breaking news
Le Corbusier
-
ఫ్రాన్స్ ప్రధాని సెబాస్టియన్ రాజీనామా
పారిస్: ఫ్రాన్స్లో రాజకీయ సంక్షోభం మొదలైంది. నెల రోజుల క్రితమే ఫ్రాన్స్ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సెబాస్టియన్ లెకోర్ను సోమవారం తన పదవికి రాజీనామా చేశారు. ఆయన గత నెల 9న ప్రధానమంత్రిగా అధికారంలోకి వచ్చారు. నెల లోపలే పదవి నుంచి తప్పుకోవాల్సి వచి్చంది. సెబాస్టియన్ ఆదివారం తన మంత్రివర్గాన్ని నియమించారు. దీనిపై రాజకీయంగా పలు విమర్శలు వచ్చాయి. దాంతో చేసేది లేక సెబాస్టియన్ రాజీనామా సమర్పించారు. దీన్ని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మాక్రాన్ ఆమోదించారు. మాక్రాన్ ఇప్పుడేంద చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. కొత్త ప్రధానమంత్రిని నియమిస్తారా? లేక జాతీయ అసెంబ్లీని రద్దు చేసి, మళ్లీ ఎన్నికలు నిర్వహిస్తారా? అనేది చర్చనీయాంశంగా మారింది. ఫ్రాన్స్లో గత రెండేళ్లలో ఐదుగురు ప్రధానమంత్రులు రాజీనామా చేయడం గమనార్హం. -
ఇక్కడైతే వంద.. అక్కడ రూ. 8.3 లక్షలు!
చండీగఢ్లో అక్కడి ప్రభుత్వం పనికిరాని పాత వస్తువులుగా భావిస్తున్నవన్నీ విదేశాల్లో లక్షలాది రూపాయలకు అమ్ముడుపోతున్నాయి. ఆ నగర రూపశిల్పి లీ కార్బుసియర్ గీసిన మాస్టర్ ప్లాన్ ఉన్న ఇనుప మ్యాన్ హోల్ను ప్రభుత్వం తుక్కుగా భావించి కేవలం వంద రూపాయలు అమ్మేస్తే.. అది న్యూయార్క్ నగరంలోని క్రిస్టీ వేలంశాలలో ఏకంగా రూ. 8.3 లక్షలకు అమ్ముడుపోయింది. ఇలా ఒకటి కాదు, రెండు కాదు.. వందలాది 'తుక్కు' వస్తువులు చండీగఢ్లో కారు చవకగా అమ్మేస్తుంటే, న్యూయార్క్, లండన్, షికాగో, ప్యారిస్ లాంటి మహానగరాల్లోని అంతర్జాతీయ వేలం శాలల్లో మాత్రం లక్షల రూపాయలకు అమ్ముడవుతున్నాయి. దీని వెనుక పెద్ద స్కాం ఉందని ఇప్పుడు అంటున్నారు. హెరిటేజ్ వస్తువులను తుక్కు పేరు చెప్పి కారు చవకగా అమ్మేసి.. విదేశాల్లోని వేలం శాలల్లో మాత్రం లక్షలు సంపాదిస్తున్నారన్న ఆరో్పణలు వినవస్తున్నాయి. నగరానికి చెందిన ప్రముఖ న్యాయవాది అజయ్ జగ్గా దీనిపై కేంద్ర సాంస్కృతిక వ్యవహారాల మంత్రిత్వ శాఖకు ఓ లేఖ రాశారు. ఈ మొత్తం స్కాంపై సీబీఐ విచారణ జరిపించాలని ఆయన కోరారు. ఇది 2జీ స్కాం లాంటిదేనని ఆయన అభివర్ణించారు. ఇలా కొంతమంది పెద్దలు కోట్లాది రూపాయలు వెనకేసుకున్నట్లు ఆరోపించారు.