breaking news
ksr comment
-
KSR Comment: బాబు, లోకేశ్ కు హైకోర్టు చివాట్లు.. జాతీయ స్థాయిలో నవ్వులపాలు
-
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ద్వంద వైఖరి మరోసారి బట్టబయలు
-
సీమ ప్రజల నోట్లో మట్టి కొట్టిన చంద్రబాబు
-
KBG Tilak: టీడీపీలో ఉన్న వాళ్ళంతా కోటీశ్వరులే
-
యూడైస్ పై కనీస అవగాహన లేని మంత్రి లోకేశ్
-
KSR Comment: వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబే
-
KSR Live Show: జగన్ సునామీ బాబు గుండెల్లో వణుకు
-
కోవర్టులంటూ కొత్త కుట్ర రాజకీయం!
ప్రతిపక్ష పార్టీలపై కొత్త కొత్త ఆరోపణలు చేయడం.. ప్రతి చెడు ఘటనను కూడా వారికి ఆపాదించేలా చేయడంలో చంద్రబాబు దిట్ట. ఎల్లోమీడియా అండ ఎలాగూ ఉంది కాబట్టి ఆయనకు ఈ పని మరింత సులువు అవుతుంది. తాజాగా ఆయన వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిన వారిని కోవర్టులంటూ వ్యాఖ్యానించి ఒక సంచలనం సృష్టించారు. ఇటీవలి మహానాడు సభలో పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన చంద్రబాబు తన పార్టీ అంతర్గత వ్యవహారాలనూ వైసీపీకి పులిమే ప్రయత్నం చేయడం ఆయన వక్రబుద్ధిని చెబుతోంది. ఈ మధ్య టీడీపీలో అంతర్గత కుమ్ములాటలు కాస్తా హత్యలకూ దారితీస్తున్న విషయం తెలిసిందే. అయితే టీడీపీ వారు వైసీపీ కార్యకర్తలపై దాడులు చేసినా, హత్యలకు పాల్పడ్డా లోకేశ్ తీసుకొచ్చిన రెడ్బుక్ రాజ్యాంగం బాగానే అమలవుతోందంటూ ఆ పార్టీ నేతలు సంబరపడ్డారు. కానీ తమ పార్టీ నేతలను తమవారే హత్య చేస్తున్నారన్నది వారు కూడా ఊహించి ఉండరు.కొంతకాలం క్రితం ఒంగోలు ప్రాంతం మద్యం సిండికేట్, ఇతర దందాల్లో తలెత్తిన గొడవల నేపథ్యంలో బాపట్ల జిల్లాలో స్థానిక టీడీపీ నేత చౌదరి హత్యకు గురయ్యారు. వెనుక ఉన్నది టీడీపీ వారేనని పోలీసులు గుర్తించారు. ఈ వ్యక్తి ఏ రకంగా సన్నిహితుడో తెలియదు కానీ.. చంద్రబాబు స్వయంగా ఆయన అంతిమక్రియలకు హాజరయ్యారు. ఆ సందర్బంలోనూ వైసీపీ నేతలపై అనుమానం వ్యక్తం చేసినప్పటికీ పోలీసులు అప్పటికే టీడీపీ నేతల పాత్రను తేల్చేశారు. అయితే చంద్రబాబు అప్పుడైనా ఇలాంటి పనులకు పాల్పడరాదన్న హితవు పలకడానికి బదులు వారికి దన్నుగా నిలిచినట్లు వ్యవహరించారు. మాచర్ల వద్ద జరిగిన ఇంకో ఘటనలోనూ ఇద్దరు టీడీపీ నేతల మధ్య గొడవతో హత్య జరిగింది. కానీ చంద్రబాబు ప్రభుత్వం సరే పనికట్టుకుని వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులపై కూడా కేసు నమోదు చేశారు. ఇది ఆ ప్రాంత ప్రజల్లో ప్రభుత్వంపై అసహ్యం కలిగే పరిస్థితి కల్పించింది. హత్య జరిగిన ప్రదేశంలో ఉన్న వాహనం వెనుక స్థానిక టీడీపీ ఎమ్మెల్యే జేబీఆర్ పేరు కూడా ఉన్నా పోలీసులు ఇంత అధ్వాన్నంగా వైసీపీ వారిపై కేసులు పెట్టారు. విశేషం ఏమిటంటే ఈ టీడీపీ వర్గాలలోని వారు గతంలో కాంగ్రెస్ లో ఉండి, తదుపరి టీడీపీలో చేరారట.ఇంకో సంఘటనలో కర్నూలు జిల్లా ఆలూరులో ఒక కాంగ్రెస్ నేత హత్యకు గురయ్యారు. గుత్తి టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం సోదరుడే ఈ హత్య చేయించారని ఆరోపణలు వచ్చాయి. జయరాం గతంలో వైసీపీ ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉండి, ఎన్నికల ముందు టీడీపీలో చేరారు. చంద్రబాబు కోవర్టులంటూ ఎవరిని ఉద్దేశించి అన్నారో కానీ.. ఇది వైసీపీ నుంచి టీడీపీలో చేరిన నేతలందరికి ముల్లులా గుచ్చుకున్నట్లయింది. మహానాడు వేదిక మీద ఉన్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం శ్రీధర్ రెడ్డి, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి, ఆయన భార్య, కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి, నూజివీడు నుంచి గెలిచి మంత్రి అయిన కొలుసు పార్ధసారధి, మరో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, లోక్ సభలో పార్టీ నేతగా ఉన్న లావు శ్రీకృష్ణదేవరాయలు, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ప్రభృతులు వైసీపీ నుంచి వెళ్లినవారే. వీరిలో కొంతమందికి చంద్రబాబు,లోకేశ్లతో నేరుగా సంబంధాలు ఉన్నాయి. పార్టీకి భారీగా ఆర్థిక సాయం చేసేవారు కూడా ఉన్నారు. ఇలాంటి వారికి సహజంగానే కోవర్టు వ్యాఖ్య చిన్నతనం అవుతుంది.అంతేకాదు..ఈ మధ్యకాలంలో వైసీపీకి చెందిన పలువురు కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, మున్సిపల్ ఛైర్మన్లు, జెడ్పీ ఛైర్మన్లు రకరకాలుగా ప్రలోభ పెట్టో, లేక భయపెట్టో టీడీపీలో చేర్చుకున్నారు. మరి వీరిలో ఎవరు కోవర్టులో, ఎవరు కాదో తెలుసుకుని పార్టీలోకి తీసుకున్నారా?అంటే అదేమీ లేదు. 2014-19 మధ్య 23 మంది వైసీపీ ఎమ్మెల్యేల మాదిరిగా ఇప్పుడు కూడా అడ్డగోలుగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించారు. తనపార్టీలో చేరిన వారంతా మంచి వారని, లేకుంటే చెడ్డవారని ప్రచారం చేయడం చంద్రబాబుకు అలవాటే. గతంలో తాను ఎవరినైతే తిట్టి ఉంటారో, వారు పార్టీలోకి రాగానే పవిత్రులైనట్లుగా ప్రసంగాలు కూడా చేస్తుంటారు.కోటంరెడ్డి ,గుమ్మనూరు, కొలుసు వంటి వారిపై టీడీపీ ఎన్ని ఆరోపణలు చేసిందో తెలుసు. కాని వారిని టీడీపీలోకి తీసుకోవడానికి ఇబ్బంది పడలేదు. ఇప్పుడు అలా వచ్చిన వారిని కోవర్టులు అని అంటున్నారు. వైసీపీ వారిని టీడీపీలో చేర్చి హత్యలు చేయిస్తున్నారని చంద్రబాబు అనడం ద్వారా తన ప్రభుత్వం శాంతిభద్రతల పరిరక్షణలో ఎంత వైఫల్యం చెందింది చెప్పకనే చెబుతున్నట్లయింది. అలాగే తెలుగుదేశం పార్టీలో అరాచక శక్తులు ఏ స్థాయిలో ఉంది కూడా తెలియ చేసినట్లయింది. పైగా చంద్రబాబు తాను ఎవరిని నమ్మనని చెబుతున్నారు. అలాగే పార్టీలో ఉన్నవారు కూడా ఆయనను అంతగా నమ్మరు. కాని పరస్పర అవసరాల కోసం కలిసి ప్రయాణం చేస్తుంటారన్నది రాజకీయ వర్గాల విశ్లేషణ ఎప్పటి నుంచో ఉంది.గత చరిత్ర చూస్తే కోవర్టుల రాజకీయం చేయడంలో చంద్రబాబును మించిన సిద్దహస్తుడు మరొకరు లేరని ఆయన ప్రత్యర్ధులు తరచు వ్యాఖ్యానిస్తుండే వారు. చంద్రబాబు, దగ్గుబాటి వెంకటేశ్వర రావులు టీడీపీలో ఉన్నప్పుడు చెరో వర్గం నడిపే వారు.అప్పట్లో దగ్గుబాటి వర్గంలో కూడా చంద్రబాబు మనుషులు ఉండేవారని, ఎప్పటికప్పుడు సమాచారం చేరవేస్తుంటారన్న ప్రచారం ఉండేది. దానికి మించి ఎన్టీ రామారావు వద్దే తనకు రహస్యంగా సమాచారం ఇచ్చే కొందరిని కూడా ఏర్పాటు చేసుకున్నారని అంటారు.ఎన్టీ రామారావు ఎక్కడ లక్ష్మీపార్వతికి పదవి కట్టబెడతారో అన్న సందేహంతో చంద్రబాబు వర్గానికి చెందిన కొందరు రకరకాల వదంతులు ప్రచారం చేసేవారని అంటారు. పార్టీ టిక్కెట్ల సమయంలో తన వర్గం వారిని వ్యూహాత్మకంగా లక్ష్మీపార్వతి వద్దకు పంపించి ఆమెతో కూడా సిఫారసులు చేయిస్తుండేవారట. ఆయన పార్టీని, ప్రభుత్వాన్ని కైవశం చేసుకున్న తర్వాత విపక్ష కాంగ్రెస్ నేతలతో కూడా సంబంధాలు ఉండేలా చూసుకునే వారు. వైఎస్ జగన్ పై కాంగ్రెస్తో కలిసి సీబీఐ కేసు వచ్చేలా చేయడంలో చంద్రబాబు పాత్ర అందరికి తెలిసిందే. మరి ఇవన్ని కోవర్టు రాజకీయాలో, కాదో చెప్పాలి. మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కూడా కొందరు కోవర్టులను ఆ పార్టీలోకి పంపించి, రహస్య సమాచారం సేకరించే వారని, స్వయంగా చిరంజీవే కొన్ని సందర్భాలలో వాపోయారు. 2019లో ఓటమి తర్వాత తెలివిగా నలుగురు టీడీపీ రాజ్యసభ సభ్యులను బీజేపీలోకి పంపించిన చరిత్ర కూడా ఆయనదేనని చాలామంది నమ్ముతారు. దానికి తగ్గట్లుగానే ఆ నలుగురు పేరుకు బీజేపీ. సేవ చేసేదంతా చంద్రబాబు కోసమేనన్నది బహిరంగ రహస్యమే. తదుపరి పవన్ కళ్యాణ్ తో పాటు, బీజేపీలో చేరిన టీడీపీ నేతలతో బీజేపీ పెద్దలను ప్రసన్నం చేసుకుని తిరిగి పొత్తు పెట్టుకున్నది కూడా ఆయనే కదా! ఇలా కోవర్టు రాజకీయం చేయడంలో చంద్రబాబు ఘనాపాటి. మరో సంగతి చెప్పాలి. ఎన్టీ రామారావు ఆత్మో, లేక మరొక పేరో తెలియదు కాని ఏఐ ఉపయోగించి చంద్రబాబు, లోకేశ్ లను పొగుడుతున్నట్లు మాట్లాడించడం మహానాడులో ఒక హైలైట్.ఎందుకంటే ఎన్టీఆర్ మరణించడానికి కొద్ది రోజుల ముందు వరకు కూడా చంద్రబాబును తీవ్రంగా విమర్శించే వారు. చంద్రబాబు సైతం ఎన్టీఆర్కు విలువలు లేవని, ఆయన అవసరం టీడీపీకి లేదని, ఇతరత్రా విమర్శలు చేస్తూ ఇంటర్వ్యూలు ఇచ్చిన రికార్డులు ఇప్పటికీ కనిపిస్తూనే ఉంటాయి. తనను ఔరంగజేబుతో పోల్చినా, ఇంకా అనేక ఆరోపణలు చేసినా, చంద్రబాబు అసలు ఏమీ జరగనట్లు, చంద్రబాబు పాలనకు ఎన్టీఆర్ మద్దతు ఇస్తున్నట్లు ఆయన ఆత్మతో మాట్లాడించినట్లు వీడియో రూపొందించి ప్రదర్శించారంటే ఇంతకన్నా క్రిమినల్ ఆలోచన ఇంకేమైనా ఉంటుందా? అన్న విమర్శను వైసీపీ చేస్తోంది.ఈ సందర్భంగా ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతి మాట్లాడుతూ ఎన్టీఆర్ ఆత్మ తనతో మాట్లాడిందని, చంద్రబాబు, లోకేశ్లు చేస్తున్న అరాచక పాలనను తీవ్రంగా దుయ్యబట్టారని అన్నారు. చంద్రబాబు తన ఆశయాలకు విరుద్ధంగా పాలన చేస్తున్నారని, జగన్ పేదల కోసం పని చేశారని చెప్పారని ఆమె అంటున్నారు. గతంలో జగన్ ఆత్మలతో మాట్లాడినట్లు కొందరు ఐఎఎస్లు చెబుతున్నారంటూ పచ్చి అబద్దాలను ప్రచారం చేసిన ఎల్లో మీడియా ఇప్పుడు మహానాడులో నేరుగా ఎన్టీఆర్ ఆత్మ మాట్లాడిందని చెబుతుంటే దానికి భజంత్రి చేసిందే! ఎన్టీఆర్ ఆత్మ చంద్రబాబు, లోకేశ్ లను పొగిడిందంటే ఎవరైనా నమ్ముతారా!- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
పేరుకే బాబు సీఎం.. కానీ నడిపించేదంతా..
-
వంశీ ప్రాణాలకు ముప్పు రెడ్ బుక్ భయంతో వైద్యం నిరాకరణ
-
Analyst Vijay babu: వాళ్లకు ఇచ్చిపడేశాడు హ్యాట్సాఫ్ నారాయణ..
-
ప్రజల ఆశలతో బాబు కపట రాజకీయం!
‘‘ప్రజలకు మరీ ఆశ ఉండకూడదు. దురాశ పనికిరాదు’’ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు తరచూ చేసే వ్యాఖ్య ఇది. ఈమధ్య సోషల్ మీడియాలోనూ ఆయన వాడిన ఈ డైలాగులు ఎక్కవగా కనిపిస్తున్నాయి. ఆయన చెప్పింది వాస్తవమే. ఎందుకంటారా? బాబు, పవన్కళ్యాణ్ లాంటి వాళ్లు ఇచ్చినమాటకు కట్టుబడి హామీలన్నీ నెరవేరుస్తారని నమ్మడం ప్రజల అత్యాశే కదా! ఈ దురాశతోనే ప్రజలు టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిని గెలిపించింది! పాపం.. పై పై వాగ్ధానాలు చేసిన వాళ్లు ఎవరు? వారి ట్రాక్ రికార్డు ఏమిటి అన్నది కూడా గుర్తుపెట్టుకోకుండా ప్రజలు అతిగా ఆశపడ్డారు. టీడీపీ ఎన్నికల మానిఫెస్టోలోని ‘ఆడ బిడ్డ నిధి’కి కూడా బాబు అండ్ కో మంగళం పాడేసినట్లేనన్న వార్తలు చూసిన తరువాత ప్రజలను ఇంత గొప్పగా మోసం చేయవచ్చా? అని అనిపించక మానదు. ప్రజలను దురాశా పరులుగా చిత్రీకరించి నిందించవచ్చు కానీ.. ఆ ఆశ పెట్టిన వారి తప్పు మాత్రం ఏమీ లేదన్నచందంగా ఉందీ వ్యవహారం. ప్రజలను ఇంత బాహాటంగా మోసం చేసినందుకు ఇతర దేశాల్లో ఎలాంటి శిక్షలు పడతాయో తెలియదు కానీ.. ఇలాంటి వారు.. ప్రజల ఆగ్రహాన్ని, ఛీత్కారాలనైతే తప్పకుండా చూస్తారు. దురదృష్టకరమైన విషయం ఏమిటంటే ఈ దేశంలో నేతల వైఖరి నమ్మి మోసపోయిన వారిదే తప్పన్నట్టుగా ఉండటం. అయ్యో ఈ నేతలు ప్రజలను పిచ్చోళ్లుగా చూస్తున్నారే అన్న ఆవేదన కలుగుతుంది. నిజాయితీ లేని నేతలు అధికారంలోకి వచ్చి, చెప్పినవి చేయకపోగా, వారినే బెదిరిస్తున్న తీరు, విషయాలను పక్కదారి పట్టిస్తున్న తీరులపై పెద్ద పరిశోధనే చేయవచ్చు. ఆశపెట్టి ఏమార్చడం.. ఆ తరువాత ప్రజలనే నిందించడం చంద్రబాబుకు కొత్తేమీ కాదు. సుమారు రూ.లక్ష కోట్ల రైతు, డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేస్తానన్న హామీతో 2014లో గద్దెనెక్కిన చంద్రబాబు ఆ తరువాత ఏం చేశారో అందరికీ తెలుసు. ఆ రోజుల్లోనే ఆయన ‘‘ఆశకు హద్దు ఉండాలి’’ అని రైతులను ఉద్దేశించి నేరుగానే అన్నారు. తాజాగా 2024 ఎన్నికల్లో బాబు ఇచ్చిన హామీ ప్రతి మహిళకూ రూ.1500 చొప్పున నెల నెల ఇస్తానని! ఈ పథకానికి ఆడబిడ్డ నిధి పేరూ పెట్టారు. ప్రతి ఒక్కరికీ ఇస్తాం. తల్లికి వందనం కింద ఇంట్లో ఉన్న ప్రతి బిడ్డకూ రూ.15 వేలు చొప్పున ఇస్తామని ఊదరగొట్టడంతో మహిళలు చాలామంది ఆశపడ్డారు. ఓట్లేశారు. ప్రస్తుత మంత్రి నిమ్మల రామానాయుడు అప్పట్లో ‘‘నీకు పదిహేను వేలు.. నీకు పదిహేను వేలు’’ అంటూ ప్రచారం చేయడమూ మనం చూశాం. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు సైతం.. ‘‘ఒకరుంటే రూ.15 వేలు, నలుగురు పిల్లలుంటే రూ.60 వేలు..ఇంకా పిల్లలను కనండి..వారి బాధ్యత మాది’’ అని ప్రచారం చేసి అధికారంలోకి వచ్చారు. ఏడాది పూర్తి అయిపోయింది.. తల్లికి వందనం లేదు. విద్యార్ధులకు సుమారు రూ.13 వేలు ఎగవేశారు. వచ్చే విద్యా సంవత్సరం ఇస్తామని అంటున్నారు. ఏమవుతుందో తెలియదు! ఆర్టీసీ బస్సుల్లో మహిళకు ఉచిత రవాణా సౌకర్యం అన్న హామీని కూడా అటకెక్కించేశారు. అమలు చేసి ఉంటే ఏపీ మహిళలకు ఏడాదికి రూ మూడు వేల కోట్ల వరకూ మిగిలేది! ఈ లెక్క కూడా ఎల్లోమీడియాదే. ఆగస్టు పదిహేను నుంచి ఈ స్కీము అమలు చేస్తామని చంద్రబాబు ఈమధ్య కర్నూలులో ప్రకటించారు. అంటే మరో మూడు నెలలు ఈ స్కీమ్ ఉండదు. దీనిని కూడా లెక్కలోకి తీసుకుంటే మహిళలు మరో రూ.వెయ్యి కోట్లు నష్టపోయినట్లు! ఇదే సభలో చంద్రబాబు ఆడబిడ్డ నిధి స్కీము లేనట్లే తేల్చారని వార్త వచ్చింది. దానికి ఆయన ఇచ్చిన వివరణ చూస్తే మరీ ఇంత పచ్చి పాపమా అనిపిస్తుంది. తాను అధికారంలోకి రావడానికి సూపర్ సిక్స్ పేరుతో ఇచ్చిన హామీలు మోసపూరితమని ఆయనకు తెలుసు. తాను ఆ వాగ్దానాలు ఎందుకు చేసింది.. ఎందుకు అమలు చేయలేకపోతున్నది నిజాయితీగా వివరించడం మానేసి, మరో కొత్త అబద్దాన్ని సృష్టించారు. అదేమిటంటే తాను తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణల పుణ్యమా అని ఏపీలో పేదలు బాగానే సంపాదిస్తున్నట్లు చంద్రబాబే తేల్చేశారు! అందువల్ల వారికి ఆ స్కీమ్ అవసరం లేదని, 2029నాటికి పేదరికం లేకుండా చేసేస్తామని, అప్పటికీ పేదలు ఉంటే పీ-4 కింద దాతలకు అప్పగిస్తామని అన్నారట. కూటమి ప్రభుత్వం వచ్చాక, ప్రజల చేతుల్లో డబ్బులు ఆడక పేదలు, గిట్టుబాటు ధరలు లేక రైతులు, వ్యాపారాలు లేక వ్యాపారస్తులు అల్లాడుతుంటే పేదలంతా బాగా సంపాదించుకుంటున్నారని చంద్రబాబు చెబుతున్నారు. ఇలాంటి వారి మాటలు నమ్మి ఓటు వేసినందుకు తమకు బాగానే శాస్తి అయిందని ప్రజలు అనుకునే పరిస్థితి ఏర్పడింది. ఆడబిడ్డ నిధి స్కీము రాష్ట్రంలోని కోటిన్నర మంది మహిళలకు ఉపయోగపడేది! ఏడాదికి సుమారు రూ.30 వేల కోట్లకుపైగా అవసరమని లెక్క. ఇంత మొత్తం ఎలా సాధ్యమని అప్పట్లో ప్రశ్నించిన వారికి బాబు ఇచ్చిన సమాధానం తాను సంపద సృష్టించగలనూ అని! ఇప్పుడేమో సంపద వచ్చేసిందని చెబుతుంటే బిత్తరపోవడం తప్ప ప్రజలు చేయగలిగేది ఏముంటుంది! ఒకరకంగా చెప్పాలంటే ఈవీఎంల మాయాజాలం సంగతి పక్కనబెడితే అనేక నియోజకవర్గాలలో తల్లికి వందనం, ఆడబిడ్డ నిధి వాగ్దానాలు గేమ్ చేంజర్ గా మారి కూటమిని అధికారంలోకి తెచ్చాయి. ఇప్పుడేమో చేతులెత్తేసి పేదల జీవితాలతో కూటమి నేతలు చెలగాటమాడుతున్నారు. వాగ్దానాల గురించి చెప్పకుండా, చెత్త నుంచి సంపద సృష్టిస్తున్నామని, ఓర్వకల్లో మహిళలను పారిశ్రామికవేత్తలుగా తయారు చేశామని, బుద్దుడి సలహాలు పాటించండని కధలు చెబుతున్నారు. ఇక్కడ ఒక గమ్మత్తు జరిగింది. చెత్త ఎత్తడానికి పనివారు వస్తున్నారా అని చంద్రబాబు ప్రశ్నిస్తే లేదు..లేదు..అని ఎక్కువ మంది చేతులెత్తారు. దాంతో చెత్త గురించి ఆయన చెబుతున్న కబుర్లలో డొల్లతనం బయటపడింది. చెత్త నుంచి విద్యుత్ తయారు చేసే ప్లాంట్లు పెడతామని, లక్ష మంది డ్వాక్రా మహిళలను పారిశ్రామికవేత్తలు చేస్తామని, ఉద్యానవన పంటలను 18 లక్షల హెక్టార్ల నుంచి 36 లక్షల హెక్టార్లు చేస్తామని, ఇలా ఏవేవో సంబంధం లేని మాటలతో ప్రసంగం చేశారు. అక్కడితో ఆగితే ఫర్వాలేదు. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని కూడా దబాయించి మరీ చెప్పారు. నవ్వుకుని ఊండిపోవడం అక్కడి ప్రజల వంతైంది. చివరికి బుద్దుడు, ఆయన శిష్యుడి కథ అంటూ చంద్రబాబు ప్రజలకు ఒక స్టోరీ చెప్పారు. దాని ప్రకారం శిష్యుడి కోరిక మేరకు బుద్దుడు కొత్త వస్త్రాలు ఇప్పించారట. ఆ తర్వాత కొద్ది రోజులకు బుద్దుడు పిలిచి పాత వస్త్రాలు ఏమి చేశావని అడిగాడట. వాటితో చిరిగిపోయిన బొంతలో పెట్టి కుట్టుకున్నానని శిష్యుడు చెప్పాడట. మరీ చినిగిపోయిన బొంతలోని వస్త్రాలు ఏమి చేశావు అని బుద్దుడు అడిగాడట. వాటిని కిటికీ తెరలు చేశానని జవాబు ఇచ్చారు.మరి అప్పటికే ఉన్న కిటీకి తెరలు ఏమి చేశావని అడిగితే గది తుడవడానికి వాడుతున్నానని, ఆ వస్త్రాన్ని మసిబట్టగా వాడుతున్నానని, అప్పటిదాకా ఉన్న మసిబట్ట దారాలను కొవ్వొత్తిలో వాడే వత్తులకు వినియోగిస్తున్నానని శిష్యుడు చెప్పారట. ప్రతి వస్తువుకూ ఒక ఉపయోగం ఉంటుందని చెప్పడానికి చంద్రబాబు ఈ కథ చెప్పినా, విన్న వారికి మాత్రం చివరికి ఏపీ పరిస్థితి ఇలా మారిందన్నమాట అని అనుకున్నారనుకోవాలి. ఒక పక్క అమరావతిలో ఇప్పటికే ఉన్న సచివాలయం, అసెంబ్లీ తదితర భవనాలు ఉన్నా, అవి పనికి రావంటూ లక్ష కోట్లు వ్యయం చేస్తూ గొప్పలు చెప్పే చంద్రబాబు ప్రజలు మాత్రం ఈ ఆధునిక యుగంలో చినిగిన వస్త్రాలు సైతం వాడుకోవాలని చెబుతున్నారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చుతున్న చంద్రబాబు ప్రభుత్వానికి బుద్దుడు, శిష్యుడు కథ వర్తించదా అంటే ఏమి చెబుతాం. ఎదుటివాడికి చెప్పేటందుకే నీతులు అన్న సూత్రం చంద్రబాబు వంటివారిని చూసే వచ్చిందనుకోవాలి.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
KSR Paper Analysis: ఈరోజు ముఖ్యాంశాలు
-
BRS Vs BJP మాటల యుద్ధం
-
విజయ సిందూరం పెరిగిన భారత్ ప్రతిష్ట
-
ఆర్ధిక పరిస్థితిపై మరోసారి చేతులెత్తేసిన తెలంగాణ సర్కార్
-
KSR: చంద్రబాబు సర్కార్ భూదాహానికి వంత పాడుతున్న ఎల్లో మీడియా
-
పరామర్శకూ తీరికలేదా బాబూ!
సింహాచలం అప్పన్న ఆలయంలో హాహాకారాలు.. మృత్యు ఘోష.. ఎవరికైనా బాధనిపిస్తుంది. కాని ఆంధ్రప్రదేశ్ సర్కారుకు మాత్రం అవేమీ పట్టినట్లు లేదు. కూటమి నేతలందరూ అమరావతి సంబరంలో మునిగి తేలుతున్నారు. పలుమార్లు శంకుస్థాపనలు జరిగిన అమరావతిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఇంకోసారి శంకుస్థాపన చేయిస్తున్నారు.సింహాచలంలో ప్రభుత్వ నిర్లక్ష్యానికి బలి అయింది సామాన్యులే.. అమరావతి హంగామాతో తీవ్రంగా నష్టపోతున్నదీ పేదలే. హిందూ మతంలో ఒక నమ్మకం ఉంటుంది. ఏదైనా ఒక కుటుంబంలో అశుభం జరిగితే నిర్దిష్టంగా కొన్నాళ్లపాటు ఎలాంటి శుభ కార్యక్రమాలు జరపరు. హిందూ మతోద్దారకులమని ప్రచారం చేసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, సనాతన హిందూ అని చెప్పుకునే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు మాత్రం దీన్ని పట్టించుకోవడం లేదు. శంకుస్థాపన కార్యక్రమాలను వాయిదా వేసుకోలేదు. పాలకులు రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను కుటుంబంలా పరిగణిస్తారు. ఆ ప్రకారం చూస్తే ఒక ప్రముఖ ఆలయంలో జరిగిన ఈ దుర్ఘటనలో కొత్తగా కట్టిన గోడ కూలి ఏడుగురు మరణించినా తమ ప్రోగ్రాం ఆపుకోవడానికి ఇష్టపడలేదు. సింహాచలం మృతుల కుటుంబాలను పరామర్శించడానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు వెళ్లలేదు.అంటే వారికి ఏదో అనుమానం ఉండబట్టే అటువైపు వెళ్లకుండా ఉన్నట్లు అనిపిస్తుంది.మామూలుగా అయితే ఒక ప్రసిద్ద పుణ్యక్షేత్రంలో ఇలాంటి ఘటనలు సంభవిస్తే వెంటనే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, సంబంధిత మంత్రులు అంతా వెళ్లి సహాయ చర్యలను పర్యవేక్షించి బాధితులకు స్వాంతన చేకూర్చడానికి యత్నిస్తారు. కాని వీరిద్దరూ ఆ పని చేయలేదు. కొద్ది నెలల క్రితం వైకుంఠ ఏకాదశి టిక్కెట్ల కోసం తిరుపతి వెళ్లిన వేలాది భక్తులు తొక్కిసలాటకు గురయ్యారు. ప్రభుత్వం సరైన ఏర్పాట్లు చేయకపోవడం వల్లే ఆ తొక్కిసలాట జరిగి ఆరుగురు మరణించగా, పలువురు గాయపడ్డారు. ఆ సమాచారం వచ్చిన వెంటనే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు పోటీ పడి తిరుపతి వెళ్లారు.ఏదో చేస్తున్నట్లు హడావుడి చేశారు. అలాంటి వారు సింహాచలం ఎందుకు వెళ్లలేదు? ప్రధాని మోడీ అమరావతి వస్తున్నందున వెళ్లలేక పోయారని చెప్పవచ్చు కానీ మూడు గంటల ఖాళీ కూడా లేదనడం అతిశయోక్తి అవుతుంది. పైగా ఇప్పుడు వచ్చిన సాంకేతిక పరిజ్ఞానంతో ఎక్కడ నుంచైనా పర్యవేక్షణ చేయవచ్చు. పవన్ కళ్యాణ్ కు ఆ ఇబ్బంది లేదు కదా?మరి ఆయన ఎందుకు సింహాచలం వెళ్లలేదు? దీనికి రెండు,మూడు కారణాలు చెబుతున్నారు. అక్కడకు వెళ్లితే భక్తులలో ఉన్న కోపం అంతా తమపై చూపే అవకాశం ఉందని, వారు ప్రభుత్వ నిర్వాకంపై నిలదీస్తే ఇబ్బంది అవుతుందని అనుకుని ఉండవచ్చ అంటున్నారు. అమరావతి పునః శంకుస్థాపన పనుల పేరుతో తప్పించుకునే అవకాశం ఉండడం. మరొకటి చావుల వద్దకు వెళ్లి రావడం అశుభం అని ఎవరైనా సలహా ఇచ్చారేమో తెలియదు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు నిజంగానే హిందూ మతాచారాలపై అంత శ్రద్దగా ఉంటారా అంటే అదీ గ్యారంటీ లేదు. ఏ మతం వారివద్దకు వెళ్లితే ఆ మతమే గొప్పదని చెప్పి వస్తుంటారు. రాజకీయాల కోసం మతాన్ని వాడుకుంటారు.గత గోదావరి పుష్కరాల సమయంలో చంద్రబాబు కుటుంబం స్నానమాచరించే ఘట్టాన్ని సినిమా తీయడం కోసం సామాన్య భక్తులను నిలిపి వేయడం, ఒక్కసారిగా గేటు తెరవడం వల్ల తొక్కిసలాట జరిగి 29 మంది మరణించడం జరిగింది. అప్పుడు చంద్రబాబు తన తప్పు కప్పిపుచ్చుకోవడానికి ఎన్నో యత్నాలు చేశారు. చివరికి రోడ్డు ప్రమాదాలలో చనిపోవడం లేదా? కుంభమేళాలో చనిపోలేదా? అంటూ వితండ వాదం చేశారు. అంతే తప్ప అంత పెద్ద ఘటన జరిగితే మామూలుగా అయితే పదవి నుంచి తప్పుకుంటారు. ప్రాంతీయ పార్టీ కనుక ఆయనను పార్టీలో ఎవరూ ప్రశ్నించరు కనుక ఆ ప్రస్తావనే ఉండదు. పోనీ కనీసం ఒక కానిస్టేబుల్ పై కూడా చర్య తీసుకోకపోవడం విశేషం. తిరుపతి తొక్కిసలాట ఘటన జరిన తర్వాత పవన్ కళ్యాణ్ క్షమాపణల డ్రామా తెలిసిన సంగతే.చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్లు ఏమి మాట్లాడింది అందరికి తెలుసు. అక్కడ చైర్మన్ లేదా, అధికారులపై చర్య తీసుకోలేదు. వారిని పదవుల నుంచి తప్పించలేదు. నిజంగా హిందూ మత విశ్వాసాలు నమ్మేవారైతే అలా చేస్తారా? అన్న విమర్శలను పలువురు చేశారు. చివరికి ఒక రిటైర్డ్ జడ్జితో కమిషన్ ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారు. గోదావరి పుష్కరాల మరణాలపై వేసిన కమిషన్ ఏ తరహా రిపోర్టు ఇచ్చిందో, తిరుపతి ఘటనపై కూడా రిపోర్టు అందుకు భిన్నంగా వస్తుందా అన్నది కొందరి సందేహం. పుష్కరాల తొక్కిసలాటలో తప్పు భక్తులదే అని ఆ కమిషన్ తేల్చింది. ఇప్పుడు సింహాచలం ఘటనపై కూడా విచారణ కమిటీని నియమించినా, ఎంతవరకు ప్రయోజనం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. గోడ కూలడానికి నాణ్యత లోపమని కాకుండా, భక్తుల రద్దీ, తోపులాట అని నివేదికలు వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు.వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న రోజులలో ఆలయాలలో ఏ చిన్న ఘటన జరిగినా, దాని వెనుక టీడీపీ, జనసేన రాజకీయ శక్తుల ప్రమేయం ఉన్నా, దానినంతటిని జగన్ కు ఆపాదించి ఎంత రచ్చ చేసేవారో గుర్తు చేసుకుంటేనే కంపరం కలుగుతుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత సైతం అదే ధోరణి ప్రదర్శించారు. తిరుమల లడ్డూ లో జంతు కొవ్వు కలిసిదంటూ దారుణమైన అసత్యాన్ని చంద్రబాబు, పవన్ లు ప్రజలకు చెప్పారు. దీనివల్ల కోట్లాది హిందువుల మనోభావాలు దెబ్బతింటాయని, దైవానికి అపచారం చేసినట్లు అవుతుందని వారు ఫీల్ కాలేదు. తమ రాజకీయ ప్రయోజనం కోసం ఎంతకైనా దిగజారతామన్నట్లుగా వారు వ్యవహరించారు. ఈ ఘటన తర్వాత పవన్ కళ్యాణ్ మరో అడుగు ముందుకు వేసి తాను అన్ అప్పాలజిటిక్ సనాతన హిందూ అని ప్రకటించుకుని కొత్త వేషం కట్టారు.అసలు సనాతన హిందూయిజం ఏమి చెబుతుందో తెలియకుండానే, తానేదో వేద శాస్త్రాలు అన్నిటిని పుక్కిట పట్టినట్లుగా మాట్లాడారు. విశేషం ఏమిటంటే ఆయన భార్య విదేశీయురాలు. క్రైస్తవ మతానికి చెందిన వారు.అలాగే పవన్ కు పుట్టిన వారు సైతం క్రైస్తవమే తీసుకున్నారు. మరి అక్కడ ఈయన సనాతనమేమైందో తెలియదు. అనవసరంగా సినిమా డైలాగులు చదివితే ఇలాంటి అప్రతిష్టే వస్తుంది. చంద్రబాబు తన రాజకీయం కోసం ఏ మతాన్ని అయినా వాడుకోగలరు.ఆయన తెలివితేటలు వేరు.ఆయనను మించి ఏదో చేసి బీజేపీ వారి మెప్పు పొందాలని పవన్ చేస్తున్న ఈ ప్రయత్నాల వల్ల ఆయన పరువు పోగొట్టుకుంటున్నారు. పోనీ నిజంగానే అంత సనాతన హిందూ అయితే సింహాచలం ఎందుకు వెళ్లలేదు.ఒక సంతాప సందేశం ఇచ్చి వదలివేశారే.అమరావతి కార్యక్రమ ఆహ్వానంలో తన పేరు వేయలేదని మొదట అలిగారని, దాంతో ప్రభుత్వం మరో కార్డు వేసిందని చెబుతున్నారు. తన డిమాండ్ నెరవేరకపోతే ఏమైనా సింహాచలం వెళ్లేవారేమో. తిరుమల గోవుల మరణాలు, కాశీనాయన క్షేత్రంలో భవనాల కూల్చివేత, తిరుమల, బ్రహ్మం గారి మఠం తదితర ఆధ్యాత్మిక కేంద్రాలలో మత్తు పదార్ధాల వాడకం వంటి ఆరోపణలు వస్తున్నా ఈ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టలేక పోతోందన్న విమర్శలు వస్తున్నాయి. సింహాచలంలో చందనోత్సవానికి ఐదుగురు మంత్రుల కమిటీ కూడా ఉందట. వారంతా ఏమి చేశారో తెలియదు. కాని గోడ కూలి ఏడుగురు మరణించారు. చిన్న ఆలయ గోడ నిర్మాణమే చేయలేని వారు రాజధాని నిర్మాణం చేస్తారట అంటూ సోషల్ మీడియాలో వ్యంగ్య వ్యాఖ్యానాలు వచ్చాయి.అదే టైమ్ లో జగన్ విజయవాడ వద్ద కృష్ణానదికి కట్టిన రిటైనింగ్ వాల్ ఏ రకంగా స్ట్రాంగ్ గా ఉందీ వివరిస్తూ కూడా వీడియోలు వచ్చాయి. సింహాచలం ఘటన తర్వాత జగన్ వెంటనే అక్కడకు వెళ్లి మృతుల కుటుంబాలకు భరోసా ఇచ్చివచ్చారు. చంద్రబాబు, పవన్ లు మాత్రం సాకులు వెతుక్కుంటూ కూర్చున్నారు. ఎల్లో మీడియా మాత్రం సింహాచలం ప్రమాదాన్ని తగ్గించి చూపడానికి నానా పాట్లు పడింది. ఏది ఏమైనా మత సెంటిమెంటును రాజకీయాలకు వాడుకోవడం మంచిది కాదు.అది ఎప్పటికైనా వారికే తగులుతుంది.ఈ నేపథ్యంలో పాలకులు చేసే పాపాలు తమకు శాపాలుగా మారుతున్నాయని ప్రజలు సెంటిమెంట్ గా భావించే పరిస్థితి ఏర్పడింది. - కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
KSR LIVE: పవన్ వ్యాఖ్యలకు శంకర్ రెడ్డి కౌంటర్
-
KSR: చంద్రబాబు మాస్టర్ ప్లాన్ ఎల్లో మీడియా భుజాన ఉర్ఫా
-
పవన్ కళ్యాణ్ పిచ్చి మాటలు కాశ్మీర్లో అసలేం జరిగిందో చెప్పిన చిన్నారిపవన్ కళ్యాణ్ పిచ్చి మాటలు కాశ్మీర్లో అసలేం జరిగిందో చెప్పిన చిన్నారి
-
భారత్ అంటే భయపడేలా.. పాకిస్తాన్ ను చావుదెబ్బ కొట్టాలి
-
వెడ్డింగ్ ఈవెంట్స్ చేసేవాళ్లు అసలు గాయకులే కాదు : కీరవాణి
-
KSR Comment: సూపర్ సిక్స్ డైవర్షన్ కోసం చంద్రబాబు కొత్త ప్రకటన
-
జగన్ ఫాలోయింగ్ చూసి.. బాబులో మరో అనుమానం
-
ఆరోగ్యశ్రీ ఆగిపోయింది మొర్రో అంటే..వైద్యం చిట్కాలు చెప్తున్న చంద్రబాబు
-
KSR Comment: తమిళనాడులో జనసేన.. ఊసరవెల్లి సిగ్గుపడేలా పవన్ తీరు
-
Analyst Vijay: బస్సులో జనాన్ని తరలించారు వాళ్లు చెప్పే సోది వినలేక పారిపోయారు
-
దైవ సన్నిధిలో కూడా అబద్దాలు.. సిగ్గుండాలి చంద్రబాబు
-
KSR Comment: డీలిమిటేషన్ పై స్పష్టంగా చెప్పిన జగన్
-
రఘురామరాజుకు ఒక రూల్? కృష్ణ రెడ్డికి ఒక రూలా?
-
KSR Comments: చంద్రబాబు దారిలో రేవంత్
-
ఒకవైపు డబ్బులు లేవు అంటారు.. మరోవైపు విలాసాలకు ఖర్చు పెడుతున్న కూటమి సర్కార్
-
జగన్ పై వ్యక్తిగత విమర్శలు.. అసెంబ్లీలో చంద్రబాబు నీచపు బుద్ది
-
అంకెల గారడీ చేస్తే ప్రజల ఆదాయం పెరిగిపోతుందా?
-
స్టార్ హోటల్లో IAS అధికారుల భార్యలు.. ప్రభుత్వం సిగ్గు పడాల్సిన విషయం
-
KSR LIVE Show: పోసానిపై కుట్ర.. బాబుకి టీచర్ల చెంప దెబ్బ
-
కృష్ణా జలాల వాటాపై తోడు దొంగలాట
-
AP MLC Results 2025: షాక్ లో టీడీపీ, జనసేన
-
పోసానికి 10 రోజుల రిమాండ్ విధించిన జడ్జి
-
రెడ్ బుక్ దెబ్బ జీవీ రెడ్డి అవుట్
-
అప్పుడు చెత్త పన్ను అంటూ ఏడ్చాడు ఇప్పుడు పిఠాపురంలో అదే చేస్తున్నాడు
-
ఆంధ్రప్రదేశ్ అప్పు లపై కూటమి సర్కారు తప్పుడు ప్రచారం
-
రాజకీయాల్లోకి రీ-ఎంట్రీ ప్రచారంపై చిరంజీవి క్లారిటీ
-
అసత్య కథనాలు అల్లుతున్న ఎల్లో మీడియా
-
మార్గదర్శి స్కాం దేశంలోనే చాలా పెద్దది: మిథున్ రెడ్డి
-
కిరణ్ రాయల్ చేసిన మోసాలపై ఆధారాలతో ఎస్పీకి ఫిర్యాదు చేసిన లక్ష్మి
-
మహిళలపై పవన్ కు ఉన్న గౌరవం ఇదేనా? అని ప్రశ్నలు
-
డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా టీడీపీ గూండాగిరి
-
తెలంగాణ రాజకీయాలో పద్మ వార్ : KSR
-
నాడు ఎన్టీఆర్కు జరిగిందే నేడు బాబుకు జరుగుతుందా ?
-
ఆంధ్రప్రదేశ్లో జోరుగా కోడి పందేలు, జాదాలు
-
పండుగ పూట బీజేపీలో జనసేన విలీనం..!? బాలకృష్ణ వేధింపులు
-
KSR Comment: బోల్తా కొట్టించిన బాబు..
-
ఎప్పుడు తొక్కిసలాటలు జరగలేదా!
-
రాష్ట్ర ప్రజలపై అమరావతి భారం
-
హైదరాబాద్- బెంగుళూరుకు ఇన్వెస్టర్లు వస్తున్నారని స్పష్టీకరణ
-
KSR: గ్రూప్ 2లో బాబు భజన
-
నాగబాబుకు మంత్రి పదవి!
-
చంద్రబాబు చానా ముదురు..
-
చంద్రబాబు మరో డైవర్షన్...
-
సోషల్ మీడియా పోస్టులపై కేసులో విచారణకు వచ్చామంటూ హల్ చల్
-
టీడీపీ నేతలపై ఫిర్యాదు తీసుకోవడానికి వెనకాడారు: YSRCP నేతలు
-
ఏపీలో పోలీసులను అడ్డుపెట్టుకుని నిరంకుశత్వం
-
పవన్ సంచలన వ్యాఖ్యలు.. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కౌంటర్..
-
లడ్డు వ్యవహారం తరువాత తిరుమలలో బ్రాహ్మణుల పరిస్థితి
-
KSR: ఏపీ మహిళలకు బాబు బిగ్ షాక్.. ఒక సిలిండర్ మాత్రమే..!
-
మార్చి వరకు ఒకటే గ్యాస్
-
భవిష్యత్తు కోసం బాబు గారి ప్లానింగ్ అన్ని అమ్మేసి అస్సాం కు ఆంధ్రను..!
-
KSR Comment: చంద్రబాబు చక్రబంధంలో చెల్లెమ్మ
-
ఇంత నీచానికి దిగజారాలా బాబు... అబ్బా... కొడుకులపై KSR ఫైర్
-
ఎన్నికల సమయంలో బాబు లోకేష్ లు విదేశాలకు వెళ్ళింది అందుకే
-
మద్యం మాఫియా సూత్రధారి, పాత్రధారి చంద్రబాబే
-
KSR: న్యూస్ పేపర్స్ టాప్ హెడ్ లైన్స్
-
కేసీఆర్ కేజీ టు పీజీ కథ చెప్పి చేసిన మోసం
-
KSR : ఈరోజు ముఖ్యాంశాలు
-
అగ్గిపెట్టెలకు 23 కోట్లా..! లక్షకోట్ల స్టీలాప్లాంట్ స్కాం..
-
మోడీని బాగా పొగిడారు.. స్టీల్ ప్లాంట్ గురించి ఎందుకు అడగలేదు
-
హర్యానా ఫలితాలు బయట పెట్టిన నిజం..
-
మతిపోయి, గతి తప్పి.. మంత్రిగారి గలీజు మాటలు..
-
స్వతంత్ర సిట్ నిజాలు నిగ్గుతేల్చుతుందా ?
-
అధికార మదం తలకెక్కితే.. జస్టిస్ విశ్వనాథన్ కీలక వ్యాఖ్యలు
-
సుప్రీంకోర్టు వ్యాఖ్యలపై కొమ్మినేని రియాక్షన్..
-
KSR Live Show: విద్య వద్దు.. మద్యం ముద్దు
-
తీసుకున్న గోతిలోనే.. బాబు అండ్ కో
-
బాబు ఉన్మాద ప్రేలాపనలు
-
జానీ మంచి కళాకారుడు..!
-
మచ్చ లేని మహా నాయకుడు అతని మృతి దేశానికే తీరని లోటు
-
బాబు బోట్ల ఎపిసోడైపై కృష్ణంరాజు కీలక వ్యాఖ్యలు..
-
KSR: కృష్ణలంకను కాపాడిన జగన్..
-
రాష్ట్రం మునిగిపోతుంటే.. చంద్రబాబు నిద్రపోతున్నాడు
-
KSR Comment: జగన్ అంటే బాబుకు ఎందుకంత భయం?
-
బాబూ తాళాలు ఎక్కడ?
-
మార్గదర్శికి హైకోర్టు భారీ షాక్
-
రోజుకు 405 కోట్లు అప్పు KSR చంద్రబాబు సరికొత్త రికార్డు
-
సాయిరెడ్డిపై ఎల్లో కుట్ర.. బాబు పిచ్చి ( శ్వేత ) పత్రం
-
KSR Comment: భూతం ఎవరు ?.. చంద్రబాబు రెండు నాలుకలు
-
సూపర్ సిక్స్ ఫెయిల్యూర్.. బాబు బండారంపై కెఎస్ఆర్ కామెంట్స్
-
KSR Comments: మరోసారి అమరావతి గ్రాఫిక్స్
-
గురువు కోసం రేవంత్ నీచ రాజకీయాలు
-
KSR Comments: వాట్ ఏ మేనేజ్ మెంట్?.. చంద్రబాబుపై ఆరోపణలు మోదీ సైలెంట్..
-
YSRCP ఓటమిపై పిచ్చి కూతలు.. రేవంత్ రెడ్డికే భారీ నష్టం
-
KSR Comment: శృతిమించిన కీరవాణి.. రామోజీ నిజస్వరూపం బయటపెట్టిన పవన్
-
చంద్రబాబు, లోకేష్ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలు
-
టీడీపీ సర్కార్ పై NBDA సీరియస్
-
KSR Comments: ఇరకాటంలో కేసీఆర్
-
రెడ్ బుక్ హోర్డింగ్స్ అర్థం ఏంటి..?
-
KSR Comment: త్వరలో ప్రజల్లోకి వైఎస్ జగన్
-
గెలిచేది జగనే ..ఎందుకంటే..
-
కూటమి ఓటమిని ఒప్పుకున్న ABN రాధాకృష్ణ
-
పిన్నెల్లి వీడియో ముందు ఏం జరిగింది..?
-
తెలంగాణలో సన్నబియ్యం రాజకీయం..
-
KSR : సన్నబియ్యం రాజకీయం..! ఎవరి వాదన కరెక్ట్ ?
-
రామోజీ ఈ వయసులో ఇదేం పని... ఇప్పటికైనా మారకపోతే..
-
రిజర్వేషన్లపై మోడీ డబుల్ గేమ్
-
పార్లమెంట్ ఎన్నికలు..BRS పరిస్థితి ఏంటి ?..KSR విశ్లేషణ
-
వైఎస్ జగన్ విస్పష్ట సందేశం
-
ఆ కాన్ఫిడెంట్ ఏంటి ?..హ్యాట్సాఫ్ జగన్
-
కుప్పంలో కోట్లు కుమ్మరించినా చంద్రబాబుకు ఓటమి ?
-
మళ్లీ జగనే సీఎం..తేల్చేసిన కొమ్మినేని
-
ఇదే సాక్ష్యం... సంచలన నిజాలు బయటపెట్టిన KSR
-
మోదీ వ్యాఖ్యలకు కొమ్మినేని కౌంటర్..
-
పిఠాపురం పవన్ కళ్యాణ్ గెలుపుపై చిరంజీవి వీడియో..కొమ్మినేని స్ట్రాంగ్ రియాక్షన్
-
సీఎం రమేష్ ను కలవడంపై కొమ్మినేని విశ్లేషణ
-
నా తొలి సంతకం వాళ్ళ కోసమే.. కూటమి మరో కుట్ర..!
-
విలవిల లాడిన వృద్ధులు.. 30 మందికిపైగా మృతి..!
-
పవన్ కళ్యాణ్ ఊగిపోయే స్పీచ్ కి కొమ్మినేని అదిరిపోయే సెటైర్లు
-
భువనేశ్వరి తిట్ల దండకం.. ఇదే అసలు నిజం
-
నారా భువనేశ్వరి ఆడియోపై కొమ్మినేని షాకింగ్ కామెంట్స్
-
నా చెల్లెళ్ళు అంటూ పద్దతిగా మాట్లాడారు.. అది సీఎం జగన్ సంస్కారం..!
-
ముస్లిం రిజర్వేషన్లపై పచ్చ పత్రికలకు పెద్ద కష్టం.. కొమ్మినేని విశ్లేషణ...
-
KSR Comments: టీడీపీ సభలో జనాలు ఎక్కువ కనిపించాలని చంద్రబాబు, పవన్ మాస్టర్ ప్లాన్
-
బస్సు యాత్ర దెబ్బకు రామోజీ కి మైండ్ బ్లాక్
-
పెళ్ళాం అనే పదం తప్పయితే పవన్ కు రాజీవ్ కౌంటర్
-
తానా సభల పేరుతో అమ్మాయిలను.. కోమటి జయరాం చరిత్ర ఇది
-
మట్టి మనుషులు వెధవలంట.. ఓటర్లను కొనేస్తారంట..!
-
రాయి వేసిన దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకున్న బోండా ఉమా
-
సీఎం రమేష్ మీటింగ్ పై కొమ్మినేని కామెంట్స్
-
చంద్రబాబు సెల్ఫ్ గోల్..!
-
సీఎం జగన్ ను హత్య చేసేందుకే..రిమాండ్ రిపోర్ట్ నిజాలు..!
-
సీఎం జగన్ రాయి దాడిపై పవన్ కామెంట్స్...కొమ్మినేని స్ట్రాంగ్ కౌంటర్
-
పవన్ కళ్యాణ్ చాలా హానికరం.. సీఎం జగన్ దాడిపై కొమ్మినేని షాకింగ్ నిజాలు
-
షర్మిలతో చాలా నష్టం..!
-
ఇక రామోజీరావు తప్పించుకోలేడు.. కొమ్మినేని కామెంట్స్
-
"ఎంపీ పదవి కోసం..నాడు చంద్రబాబు చేసిన మోసం మర్చిపోయి.."
-
రామోజీ రావు సుప్రీం కోర్టు తీర్పుపై కొమ్మినేని విశ్లేషణ
-
చంద్రబాబు, షర్మిల.. చిత్ర విచిత్ర విన్యాసాలు: KSR
-
చంద్రబాబు విధ్వంసం.. వాలంటీర్ వ్యవస్థ ధ్వంసం
-
వీళ్లు పెద్ద ముదుర్లు..! సీఎం రమేష్, చంద్రబాబు ఒకరికొకరు
భారతీయ జనతా పార్టీ దేశంలో పాటిస్తున్న ద్వంద్వ ప్రమాణాలకు అనకాపల్లి అభ్యర్ధి సీఎం రమేష్ ఒక ప్రత్యక్ష ఉదాహరణ కావచ్చు. రమేష్ తనకు ఉన్న అర్ధ,హంగు బలంతో అనకాపల్లి వద్ద పోలీసులపై తిరగబడ్డ తీరు ఆశ్చర్యం ఏమీ కాదు. ఆయన గత చరిత్ర ఒకసారి చూస్తే అనేక విషయాలు తెలుస్తాయి. ఒక చిన్న సారాయి వ్యాపారిగా ఉన్న సీఎం రమేష్ ఈ రోజు కొన్ని వేల కోట్ల రూపాయల ఆస్తులకు అధిపతి. రాజకీయ సమాజాన్ని ప్రభావితం చేస్తున్న ఒక నేతగా చలామణి అవుతున్నారు. తనపై ఎన్ని ఆరోపణలు ఉన్నా దేశ ప్రధానమంత్రి ఎదుట కూర్చోగలుగుతున్నారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన వారి సరసన నిలబడుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు జూబ్లీహిల్స్ లో ఒక ఇల్లు ఉంది. అందులోనే ఆయన నివసిస్తారు. ఆయన సీఎం పదవి చేపట్టాక తన ఇంటి పక్కనే ఉన్న మరో ఇంటిని తన రాజకీయ అవసరాల కోసం తీసుకున్నారు. అందులో సర్వే కార్యకలాపాలు నిర్వహించేవారికి, పార్టీ పనులు ,ఇతరత్రా వినియోగించేవారు. విశేషం ఏమిటంటే ఆ తర్వాత కాలంలో సీఎం రమేష్ ఆ ఇంటిని కొనుగోలు చేసి ఒక భారీ భవంతి ని నిర్మించారు. చంద్రబాబు పాత ఇల్లుకన్నా సీఎం రమేష్ ఇల్లే సూపర్గా కనిపించేది. ఆ తర్వాతకాలంలో చంద్రబాబు కుటుంబం కూడా మళ్లీ తమ ఇంటిని పునర్మించుకున్నారు. అంతేకాదు.చంద్రబాబు వాస్తు నమ్మకాల కోసం రమేష్ కొన్న ఇంటి స్థలం నుంచి 400 గజాలు తీసుకున్నారు. ఒక మాట ఎవరైనా అంగీకరించాలి. సీఎం రమేష్ ఎదుగుదలలో చంద్రబాబుకు పెద్ద పాత్రే ఉంది. ఉమ్మడి ఏపీ సీఎంగా ఉన్నప్పుడు హైదరాబాద్లో నిత్యం ఆయన కార్యాలయం చుట్టూనే రమేష్ తిరుగుతుండేవారు. ఒక మీడియా ప్రముఖుడితో కలిసి పైరవీలు,ఇతర లావాదేవీలు సాగించేవారని చెబుతారు. ఈ మీడియా ప్రముఖుడికి, రమేష్కు జిగినీ దోస్తి ఏర్పడింది. ఒకసారి సుజనా చౌదరికి రాజ్యసభ సీటు ఇవ్వాలని చంద్రబాబు ప్రతిపాదించినప్పుడు ఆ మీడియా ప్రముఖుడికి కోపం వచ్చింది. తన సన్నిహితుడు సీఎమ్ రమేష్కు రాజ్యసభ సీటు ఇవ్వకుండా సుజనాకు ఇస్తారా అని ఆగ్రహించి, సుజనాపై ఒక పెద్ద వ్యతిరేక స్టోరీని బ్యానర్గా ఇచ్చారు.అందులో సుజనాకుఉన్న బోగస్ కంపెనీలు ఇతరత్రా అనేక విషయాలను ప్రచురించారు. దాంతో చంద్రబాబు రాజీ చేసుకుని, సీఎమ్ రమేష్కు తదుపరి టర్మ్లో పదవి ఇవ్వవలసి వచ్చిందని టీడీపీ వర్గాలు చెబుతుంటాయి. రమేష్ తండ్రి కుప్పంలో సారా వ్యాపారం చేస్తుండేవారు.అప్పటికి ఇంకా చిన్నవాడు అయిన రమేష్ కుప్పంలో చదివేవాడట. తదుపరి అతను రైల్వే కోడూరులో ఇంటర్ వరకు చదివారట. ఆ తర్వాత పదేళ్లకు ఈయన యువకుడు అయి వ్యాపారంలోకి వచ్చారు. ఆ క్రమంలో రాయదుర్గం నుంచి సారా సాచెట్లు తెప్పించి వాటిలో సారా నింపి తమిళనాడుకు అక్రమ రవాణా చేస్తుండగా, తండ్రితో సహా రమేష్ను పోలీసులు అరెస్టు చేశారని ఆయన గురించి తెలిసినవారు గుర్తు చేస్తున్నారు. మరో కేసులో సీఎం రమేష్ తండ్రిని పి.డి చట్టం కింద కూడా అరెస్టు చేసి చంచల్ గూడ జైలులో ఉంచారట. ఈ దశలో రాజకీయ రంగంలో ముఖ్యులను ఆశ్రయించితే కేసుల నుంచి బయటపడవచ్చని తెలుసుకున్న రమేష్ అప్పట్లో కడప జిల్లాలో మంత్రిగా ఉన్న ఒక కాంగ్రెస్ నేతతో సంబంధాలు పెట్టుకున్నారు. ఆయన కూడా సాయం చేసి వీరిని కేసుల నుంచి బయటపడేశారు. అప్పటికి చంద్రబాబుతో రమేష్కు పెద్దగా సంబంధాలు లేవు. ఆ రోజుల్లో అసెంబ్లీలో కూడా రమేష్ ,ఆయన తండ్రిపై వచ్చిన ఆరోపణలను,వారిని రక్షించిన కాంగ్రెస్ మంత్రికి, ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడుకు మద్య అసెంబ్లీలో వాగ్వాదం జరిగింది. చంద్రబాబు అప్పట్లో రమేష్ సన్నిహితులతో మంత్రికి ఉన్న సంబంధం పై ఆరోపణలు గుప్పించగా, చంద్రబాబుపైనే మంత్రి ప్రత్యారోపణలు చేశారు. చంద్రబాబును కూడా రమేష్ ఆకట్టుకోవడానికి ప్లాన్ చేసి సఫలం అయ్యారు. చంద్రబాబు తిరుపతి వస్తుంటే ,అక్కడ పత్రికలలో స్వాగత ప్రచార ప్రకటనలు ప్రచురించారట. దాంతో చంద్రబాబుకు ఈయనపై ఆసక్తి కలిగి టచ్లో పెట్టుకున్నారు. అప్పటి నుంచి వీరి మధ్య ఆర్ధిక సంబంధం ఏర్పడింది. తదుపరి అది రాజకీయ సంబంధంగా కూడా మారింది. ఇంతలో చంద్రబాబు తన మామ ఎన్.టి.రామారావును కూలదోసి ముఖ్యమంత్రి కావడంతో రమేష్ తన పట్టు బిగించడం ఆరంభించారు.పైరవీల స్థాయి నుంచి కాంట్రాక్టర్ అవతారం ఎత్తగలిగారు. కుప్పంలో ఎన్నికలు జరిగినప్పుడు పోట్లదుర్తి నుంచి ఒక వందమందిని తీసుకుని వెళ్లి చంద్రబాబు కోసం పనిచేసేవారట. దొంగ ఓట్లు మొదలు వివిధ కార్యకలాపాలను ఈ బృందం నిర్వహించేదట. ఆ రకంగా చంద్రబాబుతో బంధం పెనవేసుకుని పోయింది. చంద్రబాబు కూడా ఈయనకు ఇరిగేషన్ తదితర కాంట్రాక్టులు వచ్చేందుకు సహకరించారన్న ప్రచారం ఉంది. ఆ రకంగా అంచెలంచెలుగా ఎదుగుతూ ఒక ఆర్ధిక సామాజ్రాన్ని ఏర్పరచుకోగలిగారు.వందల ఎకరాల భూములు సంపాదించారు. హైదరాబాద్లో స్థిరాస్తులు సమకూర్చుకున్నారు. ఒక విమానం కొనుగోలు చేసే దశకు వెళ్లగలిగారు. ఈ మధ్యనే ప్రముఖ నటుడు వేణు ఈయనపై ఒక ఫిర్యాదు చేస్తూ 450 కోట్ల మేర ఫోర్జరీ చేసి మోసం చేశారని ఆరోపించారు. బ్యాంకుల నుంచి రుణాలు పొందడం, వాటిలో కొంతమేర ఎగవేయడం తదితర ఆరోపణలు కూడా వచ్చాయి. 2019 ఎన్నికల సమయంలో తన ఇంటికి వచ్చిన ఆదాయపన్ను శాఖ అధికారులపై కూడా దౌర్జన్యపూరితంగా వ్యవహరించారు. అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు సైతం సీఎం రమేష్, సుజనా చౌదరి వంటివారిపై కేంద్రం అక్రమ కేసులు పెడుతోందని, ఐటీ, సీబీఐ అక్రమ దాడులు చేస్తోందని ఆరోపించేవారు. ఆ ఎన్నికలలో టీడీపీ ఓటమి చెందడంతో సీఎమ్ రమేష్ ,సుజనా చౌదరి , టీజీ వెంకటేష్, గరికపాటి మోహన్ రావులు వెంటనే బీజేపీలో చేరిపోయారు. అప్పటివరకు బీజేపీని తిట్టిన రమేష్, సుజనాలు తమపై ఉన్న ఆర్దిక నేరారోపణల నేపథ్యంలో జాగ్రత్తపడ్డారని అంతా భావించారు. బీజేపీలో చేరిన వెంటనే వీరంతా ప్రధాని నరేంద్ర మోదీ ఎదుట కూర్చుని తెలుగు ప్రజలను ఆశ్చర్యపరిచారు. బీజేపీలోలో చేరితే ఎన్ని ఆరోపణలు ఉన్నా పునీతులు అయిపోతారా అన్న ప్రశ్న ఆ రోజే వచ్చింది.అక్కడ నుంచి మెల్లగా బీజేపీ పెద్దలను మంచి చేసుకుంటూ రమేష్ కాని, సుజనా చౌదరి కాని చంద్రబాబు తరపున పనిచేస్తుంటారన్నది సర్వత్రా ఉన్న అభిప్రాయం. దానికి తగ్గట్లుగానే బీజేపీ ఏపీ అధ్యక్షుడుగా ఉన్న సోము వీర్రాజును తప్పించి దగ్గుబాటి పురందేశ్వరికి ఆ పదవి వచ్చేలా చేసుకోగలిగారు. ఆ తర్వాత బీజేపీపై మరింత పట్టు బిగించారు. ఇదే టైమ్ లో ముఖ్యమంత్రి జగన్ను వ్యతిరేకించిన ఆయన చెల్లెలు షర్మిలకు కూడా తన విమానం సమకూర్చి ఢిల్లీకి పంపించి కాంగ్రెస్లో చేర్పించడానిక సహకరించారని అంటారు. ఈ రకంగా అంచెలంచెలుగా ఎదిగిన రమేష్ను చంద్రబాబు రెండుసార్లు రాజ్యసభకు పంపించారు. ఆ పదవి ద్వారా ఢిల్లీ స్థాయిలో కేంద్రంలో ఉన్న ప్రముఖులతో సంబంధబాంధవ్యాలు పెట్టుకోవడంలో నేర్పరిగా రమేష్ పేరుపొందారు. ఈ క్రమంలో ఏపీ బీజేపీపై కూడా పట్టు సాధించి అనకాపల్లి నుంచి ఆ పార్టీ పక్షాన పోటీచేయడానికి సిద్దం అయ్యారు. 2014 లో జగన్ మాతృమూర్తి విజయమ్మ విశాఖ నుంచి లోక్ సభకు పోటీచేశారు. అప్పట్లో తెలుగుదేశం ఒక ప్రణాళిక ప్రకారం ఒక తప్పుడు ప్రచారం చేసింది. ఆయా హోటళ్ల వద్ద, కూడళ్లలో ,నలుగురు కూర్చున్న చోటకు ప్రత్యేకంగా నియమితులైన టీడీపీ కార్యకర్తలతో,నారాయణ సంస్థల సిబ్బందితో కడప నుంచి వచ్చిన వారిని ఎన్నుకుంటే విశాఖలో భూములు ఆక్రమిస్తారు..గొడవలు చేస్తారు..అంటూ ప్రచారం చేయించింది. దాని ప్రభావం కూడా అప్పట్లో కొంత పడింది. ఫలితంగా విజయమ్మ ఓటమి పాలయ్యారు. విశేషం ఏమిటంటే అదే కడప జిల్లాకు చెందిన సీఎమ్ రమేష్ అనకాపల్లి నుంచి పోటీచేస్తున్నారు. తన స్వస్థలం పోట్లదుర్తి నుంచి సుమారు ఏభై మందిని అక్కడకు తరలించి ప్రచార,ఇతర కార్యాకలాపాలలో పెట్టుకున్నారట. అలాగే టీడీపీకి చెందిన నేతలకు తగు ఆర్ధిక వనరులు సమకూర్చి టీడీపీలో ఉన్న అసమ్మతిని తగ్గించుకునేందుకు కృషి చేశారట.ఈ క్రమంలో తనకు ఎదురు లేదని భావించిన సీఎం రమేష్ అక్కడ పోలీసు అధికారులను భయపెట్టేలా వ్యవహరించారు. చోడవరం వద్ద జీఎస్టీ ఎగవేతకు సంబందించి తనిఖీలకు అధికారులు వెళ్లగా, ఆ సంస్థ యజమాని సీఎమ్ రమేష్కు ఫోన్ చేసి రప్పించారు. ఆయన రావడంతో సీన్ సృష్టించి అధికారులు వెళ్లిపోయేలా చేశారు. విజయమ్మ ఆ ప్రాంతంలో పోటీచేసినప్పుడు ఎలాంటి గొడవలు, దౌర్జన్యాలు జరగలేదు. అయినా టీడీపీ, బీజేపీ అలా అసత్య ప్రచారం చేశాయి. ఇప్పుడు టీడీపీ నుంచి బీజేపీలో చేరి అనకాపల్లిలో పోటీచేస్తున్న సీఎం రమేష్ మాత్రం తన స్వరూపాన్ని బహిర్గతం చేశారు. దీనిని అనకాపల్లి ప్రాంత ప్రజలు సహిస్తారా? అన్నది అనుమానం. అసలే స్తానికుడు కాదన్న భావన ఉంటే,దానికి తోడు రమేష్ ,ఆయన మనుషులు దౌర్జన్యాలు చేస్తారేమో అన్న భయం ఏర్పడితే అది ఆయనకు మరింత నష్టం కలిగించవచ్చు. సీఎం రమేష్ టీడీపీ రాజకీయాలలో ఒక కీలకమైన వ్యక్తిగా,చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడుగా ఇప్పటికీ కొనసాగగలుగుతున్నారు. నిజాయితీగా వ్యాపారం నిర్వహించుకుని పైకి వస్తే ఎవరికి అభ్యంతరం ఉండవలసిన అవసరం లేదు. కాని అడ్డదారుల ద్వారా వేగంగా ఎదిగినప్పుడు అందరూ ఆశ్చర్యపోతారు. తమ వద్ద ఉన్న ఆర్ధిక వనరులను ఉపయోగించి వీలైనంతమందిని వీరు ఆకట్టుకోగలుగుతారు. ఒక చిన్న సారా వ్యాపారి ,ఇంత పెద్ద ఆర్దిక సామ్రాజ్యాన్నిసృష్టించుకోవడం సమాజ వైఫల్యమా? రాజకీయ వ్యవస్థ వైఫల్యమా అంటే ఏమి చెబుదాం? – కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
పురందేశ్వరిని అడ్డుపెట్టుకొని చంద్రబాబు కొత్త పన్నాగం