-
కీసరలో దేవాదాయ నిర్మాణాల కూల్చివేతకు యత్నం
కీసర: కీసరగుట్టలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఆలయానికి సంబంధించిన పలు నిర్మాణాలను ఓ ప్రైవేటు వ్యక్తి కూల్చివేయడానికి ప్రయత్నించడం గురువారం తీవ్ర చర్చనీయాంశమైంది. సదరు స్థలం ఓ ప్రైవేటు వ్యక్తికి చెందినది కావడంతో సమస్య ఏర్పడింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. కీసర వాణి సమీపంలోని సర్వే నం: 200/4లో దాదాపు 11 ఎకరాల్లో భూమి ఉంది. ఈ భూమిలో ఏటా కీసరగుట్టలో నిర్వహించే బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఎగ్జిబిషన్ స్టాల్స్, జిల్లా స్థాయి క్రీడాపోటీలను నిర్వహిస్తున్నారు. ఈమేరకు అక్కడ కళా వేదిక నిర్మాణంతోపాటు, భక్తుల సౌకర్యార్థం మినీ తాగునీటి ట్యాంకులు, మరుగుదొడ్లు తదితర నిర్మాణాలను ప్రభుత్వం నిర్మించింది. అయితే ఈ సర్వే నంబర్లోని ఎనిమిదిన్నర ఎకరాల భూమి బోగారం గ్రామానికి చెందిన చేవూరి రఘునందనరావు పేరిట ఉంది. ఈ స్థలాన్ని వాడుకుంటున్నందుకు పట్టాదారును స్థలదాతలుగా కీసర దేవస్థానం గుర్తిస్తూ వస్తోంది. కూల్చివేతలకు ప్రయత్నించిన పట్టాదారుడు అయితే గురువారం ఈస్థలాన్ని స్వాధీ నం చేసుకునే క్రమంలో పట్టాదారు అక్కడి నిర్మాణాలను కూల్చివేసేందుకు జేసీబీ సాయంతో పనులు చేయిస్తుండగా స్థానికులు అడ్డుకున్నారు. అప్పటికే ఆ స్థలంలో మోదుగు వృక్షాల చుట్టూ ఉన్న దిమ్మెలను కూల్చివేశారు. ఈ సమాచారాన్ని తహసీల్దార్ రవీందర్రెడ్డికి, కీసరగుట్ట దేవస్థానం వారికి స్థానికులు సమాచారం అందించారు. దీంతో అక్కడకు చేరుకున్న తహసీల్దార్ కూల్చివేతలను నిలిపివేయించారు. రికార్డుల ప్రకారం స్థలం ప్రైవేటు వ్యక్తికి చెందినదైనప్పటికి చాలా ఏళ్లుగా ఇక్కడ యాత్రికుల సౌకర్యార్థం ప్రభుత్వం ఇక్కడ పలు నిర్మాణాలను చేపట్టిందన్నారు. ప్రభుత్వ అనుమతి లేకుండా వీటిని తొలగించడం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడదన్నారు. స్థలం మొత్తం సర్వేచేసి జిల్లా కలెక్టర్కు నివేదిక అందజేస్తామని, అంతవరకు ఎలాంటి పనులు చేపట్టవద్దని స్థలయజమానికి స్పష్టం చేశారు. -
కీసర జాతరకు ఏర్పాట్లు ముమ్మరం
కీసర, న్యూస్లైన్: ఈనెల 25 నుంచి మార్చి 2వ తేదీ వరకు జరుగనున్న కీసరగుట్ట మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఏర్పా ట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఆలయ గోపురాలకు, మహా మండపానికి పంచరంగులు వేస్తున్నారు. ఈ పనుల కోసం తమిళనాడు నుంచి ప్రత్యేకంగా కార్మికులను రప్పించారు. క్యూలైన్ల పనులు దాదాపు పూర్తి కావొచ్చాయి. భక్తులు సేద తీరేందుకు చలువపందిళ్లు వేస్తున్నారు. కీసరగుట్ట, ఎగ్జిబిషన్ గ్రౌండ్ నుంచి దిగువ గుట్ట వరకు విడిది చేసే యాత్రికుల సౌకర్యార్థం గతంలో ఏర్పాటు చేసిన కులాయిలకు ఆర్డబ్ల్యూఎస్ శాఖ, పంచాయతీ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం మరమ్మతు లు ప్రారంభించారు. గతంలో నిర్మించిన మినీ ట్యాంకులను శుభ్రం చేయడంతోపాటు మరమ్మతులు చేపడుతున్నట్లు ఆర్డబ్ల్యూఎస్ డీఈ వెంకటరమణ తెలిపారు. ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్లైన్ల వద్ద విద్యుత్ సిబ్బంది మరమ్మతులు మొదలుపెట్టారు. జాతర సందర్భంగా 24 గంటల పాటు విద్యుత్ను సరఫరా చేసేందుకు అదనపు ట్రాన్స్ఫార్మర్లు బిగించే ప్రాంతాల్లో పనులు జరుగుతున్నాయి. పార్కింగ్, ఆర్టీసీ బస్టాం డ్, క్రీడాప్రాంగణం, ఎగ్జిబిషన్ స్టాల్స్ వద్ద చదును చేసే పనులు, మరుగుదొడ్ల ఏర్పాటు, స్నానఘట్టాల ఏర్పాటు తదితర పనులు ప్రారంభం కావాల్సి ఉంది. ఈ పనులు చేపట్టేందుకు కలెక్టర్ కార్యాలయం నుంచి నిధులు మంజూరు కావాల్సి ఉందని, ఒకటిరెండు రోజుల్లో పనులు ప్రారంభిస్తామని అధికారులు పేర్కొంటున్నారు. జాతరను విజయవంతం చేసేందుకు ఏర్పాటు చేసిన వివిధ కమిటీల పనితీరును ఈనెల 18న జేసీ చంపాలాల్ క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. ఈనెల 18 లోపు రంగులు వేసే పనులను పూర్తవుతాయని ఆలయ చైర్మన్ తటాకం రమేష్శర్మ, ఈఓ వెంకటేశ్వర్లు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా సౌకర్యాలు కల్పించనున్నట్లు వివరించారు.
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
2030 నాటికి 16 కొత్త కార్లు.. దేశీయ దిగ్గజం కీలక నిర్ణయం
20 ఏళ్ల క్రితం నాటా.. ఇప్పుడు చూస్తే : రాఘవ లారెన్స్
ఇరాన్ అధ్యక్షుడు హెలికాప్టర్కు ప్రమాదం
Indraja Sankar: విజిల్ నటి బర్త్డే సెలబ్రేషన్స్.. పెళ్లి తర్వాత భర్తతో తొలిసారి (ఫోటోలు)
ఒక వ్యక్తికి ఎన్ని బ్యాంక్ అకౌంట్స్ ఉండాలి.. ఆర్బీఐ ఏం చెబుతోంది?
పంజాబ్పై ఘన విజయం.. సెకెండ్ ప్లేస్కు ఎస్ఆర్హెచ్
అధికారం చేపట్టగానే అగ్నివీర్ రద్దు.. రాహుల్ కీలక వ్యాఖ్యలు
టాలీవుడ్ యాంకర్ అరుదైన ఘనత
కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలపై ప్రధాని సంచలన వ్యాఖ్యలు
సన్ రైజర్స్ vs పంజాబ్..తారలతో నిండిన ఉప్పల్ స్టేడియం (ఫోటోలు)
తప్పక చదవండి
- అధికారం చేపట్టగానే అగ్నివీర్ రద్దు.. రాహుల్ కీలక వ్యాఖ్యలు
- కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలపై ప్రధాని సంచలన వ్యాఖ్యలు
- పెట్టుబడుల సునామీ.. టాటా మోటార్స్ కీలక నిర్ణయం
- హీరామండి హీరోయిన్.. వేలకోట్ల అధిపతిని పెళ్లాడిన భామ!
- సభలో గందరగోళం.. మధ్యలోనే వెళ్లిపోయిన రాహుల్, అఖిలేష్
- T20 WC Trophy: ఈ పొట్టోడిని గెలవడమే అందరి టార్గెట్
- నాణ్యతలేని ‘పతంజలి సోన్పాపిడి’.. ముగ్గురికి జైలు, జరిమానా
- మేమిద్దరం ఎక్కువగా కలిసుండము.. అందుకే! :నటి ఆసక్తికర వ్యాఖ్యలు
- RCB: అమెరికాలో అంబరాన్నంటిన సంబరాలు.. ఎందుకంత స్పెషల్?
- పరారీలో చింతమనేని.. పోలీసుల గాలింపు
Advertisement