breaking news
konam
-
మనిషిని చంపే శక్తి ఉన్న కొమ్ముకోణం చేప?
పల్లిపాలెం ఫిషింగ్ హార్బర్ కేంద్రంగా చేసుకుని సోమవారం సముద్రంపై వేటకు వెళ్లిన మత్య్సకారుల వలకు ఇతర రకాల సంపదతో పాటు కొమ్ముకోణం రకం భారీ చేప చిక్కింది. దాన్ని మంగళవారం ఫిష్ మార్కెట్కు తీసుకువచ్చారు. సుమారు 40 కేజీల బరువున్న కొమ్ముకోణం చేపను ఓ వ్యక్తి రూ.8 వేలకు కొనుగోలు చేశాడు. ఈ చేప ముక్కుకు కొమ్ము ఉండడంతో దీన్ని కొమ్ముకోణం అని పిలుస్తామని, మనిషి ప్రాణం తీసే శక్తి దీనికి ఉందని మత్స్యకారులు చెబుతున్నారు. – సఖినేటిపల్లి మీనమిలలుపల్లిపాలెం ఫిష్ మార్కెట్కు మంగళవారం వడగర్లు రకం చేపలు ఇబ్బడి ముబ్బడిగా వచ్చాయి. ఈ చేపలన్నీ కలిసి సుమారు మూడు టన్నులు ఉంటాయని మత్స్యకారులు చెప్పారు. వీటిని కేజీ రూ.50 చొప్పున విక్రయిస్తామని, మాంసాహార ప్రియులు ఈ రకం చేపల కోసం ఎదురు చూస్తుంటారన్నారు. అలాగే చాలామంది వాటిని కొనుగోలు చేశారు. వాటిని ఎగుమతి చేసేందుకు ఐస్ బాక్సుల్లో భద్ర పరిచే పనులు చేపట్టారు. – సఖినేటిపల్లిఫుట్పాట్లు చంద్రబాబు ప్రభుత్వం ఉచిత బస్సు పథకం ప్రవేశపెట్టాక మహిళా ప్రయాణికులు బాగా పెరిగారు. కానీ ఆ రద్దీకి అనుగుణంగా బస్సులను పెంచకపోవడంతో వారందరూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బస్సులో కూర్చోవడానికి సీటు కోసం చూసే స్థాయి నుంచి నిలబడే స్థలం దొరికితే చాలనే పరిస్థితి ఏర్పడింది. గతంలో ఫుట్పాత్పై నిలబడితే ప్రమాదమని చెప్పేవారు. ప్రస్తుతం అలాంటి స్థితిలోనే మహిళలు ప్రయాణం చేస్తున్నారు. రాజమహేంద్రవరంలో మంగళవారం కనిపించిన ఈ చిత్రం దానికి నిదర్శనంగా నిలుస్తోంది. – ‘సాక్షి’ ఫొటోగ్రాఫర్,రాజమహేంద్రవరం -
వైజాగ్ చేప.. ‘కోనాం’గలరా?
డాబాగార్డెన్స్ (విశాఖ దక్షిణ): విశాఖ మత్స్యకారులకు బుధవారం అతి భారీకొమ్ము కోనాం చేపలు లభ్యమయ్యాయి. ఫిషింగ్ హార్బర్లో బుధవారం సాయంత్రం సుమారు 20 వరకు కొమ్ము కోనాం చేపలను విక్రయించారు. ఒక్కో కొమ్ము చేప 100 కేజీల నుంచి 800 కేజీల బరువు తూగాయి. వీటి ధర రూ.15 వేల నుంచి రూ.50 వేలు పలికింది. ఇంత బరువున్న చేపలను నీటిలో నుంచి బయటకు తీసేందుకు జాలర్లు కష్టపడాల్సి వచ్చింది. వీటిని వేలం పాటలో పాడుకునేందుకు జనం పెద్దఎత్తున తరలివచ్చారు. -
గుట్టలుగా కోనాం చేపలు
పాతపోస్టాఫీసు కోనాం, టూనా చేపలు మంగళవారం ఉదయం చేపలరేవుకు గుట్టలుగా చేరుకున్నాయి. రేవుకు చేరిన బోట్లలో అధికంగా కోనాం చేపలు వలకు చిక్కడంతో బోట్ల యజమానులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ రకం చేపలను అత్యధికంగా ఎగుమతి చేస్తారు. కోనాం, టూనా చేపలకు దేశీయంగా కూడా మంచి ధర పలుకుతుంది. స్టార్ హోటళ్లలో మాంసాహార ప్రియులకు వీటిని వండి వడ్డిస్తారు. కోనాం చేపల ధర కూడా అధికంగానే పలుకుతుంది. మంగళవారం వేలంలో పదిహేను కేజీలు ఉన్న చేప మూడువేల రూపాయల ధర పలికింది. వీటిని బెంగళూరు, చెన్నై, ఒడిస్సా, కోల్కత్తాలకు ఎగుమతి చేసేందుకు సిద్ధం చేశారు. గత ఏడాది కన్నా ప్రస్తుత సీజన్లో చేపల ధర బాగా పడిపోయిందని బోట్ల యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


