breaking news
Kerala priest
-
బాధితురాలే.. నిందితురాలు
దొడ్డబళ్లాపురం(కర్ణాటక): కేరళ పూజారిపై బెంగళూరు మహిళ లైంగికదాడి కేసు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పుడు మలుపు చోటుచేసుకుంది. చివరకు హనీట్రాప్గా మారి బాధిత మహిళే నిందితురాలు అయ్యింది. కేరళలోని త్రిస్సూరులోని ప్రసిద్ధ పెరింగొట్టుకర దేవాలయంలో ఓ పూజారిగా పని చేస్తున్న ఉన్ని దామోదరన్ పై బెంగళూరు బెళ్లందూరు పోలీస్స్టేషన్లో ఒక మహిళ అత్యాచారం, బ్లాక్మెయిలింగ్ ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. ఈ ఏడాది జూన్లో ఇది జరిగింది. తన భర్త చనిపోయి తాను కష్టాల్లో ఉండగా, పూజారిని కలిసి పరిష్కారం కోరానని, క్షుద్రపూజలు చేయిస్తానని చెప్పి లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆమె ఆరోపించింది. పోలీసులు త్రిస్సూరుకు వెళ్లి పూజారి దామోదరన్, ఆలయం ఉద్యోగి అరుణ్ని అరెస్టు చేశారు. హోంమంత్రికి కుటుంబం ఫిర్యాదు... పూజారి కుటుంబ సభ్యులు హోంమంత్రి పరమేశ్వర్ని కలిసి ఇదంతా కట్టుకథ అని, అకారణంగా అబద్దపు కేసు నమోదు చేశారని, హనీ ట్రాప్ కుట్ర అని ఫిర్యాదు చేయగా, విచారణ చేయాలని ఆయన పోలీసులకు ఆదేశించారు. దర్యాప్తు చేసిన పోలీసులు మహిళ ఇచ్చింది అబద్ధపు ఫిర్యాదుగా పేర్కొన్నారు. పూజారిని అప్రతిష్టపాలు చేయడంతో పాటు కేసు వెనక్కు తీసుకోవాలంటే రూ.2 కోట్లు ఇవ్వాలని బెదిరించిందని తెలిపారు. ఈ నేపథ్యంలో పోలీసులు సదరు మహిళతో పాటు ఆమెకు సహకరించిన మరో నలుగురిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. -
ఫాదర్ పాడు బుద్ధి.. చర్చిలో అపచారం
తిరువనంతపురం : కేరళలో ఓ చర్చి ఫాదర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. పదేళ్ల బాలికపై చర్చిలో లైంగికదాడి చేసే యత్నం చేశాడు. దీంతో అతడిని కేరళ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దేవరాజ్ అనే 65 ఏళ్ల వ్యక్తి తిరువనంతపురంలోని ఓ చర్చిలో ఫాదర్గా పనిచేస్తున్నారు. ఆ చర్చికి ఓ పదేళ్ల బాలిక బైబిల్ స్టడీ సమయంలో వస్తుంటుంది. ఆ బాలికను రోజు ఆమె తండ్రి వచ్చి తీసుకెళుతుంటాడు. అందులో భాగంగానే ఆదివారం బైబిల్ స్టడీ సెషన్ పూర్తయిన తర్వాత ఆ బాలికను తీసుకెళ్లేందుకు ఆ తండ్రి వచ్చిన సమయంలో ఫాదర్ దేవరాజ్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడటం చూశాడు. ఈ విషయాన్ని వెంటనే పోలీసులకు చెప్పడంతో అతడిని అరెస్టు చేశారు. -
ఏడాదిగా ఐసిస్ చెరలో.. నేడు భారత్కు..
సాక్షి, న్యూఢిల్లీ : దాదాపు ఏడాదిపాటు ఉగ్రవాదుల చేతిలో బందీగా ఉన్న కేరళకు చెందిన క్రైస్తవ మత ప్రబోధకుడు ఫాదర్ టామ్ ఉజున్నాలిల్ ఎట్టకేలకు బయటపడ్డారు. ఆయన మంగళవారం రాత్రిలోగా కేరళకు చేరుకుంటారని కేంద్ర విదేశాంగ వర్గాల సమాచారం తెలిపింది. ఫాదర్ టామ్ను ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు 2016 మార్చి నెలలో యెమెన్లోని అడెన్లో మదర్ థెరిసా మిషనరీస్ ఆఫ్ చారిటీ నిర్వహిస్తున్న వృద్ధాశ్రమంపై దాడి చేసి ఎత్తుకెళ్లారు. ఆ దాడిలో దాదాపు 15మంది ప్రాణాలు కోల్పోయారు. ఫాదర్ టామ్ను ఉగ్రవాదులు ఎత్తుకెళ్లడం కేరళలో పెద్ద కలకలమే రేపింది. యెమెన్లో భారత్కు రాయబార కార్యాలయం కూడా లేదు. అలాంటి పరిస్థితుల్లో ప్రధాని మోదీ జోక్యం చేసుకుని వివిధ దేశాలను సంప్రదించడం ద్వారా యెమెన్కు దగ్గరవడంతో అక్కడి అధికారులు, భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ పరస్పర సమన్వయంతో తిరిగి ఆయనను భద్రంగా ఉగ్రవాదుల చెర నుంచి విడిపించగలిగారు. ఈ సందర్భంగా సుష్మాస్వరాజ్ 'ఫాదర్ టామ్ సురక్షితంగా బయటపడ్డారనే విషయాన్ని వెల్లడిస్తున్నందుకు నాకు సంతోషంగా ఉంది' అంటూ ఆమె ట్వీట్ చేశారు.