ఆఖరి బస్సులో ఏం జరిగింది? | Last Bus Sri Manjunatha Movie Makers | Sakshi
Sakshi News home page

ఆఖరి బస్సులో ఏం జరిగింది?

May 16 2016 12:28 AM | Updated on Sep 4 2017 12:10 AM

ఆఖరి బస్సులో ఏం జరిగింది?

ఆఖరి బస్సులో ఏం జరిగింది?

లంబసింగి నుంచి అరకు వెళ్లే ఆఖరి బస్సులో ఏం జరిగిందనే నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘లాస్ట్ బస్’. కన్నడంలో...

లంబసింగి నుంచి అరకు వెళ్లే ఆఖరి బస్సులో ఏం జరిగిందనే నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘లాస్ట్ బస్’. కన్నడంలో విజయవంతమైన ఈ చిత్రాన్ని తెలుగులో ‘అడవిలో లాస్ట్ బస్’ పేరుతో విడుదల చేస్తున్నారు. అవినాష్, నరసింహరాజు, మేఘశ్రీ, ప్రకాశ్, మానస జోషి, రాజేష్ ప్రధాన  పాత్రలు పోషించారు. పూజశ్రీ సమర్పణలో ఈ నెల 27న శ్రీ మంజునాథ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని విడుదల చేస్తోంది. పూజశ్రీ మాట్లాడుతూ- ‘‘ సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రమిది. కొత్త సినిమా చూశామనే భావన ప్రేక్షకులకు కలుగుతుంది.

చిత్ర దర్శకుడు అరవింద్ పాటలు కూడా స్వరపరచడం మరో విశేషం. ఈ చిత్రంలోని ఓ పాట బీబీసీ ఛానెల్‌లో ప్రసారమైంది. రాకేందు మౌళి వెన్నెలకంటి రాసిన రెండు పాటలు, నందు తుర్లపాటి సంభాషణలు హైలెట్‌గా నిలుస్తాయి. డబ్బింగ్, అనువాద కార్యక్రమాలు పూర్తయ్యాయి’’ అని చెప్పారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement