిస్థితి ఏంటి? కేసును ఎలా ఎదుర్కోవాలి వంటి అంశాల్లో స్పష్టత కోసం ఇప్పటికే కొందరు నేతలు సీనియర్ న్యాయవాదులను సంప్రదించారని తెలిసింది. వీరిలో కొందరు సుప్రీంకోర్టు న్యాయవాదుల సలహా కూడా తీసుకున్నారని చెబుతున్నారు. ఈ కేసులో ఎవరినీ ఉపేక్షించబోమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఇప్పటికే పోలీసు అధికారులకు స్పష్టంగా చెప్పారు. ఈ నేపథ్యంలో నేతలు తమపై కేసులు తప్పవన్న అభిప్రాయానికి వస్తున్నారు. ప్రధానంగా అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు పోలీసుల నుంచి తమకు నోటీసులు అందే లోపే.. పదవులకు రాజీనామా చేసి, సిట్ విచారణను స్వాగతిస్తున్నామని, విచారణ తర్వాత నిర్దోషులుగా బయటకొస్తామని మీడియా ముందు ప్రకటించాలన్న నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. మొత్తం 21 మంది ఖాకీలు సిట్ దర్యాప్తులో 21 మంది పోలీసు అధికారులు నయీమ్తో భూ లావాదేవీలు కొనసాగించినట్లు ఆధారాలు బయటపడ్డాయి. పలు హత్య కేసుల్లో ప్రధాన ముద్దాయి, పరారీలో ఉన్న వ్యక్తితో అత్యంత సన్నిహితంగా మెలగడాన్ని పోలీసు శాఖ సీరియస్గా తీసుకుంది. అందుకు అనుగుణంగా మొదటి విడతలో 8 మంది అధికారులకు మెమోలు జారీ చేసినట్లు సమాచారం. వీరు వెంటనే సర్వీసు రివాల్వర్లు పోలీసు ప్రధాన కార్యాలయంలో అప్పగించాలని ఆదేశించింది. వీరిలో ఇద్దరు అదనపు ఎస్పీలు, ముగ్గురు డీఎస్పీలు, ముగ్గురు ఇన్స్పెక్టర్లు ఉన్నట్లు తెలిసింది. త్వరలో మరో 13 మందికి మెమోలు ఇచ్చి వారి నుంచి కూడా సర్వీసు రివాల్వర్లు స్వాధీనం చేసుకోవాలని పోలీసు శాఖ యోచిస్తోంది. వీరందరూ గ్యాంగ్స్టర్తో అత్యంత సన్నిహితంగా మెలగడంతో పాటు పెద్దఎత్తున లబ్ధి పొందినట్లు సిట్కు పక్కా ఆధారాలు లభించాయి. నయీమ్ డెన్లో.. పోలీసులు అతడితో సన్నిహితంగా మెలిగిన ఫొటోలతోపాటు భారీగా భూ లావాదేవీలు జరిపినట్టు ఆధారాలు లభ్యమయ్యాయి. వీటిని రిజిస్ట్రేషన్ల శాఖ కూడా ధ్రువీకరించింది. మున్ముందు వీరందరిని క్రమశిక్షణ చర్యల కింద డిపార్టమెంట్ నుంచి తొలగించే అవకాశం ఉందని సీనియర్ అధికారులు పేర్కొంటున్నారు. -
తుపాకులు సరెండర్ చేయండి
సైబరాబాద్ : ఎన్నికల కోడ్ సందర్భంగా తుపాకులను వెంటనే సరెండర్ చేయాలన్న పోలీసుల ఆదేశాలను ప్రముఖులు బేఖాతరు చేశారు. గడువు ముగిసినా ఇంకా చాలామంది తుపాకులను వారి వద్దే ఉంచుకున్నారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన సైబరాబాద్ పోలీసులు 102 మందికి బుధవారం నోటీసులు జారీ చేశారు. ఈ విషయాన్ని సైబరాబాద్ జాయింట్ పోలీస్ కమిషనర్ వై.గంగాధర్ ‘న్యూస్లైన్’కు తెలిపారు. నోటీసులు అందుకున్న మూడు రోజుల్లో తుపాకులను అప్పజెప్పాలని... లేకుంటే వాటి లెసైన్సులు రద్దు చేస్తామని ఆయన హెచ్చరించారు. 462 మందికి మినహాయింపు సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో మొత్తం 2099 మందికి తుపాకీ లైసన్స్ ఉన్నాయని జాయింట్ సీపీ చెప్పారు. వీరిలో 1535 మంది సరెండర్ చేయగా... 462 మందికి మినహాయింపు ఇచ్చామన్నారు. మినహాయింపు ఇచ్చిన వారిలో బ్యాంక్ సెక్యూరిటీ గార్డ్స్, రైఫిల్ షూటింగ్ క్రీడాకారులు ఉన్నారన్నారు. ఇంకా 102 మంది తుపాకులు అప్పజెప్పలేదన్నారు. మినహాయింపునివ్వండి... తుపాకులను సరెండర్ చేయకుండా తమవద్దే ఉంచుకొనేందుకు అనుమతినివ్వాలని ఆరుగురు వ్యాపారులు సైబరాబాద్ పోలీసులకు విజ్ఞప్తి చేసుకున్నారు. తమకున్న ప్రాణహానిని దృష్టిలో పెట్టుకొని ఈ మినహాయింపు ఇవ్వాలని కోరినట్టు జాయింట్ సీపీ తెలిపారు. వీరి విన్నపాన్ని పరిశీలించి... ఎలక్షన్ కమిషన్కు పంపిస్తామన్నారు. వారు అనుమతిస్తే మినహాయింపు ఉంటుందన్నారు.