breaking news
Khushdil Shah
-
కోపంతో ఫ్యాన్స్పైకి దూసుకెళ్లిన ఖుష్దిల్!.. మద్దతుగా పీసీబీ ప్రకటన
న్యూజిలాండ్లో పాకిస్తాన్ క్రికెట్ జట్టు వైఫల్యాల పరంపర కొనసాగింది. కివీస్తో మూడో వన్డే (NZ vs Pak 3rd ODI)లోనూ రిజ్వాన్ బృందం ఓటమి పాలైంది. మౌంట్ మౌంగనూయ్లో శనివారం జరిగిన ఈ మ్యాచ్లో 43 పరుగుల తేడాతో ఓడిపోయింది.ఫలితంగా మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో పాకిస్తాన్ కివీస్ చేతిలో 3-0తో క్లీన్స్వీప్నకు గురైంది. ఇదిలా ఉంటే.. న్యూజిలాండ్- పాక్ మధ్య మూడో వన్డే ముగిసిన తర్వాత పాకిస్తానీ ఆటగాళ్లకు ప్రేక్షకుల నుంచి చేదు అనుభవం ఎదురైంది. కొంతమంది క్రికెట్ ప్రేమికులు పాక్ ప్లేయర్లను ఉద్దేశించి అసభ్యకర వ్యాఖ్యలు చేశారు.ఫ్యాన్స్పైకి దూసుకెళ్లిన ఖుష్దిల్ఈ నేపథ్యంలో బారికేడ్ దగ్గరగా ఉన్న పాకిస్తాన్ ఆల్రౌండర్, బెంచ్కే పరిమితమైన ఖుష్దిల్ షా (Khushdil Shah) తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు. తమను కామెంట్ చేసిన అభిమానులపైకి దూసుకువెళ్లేందుకు ప్రయత్నించాడు. ఇంతలో భద్రతా సిబ్బంది వచ్చి అతడిని బలవంతంగా అక్కడి నుంచి దూరంగా తీసుకువెళ్లారు. మరోవైపు.. పాక్ ఆటగాళ్లను దూషించిన ప్రేక్షకులను కూడా సెక్యూరిటీ అక్కడి నుంచి తరలించింది.ఆటగాళ్లకు మద్దతుగా ప్రకటనఈ ఘటన వివాదానికి దారి తీయటంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) తమ ఆటగాళ్లకు మద్దతుగా ప్రకటన విడుదల చేసింది. ‘‘పాకిస్తాన్ ఆటగాళ్ల పట్ల విదేశీ ప్రేక్షకులు అసభ్యంగా ప్రవర్తించిన తీరును పీసీబీ ఖండిస్తోంది. మైదానంలో ఉన్న ఆటగాళ్లను ఉద్దేశించి వారు అనుచిత వ్యాఖ్యలు చేశారు.పాకిస్తాన్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో ఖుష్దిల్ షా జోక్యం చేసుకుని.. దయచేసి ఇలా చేయవద్దని వారికి విజ్ఞప్తి చేశాడు. కానీ ఇందుకు బదులుగా అఫ్గన్ ప్రేక్షకులు పరిస్థితి మరింత శ్రుతిమించేలా పాష్తో భాషలో అసభ్యకర భాష వాడారు.పాకిస్తానీ జట్టు ఫిర్యాదుతో స్టేడియం అధికారులు జోక్యం చేసుకుని.. ఇందుకు కారణమైన ఇద్దరు ప్రేక్షకులను అక్కడి నుంచి పంపించి వేశారు’’ అని పీసీబీ వివరణ ఇచ్చింది. వరుస ఓటములుకాగా ఐదు టీ20లు, మూడు వన్డేలు ఆడేందుకు పాకిస్తాన్ జట్టు న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లింది. సల్మాన్ ఆఘా సారథ్యంలో టీ20 సిరీస్ను 4-1తో కివీస్కు సమర్పించుకున్న పాక్.. మహ్మద్ రిజ్వాన్ సారథ్యంలో వన్డే సిరీస్లో 3-0తో వైట్వాష్కు గురైంది.అంతకు ముందు స్వదేశంలో న్యూజిలాండ్-సౌతాఫ్రికాతో త్రైపాక్షకి సిరీస్ను కివీస్కు కోల్పోయిన రిజ్వాన్ బృందం.. ఆ తర్వాత ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో దారుణ ప్రదర్శన కనబరిచింది. న్యూజిలాండ్, టీమిండియా చేతుల్లో ఓడి గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. చదవండి: NZ vs Pak: పాకిస్తాన్కు ఘోర ఓటమి.. సిరీస్ క్లీన్స్వీప్ చేసిన కివీస్..స్కోర్లు -
పాకిస్తాన్ ఆల్రౌండర్కు భారీ షాకిచ్చిన ఐసీసీ
పాకిస్తాన్ ఆల్రౌండర్ ఖుష్దిల్ షాకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) భారీ షాకిచ్చింది. ఐసీసీ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు గానూ అతడి మ్యాచ్ ఫీజులో 50 శాతం మేర కోత విధించింది. అంతేకాదు.. క్రమశిక్షణ అంశంలో అతడి ఖాతాలో మూడు డిమెరిట్ పాయింట్లు జత చేసింది.ఇందుకు సంబంధించి ఐసీసీ తాజాగా ప్రకటన విడుదల చేసింది. న్యూజిలాండ్తో తొలి టీ20 సందర్భంగా ఖుష్దిల్ షా వ్యవహరించిన తీరుకు ఈ మేర కఠిన చర్యలు చేపట్టినట్లు వెల్లడించింది. కాగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 (ICC Champions Trophy)లో గ్రూప్ దశలోనే నిష్క్రమించిన పాకిస్తాన్ క్రికెట్ జట్టు ప్రస్తుతం న్యూజిలాండ్ పర్యటనలో ఉంది. కివీస్తో ఐదు టీ20లు, మూడు వన్డేలు ఆడేందుకు అక్కడికి వెళ్లింది.32 పరుగులతో టాప్ స్కోరర్గాఈ క్రమంలో మార్చి 16న కివీస్- పాక్ మధ్య తొలి టీ20 జరిగింది. క్రైస్ట్చర్చ్లో జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆతిథ్య జట్టు.. పాకిస్తాన్ను తొలుత బ్యాటింగ్కు ఆహ్వానించింది. చాంపియన్స్ ట్రోఫీ తాలుకు వైఫల్యాన్ని కొనసాగిస్తూ పాక్ 91 పరుగులకే కుప్పకూలింది. పాక్ ఇన్నింగ్స్లో ఖుష్దిల్ షా 32 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు.ఇక సల్మాన్ ఆఘా బృందం విధించిన 92 పరుగుల లక్ష్యాన్ని న్యూజిలాండ్ ఆడుతూపాడుతూ ఛేదించింది. 10.1 ఓవర్లలో ఒక వికెట్ నష్టపోయి టార్గెట్ను ఊదేసింది. ఇదిలా ఉంటే.. ఖుష్దిల్ షా తాను బ్యాటింగ్ చేస్తున్న సమయంలో కాస్త అతిగా ప్రవర్తించాడు.అతడిని బలంగా ఢీకొట్టాడుపాక్ ఎనిమిదో ఇన్నింగ్స్లో కివీస్ యువ పేసర్ జకారీ ఫౌల్క్స్ బౌలింగ్లో వికెట్ల మధ్య పరుగులు తీసే క్రమంలో ఖుష్దిల్ షా.. ఫౌల్క్స్ను బలంగా ఢీకొట్టాడు. ఆ సమయంలో అతడు నిర్లక్ష్యపూరితంగా, దురుసుగా ప్రవర్తించినట్లు స్పష్టంగా కనిపించింది.ఈ నేపథ్యంలో క్రమశిక్షణా చర్యలకు పూనుకున్న ఐసీసీ.. ఖుష్దిల్ షాకు గట్టి పనిష్మెంట్ ఇచ్చింది. ఈ మేరకు.. ‘‘ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.12 సూచిస్తున్న నిబంధనను ఖుష్దిల్ ఉల్లంఘించాడు.అంతర్జాతీయ మ్యాచ్లో ఆటగాళ్లను, సిబ్బంది, మ్యాచ్ రిఫరీ లేదా ప్రేక్షకులు.. ఎవరినైనా సరే అనుచిత రీతిలో వారికి ఇబ్బంది కలిగించేలా తాకితే కఠిన చర్యలు ఉంటాయి. అందుకు తగ్గట్లుగా ఖుష్దిల్పై చర్యలు తీసుకుంటున్నాం’’ అని ఐసీసీ ప్రకటనలో పేర్కొంది. అతడి మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత విధించడంతో పాటు మూడు డీమెరిట్ పాయింట్లు చేర్చింది. తప్పును అంగీకరించిన ఆల్రౌండర్గత 24 నెలల కాలంలో ఇదే ఖుష్దిల్ మొదటి తప్పు కాబట్టి.. ఇంతటితో సరిపెట్టింది. ఆన్ ఫీల్డ్ అంపైర్లు వేన్ నైట్స్, సామ్ నొగస్కి, థర్డ్ అంపైర్ కిమ్ కాటన్, ఫోర్త్ అంపైర్ క్రిస్ బ్రౌన్ ఫిర్యాదు ఆధారంగా ఈ మేర ఐసీసీ చర్యలు తీసుకుంది. ఖుష్దిల్ సైతం తన తప్పును అంగీకరించాడు. కాగా 30 ఏళ్ల ఖుష్దిల్ షా లెఫ్టార్మ్ ఆర్థోడాక్స్ బౌలర్. అదే విధంగా.. ఎడమచేతి వాటం గల బ్యాటర్. 2019లో పాకిస్తాన్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన ఈ స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ ఇప్పటి వరకు 15 వన్డేలు, 28 టీ20 మ్యాచ్లు ఆడాడు. ఆయా ఫార్మాట్లలో వరుసగా 328, 376 పరుగులు చేయడంతో పాటు.. నాలుగు, మూడు వికెట్లు తీశాడు.చదవండి: నేను ఎదుర్కొన్న కఠినమైన బౌలర్ అతడే.. మూడు ఫార్మాట్లలోనూ బెస్ట్: కోహ్లి