breaking news
Krupa Shankar Singh
-
కాంగ్రెస్కు రంగీలా భామ గుడ్బై
ముంబై: బాలీవుడ్ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన రంగీలా ఫేమ్ ఊర్మిళ మటోండ్కర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. లోక్సభ ఎన్నికలకు కొద్ది రోజుల ముందే పార్టీలో చేరిన ఆమె అయిదు నెలలు తిరక్కముందే కాంగ్రెస్ను వీడారు. పార్టీలో అంతర్గత రాజకీయాలే తన రాజీనామాకు దారి తీశాయని ఆమె మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మహారాష్ట్ర మాజీ మంత్రి కృపాశంకర్ సింగ్ కూడా పార్టీకి రాజీనామా చేశారు. ముంబై కాంగ్రెస్లో కీలక పదవుల్లో ఉన్నవారు చిత్తశుద్ధితో పార్టీ కోసం పని చేయడం లేదని, కాలానుగుణంగా పార్టీలో మార్పులు చేస్తూ కాంగ్రెస్ అభ్యున్నతికి కృషి చేసేవారు కరువయ్యారని ఊర్మిళ ఆరోపించారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేయడానికి తన మనసు అంగీకరించడంలేదన్నారు. ఊర్మిళ రాసిన లేఖ వెలుగులోకి కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికల్లో ఎందుకు అంత దారుణంగా ఓడిపోయిందో, దానికి గల కారణాలను విశ్లేషిస్తూ ఊర్మిళ మే 16న ముంబై కాంగ్రెస్ అప్పటి అధ్యక్షుడు మిలింద్ దేవరాకు లేఖ రాశారు. ఎంతో గోప్యంగా ఉంచాల్సిన ఆ లేఖ మీడియాలో ప్రచారం కావడంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురయ్యారు ‘‘కాంగ్రెస్ పార్టీ నన్ను నిలువునా మోసం చేసింది. పార్టీలో నాయకుల మధ్య నెలకొన్న వర్గ పోరుతో నన్ను బలిపశువును చేయాలని చూశారు‘‘అంటూ ఆమె ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ముంబై కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు సంజయ్నిరుపమకు అత్యంత సన్నిహితులైన సందేష్ కోండ్విల్కర్ , భూషణ్ తీరుతెన్నులపై ఊర్మిళ ఆ లేఖలో విమర్శించారు. గత మార్చిలో కాంగ్రెస్ గూటికి చేరిన ఆమె ముంబై ఉత్తరం నుంచి పోటీ చేసి బీజేపీ అభ్యర్థి గోపాల్ శెట్టి చేతిలో 4.6 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. తన ఓటమికిగల కారణాలను ఊర్మిళ ఆ లేఖలో వివరిస్తూ స్థానిక నాయకుల మధ్య సమన్వయ లేమి, క్షేత్రస్థాయిలో కార్యకర్తలను కూడగట్టడం, ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులకు నిధులు అందించడం వంటివి సరిగా చేయలేదని నిందించారు. మొత్తంగా చూస్తే పార్టీ నేతల్లో నిజాయితీ, సమర్థత, సమన్వయం కొరవడ్డాయని అందుకే తనతో సహా పార్టీలో చాలా మంది ఓటమి పాలయ్యారని ఊర్మిళ ఆ లేఖలో పేర్కొన్నారు. పేర్లతో సహా రాసిన ఆ లేఖను అత్యంత గోప్యంగా ఉంచాల్సింది పోయి మీడియాలో ప్రచారం కావడంతో చివరికి ఆమె పార్టీని వీడుతున్నట్టుగా ప్రకటించారు. -
ముంబై సీటు కోసం కాంగ్రెస్ నేత కృపాశంకర్ యత్నం
సాక్షి, ముంబై: ఆదాయానికి మించి ఆస్తులు కల్గి ఉన్నాడనే ఆరోపణలు ఎదుర్కుంటూ కోర్టుల చుట్టూ తిరుగుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే కృపాశంకర్ సింగ్కు ఈ శాసన సభ ఎన్నికల్లో టికెటు లభించే అవకాశాలు లేవు. ఈ విషయం తెలుసుకున్న ఆయన తనకు కాకుంటే కనీసం తన కొడుకు లేదా కూతురికి ముంబై అసెంబ్లీ టికెటు ఇవ్వాలని ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ని ప్రసన్నం చేసుకొనే పనిలో నిమగ్నమయ్యారని తెలుస్తోంది. ఆయనకు టికెటు ఇవ్వాలా..? వద్దా...? అనేది సోనియా గాంధీ చేతిలో ఉంది. ఒక వేళ ఆమె తలుచుకుంటే సింగ్కు లేదా ఆయన కుటుంబంలో ఒకరికి టికెటు (అభ్యర్థిత్వం) ఇచ్చే అవకాశాలున్నాయి. ఆదాయానికి మించి ఆస్తులు కలి ్గఉన్నాడనే కేసుల్లో నాలుగు సంవత్సరాల నుంచి ఆయన బాంబే కోర్టు మొదలుకుని సుప్రీం కోర్టు చుట్టూ తిరుగుతున్నాడు. ఈ ఆరోపణల కారణంగా అప్పట్లో కాంగ్రెస్ పార్టీ పరువు పోయింది. ఆయన ముంబై రీజియన్ కాంగ్రెస్ కమిటీ (ఎమ్మార్సీసీ) అధ్యక్ష పదవికి రాజీ నామా చేయాల్సి వచ్చింది. కోర్టు కేసులో తీర్పు వెలువడితే జైలు శిక్ష పడితే ఆయన రాజకీయ జీవితానికే పుల్స్టాప్ పడనుంది. ఇలాంటి సందర్భంలో మళ్లీ ఆయనకు ఎమ్మెల్యేగా టికెటు ఇస్తే పార్టీ ప్రతిష్ట మరింత దిగజారుతుందని కాంగ్రెస్ నాయకులు కొందరు భావిస్తున్నారు. ఈ విషయాన్ని ముందుగానే పసిగట్టిన సింగ్ తనకు కాకుంటే కనీసం తన కుటుంబ సభ్యులకు అభ్యర్థిత్వం దక్కేలా చూడాలని సోనియా ముందు మోకాళ్లీరుతున్నారు. ఇదిలా ఉండగా, గత ఎన్నికల్లో కృపాశంకర్ సింగ్ పోటీచేసిన నియోజక వర్గం నుంచి పోటీ చేయాలని మరో కాంగ్రెస్ అభ్యర్థి సిద్ధంగా ఉన్నారు. కానీ, ఈ నియోజక వర్గాన్ని వదిలేందుకు సింగ్ సిద్ధంగా లేరు. ఒకవేళ ఢిల్లీ అధిష్టానం సింగ్కు లేదా ఆయ న కుటుంభీకులకు టికెటు ఇస్తే ఆ నియోజకవర్గం చేజారిపోవడం ఖాయమని ఆ పార్టీ సీనియర్ నాయకులు భావిస్తున్నారు. సింగ్తోపాటు ఆయన కుటుబీబికులకెవరికీ టికెటు ఇవ్వకూండా సిని యర్ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం.