-
నీట్ పరీక్షకు హాజరవుతున్న విద్యార్థులు
-
‘ఇక్కడికి రావడం చాలా గర్వంగా ఉంది’
సాక్షి, కృష్ణా: విజయవాడలోని కేబీఎన్ (కాకరపర్తి భావనారాయణ) కళాశాల 50వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కళాశాలకు రావడం చాలా గర్వకారణంగా ఉందన్నారు. కేబీఎన్ కళాశాల ఎంతో మంది విద్యార్థులను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దుతోందని పేర్కొన్నారు. ‘ఉన్నతమైన మౌలిక సదుపాయాల ద్వారా మంచి విద్యను అందిస్తోంది. రానున్న రోజుల్లో మన దేశం విద్యకు కేంద్ర బిందువుగా మారనుంది. ఇండియా ఇతర దేశాలకు మంచి నైపుణ్యం కలిగిన వ్యక్తులను అందిస్తోంది. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను సిద్ధంచేయడం అవసరం’ అని అన్నారు. ఇంకా వారు మాట్లాడుతూ జాతీయ పతాకాన్ని అందించిన పింగళి వెంకయ్య విజయవాడ వాస్తవ్యులు కావడం గర్వకారణమన్నారు. జాతిపిత గాంధీజీ ఐదుసార్లు విజయవాడను సందర్శించారని తెలిపారు. అదేవిధంగా మొక్కలు నాటడం ప్రతి ఒక్కరు బాధ్యతగా భావించాలని విఙ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా కాలుష్యం కారణంగా.. ఎంతో మంది దేశ రాజధాని ఢిల్లీని వదిలిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. -
కృష్ణా హ్యాండ్బాల్ మహిళల జట్టు ఎంపిక
విజయవాడ (వన్టౌన్) : కృష్ణా విశ్వవిద్యాలయం హ్యాండ్బాల్ (మహిళలు) జట్టును ఎంపిక చేసినట్లు కేబీఎన్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వి.నారాయణరావు ఒక ప్రకటనలో తెలిపారు. రెండు రోజుల క్రితం తమ కళాశాలలో జరిగిన కృష్ణా విశ్వవిద్యాలయం అంతర్ కళాశాలల (మహిళల) హ్యాండ్బాల్ టోర్నమెంట్ ముగిసిన తరువాత ఎంపిక కమిటీ విశ్వవిద్యాలయం జట్టును ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. ఆంధ్ర లయోల కళాశాలకు చెందిన జె.సుశ్రీ, టి.నవ్య, ఎన్.మనీషా, కేబీఎన్ కళాశాలకు చెందిన టి.సాయివినీత, జి.సాయిలక్ష్మి, ఎస్.గౌరీపార్వతి, సిద్ధార్థ మహిళా కళాశాలకు చెందిన డి.తారాబాయి, ఎస్.దివ్యవల్లి, మారీస్ స్టెల్లా కళాశాలకు చెందిన కె.వంశీప్రియ, నూజివీడు ఎంఆర్ అప్పారావు పీజీ సెంటర్కు చెందిన ఈ.కల్యాణి, విజయ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్కు చెందిన ఎం.కోటేశ్వరి, ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ కళాశాలకు చెందిన పి.అశ్విని తదితులు ఎంపికయ్యారని పేర్కొన్నారు. స్టాండ్బైస్గా పి.శివనాగలక్ష్మి (కేబీఎన్), కె.సుష్మాస్వరాజ్, జె.రాణి (ఆంధ్ర లయోల), ఎస్.శాంతి (మారీస్ స్టెల్లా), వీఎల్ భవ్య (సిద్ధార్థ మహిళా)ఎంపికైనట్లు వివరించారు. వీరు తమళనాడు సేలంలోని పెరియార్ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఈనెల 25 నుంచి నిర్వహించే అంతర్ విశ్వవిద్యాలయ హ్యాండ్బాల్ పోటీలకు కృష్ణా విశ్వవిద్యాలయానికి ప్రాతినిధ్యం వహిస్తారని పేర్కొన్నారు. -
కృష్ణా మహిళల హ్యాండ్బాల్ ట్రోఫీ లయోలా కైవసం
విజయవాడ(వన్టౌన్) : కృష్ణా విశ్వవిద్యాలయం (మహిళల) హ్యాండ్బాల్ టోర్నమెంట్ ట్రోఫీని ఆంధ్రా లయోలా కైవసం చేసుకుంది. కేబీఎన్ కళాశాల క్రీడా విభాగం ఆధ్వర్యంలో కృష్ణా విశ్వవిద్యాలయం అంతర్ కళాశాలల (మహిళల) హ్యాండ్బాల్ టోర్నమెంట్ సోమవారం ఆ కళాశాల ప్రాంగణంలో సందడిగా జరిగింది. జిల్లాలోని వివిధ కళాశాలలకు చెందిన మహిళా హ్యాండ్బాల్ జట్లు ఈ పోటీలో తలపడ్డాయి. అందులో ఫైనల్స్లో పోటాపోటీగా ఆడిన కేబీఎన్ కళాశాలపై, ఆంధ్రా లయోలా కళాశాల మహిళా హ్యాండ్బాల్ జట్టు విజయం సాధించింది. ఆంధ్రా లయోలా, కేబీఎన్, సిద్ధార్థ మహిళా కళాశాలలు వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలను కైవసం చేసుకున్నాయి. ఉదయం నుంచి జరిగిన మ్యాచ్లు అత్యంత ఉత్కంఠభరితంగా సాగాయి. ఆయా కళాశాలలకు చెందిన విద్యార్ధులు హజరై క్రీడాకారులను తమ హర్షధ్వనాలతో ఉత్సాహపరిచారు. క్రీడలతో వ్యక్తిత్వ వికాసం క్రీడలతో విద్యార్ధుల వ్యక్తిత్వ సాధ్యమవుతుందని పొట్టిశ్రీరాములు చలవాది మల్లికార్జునరావు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అధ్యక్షుడు చలవాది మల్లికార్జునరావు అన్నారు. కేబీఎన్ కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన కృష్ణా విశ్వవిద్యాలయం మహిళల హ్యాండ్బాల్ టోర్నమెంట్ ముగింపు సభ సోమవారం సాయంత్రం జరిగింది మల్లికార్జునరావు మాట్లాడుతూ విద్యార్ధులు క్రీడల్లోనూ రాణించాలని సూచించారు. కళాశాల పాలకవర్గ అధ్యక్ష, కార్యదర్శులు ఉప్పల సాంబశివరావు, ఎస్.రజిత్కుమార్, కృష్ణా విశ్వవిద్యాలయం స్పోర్ట్స్బోర్డు కార్యదర్శి డాక్టర్ ఎన్.శ్రీనివాసరావు మాట్లాడారు. ఉదయం జరిగిన ప్రారంభోత్సవ సభకు ఏలూరు రేంజ్ స్పెషల్బ్రాంచ్ ఎస్ఐ, పూర్వ విద్యార్ధి ఎం.సుధాకర్, జిల్లా హ్యాండ్బాల్ అసోసియేషన్ కార్యదర్శి ఆర్.సిజర్రెడ్డి హాజరయ్యారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వీ.నారాయణరావు, కళాశాల ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ ఎం.సాంబశివరావు, పూర్వ ఫిజికల్ డైరెక్టర్ నరేంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు. -
పోటీకి దీటుగా రాణించాలి
విజయవాడ(వన్టౌన్): పోటీ ప్రపంచానికి దీటుగా రాణించేందుకు విద్యార్థులు కృషి చేయాలని పారిశ్రామికవేత్త ఎంవీకే హరగోపాల్ అన్నారు. కేబీఎన్ కళాశాల ఎంసీఏ అండ్ ఎంఎస్సీ(కంప్యూటర్స్) విభాగం ఆధ్వర్యంలో ‘ఇమేజ్ ప్రొసెసింగ్ యూజింగ్ ఆర్ ప్రోగ్రామింగ్’ అంశంపై జాతీయ స్థాయి వర్క్షాప్ బుధవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కంప్యూటర్ రంగంలో చోటుచేసుకుంటున్న ప్రగతితో యావత్ ప్రపంచం పరుగులు తీస్తుందన్నారు. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ విద్యార్థులు నూతన అంశాలపై శ్రద్ధ చూపాలన్నారు. కళాశాల పీజీ కో–కన్వీనర్ కే.వీ.రామకృష్ణ మాట్లాడుతూ విద్యార్థులు అభ్యున్నతికి కళాశాల యజమాన్యం నిర్వహిస్తున్న కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. రిసోర్స్పర్సన్, యోగివేమన విశ్వవిద్యాలయం సీఎస్ఈ విభాగ ఆచార్యులు డాక్టర్ సి.నాగరాజు మాట్లాడుతూ ‘ఇమేజ్ ప్రాసెసింగ్ యూజింగ్ ఆర్ ప్రోగ్రామింగ్’ అంశం ప్రస్తుతం చాలా కీలకంగా మారిందన్నారు. కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ ఎస్.రజిత్కుమార్ మాట్లాడారు. సభలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వీ.నారాయణరావు, పీజీ డైరెక్టర్ డాక్టర్ డీ.వీ.రమణమూర్తి, పీజీ కోర్సెస్ డైరెక్టర్ డాక్టర్ వై.నరసింహారావు, విభాగాధిపతి పీఎల్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
ఆర్టీసీ బస్సు– బైక్ ఢీ ●
వీడిన మహిళ హత్య కేసు మిస్టరీ
అంబేడ్కర్ కళాశాలలో దొడ్డమణి గోల్మాల్
తప్పక చదవండి
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- పారిస్ ఒలింపిక్స్కు భారత రిలే జట్లు అర్హత
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- 3 రోజులు తేలికపాటి వానలు!
- బాబును నమ్మితే మళ్లీ బానిస బతుకులే..
- రైతు భరోసా నిధుల విడుదల
- ఏబీసీ పార్టీలది ముస్లిం లీగ్ ఎజెండా: జేపీ నడ్డా
Advertisement