-
ప్రాణాలు తీసిన ఈత సరదా..
దామరచర్ల (మిర్యాలగూడ): నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వాచ్యా తండాలో ఈత సరదా ముగ్గురు చిన్నారుల ప్రాణాలను తీసింది. తండాకు చెందిన లావూరి రవి, సరోజల పెద్ద కూతురు సంధ్య (13) కట్టంగూరు మండలం అయిటిపాముల గిరిజన ఆశ్రమ పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. మరో కూతురు మంజుల (8) స్థానిక పాఠశాలలో మూడో తరగతి చదువుతోంది. ఇదే తండాకు చెందిన లావూరి లింగా, శారదల కూతురు పెద్దమంజుల (12) అయిటిపాముల ఆశ్రమ పాఠశాలలో ఏడో తరతగతి చదువుతోంది. ముగ్గురూ ప్రాణస్నేహితులు. తల్లిదండ్రులు పొలానికి వెళ్తుండగా సంధ్య, మంజులలు వారితో కలసి పొలానికి వెళ్లారు. తల్లిదండ్రులు కుంట సమీపంలోని పొలాల్లో చెట్లు కొట్టుకుంటుండగా, వీరు ముగ్గురు సరదాగా ఈతకోసం నీటి కుంటలో దిగారు. ఇటీవల వచ్చిన వర్షాలకు కుంటలోకి భారీగా నీరు చేరడంతో మగ్గురూ మునిగిపోయారు. రాత్రి అయినా పిల్లలు రాకపోవడంతో కుటుంబీకులు బావి, కుంట దగ్గర వెతికారు. కుంట దగ్గర చున్నీలు, చెప్పులు కనిపిం చడంతో నీటిలో దిగి వెతకడంతో ముగ్గురు బాలికల మృతదేహాలు కనిపించాయి. -
ప్రియుడితో కలిసి ఇద్దరు పిల్లలను చంపిన తల్లి
ఛత్తీస్గఢ్లోని జాష్పూర్ జిల్లాలో 22 ఏళ్ల మహిళ తన ప్రియుడితో కలిసి తన ఇద్దరు కన్నబిడ్డలను హతమార్చింది. మంజు అలియాస్ తస్లీమాఖాన్ అనే ఈ మహిళ తన నాలుగేళ్ల కొడుకు ఈద్ మహ్మద్ను, ఏడాది వయసున్న కుమార్గె సబీనాను గొంతుపిసికి చంపేసింది. కోయో అలియాస్ అమృత్ అనే తన ప్రియుడితో కలిసి ఈ ఘాతుకానికి పాల్పడింది. పిల్లలిద్దరినీ తానే చంపేసినట్లు ఆమె అంగీకరించింది. అనంతరం నేరం జరిగిన తీరును పోలీసులకు వివరించింది. ఓ కేసులో ఆమె భర్త రబూల్ అన్సారీ జైలుకు వెళ్లడంతో కొన్ని నెలల క్రితం ఆమె కోయోతో ప్రేమలో పడింది. తమ ప్రేమ వ్యవహారాలకు పిల్లలు అడ్డుగా ఉన్నారని, వాళ్లను చంపేయాలని కొన్నాళ్ల తర్వాత ఇద్దరూ కలిసి నిర్ణయించుకున్నారు. జూన్ 27వ తేదీన ఇద్దరూ కలిసి పిల్లలను జోష్పూర్ శివార్లలోని స్మృతి వనానికి తీసుకెళ్లారు. తర్వాత అక్కడ పిల్లలిద్దరినీ చంపేసి బావిలో పారేశారు. అనంతరం ఇద్దరూ ఢిల్లీకి పారిపోయారు. అక్కడ ఓ వారం ఉన్న తర్వాత మళ్లీ సొంతూరికి వచ్చారు. అయితే.. ఇటీవల వారం క్రితం తన ప్రియుడు తనపై అత్యాచారం చేశాడంటూ తస్లీం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈలోపు పిల్లలు కనిపించడంలేదని ఆమె భర్త కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదుచేశారు. దాంతో పోలీసులు తమదైన శైలిలో తస్లీమాను విచారించగా.. విషయం బయటపడింది.
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
భారీగా పెరిగిన ఫ్లిప్కార్ట్ గ్రోసరీ బిజినెస్
లిక్కర్ కేసు: మనీష్ సిసోడియాకు మళ్లీ చుక్కెదురు
తెలంగాణ దశాబ్దిపై కేటీఆర్ ట్వీట్..
బిగ్బాస్ బ్యూటీకి చేదు అనుభవం.. నెల రోజులైనా రాలేదు!
Tirupati Gangamma Jatara 2024: తిరుపతిలో ఘనంగా తాతయ్యగుంట గంగమ్మ జాతర (ఫొటోలు)
క్యార్వ్యాన్లోకి వచ్చి అతడలా చేసేసరికి భయపడ్డా: కాజల్ అగర్వాల్
ఎస్ఆర్హెచ్ వర్సెస్ కేకేఆర్ లైవ్ అప్డేట్స్
'బ్లాక్ మిర్రర్ ఎపిసోడ్'.. సత్యనాదెళ్ళ వీడియోపై మస్క్ కామెంట్
టీమిండియా హెడ్ కోచ్ పదవిపై హర్భజన్ ఆసక్తి..?
ప్రశాంత్ కిషోర్ ఏమైనా బ్రహ్మా?: మంత్రి బొత్స కౌంటర్
తప్పక చదవండి
- రాహుల్ విరామం తీసుకోవడమే మేలు: పీకే
- హార్దిక్ తప్పేం లేదు.. అంతా సీనియర్ల వల్లే: ముంబై మాజీ కెప్టెన్
- లవ్ ఫర్ లగ్జరీ కార్ : నాగ చైతన్య కొత్త కారు, ధర తెలిస్తే!
- మాజీ జడ్జి గంగోపాధ్యాయ ప్రచారంపై ‘ఈసీ’ బ్యాన్
- 2030 నాటికి భారత్ 11.5 కోట్ల ఉద్యోగాలను సృష్టించాలి.. లేకుంటే?
- ఎల్లో మీడియాకు చెప్పకుండా బాబు ఎక్కడికి వెళ్లారు? జోగి రమేష్
- జూన్ 1 నుంచి డ్రైవింగ్ లెసెన్స్లు జారీ చేయనున్న ప్రైవేట్ కంపెనీలు
- అంతర్జాతీయ 'టీ' దినోత్సవం! ఈ వెరై'టీ'లు ట్రై చేశారా?
- వైఎస్సార్సీపీ గెలుపును ఖరారు చేసిన ఎల్లో మీడియా!.. ఈ రాతలు అందుకేనా?
- బంగారం కొనుగోలు దారులకు భారీ ఊరట
Advertisement