breaking news
Komaram Bheem Award
-
ఆర్.నారాయణమూర్తికి కొమరం భీమ్ పురస్కారం
సాక్షి, హైదరాబాద్ : సినీ దర్శకుడు, నిర్మాత, నటుడు ఆర్.నారాయణ మూర్తికి ప్రతిష్టాత్మక ‘కొమరం భీమ్ జాతీయ పురస్కారం’ లభించింది. తెలంగాణ టెలివిజన్ డెవలప్మెంట్ ఫోరమ్, ఆదివాసి సాంస్కృతిక పరిషత్, గోండ్వానా సాంస్కృతిక పరిరక్షణ దళం, భారత్ కల్చరల్ అకాడమీ సంయుక్తంగా ప్రతి ఏడాది అందించే ఈ అవార్డుకు... ఈ ఏడాది ఆర్.నారాయణమూర్తిని ఎంపికి చేసినట్లు అవార్డు కమిటీ చైర్మన్, తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు కేవీ రమణాచారీ తెలిపారు. ఈ నెల 3వ వారం జరిగే అవార్డు ప్రదానోత్సవంలో 51 వేల రూపాయల నగదుతో పాటు, జ్ఞాపిక, ప్రశంస పత్రం, శాలువాతో సత్కరిసున్నట్టు కన్వీనర్ నాగబాల సురేష్ కుమార్ పేర్కొన్నారు. గతంలో ఈ అవార్డును కొమరం భీమ్ చిత్ర నిర్మాత, దర్శకుడు అల్లాణి శ్రీధర్, గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ అందుకున్నారు. కాగా ప్రజలను చైతన్యపరిచేలా ఆర్. నారాయణమూర్తి పలు చిత్రాలను నిర్మించారు. అర్థరాత్రి స్వతంత్రం, అడివి దివిటీలు, లాల్ సలాం, దండోరా, ఎర్ర సైన్యం, చీమల దండు, దళం, చీకటి సూర్యులు, ఊరు మనదిరా, వేగు చుక్కలు, అరణ్యం, ఎర్రోడు, సింగన్న లాంటి పలు చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. -
గూడ అంజయ్యకు కొమురం భీం పురస్కారం
హైదరాబాద్: ప్రముఖ గేయ రచయిత గూడ అంజయ్యను ఈ ఏడాది కొమురం భీం జాతీయ పురస్కారానికి ఎంపిక చేశారు. కొమురం భీం స్మారక ఉత్సవ పరిషత్, ఆదివాసీ సంస్కృతి, భారత్ కల్చరల్ అకాడమీ, ఓం సాయి తేజా ఆర్ట్స్ ఆధ్వర్యంలో ఈ అవార్డును ఏటా ప్రదానం చేస్తున్నారు. బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో అవార్డు కమిటీ చైర్మన్ నాగబాల సురేష్కుమార్ వివరాలను వెల్లడించారు. సినీ, టీవీ పరిశ్రమలోవిశేష సేవలందిస్తున్న వారికి తమ ఆధ్వర్యంలో గత ఐదేళ్లుగా పురస్కారాలను అందజేస్తున్నట్టు చెప్పారు. ఇప్పటి వరకు సినీ దర్శకుడు సుద్దాల అశోక్ తేజ, సినీ నటులు రాజేంద్రప్రసాద్, దర్శకుడు అల్లాణి శ్రీధర్, శిడాం అర్జున్లు ఈ అవార్డులను అందుకున్నారని తెలిపారు. అవార్డు కింద రూ.50,116, జ్ఞాపిక, శాలువా, సన్మానపత్రం అందించనున్నామన్నారు. కాగా, జనవరి చివరి వారంలో రవీంద్రభారతిలో ఈ అవార్డును అందించడానికి ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.