breaking news
Lecturer harassment
-
విద్యార్థినిని వేధించిన లెక్చరర్
చిత్తూరు , తిరుపతి లీగల్ : తిరుపతి అంబేడ్కర్ న్యాయ కళాశాలలో ఎల్ఎల్బీ చదువుతున్న చెన్నైకి చెందిన ఓ విద్యార్థినిని వేధించిన కేసులో అదే కళాశాలలో లెక్చరర్గా పనిచేసిన ముచ్చకాయల నారాయణకు రిమాండ్ విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు తిరుపతి రెండవ అదనపు జూనియర్జడ్జి సన్యాసినాయుడు మంగళవారం రాత్రి ఆదేశాలు జారీ చేశారు. ప్రాసిక్యూషన్ కథనం మేరకు తిరుపతి రూరల్ కాలూరుకు చెందిన నారాయణ కొన్నాళ్లు తిరుపతిలో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. తర్వాత అంబేడ్కర్ న్యాయ కళాశాలలో లెక్చరర్గా చేరారు. అదే కళాశాలలో చదివే చెన్నైకి చెందిన విద్యార్థినిని ప్రేమించాలంటూ వేధించాడు. దీనికి ఆమె అంగీకరించక ఆ విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పడంతో వారు కళాశాల యజమాన్యానికి ఫిర్యాదు చేశారు. దీంతో యాజమాన్యం ఈ ఏడాది మార్చిలో అతన్ని విధుల నుంచి తొలగించింది. కోపంతో అతను ఆమె ఫొటోను సామాజిక మాధ్యమాల్లో కాల్గర్ల్ పేరుతో పోస్టు చేశారు. ఇప్పటికైనా తనను పెళ్లి చేసుకోవాలని బెదిరించాడు. దీంతో ఆ విద్యార్థిని ఈస్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడు సామాజిక మాధ్యమాల్లో ఆమెకు పంపిన మెసేజ్లను సేకరించి పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. మంగళవారం రాత్రి న్యాయమూర్తి ఎదుట నిందితుడిని హాజరుపరిచారు. దీంతో ఈనెల 24వతేదీ వరకు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. -
లెక్చరర్ వేధింపులు తాళలేక..
విద్యార్థిని ఆత్మహత్యాయత్నం సమితిసింగారం (మణుగూరు రూరల్): లెక్చరర్ వేధింపులు తట్టుకోలేని ఓ విద్యార్థిని ఆత్మహత్యకు యత్నించింది. ఆ విద్యార్థిని తండ్రి తెలిపిన ప్రకారం... మణుగూరు మండలం సమితిసింగారం పంచాయతీలోని గుట్టమల్లారంలోగల గ్రేస్ మిషన్ జూనియర్ కాలేజీలో అశ్వాపురం మండలం మల్లెమడుగు గ్రామానికి చెందిన విద్యార్థిని చదువుతోంది. ఆమె రోజూ కాలేజి బస్సులో వెళ్లి వస్తోంది. అదే కాలేజీలో ఇంగ్లిష్ లెక్చరర్గా అశ్వాపురం గ్రామానికి చెందిన రాజారావు పనిచేస్తున్నాడు. అతడు కూడా అదే బస్సులో ప్రయూణిస్తూ, ఆ విద్యార్థినిని మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడు. ఆమె మంగళవారం కాలేజీ నుంచి ఇంటికి వచ్చి, తనను లెక్చరర్ రాజారావు వేధిస్తున్నాడని, ఇకపై ఆ కాలేజీకి వెళ్లనని తండ్రితో చెప్పింది. ఆ తరువాత, సూసైడ్ నోట్ రాసి, పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. భద్రాచలంలోని ప్రైవేటు ఆస్పత్రిలో ఆమె చికిత్స పొందుతోంది. కఠినంగా శిక్షించాలని ఆందోళన తన కుమార్తెను వేధించి, ఆమె ఆత్మహత్య యత్నానికి కారకుడైన లెక్చరర్ను కఠినంగా శిక్షించాలన్న డిమాండుతో విద్యార్థిని కుటుంబీకులు, బంధువులు కలిసి బుధవారం ఉదయం మణుగూరులోని కాలేజి వద్ద ఆందోళనకు దిగారు. వారికి మద్దతుగా యువజన, విద్యార్థి సంఘాల నాయకులు అక్కడకు వచ్చారు. ప్రిన్సిపాల్ను ఆందోళనకారులు, విద్యార్థి సంఘాల నాయకులు నిలదీశారు. నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని మణుగూరు ఎస్సై ఎం.అరుణ్ కుమార్ హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు శాంతించారు. నిందితుడైన లెక్చరర్ రాజారావు మంగళవారం రాత్రి పరారైనట్టు స్థానికులు చెప్పారు. అశ్వాపురం సీఐ వేణుచందర్ కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.