-
వీరి చావుకి కారణం ఎవరు?
తేని జిల్లా బోడినాయకనూరు కురంగని కొండల్లో రేగిన కార్చిచ్చు ప్రమాదంలో మృతుల సంఖ్య 11కు పెరిగింది. కాలిన గాయాలతో చికిత్స పొందుతున్న ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. సోమవారం నాటికి పది మంది మృతి చెందగా మదురై ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఈరోడ్కు చెందిన దివ్య (25) మంగళవారం ఉదయం ప్రాణాలు విడిచింది. దివ్య భర్త వివేక్ ఇదే కార్చిచ్చులో సోమవారమే మృతి చెందాడు. సహాయక చర్యల్లో పాల్గొన్న సిబ్బందిని ఎవరు కదిలించినా కన్నీటి గాథను చెబుతున్నారు. సాక్షి ప్రతినిధి, చెన్నై: ఇద్దరు చిన్నారులు సహా 36 మంది కురంగని కొండల్లో ట్రెక్కింగ్ నిర్వహిస్తూ కార్చిచ్చులో చిక్కుకున్న సంగతి పాఠకులకు విధితమే. అగ్నికీలలకు ఆహుతైన వారంతా ఐటీ ఉద్యోగులు, ఉన్నత చదువులు చదివినవారు, కొత్తగా పెళ్లయిన దంపతులు కావడం విచారకరం. కన్యాకుమారి జిల్లాకు చెందిన విపిన్ (30) చెన్నైలోని ఒక ఐటీ కంపెనీలో ఉద్యోగి. తన సహోద్యోగిని దివ్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇరువురు ఈ ప్రమాదంలో మృతిచెందారు. కడలూరు జిల్లాకు చెందిన శుభ (28) చెన్నై షోళింగనల్లూరులోని ఒక ఐటీ సంస్థలో పనిచేస్తున్నారు. అన్నాడీఎంకేకు చెందిన ప్రముఖ నేత కుమార్తె శుభ తన స్నేహితురాలు అఖిల ట్రెక్కింగ్కు వెళ్లడంతో తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండానే వెంటవెళ్లి అఖిలతోపాటు ప్రాణాలు కోల్పోయింది.. మదురై జిల్లాకు చెందిన హేమలత (30) ఒక హెచ్ఆర్ కంపెనీ ఉద్యోగిని. చెన్నై వేలాచ్చేరిలోని ఒక ఐటీ సంస్థ ఉద్యోగిని చెంగల్పట్టు జిల్లాకు చెందిన పునిత (26) ప్రాణాలు కోల్పోయి, రెండేళ్ల ఏళ్ల క్రితమే వివాహం చేసుకున్న సాఫ్ట్వేర్ ఉద్యోగైన భర్త బాలాజీకి తీరని శోకాన్ని మిగిల్చింది. ఈరోడ్ జిల్లాకు చెందిన తమిళ్సెల్వన్ (26) చెన్నైలోని ఒక ప్రముఖ టైర్ల కంపెనీ ఉద్యోగి. ఈరోడ్ గౌతంపాడికి చెందిన వివేక్ (28) దుబాయ్లో పనిచేస్తుండగా, భార్య దివ్య (26)తో కలిసి ట్రెక్కింగ్ వెళ్లి ప్రాణాలు విడిచారు. వీరికి వివాహమై వందరోజులు మాత్రమేకాగా ఇంతలోనే వీరిద్దరికి నూరేళ్లు నిండిపోయాయి. కుంభకోణంకు చెందిన అఖిల (27) వారి తల్లిదండ్రులకు ఏకైక సంతానం. చెన్నై నంగనల్లూరులోని ఐటీ కంపెనీలో పనిచేస్తున్నారు. చెన్నై హార్బర్లో పనిచేస్తున్న విరుదునగర్ జిల్లాకు చెందిన ప్రభాకరన్ (28), కొండలు ఎక్కడంలో శిక్షణ కూడా ఇస్తుంటాడు. చెన్నై వేలాచ్చేరికి చెందిన నిషా (20) చెన్నై మనపాక్కంలోని ఒక ఐటీ సంస్థలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్నారు. కన్నీరు తెప్పించిన సంఘటనలు: సహాయక చర్యలు చేపట్టినవారి కళ్లను చెమర్చిన సంఘటనలు అనేకం ఎదురయ్యాయి. కురంగని పరిసరాలకు చెందిన 30 మంది కొండలు, గుట్టలు ఎక్కుతూ బాధితులను వెతుక్కుంటూ అందరికంటే ముందుగా బయలుదేరారు. కొండలోతుల్లో పడిపోయిన వారు ఆవేదనతో పెట్టిన కేకలను విని రక్షించారు. తీవ్రంగా గాయపడిన వారంతా ఒంటిపై గుడ్డలు సైతం కాలిపోయి దయనీయావస్థలో చిక్కుకుపోయారు. మరికొందరు దాహం దాహం అంటూ కేకలు వేయడం, ఎలాగైనా మా ప్రాణాలు కాపాడండి...నా పేరు వివేక్ అంటూ ఒక యువకుడు మూలగడం బా«ధాకరంగా మారింది. డోలీల్లో వస్తున్న తమ వారిని చూసి బంధువుల రోదనలు మిన్నంటాయి. 108 అంబులెన్స్లు అక్కడి చేరుకోగా కాలిన గాయాలతో తీవ్రంగా రోదిస్తున్న క్షతగాత్రులను గుర్తించి కురంగని ప్రభుత్వ ఆస్పత్రులకు చేర్చారు. అయితే కాలిన గాయాలకు అత్యవసర చికిత్సకు అవసరమైన ఎస్ఎస్టీ అనే సిల్వర్ సల్పాడయోడిన్ అనే మందు ఆస్పత్రిలో లేదు. దీంతో మదురై, తేనీ జిల్లాల ప్రభుత్వ ఆస్పత్రులకు కబురంపగా వారు కూడా లేదన్నారు. ఈ సమయంలో కేంద్రసహాయ బృందాలు వెంటతెచ్చిన మందులతో చికిత్స ప్రారంభించాల్సి వచ్చింది. అంతవరకు క్షతగాత్రులంతా బాధను తట్టుకోలేక రోదిస్తూ గడపడం సహాయక సిబ్బందిని కన్నీరుపెట్టించింది. అగ్నికీలలు చుట్టుకుంటున్న దశలో అటవీశాఖ వాచర్ బైటపడేమార్గం చూపుతూ ముందు వెళుతుండగా 12 మంది అతన్ని అనుసరించారు. అయితే చెన్నైకి చెందిన 24 మంది వాచర్ చూపుతున్న మార్గంలో వెళ్లకుండా స్వతంగా తప్పించుకునే ప్రయత్నం చేశారు. అదే సమయంలో వేడిగాలులతో మంటలు సమీపించడంతో వాటి నుంచి తప్పించుకునేందుకు కొండపై నుంచి లోతుల్లోకి దూకారు. దీని వల్ల తీవ్రంగా గాయపడడంతో కదల్లేక పోయారు. ఇంతలో మంటలు వారి ప్రాణాలను హరించివేశాయి. కాలినగాయాలతో విలవిలలాడుతున్న ఇద్దరు యువతుల ఒకరినొకరిని పట్టుకుని మనల్ని దేవుడే కాపాడాలని అని కన్నీరుకారుస్తుండగా హెలికాప్టర్ వచ్చి వారిపై ఎగరసాగింది. దీంతో సంతోషంతోపడిన వారిద్దరూ అదిగో దేవుడు వాహనం పంపాడని సహాయక సిబ్బంది ఆసరాతో హెలికాప్టర్ ఎక్కి సురక్షితంగా బైటపడ్డారు. ఈ విషయాలను వైమానికి సిబ్బందికి వారే చెప్పుకుని కృతజ్ఞతలు తెలిపారు. కురంగని ప్రమాదం సహాయక చర్యల్లో వైమానికదళం ప్రముఖ పాత్ర పోషించింది. పేరుకు తగ్గట్లుగా వాయువేగంతో సహాయక చర్యలు చేపట్టి పలువురి ప్రాణాలను కాపాడింది. కేంద్ర రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రత్యక్ష పర్యవేక్షణ సాగిస్తూ ప్రశంసనీయమైన పాత్ర పోషించారు. అటవీ దొంగలే అగ్గికి కారణమా: కురంగని కొండల్లో అకస్మాత్తుగా అగ్గిపుట్టడం అటవీ దొంగల పనేనని అనుమానిస్తున్నారు. 11 మంది ప్రాణాలను బలిగొన్న కార్చిచ్చు ఎలా పుట్టింది, ప్రకృతిపరమైన సంఘటన లేక మరేదైనా కోణం ఉందాని ప్రభుత్వం ఇప్పటికీ తేల్చలేక పోతోంది. అయితే అటవీ సంపదపై పూర్తి అవగాహన ఉన్న మాజీ అధికారులు, సామాజిక సేవకులు మాత్రం పలుకోణాల్లో అరాతీయడం ప్రారంభించారు. అటవీప్రాంతాల్లోని వృక్షాలను ఆయాశాఖ అధికారులు ప్రతిఏడాది లెక్కకడతారు. ఎక్కడైనా వృక్షాలు నరికివేసినట్లు కనపడితే అటవీ సిబ్బందిని విచారించి నష్టపరిహారాన్ని జీతాల నుంచి మినహాయిస్తారు. సిబ్బంది ఇచ్చే వివరణ సమంజసంగా ఉంటే సదరు మొత్తాన్ని తిరిగి ఇచ్చేస్తారు. అవినీతి, అక్రమమని తేలితే శాఖాపరమైన కఠిన శిక్షకు గురిచేస్తారు. ఇరుకుగా ఉంటే ప్రాంతాల్లో మూంగిల్ వృక్షాలు ఒకదానికి ఒకటి రాసుకుని అగ్గిపుట్టే అవకాశం ఉంది. అయితే కురంగని కొండల్లో మూగింల్ వృక్షాలు అతికొద్దిగా ఉన్నందున అగ్నిరాజుకునే అవకాశాలు చాలా తక్కువ. పశువులు మేపేవారు, నాటుసారా కాచేవారు, అసాంఘిక శక్తులు కొండల్లోకి వెళ్లి తమ అవసరాల కోసం నిప్పురాజేసే అవకాశం ఉంది. అడవుల్లోని పచ్చగడ్డిని పశువులు ఆహారానికి అధికారులు అనుమతిస్తుండగా, ఈసాకుతో అడవుల్లోకి వెళ్లి చెట్లను నరికి సొమ్ముచేసుకునే వారు కొందరు తయారయ్యారు. దీంతో పశువుల మేత కోసం అడవుల్లోకి వెళ్లడాన్ని అధికారులు నిషేధించారు. కేవలం పశువుల దాణా కోసం అడవుల్లోకి వెళ్లేవారు ఏ కారణం చేతనూ నిప్పురాజేయరని, దొంగతనంగా అటవీ సంపదను అమ్మి సొమ్ముచేసుకునే వ్యక్తులు అధికారుల దృష్టి మరల్చేందుకు నిప్పురాజేసి ఉంటారని అనుమానిస్తున్నారు. అదే నిజమైతే అటవీ దొంగల స్వార్థం అమాయకుల ప్రాణాలను బలిగొందని అంటున్నారు. అటవీ కార్చిచ్చు ప్రకృతి ప్రకోపమా, అరాచక శక్తులు సృష్టించిన ప్రమాదమా విచారణ జరపాలని నటుడు సత్యరాజ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని పర్యతారోహణ శిక్షణ కేంద్రాల జాబితా, వారి పనితీరు, కార్యకలాపాలపై ప్రభుత్వం ఆరా తీయడం ప్రారంభించింది. అధికారి సస్పెన్షన్ కురంగని కొండల్లో అగ్నిప్రమాదంలో చిక్కుకుని 11 మంది మృతి చెందిన సంఘటనపై బాధ్యుడిని చేస్తూ అటవీశాఖ అధికారిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. తేని జిల్లా అటవీశాఖ ఉన్నతాధికారి రాజేంద్రన్ మంగళవారం శాఖాపరమైన విచారణ జరిపారు. ఫారెస్టర్ జెయ్సింగ్ అనే వ్యక్తిని సస్పెండ్ చేశారు. అటవీశాఖ అనుమతి పొందకుండా కోండపైకి తీసుకెళ్లిన ప్రయివేటు సంస్థపై చర్య తీసుకోవాలని ఎస్టీపీఐ పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. అనుమతితోనే ట్రెక్కింగ్: అటవీశాఖ అనుమతి లేకుండా వెళ్లడమే పలువురు ప్రాణాలు కోల్పోవడానికి కారణమని ముఖ్యమంత్రి ఎడపాడి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్సెల్వం సోమవారం ప్రకటించారు. అయితే వారంతా ఒకరికి రూ.200 చొప్పున చెల్లించి, పాస్ను సైతం పొంది అనుమతి పొందిన తరువాత కొండ ఎక్కినట్లు తేలింది. గవర్నర్ పరామర్శ అడవుల్లో రేగిన కారుచిచ్చులో చిక్కుకుని మృతి చెందిన వారికి గవర్నర్ బన్వరిలాల్ సంతాపం ప్రకటించారు. మంగళవారం మదురై ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. బిడ్డలను, బంధువులను కోల్పోయిన కుటుంబాలకు సానుభూతిని తెలుపుతున్నానని అన్నారు. గాయపడిన వారు త్వరగా కోలుకుని ఇళ్లకు తిరిగి వెళ్లాలని తాను ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. -
మంటల్లో బూడిదైన ప్రాణాలకు ఎవరు బాధ్యులు?
సాక్షి, న్యూఢిల్లీ : తమిళనాడు రాష్ట్రంలోని థేని జిల్లా అడవుల్లో ఆదివారం సంభవించిన కార్చిచ్చుకు పది మంది ట్రెక్కర్లు మరణించిన విషయం తెల్సిందే. అటవీ శాఖ అధికారుల అనుమతి తీసుకోకుండానే ట్రెక్కర్లు అడవిలోకి వెళ్లారా? అనుమతి తీసుకొని వెళ్లి ఉంటే సకాలంలో మంటల బారి నుంచి వారిని ఎందుకు రక్షించలేకపోయారు? ఒకవేళ ట్రెక్కర్లు అధికారుల అనుమతి తీసుకోకుండా అడవుల్లోకి వెళ్లి ఉంటే ఆ విషయాన్ని అటవీ శాఖ అధికారులు సకాలంలో ఎందుకు తెలుసుకోలేపోయారు? ఎందుకు వారిని వారించలేక పోయారు? అసలు గ్రీష్మ బుతువు ప్రవేశించాక, అంటే అడువులు తగులబడే అవకాశం ఉన్నప్పుడు ట్రెక్కర్లకు ఎందుకు అనుమతినిచ్చారు? ఇత్యాది సవాలక్ష ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. భారత వైమానిక దళం సోమవారం నాడు తన సహాయక చర్యలను నిలిపేసిన తర్వాత ఈ ఆపరేషన్లో 27 మంది ట్రెక్కర్లను రక్షించినట్లు భారత రక్షణ శాఖ ప్రకటించింది. మంటల్లో చిక్కుకుని పది మంది మరణించినట్లు అధికారులు ధ్రువీకరించారు. చెన్నై నుంచి 27 మంది ట్రెక్కర్ల బృందం, ఈరోడ్ నుంచి మరో 12 మంది ట్రెక్కర్ల బృందం అడవుల్లోకి ప్రవేశించినట్లు తెల్సింది. ఈ లెక్కన ఇంకా ఇద్దరి ఆచూకి తెలియాల్సి ఉంది. ట్రెక్కర్లు ముందస్తు అనుమతి తీసుకోకుండానే ఈ సాహస యాత్రకు ఒడిగట్టారని మధురై సర్కిల్ ఫారెస్ట్ కన్సర్వేటర్ ఆర్కే జగానియా ఆరోపించారు. ట్రెక్కర్లు ఫారెస్ట్ చెక్పోస్టుల గుండా వెళ్లలేదని థేని కలెక్టర్ కూడా తెలిపారు. కురంగణి అడవుల్లోకి వెళ్లిన ఈరోడ్ ట్రెక్కర్ల బృందం మాత్రం చెక్ పాయింట్ల గుండా వెళ్లిందని, అక్కడ అధికారులకు ట్రెక్కర్ ఒక్కరికి 200 రూపాయల చొప్పున చెల్లించామని ఈరోడ్ ట్రెక్కర్ బృందం సభ్యుడైన డీ ప్రభు విచారణ సందర్భంగా తెలిపారు. చెన్నై బృందం అటవీ శాఖ అధికారుల నుంచి అనుమతి తీసుకోలేదని, ఈరోడ్ బృందం తీసుకుందని థేని జిల్లా స్పెషల్ పోలీస్ ఇన్స్పెక్టర్ శివకుమార్ తెలిపారు. పది మంది మరణించడం వెనక ఇటు ట్రెక్కర్ల బృందం, అటు అటవీ శాఖ అధికారుల బృందం తప్పుందని శాస్త్ర నిపుణులు, అనుభవం కలిగిన సీనియర్ ట్రెక్కర్లు ఆరోపిస్తున్నారు. అటవీ శాఖ అధికారుల ముందస్తు అనుమతి, బృందం వెంట వారి సభ్యుడిని తీసుకెళ్లడం తప్పనిసరి చేయాలని వారు సూచిస్తున్నారు. అడవుల్లో ఎవరు ట్రెక్కింగ్ చేయాలన్నా తమ అనుమతి తప్పనిసరని, ఫీజు కూడా చాలా తక్కువగా ఉంటుందని అటవీ అధికారులు తెలిపారు. ఆ తక్కువ ఫీజును కూడా తప్పించుకునేందుకు తమ అనుమతి తీసుకోకుండా ట్రెక్కర్లు దొంగదారుల్లో అటవిలోకి జొరబడుతున్నారని వారు చెప్పారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బాహుబలి కేవలం 10 కోట్ల మంది మాత్రమే: రాజమౌళి కామెంట్స్
బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
తెలంగాణను అసమర్థులు ఏలుతున్నారు: కేసీఆర్
క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
నెల ముందే ప్రమోషన్.. ఇప్పుడు జాబ్ పోయింది: అగ్రరాజ్యంలో టెకీ ఆవేదన
జేక్ ఫ్రేజర్ విధ్వంసం.. కేవలం 19 బంతుల్లోనే! వీడియో వైరల్
ల్యాండ్ టైట్లింగ్ చట్టం సమగ్ర స్వరూపం ఇదే..
25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
ఈహెచ్టీని ఢీ కొట్టిన లారీ
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement