breaking news
law student killed
-
విశాఖపట్నంలో న్యాయ విద్యార్థిపై సామూహిక అత్యాచారం
-
ఢిల్లీలో న్యాయ విద్యార్థి కాల్చివేత
న్యూఢిల్లీ: మాటామాటా పెరగటంతో ఓ న్యాయ విద్యార్థిని సెక్యూరిటీ గార్డు కాల్చిచంపిన ఘటన ఢిల్లీలో జరిగింది. బిహార్లోని పశ్చిమ చంపారన్ జిల్లాకు చెందిన ఆశిష్ భరద్వాజ్(24) గురుగ్రామ్లోని బంధువుల ఇంట్లో ఉంటూ అక్కడే ఓ ప్రైవేటు వర్సిటీలో న్యాయ విద్య అభ్యసిస్తున్నారు. తన స్నేహితులు హిమాన్షు, అనూప్లను కలుసుకునేందుకు గురువారం ఢిల్లీ చేరుకున్న భరద్వాజ్ వారితో కలిసి హర్దేవ్నగర్కు బయలుదేరారు. రాత్రి 11.45 సమయంలో మద్యం తాగి బైక్పై వెళ్తున్న ఓ సెక్యూరిటీ గార్డు వీరిని గుర్తించాడు. ఇంత రాత్రి వేళ ఇక్కడేం పని, వెళ్లిపోండని బెదిరించాడు. ఇందుకు ముగ్గురు స్నేహితులు నిరాకరించడంతో వారి మధ్య స్వల్ప ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో కోపంతో ఊగిపోయిన సదరు సెక్యూరిటీ గార్డు తనవెంట తెచ్చుకున్న డబుల్ బ్యారెల్ తుపాకీతో ఆశిష్పై కాల్పులు జరిపాడు. బుల్లెట్ మెడ భాగంలో దూసుకుపోవడంతో తీవ్రంగా గాయపడిన ఆశిష్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయాడు. -
ఆమెకు మేం మాత్రమే న్యాయం చేయగలం
త్రివేండ్రం: కేరళలో ఇటీవల సామూహిక అత్యాచారానికి గురై, దారుణ హత్యకు గురైన దళిత న్యాయ విద్యార్థినికి తప్పక న్యాయం జరుగుతుందని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. శుక్రవారం అట్టింగళ్లో ఎన్నికల ప్రచారంలో రాజ్నాథ్ మాట్లాడుతూ.. ఎల్డీఎఫ్ లేదా యూడీఎఫ్ ఆమెకు న్యాయం చేయలేవని, బీజేపీ మాత్రమే చేయగలదని చెప్పారు. మహిళల రక్షణకు కేరళ సురక్షిత ప్రాంతమని పేరుండేదని.. అయితే ఎల్డీఎఫ్, యూడీఎఫ్ కేరళ గౌరవాన్ని ప్రశ్నార్థకం చేశాయని విమర్శించారు. గత నెల 28న ఎర్నాకుళం జిల్లా పెరంబవూర్లో న్యాయ విద్యార్థిని ఆమె ఇంట్లోనే దుండగులు నిర్భయ ఘటనలాగా చిత్రహింసలు పెట్టి దారుణంగా చంపిన సంగతి తెలిసిందే. ఈ ఘటన జరిగిన తర్వాత ఆమె కుటుంబానికి న్యాయం చేసేందుకు ఎవరూ ముందుకురాలేదు. ఈ వార్త మీడియాలో రావడం, తోటి విద్యార్థులు ర్యాలీ నిర్వహించడం, కేరళ వ్యాప్తంగా ఆందోళన చెలరేగడం, ఆ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ సుమెటో కేసును నమోదు చేసి విచారణకు ఆదేశించిన తర్వాత రాజకీయ నాయకులు స్పందించారు. చివరకు ఈ ఘటనను రాజకీయ పార్టీలు ఓ ప్రచారాస్త్రంగా వాడుకుంటున్నాయి. శాంతిభద్రతలను కాపాడటంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, మహిళలకు రక్షణ లేదని విపక్షాలు విమర్శించగా, కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ బుధవారం బాధితురాలి కుటుంబసభ్యులను పరామర్శించారు. బాధితురాలి సోదరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని చాందీ హామీ ఇచ్చారు.