breaking news
Karun
-
ఏమీ చేయకుండా నెలకు రూ. 9 లక్షలు.. ఫలించిన కుర్రాడి ఐడియా!
ప్రపంచంలో డబ్బు సంపాదించడానికి జనం వివిధ పద్ధతులను అవలంబిస్తుంటారు. ఇలా సంవత్సరానికి కోట్లాది రూపాయలు సంపాదిస్తుంటారు. వీరిలో సంపాదనకు చక్కటి మార్గాలను కనుగొన్నవారు కూడా ఉన్నారు. వారిలో ఒకరే కరుణ్ విజ్. అతను భారతీయుడే అయినప్పటికీ ప్రస్తుతం కెనడాలో నివసిస్తున్నారు. కరుణ్ విజ్ ప్రతి నెలా సగటున రూ.9 లక్షలు సంపాదిస్తున్నారు. ఇంజినీరింగ్ చదువుతున్నప్పుడు కరుణ్ సంపాదనకు లాభసాటి మార్గాన్ని కొనుగొన్నారు. 33 ఏళ్ల కరుణ్ మొదటి నుంచి ప్రాపర్టీ ఓనర్గా మారాలనుకునేవారు. రియల్ ఎస్టేట్.. మంచి లాభదాయకమైన వ్యాపారమని కరుణ్ కాలేజీ రోజుల్లోనే గ్రహించారు. ఈ సమయంలో కరణ్.. దేశంలోని ఇన్స్టిట్యూట్ల చుట్టుపక్కల ఉండే ఇళ్లకు సంబంధించి ఒక ఆలోచన చేసేవారు. మొత్తం ఇంటిని ఒకరికే అద్దెకు ఇవ్వకుండా.. గదుల ప్రాతిపదికన రెంట్ వసూలు చేయడం లాభదాయకమని భావించారు. ఇంటినంతటికీ అద్దెదారుకు అద్దెకు ఇవ్వకుండా విద్యార్థుల కోసం ప్రత్యేక గదులుగా మలచి, అద్దెకు ఇవ్వడం ఎంత ప్రయోజనకరమనేది గ్రహించారు. మీడియాకు తెలిసిన వివరాల ప్రకారం కరుణ్ కెనడాలో మొత్తం 28 గదులు కలిగిన నాలుగు ఇళ్లను కలిగి ఉన్నాడు. అతను వాటిని అద్దెకు ఇచ్చాడు. దీంతో ప్రతినెలా రూ.9 లక్షలకు పైగా మొత్తాన్ని ఆర్జిస్తున్నారు. అయితే ఈ ఆస్తులను కొనుగోలు చేసేందుకు కరుణ్ దాదాపు రూ.19 కోట్లు పెట్టుబడి పెట్టారు. 2016వ సంవత్సరంలో తన 26 ఏళ్ల వయస్సులో కరుణ్ కెనడాలోని అంటారియోలో తన మొదటి పెట్టుబడి పెట్టారు. ఈ క్రమంలో దాదాపు రూ.2.7 కోట్ల విలువైన ఆస్తిని కొనుగోలు చేసి, ఏడుగురు కాలేజీ విద్యార్థులకు అద్దెకు ఇచ్చారు. కరుణ్ కేవలం అద్దె ఆదాయంపై మాత్రమే ఆధారపడటం లేదు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత కరుణ్ అప్లికేషన్స్ ఇంజనీర్గా పనిచేశారు. ప్రస్తుతం అమెరికాలోని ఒక కంపెనీలో సేల్స్ మేనేజర్గా పనిచేస్తున్నారు. అద్దెల ద్వారా వచ్చే ఆదాయం, తన జీతం సొమ్ముతో కరుణ్.. దక్షిణ అంటారియోలో భారీగా ఆస్తులను కూడబెట్టారు. ఇది కూడా చదవండి: ఢిల్లీలో మరింత దిగజారిన గాలి నాణ్యత -
రహానేను తప్పించడమా!
ప్రతీ విజయయాత్రకు ఎక్కడో ఒక చోట విరామం తప్పదని, అన్ని మ్యాచ్లు గెలవడం సాధ్యం కాదని భారత జట్టు కోచ్ అనిల్ కుంబ్లే వ్యాఖ్యానించారు. పుణే ఫలితం ఇప్పుడు గతమని, జట్టు కోచ్గా తాను భవిష్యత్తుపైనే దృష్టి పెడతానని ఆయన అన్నారు. ‘మేం మా స్థాయికి తగినట్లుగా ఆడలేదు కాబట్టే ఓడిపోయాం. అలాంటి తప్పు ఇక్కడ జరగకుండా జాగ్రత్త పడతాం. జరిగినదాని గురించి చర్చ అనవసరం. సిరీస్లో మరో మూడు టెస్టులు ఉన్నాయి. ఆస్ట్రేలియా మెరుగైన జట్టే అనే విషయం మరచిపోవద్దు. ఈ టెస్టులో ఎలా విజయం సాధించాలనేదానిపైనే మా దృష్టి’ అని కుంబ్లే అన్నారు. మరో వైపు రహానేను తుది జట్టులోంచి తప్పించాల్సిన అవసరమే లేదని కుంబ్లే స్పష్టం చేశారు. నాయర్ ఇంకా వేచి చూడాల్సిందేనని ఆయన అన్నారు. ‘గత రెండేళ్లుగా రహానే చాలా బాగా ఆడుతున్నాడు. అతడిని తప్పించాలనే ప్రశ్నే తలెత్తదు. ట్రిపుల్ సెంచరీ తర్వాత కూడా కరుణ్కు అవకాశం రాకపోవడం దురదృష్టకరం కానీ తప్పదు. తుది జట్టుపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఐదుగురు బౌలర్లను కొనసాగించాలా, లేదా నలుగురు బౌలర్లతో ఆడి మరో బ్యాట్స్మన్కు అవకాశం ఇవ్వాలా అనేది చెప్పలేను’ అని కుంబ్లే అభిప్రాయం వ్యక్తం చేశారు.