breaking news
Last Bus
-
ఆ రూట్లోనే లాస్ట్
ఓ రూట్లో నడిచే లాస్ట్ బస్లో ఏం జరిగిందనే కథాంశంతో తెరకెక్కిన కన్నడ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ‘లాస్ట్ బస్’. ఈ చిత్రాన్ని తెలుగులో శ్రీ మంజునాథ మూవీ మేకర్స్ ‘లాస్ట్ బస్’ పేరుతో వచ్చే నెల 3న విడుదల చేయనుంది. అవినాశ్, మానస జోషి, మేఘశ్రీ ముఖ్యతారలుగా రూపొందిన ఈ చిత్రానికి ఎస్. డి. అరవింద్ దర్శకత్వం వహించడంతో పాటు పాటలు కూడా స్వరపరిచారు. ‘‘కన్నడంలో మంచి వసూళ్లు రాబట్టింది. తొలిసారి బీబీసీ చానల్లో ఈ సినిమా పాట ప్రదర్శిత మైంది’’ అని నిర్మాత చెప్పారు. ఈ చిత్రానికి మాటలు: నందు తుర్లపాటి, సమర్పణ: పూజశ్రీ. -
ఆఖరి బస్సులో ఏం జరిగింది?
లంబసింగి నుంచి అరకు వెళ్లే ఆఖరి బస్సులో ఏం జరిగిందనే నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘లాస్ట్ బస్’. కన్నడంలో విజయవంతమైన ఈ చిత్రాన్ని తెలుగులో ‘అడవిలో లాస్ట్ బస్’ పేరుతో విడుదల చేస్తున్నారు. అవినాష్, నరసింహరాజు, మేఘశ్రీ, ప్రకాశ్, మానస జోషి, రాజేష్ ప్రధాన పాత్రలు పోషించారు. పూజశ్రీ సమర్పణలో ఈ నెల 27న శ్రీ మంజునాథ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని విడుదల చేస్తోంది. పూజశ్రీ మాట్లాడుతూ- ‘‘ సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్గా తెరకెక్కిన చిత్రమిది. కొత్త సినిమా చూశామనే భావన ప్రేక్షకులకు కలుగుతుంది. చిత్ర దర్శకుడు అరవింద్ పాటలు కూడా స్వరపరచడం మరో విశేషం. ఈ చిత్రంలోని ఓ పాట బీబీసీ ఛానెల్లో ప్రసారమైంది. రాకేందు మౌళి వెన్నెలకంటి రాసిన రెండు పాటలు, నందు తుర్లపాటి సంభాషణలు హైలెట్గా నిలుస్తాయి. డబ్బింగ్, అనువాద కార్యక్రమాలు పూర్తయ్యాయి’’ అని చెప్పారు.