breaking news
Kashmiri Girls
-
మేరీ జిందగీ..వేకప్ గరల్స్
అవేకెండ్ హిందుస్థాన్ ఈజ్ అవేక్, ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హాజ్ అవేకెండ్ ద ఎర్త్ యాజ్ అవేకెండ్ అండ్ ది స్కై ఈజ్ అవేక్... సో యూ ఆల్సో వేకప్!! అంటూ ఈ ట్యూన్.. కశ్మీరి బాలికల్లో మానసిక ధైర్యాన్ని నూరిపోస్తోంది. కశ్మీకు ఉన్న ప్రత్యేక రాష్ట్ర హోదా ఎత్తి వేసిన తరువాత కూడా అక్కడి పరిస్థితులు ఇంకా చక్కబడలేదు. వీలైనంత త్వరగా అక్కడి పరిస్థితులను అన్ని రాష్ట్రాల్లో మాదిరిగా మార్చేందుకు కేంద్రప్రభుత్వం, ఇండియన్ ఆర్మీ తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఇందులో భాగంగానే లక్నోకు చెందిన ‘మేరి జిందగీ’ బ్యాండ్ను కశ్మీకు పంపి అక్కడి బాలికల్లో అనేక అంశాలపై అవగాహన కలి్పస్తోంది. రేపటి (అక్టోబర్ 11) అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇండియన్ ఆర్మీ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం విశేషం. విన్నింగ్ హార్ట్స్ అండ్ మైండ్స్ ఆర్మీ సరిహద్దుల్లో ఉండి పోరాడుతూ దేశప్రజలు, కశీ్మరీల ప్రాణాలకు రక్షణ కల్పించడంతోపాటు, అక్కడి మహిళలు, బాలికల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి కృషిచేస్తోంది. ఈ క్రమంలోనే ‘‘విన్నింగ్ హార్ట్స్ అండ్ మైండ్స్ (డబ్ల్యూహెచ్ఏఎమ్), సద్భావన’’ పేరుతో అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా..‘మేరీ జిందగీ’ బ్యాండ్ను కశ్మీర్లోని మారుమూల ప్రాంతాల్లో రెండు రోజులపాటు (9, 10) పర్యటిస్తోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పర్యటించి.. విద్య, ఆత్మరక్షణ, ప్రాథమిక హక్కులు, సమానత్వం, మెన్స్ట్రువల్ హైజీన్ వంటి విషయాలపై అక్కడి మహిళలు, బాలికల్లో పాటల ద్వారా రాక్ బ్యాండ్ అవగాహన కలి్పస్తోంది. తమని తాము రక్షించుకోవడానికి ఉపయోగపడే ఆత్మరక్షణ మెళకువలను పాటల ద్వారా నేరి్పంచడం, మహిళలను చుట్టుముట్టే సమస్యలపై సంగీత కచేరీల ద్వారా విభిన్న కోణాల్లో వివరించడం, కొంతమంది విద్యారి్థనులతో ముచ్చటించి ఆరోగ్యం, విద్య, సమానత్వం వంటివాటి ప్రాముఖ్యతను తెలియజెబుతోంది. మేరీ జిందగీ.. దేశంలో తొలి మహిళా రాక్ బ్యాండ్ మేరి జిందగీ. దీనిని 2010లో డాక్టర్ జయ తివారీ స్థాపించారు. ‘సేవ్ ది గర్ల్ చైల్డ్’ లక్ష్యంగా ఏర్పడిన మహిళా బ్యాండ్ వివిధ అంశాల్లో మహిళలు, బాలికలకు అవగాహన కలి్పంచేందుకు ప్రత్యేకమైన పాటలు, సంగీతాన్ని రూపొందించి, పాటల రూపంలో ప్రదర్శిస్తుంది. ఇప్పటిదాక 350పైగా షోలను బ్యాండ్ నిర్వహించింది. బ్యాండ్ లీడర్ జయ స్వయంగా పాటలను రచించి, వాటికి ట్యూన్లు రూపొందించడం విశేషం. ఇంకా ఈ బ్యాండ్లో నిహారిక దుబే, పుర్వి మాలి్వయా, సౌభాగ్యా దీక్షిత్, మేఘన శ్రీవాస్తవ లు ఉన్నారు. ఈ బ్యాండ్ మహిళలకు మరింత దగ్గరయ్యేందుకు పింక్ డ్రెస్కోడ్ని ధరించడం విశేషం. ఈ ఐదుగురు కలిసి వివిధ రకాల సంగీత వాయిద్యాలతో మహిళలు, బాలికలకు అవగాహన కల్పిస్తున్నారు. -
ఖట్టర్ వ్యాఖ్యలకు రాహుల్ కౌంటర్
న్యూఢిల్లీ: కశ్మీరీ అమ్మాయిలపై హరియాణా ముఖ్యమంత్రి మనోహర్లాల్ ఖట్టర్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. ఖట్టర్ వ్యాఖ్యలు ఆర్ఎస్ఎస్ భావజాలానికి అద్దం పడుతున్నాయని పేర్కొన్నారు. ‘కశ్మీర్ యువతులపై హరియాణా సీఎం ఖట్టర్ చేసిన వ్యాఖ్యలు చాలా దారుణంగా ఉన్నాయి. బలహీన మనస్కుడు, అభద్రతతో కూడిన వ్యక్తికి ఏళ్లకు ఏళ్లుగా ఆర్ఎస్ఎస్ ఇచ్చిన శిక్షణకు ఈ వ్యాఖ్యలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. మగాళ్లు సొంతం చేసుకోవడానికి మహిళలేమి ఆస్తులు కాద’ని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ఆర్టికల్ 370 రద్దు, జమ్మూకశ్మీర్ విభజన నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. కశ్మీర్ లోయలో ఇప్పుడిప్పుడే ఆంక్షలు సడలిస్తున్నారు. ఇక బాధ్యత గల పదవిలో కొనసాగుతున్న వ్యక్తులు అత్యుత్సాహం ప్రదర్శించి విమర్శల పాలవతున్నారు. ‘ఇక అందమైన కశ్మీరీ అమ్మాయిల్ని పెళ్లి చేసుకోవచ్చు’ అని వ్యాఖ్యానించి దుమారం రేపిన యూపీ బీజేపీ ఎమ్మెల్యే విక్రమ్ సైనీ వ్యవహారం మరువక ముందే హరియాణా ముఖ్యమంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘మా ప్రభుత్వంలోని కొందరు మంత్రులు బిహార్ నుంచి కోడళ్లను తెచ్చుకుంటామని చెప్పేవారు. ఇకపై అలాంటి పరిస్థితి ఉండదు. అందరి చూపు ఇక కశ్మీరీ అమ్మాయిల పైపే ఉంటుంది. ఆర్టికల్ 370 రద్దవడంతోనే ఇది సాధ్యమైంది. కశ్మీరీ అమ్మాయిల్ని కోడళ్లుగా, భార్యగా చేసుకునేందుకు అందరూ మొగ్గుచూపుతార’ని మనోహర్లాల్ ఖట్టర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.