8 మంది పేకాటరాయుళ్లు అరెస్ట్
హైదరాబాద్ : కుషాయిగూడ పారిశ్రామికవాడలోని పేకాట స్థావరాలపై ఎస్ఓటీ పోలీసులు శనివారం తెల్లవారుజామున దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా 8 మందిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 42 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. అలాగే బైకులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు. కుషాయిగూడలోని పేకాట స్థావరాలపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు దాడులు నిర్వహించారు.