breaking news
Kia car industry
-
కియా కాంట్రాక్టులన్నీ మాకే
సాక్షి, పుట్టపర్తి/పెనుకొండ రూరల్: బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అరాచకీయాలు పెచ్చుమీరుతున్నాయి.శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ మండల పరిధిలోని కియా కార్ల పరిశ్రమలో కాంట్రాక్ట్ పనుల కోసం ఆమె అనుచరులు, టీడీపీ నేతలు గూండాగిరికి దిగారు. మంగళవారం పరిశ్రమ వద్ద దౌర్జన్యం చేసి భయానక వాతావరణం సృష్టించారు. మంత్రి ఆదేశాలతో భారీసంఖ్యలో అక్కడికి చేరుకుని.. కాంట్రాక్టు పనులన్నీ తమకే ఇవ్వాలంటూ అరుపులు, కేకలతో రెచ్చిపోయారు. యాజమాన్యమూ భయభ్రాంతులకు గురయ్యేలా దాదాపు నాలుగు గంటలపాటు గొడవ చేశారు. పెనుకొండ మండలం దుద్దేబండ రోడ్డులో కియా అనుబంధ పరిశ్రమ ‘సంఘు హైటెక్’ ఉంది. ఇక్కడ విడిభాగాలు (స్పేర్ పార్ట్స్) తయారు చేసి ప్రధాన పరిశ్రమలోకి పంపుతుంటారు. ఇక్కడి మ్యాన్పవర్ ఏజెన్సీ, క్యాంటీన్, స్నాక్స్ కాంట్రాక్టులపై మంత్రి అనుచరుల కన్ను పడింది. ఇప్పుడు ఉన్న కాంట్రాక్టర్లను తొలగించి తమకే ఇవ్వాలని పరిశ్రమ అధికారులపై ఒత్తిడి తెస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే మంగళవారం ఉదయం పది గంటలకు పెనుకొండ టౌన్, రూరల్, గుట్టూరు, రాంపురం ప్రాంతాలకు చెందిన టీడీపీ నేతలు సుమారు వంద మంది పరిశ్రమ వద్దకు చేరుకున్నారు. పరిశ్రమ ప్రధాన గేటు ముందు అడ్డుగా నిలబడ్డారు. కియా ప్రధాన పరిశ్రమలోకి విడిభాగాలు తీసుకెళ్లే కంటైనర్ వాహనాలను అడ్డగించారు. పరిశ్రమ హెచ్ఆర్ మేనేజర్లు సంప్రదింపుల కోసం పది మందిని కార్యాలయంలోకి పిలిచినప్పటికీ వెళ్లలేదు. వారే తమ వద్దకు రావాలంటూ ఈలలు, కేకలతో భయానక వాతావరణం సృష్టించారు. బయట పరిస్థితిని గమనించిన పరిశ్రమ హెచ్ఆర్ మేనేజర్లు కనీసం గేటు ముందుకు వచ్చే సాహసం చేయలేకపోయారు. మంత్రి అనుచరుల దౌర్జన్యం వల్ల గంటల తరబడి ట్రాఫిక్ స్తంభించిపోయింది. సమాచారం అందుకున్న కియా స్టేషన్ ఎస్ఐ రాజేష్, ఒక కానిస్టేబుల్ అక్కడికి చేరుకున్నారు. ఎస్ఐ రాజేష్ పరిశ్రమ ప్రతినిధులతో చర్చించారు. తర్వాత కొందరిని లోపలికి తీసుకెళ్లి మాట్లాడించారు. మరొక్క రోజు గడువు కావాలని వారు కోరినట్లు తెలుస్తోంది. వైఎస్ జగన్ ఫొటోల తొలగింపు దౌర్జన్యానికి దిగిన మంత్రి సవిత అనుచరులను పరిశ్రమ ప్రతినిధులు చర్చల కోసం లోపలికి పిలిచారు. ఈ సందర్భంగా కార్యాలయంలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫొటోలతో కూడిన ఫ్లెక్సీలను మంత్రి అనుచరులు చించివేశారు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు కియా కార్ల ప్రారంభ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంస్థ సిబ్బంది ఆయనతో ఫొటోలు దిగారు. వాటిని కార్యాలయ ఆవరణలో ఫ్లెక్సీలుగా పెట్టుకున్నారు. వాటిని చూసిన ‘పచ్చ’మూక జీరి్ణంచుకోలేకపోయింది. వాటిని చించివేసి నానా హంగామా సృష్టించింది. ‘పచ్చ’మూక పైశాచికత్వాన్ని చూసి కియా సిబ్బంది సైతం విస్మయం వ్యక్తం చేశారు. మీడియా ప్రతినిధులపైనా దౌర్జన్యం కియా వద్ద పరిస్థితిని చిత్రీకరించేందుకు వచ్చిన మీడియా ప్రతినిధులపైనా మంత్రి అనుచరులు దౌర్జన్యానికి దిగారు. ఒక్కసారిగా దూసుకొచ్చి సెల్ఫోన్లను లాక్కునేందుకు యత్నించారు. అప్పటికే ఎస్ఐ రాజేష్ పరిశ్రమలోకి వెళ్లగా.. బయట ఒక కానిస్టేబుల్ మాత్రమే ఉన్నారు. ఆ కానిస్టేబుల్ దౌర్జన్యకారులను నిలువరించే సాహసం చేయలేకపోయారు. శ్రుతి మించిన ఆగడాలు పెనుకొండ నియోజకవర్గంలో మంత్రి సవిత అనుచరుల ఆగడాలు శ్రుతిమించాయి. అక్రమార్జన కోసం అర్రులు చాస్తూ కాంట్రాక్టులు, దందాలే లక్ష్యంగా చెలరేగిపోతున్నారు. పరిశ్రమల నిర్వాహకులనూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఇటీవలే దుద్దేబండ మలుపు వద్ద కంటైనర్లపై రాళ్లు రువ్వి దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటన మరువక ముందే కియా ‘సంఘు హైటెక్’ వద్ద అలజడి సృష్టించారు. -
4వేలకు పైగా కార్లు వెనక్కి.. సమస్య ఏమిటంటే..
తయారీ సంస్థలు తమ వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులు అందించాలని కోరుకుంటాయి. అందుకు అనువుగానే ఉత్పత్తులను తయారుచేస్తాయి. అయితే హార్డ్వేర్ కారణాలు, ఇతర సాంకేతిక కారణాల వల్ల కంపెనీ లేదా వినియోగదారులు ఊహించిన విధంగా ఆయా ఉత్పత్తులు పనిచేయవు. దాంతో ప్రధానంగా వాటిలో గుర్తించిన సమస్యలను పరిష్కరించి తిరిగి వాటిని వినియోగదారులకు అందిస్తారు. తాజాగా ప్రముఖ ఆటోమొబైల్ తయారీ కంపెనీ అయిన కియా మధ్యస్థాయి ఎస్యూవీ సెల్టోస్ పెట్రోల్ మోడల్ కారులో ఎలక్ట్రానిక్ ఆయిల్ పంపు నియంత్రణ వ్యవస్థలో లోపాలను గుర్తించినట్లు వెల్లడించింది. దీంతో దేశ వ్యాప్తంగా 4,358 కార్లను స్వచ్ఛందంగా వెనక్కి పిలిపిస్తున్నట్లు పేర్కొంది. ఇదీ చదవండి: భవిష్యత్తులో కరెంట్ కష్టాలు తీరేనా..? గత ఏడాది ఫిబ్రవరి 28 నుంచి జులై 13 వరకు తయారు చేసిన జీ1.5 పెట్రోల్ సెల్టోస్ (ఐవీటీ ట్రాన్స్మిషన్) కార్లు కొన్నింటిలో ఈ లోపం ఉన్నట్లు సంస్థ పేర్కొంది. దీనివల్ల వాహనం ఎలక్ట్రానిక్ ఆయిల్ పంపు నియంత్రణలో ఇబ్బంది ఎదురవుతుందని తెలిపింది. లోపాలున్న భాగాలను మార్చి ఇస్తామని, ఇప్పటికే సంబంధిత కార్ల యజమానులకు సమాచారం ఇచ్చినట్లు కియా ఇండియా చెప్పింది. -
ప్చ్.. సెల్ఫీ కోసం ముసలాయన కష్టాలు
సాక్షి, శ్రీసత్యసాయి: చంద్రబాబు నాయుడికి.. ఉన్నమాటంటే ఉలుకెక్కువ. వయసు మీద పడే కొద్దీ.. అధికార దాహం పెరిగిపోతోంది ఆయనలో. అంతేకాదు.. వచ్చే ఎన్నికల్లో అధికారం దక్కదనే అసహనమూ ఆయనలో కొట్టొచ్చినట్లూ కనిపిస్తోంది. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని విమర్శించేందుకు ఆయన చేయని ప్రయత్నమంటూ లేదు. అయితే.. తాజాగా ఆయన చేసిన స్టంట్ నవ్వులు పూయిస్తోంది. పెనుగొండ పర్యటనలో కియా కార్ల పరిశ్రమ ఎదురుగా సెల్ఫీ దిగి.. వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి ఛాలెంజ్ విసిరాననుకున్నారాయన. దానికి యెల్లో మీడియా ఈనాడు తన కథనంలో ఇచ్చిన బిల్డప్ మామూలుగా లేదు. ఉద్యోగులతో పాపం బలవంతంగా తన బావ పాటకు(జై బాలయ్య..) డాన్స్ చేయించిన ఉదంతాన్ని సైతం చంద్రబాబు తన ప్రసంగంలో ఉదహరించాడు. అయితే.. సెల్ఫీ కోసం చంద్రబాబు నాయుడు అవస్థలు పడ్డాడు. అది తీయటం రాక మూడు సెల్ ఫోన్లు మార్చారు. చివరకు పక్కనే ఉన్న సిబ్బంది సహకరించారు. ఇంకేం.. ఆ ముసలాయన తాను అనుకున్న పని చేసేశాడు. ఇదే కాదు.. తన మీటింగ్లకు జనాలు వచ్చారని చూపించుకునేందుకు ఆయన చేసే ప్రయత్నమూ(డ్రోన్ కెమెరా) కనిపించిందక్కడ. గతంలో ఇలాంటి అత్యుత్సాహమే కదా అమాయక ప్రాణాల్ని బలిగొంది. అయినా చంద్రబాబుకు సిగ్గుమాత్రం రావడం లేదు! అనే కామెంట్లు వినిపిస్తున్నాయిప్పుడు. -
71 వేల కియా కార్ల రీకాల్.. ఎందుకో తెలుసా?
ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ కియా తన సంస్థకు చెందిన 71వేల కార్లను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. అమెరికా కేంద్రంగా కియా కార్లలో వరుస అగ్నిప్రమాదాలు చోటు చేసుకున్నాయి. దీంతో కార్లలో లోపాల్ని పరిశీలిస్తున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. సౌత్ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం కియా 2008 -2009కి చెందిన 71వేల స్పోర్టేజ్ కార్లను రీకాల్ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. కారులో ఉన్న యాంటీ లాక్ బ్రేక్ సిస్టం (ఏబీఎస్)లోని హైడ్రాలిక్ కంట్రోల్ యూనిట్లోని లోపాల కారణంగా అగ్నిప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో కార్లలోని లోపాల్ని సరి చేసేందుకు సిద్ధమైనట్లు కియా వెల్లడించింది. 2017 నుంచి కియా 2017 నుంచి తన 8 స్పోర్టేజ్ స్పోర్ట్ యుటిలిటి వెహికల్స్ (ఎస్యూవీ)లో అగ్నిప్రమాదాలు చోటు చేసుకోవడం, 15 రకాల మెల్టింగ్, డ్యామేజ్లాంటి ప్రమాదాలు గుర్తించింది. 2016 నుంచి ఆ వెహికల్స్లోని లోపాల్ని సరిచేయడం ప్రారంభించింది. దూరంగా పార్కింగ్ నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ (ఎన్హెచ్టీఎస్ఏ) తో కియా దాఖలు చేసిన ప్రకారం , రీకాల్ పూర్తయ్యే వరకు యజమానులు నిర్మాణాలు లేదా ఇతర వాహనాలకు వెలుపల, దూరంగా పార్క్ చేయాలని కియా,ఎన్హెచ్టీఎస్ఏ సమావేశంలో ఈ సమస్యల పరిష్కార మార్గంగా చర్చించాయి. -
మరో 700 ఎకరాల భూసేకరణ : కలెక్టర్
పెనుకొండ: కియా కార్ల పరిశ్రమ ఏర్పాటు ప్రాంతంలో మరో 700 ఎకరాల భూమిని సేకరించనున్నట్లు కలెక్టర్ వీరపాండియన్ తెలిపారు. మండలంలోని ఎర్రమంచి పొలాల్లో చేపట్టిన కియా కార్ల పరిశ్రమ పçనులను ఆయన మంగళవారం కొరియా బృందం సభ్యులతో కలిసి పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ కియా కార్ల పరిశ్రమ ప్రాంతంలో అనుబంధ సంస్థల ఏర్పాటుకు 700 ఎకరాల భూమి అవసరమని కొరియా బృందం కోరడంతో ఏపీఐఐసీ సహకారంతో భూమిని సేకరించేందుకు చర్యలు చేపట్టినట్లు వివరించారు. ప్రతినిధులు సంతృప్తి చెందితే భూమిని సేకరించి ఇవ్వడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ రామమూర్తి, కియా ప్రతినిథులు, కొరియా నూతన బృందం సభ్యులు పాల్గొన్నారు. -
చక్కని భూములనూ చెక్కుతారట!
-
చక్కని భూములనూ చెక్కుతారట!
చదును పేరుతో రూ. కోట్ల స్వాహాకు రంగం సిద్ధం - కియా కార్ల పరిశ్రమ ఏర్పాటులో ఇదో బాగోతం - పరిశ్రమ కోసం 599.35 ఎకరాలు సేకరించిన ఏపీఐఐసీ - భూముల కొనుగోలు ఖర్చు రూ. 62.93 కోట్లు - చదును చేయడానికి రూ.177.94 కోట్లతో టెండర్లు - రూ. 25 కోట్లకు మించి ఖర్చు కాదంటున్న కాంట్రాక్టర్లు - రూ. 152 కోట్లు కొట్టేయడానికి టీడీపీ పెద్దల పన్నాగం మీరు ఎకరం భూమిని రూ.10 లక్షలకు కొంటే.. అందులో కంప చెట్లు, రాళ్లూరప్పలు తొలగించి చదును చేయడానికి రూ.29 లక్షలు ఖర్చు చేస్తారా? రాష్ట్ర ప్రభుత్వం అక్షరాలా అలాంటి పనే చేస్తోంది. రూ.10.50 లక్షలకు భూమిని కొనుగోలు చేసి, దాన్ని చదును చేయడానికి రూ.29.71 లక్షలు ఖర్చు పెడుతోంది. అయితే అంటే స్థలం ధర కంటే దాదాపు రెండు రెట్లు ఎక్కువన్నమాట! ఈ ఒక్క ఉదాహరణ చాలు ప్రభుత్వం ప్రజాధనాన్ని ఎంత విచ్చలవిడిగా దుర్వినియోగం చేస్తోందో తెలుసుకోవడానికి. ‘కియా’ కార్ల పరిశ్రమ పేరుతో అనంతపురం జిల్లా పెనుకొండ సమీపంలో సాగుతున్న అధికార తెలుగుదేశం పార్టీ నేతల దోపిడీపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. సాక్షి ప్రతినిధి, అనంతపురం: పెనుకొండ నియోజకవర్గంలోని పెనుకొండ మండలంలో ఎర్రమంచి, అమ్మవారుపల్లి, దుద్దేబండ, వెంకటగిరిపాలెంలో కార్ల పరిశ్రమ ఏర్పాటు కు ‘కియా’తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. దీనికోసం ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (ఏపీఐఐసీ) 599.35 ఎకరాల భూమిని సేక రించింది. భూములు కోల్పోయిన రైతులకు ఎకరాకు రూ.10.50 లక్షల చొప్పున చెల్లిస్తా మని ప్రభుత్వం ప్రకటించింది. ఈ లెక్కన నాలుగు గ్రామాల పరిధిలో 599.35 ఎకరాలు కోల్పోయిన రైతులకు రూ.62.93 కోట్ల పరిహారం దక్కనుంది. మాయాజాలం అంతా ఇక్కడే కార్ల పరిశ్రమ కోసం సేకరించిన భూమిని చదును చేసి ‘కియా’కు అప్పగించాలని ఏపీఐ ఐసీ నిర్ణయించింది. భూములను చదును చేసేందుకు ఏప్రిల్ 25న ఈ–ప్రొక్యూర్మెంట్ ద్వారా టెండర్లను ఆహ్వానించింది. ఈ పనికి రూ.177.94 కోట్లు ఖర్చవుతుందని నిర్ధారిం చింది. ఈ నెల 10 వరకు పలు ఏజెన్సీలు టెండర్లు దాఖలు చేశాయి.టెండర్ల దాఖలులో ఏపీఐఐసీ ఓ తిరకాసు పెట్టింది. టెండర్లు దాఖలు చేసిన ఏజెన్సీలు గత ఐదేళ్లలో కనీసం ఒక్క ఏడాది అయినా రూ.780 కోట్ల టర్నోవర్తో పనులు చేసి ఉండాలని నిబం ధన విధించింది. దీంతో కొన్ని ఏజెన్సీలు టెండర్ల దాఖలుకు వెనుకడుగు వేశాయి. ఈ నెల 10న టెక్నికల్ బిడ్లను పరిశీలించారు. ఇందులో ఎల్ అండ్ టీ, ఎన్సీసీ సంస్థలు అర్హత సాధించాయి. ఫైనాన్షియల్ బిడ్ను పరిశీలించి ఒక ఏజెన్సీకి టెండర్ ఖరారు చేయనున్నారు. 599.35 ఎకరాల కొనుగోలుకు రూ.62.93 కోట్లు ఖర్చు కాగా, ఆ స్థలాలను చదును చేయడానికి రూ.177.94 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేయడం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఇక్కడ చదును చేస్తున్న భూముల్లో ఏమీ రాళ్లూ రప్పలు లేవు. రైతులు ఎప్పటి నుంచో ఈ భూములను చదును చేసుకుని సాగు చేస్తున్నారు. ఈ మొత్తం భూములను చదును చేయడానికి రూ.25 కోట్లకు మించి ఖర్చు కాదని పలువురు కాంట్రాక్టర్లు చెబుతున్నారు. ఈ లెక్కన భూములను సరి చేసే పనుల్లో రూ.152 కోట్ల మేర అవినీతి జరగనున్నట్లు స్పష్టమవుతోంది. మంత్రి పదవి ఆశించి భంగపడిన ఓ ఎమ్మెల్యేతోపాటు ‘చినబాబు’ కు లబ్ధి చేకూర్చడానికే అంచనా వ్యయాన్ని భారీగా పెంచి టెండర్లు పిలిచినట్లు ఆరోప ణలు వినిపిస్తున్నాయి. భూములకు ఇచ్చే పరిహారం కంటే చదును చేయడానికి రెండు రెట్లు ఎక్కువగా వెచ్చిస్తుండడం పట్ల రైతులు మండిపడుతున్నారు. ప్రజల సొమ్మును కాజేయడానికే ఇంత ఖర్చు చేస్తున్నారని, చదును చేసేందుకు అక్కడ ఏముందని ప్రశ్నిస్తున్నారు. పల్లె, పరిటాల భూములకు మినహాయింపు వ్యవసాయం మినహా మరొకటి తెలియని రైతుల భూములను లాక్కున్న ప్రభుత్వం.. అధికార పార్టీ నేతల భూముల వైపు మాత్రం కన్నెత్తి చూడలేదు. ఇక్కడ కియా కార్ల పరిశ్రమ ఏర్పాటవుతుందని ముందే తెలుసుకున్న అప్పటి మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డి మునిమడుగు పరిధిలో సర్వే నంబర్ 408 నుంచి 445 వరకు 378 ఎకరాలు కొనుగోలు చేశారు. మంత్రి పరిటాల సునీత కుటుంబ సభ్యులు 138 ఎకరాలను కొన్నట్లు సమాచారం. భూసేకరణ నుంచి ఈ భూములను అధికారులు మినహాయించారు. ఎక్కడి నుంచి భూములు సేకరిస్తారు? భూసేకరణ ఎక్కడితో ముగుస్తుంది? అనే సమాచారాన్ని ముందుగానే సేకరించి టీడీపీ నేతలు భూములు కొన్నట్లు తెలుస్తోంది. కార్ల పరిశ్రమ ఏర్పాటయ్యే ప్రాంతం సమీపంలోనే ఈ భూములున్నాయి. రైతులే చదును చేసుకున్నారు.. ‘కియా కార్ల పరిశ్రమ కోసం ప్రభుత్వం సేకరించిన 599.35 ఎకరాల్లో ఎక్కడా పెద్ద గుట్టలు లేవు. భూమిని చదును చేయాల్సిన అవసరం లేదు. ఏళ్ల తరబడి ఈ భూములు సాగులో ఉన్నాయి. రైతులే చదును చేసుకున్నారు’ – వెంకట్రెడ్డి, రైతు, అమ్మవారుపల్లి, పెనుకొండ మండలం