-
అమ్మాయిలని టెంప్ట్ అయ్యారో ఇక అంతే సంగతి..!!
-
ఎక్సైజ్ స్టేషన్ ముట్టడి
పిఠాపురం రూరల్, న్యూస్లైన్ : ఓ మహిళను ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేసిన వ్యవహా రం వివాదాస్పదంగా మారింది. ఆమెను అన్యాయంగా అరెస్టు చేసి, నిర్బంధించారం టూ ఆరోపిస్తూ ఆందోళనకారులు స్థానిక జగ్గయ్యచెరువులో ఉన్న ఎక్సైజ్ స్టేషన్ను ముట్టడించారు. అయితే ఎక్సైజ్ పోలీసులు ఆమెను కోర్టులో హాజరుపర్చారు. వివరాలిలా ఉన్నాయి. పి.దొంతమూరులో సారా విక్రయిస్తున్నారన్న సమాచారంతో గొల్లప్రోలుకు చెందిన మద్యం వ్యాపారులతో కలిసి ఎక్సైజ్ అధికారులు గురువారం దాడి చేశారు. ఈ దాడిలో కోశెట్టి సీతమ్మ అనే మహిళను అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేశారు. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఆమెపై అక్రమ కేసు బనాయించారని, సారాతో ఆమెకు సంబంధం లేదని చెప్పారు. మహిళను అదుపులోకి తీసుకునేటప్పుడు మహిళా పోలీసు ఉండాలనే కనీస నిబంధనను పాటించలేదని ఆరోపించారు. మహిళా పోలీసు లేకుండా రాత్రంతా ఆమెను ఎక్సైజ్ స్టేషన్లో ఉంచారన్నారు. ఈ క్రమంలో ఆందోళనకారులకు, ఎక్సైజ్ సిబ్బందికి మధ్య వాగ్వాదం జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో.. స్థానిక పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితి చక్కదిద్దారు. ఇలాఉండగా పది లీటర్ల సారాతో పట్టుబడ్డ సీతమ్మను ప్రత్తిపాడు సెకండ్క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపర్చినట్టు ఎక్సైజ్ సీఐ రమణ తెలిపారు. ఎక్సైజ్ స్టేషన్లో మహిళా కానిస్టేబుల్ లేరని, అందుబాటులో ఉన్న మహిళా వాచ్మన్ సమక్షంలో సీతమ్మను ఉంచినట్టు చెప్పారు. నిర్భయ కేసు నమోదు ఇలాఉండగా తన భార్యను అన్యాయంగా సారా కేసులో అరెస్టు చేసి, ఆమెతో అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపిస్తూ సీతమ్మ భర్త గౌరేష్ పిఠాపురం రూరల్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. నిందితులు ఎక్సైజ్ సీఐ రమణ, టాస్స్ఫోర్స ఎస్సై అశోక్, గొల్లప్రోలుకు చెందిన బస్సా రాజా, గాదం శ్రీనులపై నిర్భయ చట్టం క్రింద కేసు నమోదు చేసినట్టు శుక్రవారం రాత్రి రూరల్ ఎస్సై శివగణేష్ తెలిపారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాజస్తాన్తో ఢిల్లీ కీలక పోరు.. కొత్త ప్లేయర్లు ఎంట్రీ
యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
ఒక్క మూవీతో సెన్సేషన్.. ఈ పాన్ ఇండియా హీరోని గుర్తుపట్టారా?
‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
బీజేపీకి షాక్.. కాంగ్రెస్ వైపు తిరిగిన ముగ్గురు ఎమ్మెల్యేలు
No Headline
రోహిత్ వరుస వైఫల్యాలకు కారణం అదే! ఇకనైనా..
No Headline
నేను పక్కా లోకల్..
No Headline
తప్పక చదవండి
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
- ‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
- దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
- రోహిత్కు ఇంగ్లిష్ రాదు.. ఏడిపించేవాళ్లం.. కానీ: యువీ
- తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
Advertisement