-
కార్తిక్, గుల్వీర్లకు రజతం, కాంస్యం.. అదరగొట్టిన అమ్మాయిలు
Asian Games 2023 India Medals: ఆసియా క్రీడలు-2023లో భారత అథ్లెట్లు దుమ్ములేపారు. పురుషుల 10 వేల మీటర్ల పరుగు పందెంలో రజత, కాంస్య పతకాలు రెండూ మనోళ్లే కైవసం చేసుకున్నారు. కార్తిక్ కుమార్, గుల్వీర్ సింగ్ ఈ అద్భుతం చేశారు. చైనాలోని హోంగ్జూ వేదికగా శనివారం సాయంత్రం జరిగిన రేసులో ఈ ఇద్దరూ తమ వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శనలతో సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ గెలవడం గమనార్హం. కార్తిక్ 28:15.38, గుల్వీర్ 28:17.21 నిమిషాల్లో పరుగు పూర్తి చేయడం విశేషం. వరల్డ్ నంబర్ 2 జోడీని ఓడించి.. ఇదిలా ఉంటే.. టేబుల్ టెన్నిస్ వుమెన్స్ డబుల్స్ విభాగంలో భారత ప్లేయర్లు ఐహిక, సుతీర్థ సెమీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్ ఖాతాలో మరో పతకం చేర్చేందుకు సిద్ధమయ్యారు. శనివారం నాటి క్వార్టర్ ఫైనల్లో చైనాకు చెందిన వరల్డ్ నంబర్ 2 జోడీ చెన్ మెంగ్, వాంగ్ యిదీలను మట్టికరిపించి వహ్వా అనిపించారు. అత్యధికంగా షూటింగ్లో ఇక 19వ ఆసియా క్రీడల్లో భారత్ ఇప్పటి వరకు 10 బంగారు, 14 వెండి, 14 కాంస్యాలు మొత్తంగా 38 పతకాలు గెలిచింది. భారత మహిళా క్రికెట్ జట్టుతో పాటు ఈక్వెస్ట్రియన్ డ్రెసాజ్ టీమ్, 10మీ. ఎయిర్ పిస్టల్ టీమ్ మెన్, వ్యక్తిగత విభాగం, 50మీ. రైఫిల్ 3 పొజిషన్స్ టీమ్ మెన్, 10మీ. ఎయిర్ పిస్టల్ వుమెన్, 25మీ. పిస్టల్ టీమ్ వుమెన్, 50మీ. రైఫిల్ 3 పొజిషన్స్ వుమెన్, మెన్స్ స్క్వాష్, టెన్నిస్ మిక్స్డ్ డబుల్స్లో భారత్ పసిడి పతకాలు గెలిచింది. ఇందులో అత్యధికంగా షూటింగ్లో ఆరు గోల్డ్ మెడల్స్ ఉన్నాయి. చదవండి: WC2023: అతడి ఆట అద్భుతం.. గేమ్ ఛేంజర్ తనే: యువరాజ్ సింగ్ -
శాఖ మార్చిన కాసేపటికే.. బిహార్ మంత్రి రాజీనామా
పాట్నా: కిడ్నాప్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్జేడీ నేత, బిహార్ న్యాయశాఖ మంత్రి కార్తీక్ కుమార్ బుధవారం రాత్రి తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు కార్తీక్ కుమార్ తన రాజీనామాను గవర్నర్కు పంపగా.. ఆయన ఆమోదించినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. కాగా 2014లో జరిగిన ఓ కిడ్నాప్ కేసులో మంత్రి నిందితుడిగా ఉండటంతో విపక్షాలు రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఆందోళనలు చేశాయి. ఈ నిరసనల నేపథ్యంలో కార్తీక్ కుమార్ను.. బిహార్ సీఎం నితిష్ కుమార్ న్యాయశాఖ మంత్రి బాధ్యతల నుంచి తప్పించి.. ఆయనకు తక్కువ ప్రాధాన్యత కలిగిన చెరుకు శాఖను అప్పగించారు. అయినప్పటికీ ఆందోళనలు కొనసాగడంతో కొత్త శాఖను కేటాయించిన గంటల వ్యవధిలోనే కార్తీక్ కుమార్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. కార్తీక్ కుమార్ రాజీనామాతో.. రెవెన్యూశాఖ మంత్రి అలోక్ కుమార్ మెహతాకు చెరుకు శాఖ అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇక బిహార్లో బీజేపీ కూటమి నుండి వైదొలిగిన జేడీయూ అధినేత నితీష్ కుమార్.. లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఆర్జేడీ నుంచి ఎమ్మెల్సీగా ఉన్నారు కార్తీక్ కుమార్. బిహార్లో రాజకీయంగా శక్తివంతమైన భూమిహార్ అగ్రవర్ణానికి చెందిన వ్యక్తి కావడంతో ఆర్జేడీ చీఫ్ తేజస్వీ యాదవ్ ఆయనకు మంత్రివర్గంలో చోటు కల్పించారు. చదవండి: భారత్లో కొత్తగా 7 వేల కరోనా కేసులు -
నా ప్రాణానికి ముప్పు
గాయని సుచిత్ర పెరంబూర్ (చెన్నై): ‘నా ప్రాణానికి ముప్పు ఉంది. ఇంట్లో కూడా రక్షణ లేదు’ అని గాయని, నటి సుచిత్ర పేర్కొన్నారు. నటుడు ధనుష్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ట్వీటర్లో పేర్కొని తొలుత వివాదానికి తెరలేపిన సుచిత్ర.. తరువాత ధనుష్–త్రిష, అనిరుధ్–ఆండ్రియా, నటి హన్సిక ముగ్గురు యువకులతో రాసలీలల ఫొటోలను పోస్ట్ చేసి అలజడి సృష్టించారు. అనంతరం ఆ ఫొటోలను తాను విడుదల చేయలేదని, తన ట్వీటర్ను ఎవరో హ్యాక్ చేశారని పేర్కొన్నారు. సుచిత్ర భర్త, నటుడు కార్తీక్కుమార్ స్పందిస్తూ తన భార్య మానసికస్థితి సరిగా లేదని వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఆమె మాట్లాడుతూ.. తనకు ఇంట్లో కూడా రక్షణ లేదని, ఎవరెవరో వచ్చి బెదిరిస్తున్నారని తెలిపారు. ఒక వ్యక్తి కాలింగ్బెల్ నొక్కి కాఫీ తీసుకొచ్చానని చెప్పి తలుపు తెరవమని బెదిరించాడని చెప్పారు. ప్రశాంతంగా జీవించాలను కుంటున్న తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోయారు. చెన్నై, ఎంఆర్సీనగర్లో ఒక పబ్ ఉందని, అక్కడ కలుసుకునే ఒక ముఠా ఇదంతా చేస్తున్నారన్నారు. -
నా భార్య మానసిక రోగి!
‘‘నా భార్య మానసిక రోగి’’ అని గాయని సుచిత్ర భర్త, నటుడు కార్తీక్కుమార్ పేర్కొన్నారు. పలువురు సినీప్రముఖుల ఆంతరంగిక విషయాలను సోషల్ మీడియా ద్వారా బయట పెడుతూ గాయని సుచిత్ర కోలీవుడ్లో అలజడి రేపుతున్న విషయం తెలిసిందే. ఆ మధ్య హీరో ధనుష్ తనతో తప్పుగా ప్రవర్తించారని, ఈ విషయాన్ని ఎప్పుడు.. ఎవరితో చెప్పడానికైనా సిద్ధమేనని తన ట్విట్టర్లో పేర్కొన్నారామె. ఆ వెంటనే ఆ వ్యాఖ్యలకు, తనకు ఎలాంటి సంబంధం లేదని, తన ట్విట్టర్ను ఎవరో హ్యాక్ చేశారని ప్లేటు ఫిరాయించారు. ఆ తర్వాత హీరో ధనుష్– హీరోయిన్ త్రిష, సంగీతదర్శకుడు అనిరుద్– హీరోయిన్ ఆండ్రియా, హీరో రానా–హీరోయిన్ త్రిష, బుల్లితెర నటి డీడీ (దివ్యదర్శిని) ఒక యువకునితో క్లోజ్గా ఉన్న దృశ్యాలను సుచిత్ర ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ‘ఇవి వారి రాసలీలలు’ అంటూ ట్యాగ్లైన్ కూడా ఇచ్చారు. అలాగే వేరే వ్యక్తుల నీలి చిత్రాలను పోస్ట్ చేసి, రాయలేని వ్యాఖ్యలను పొందుపరిచారు. అదే విధంగా ‘వేచి చూడండి.. మరికొందరి తారల రాసలీలలను బయట పెడతా’ అంటూ పోస్ట్ చేయడం చిత్రపరిశ్రమలో మరింత కలకలం సృష్టించింది. ఈసారి గాయని సుచిత్ర భర్త, నటుడు కార్తీక్కుమార్ స్పందిస్తూ.. ఆ ఫొటోలకు, తన భార్య సుచిత్రకు ఎలాంటి సంబంధం లేదని, ఆమె ట్విట్టర్ను ఎవరో హ్యాక్ చేశారని, సంబంధించిన వారికి తాను క్షమాపణలు చెప్పుకుంటున్నానని తన ట్విట్టర్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో గాయని సుచిత్ర తన భర్త నుంచి విడిపోవడానికి సిద్ధమైందనే ప్రచారం జోరందుకుంది. అయితే అది వదంతి మాత్రమేనని కార్తీక్కుమార్ కొట్టిపారేశారు. అదే విధంగా తన భార్య మానసిక రుగ్మతతో బాధపడుతోందని ట్విట్టర్లో పోస్ట్ చేశారు. తాజాగా సుచిత్ర ట్విట్టర్లో మరో సంచలన వ్యాఖ్యలను పోస్ట్ చేశారు. ధనుష్, అనిరుద్తో పార్టీలో పాల్గొన్నానని, అప్పుడు తాను సేవించిన పానీయంలో మద్యం కలిపారని, ఆ తరువాత జరిగిన ఘోర అనుభవం గురించి చెప్పలేనని సుచిత్ర పేర్కొనడం దుమారం రేపింది. ఆ తర్వాత ఆ వ్యాఖ్యలు చేసింది ‘నేను కాదు, నా ట్విట్టర్ను హ్యాక్ చేసి ఎవరో ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారని, వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసే విషయమై చర్చిస్తున్నామ’ని సుచిత్ర పేర్కొన్నారు. మొత్తం మీద సుచిత్ర ప్రవర్తన కోలీవుడ్ని ఒక కుదుపు కుదిపేస్తోందనే చెప్పాలి. ధనుష్, అనిరుద్, త్రిష, ఆండ్రియా తదితరులు సుచిత్ర చేసిన వ్యాఖ్యలకు, పెట్టిన ఫొటోలకు స్పందించలేదు. కాగా.. సుచిత్ర ట్విట్టర్ను ఎవరూ హ్యాక్ చేయలేరని, ఆ విధంగా ఆమె పాస్వర్డ్ పెట్టుకున్నారని నెటిజన్లు పేర్కొనడం గమనార్హం. మరి.. సుచిత్ర ట్విట్టర్ హ్యాక్ అయ్యిందా? ఏది నిజం? ఏది అబద్ధం? ఇదిలా ఉంటే.. తన అనుమతి లేకుండా ట్విట్టర్ ఎకౌంట్ను ఇతరులు అనుసరించలేని విధంగా సుచిత్ర సెట్ చేసుకున్నారు. – ‘సాక్షి’ చెన్నై -
హైకూ టైటిల్ మారింది
సూర్య అతిథి పాత్రలో నటిస్తూ 2డీ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం హైకూ. పాండిరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అమలాపాల్, బిందుమాధవి, కార్తీక్కుమార్ ప్రధాన పాత్రలు పోషించగా కవిన్, నయన,అభిమాన్ తదితర నవ నటీనటులు ముఖ్య పాత్రలు పరిచయం అవుతున్నారు. బాలల ఇతివృత్తంగా రూపొందుతున్న ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. అయితే ఈ పరిస్థితుల్లో ఇప్పుడీ చిత్ర పేరు మారనుంది. హైకూ అనేది ఆంగ్లం పేరు కావడంతో రాష్ట్ర ప్రభుత్వ రాయితీలకు చిత్రం అర్హత లేని కారణంగా పసంగ-2గా పేరు మార్చినట్లు చిత్ర వర్గాలు పేర్కొన్నాయి. ఇంతకు ముందు పాండిరాజ్ దర్శకత్వంలో రూపొందిన పసంగ చిత్రం మంచి ప్రేక్షకాదరణ పొందడంతో పాటు జాతీయ అవార్డులను గెలుచుకున్న విషయం అందరికీ తెలిసిందే. దీంతో ఈ పసంగ చిత్రంపైనా ఎక్కడలేని అంచనాలు ఏర్పడుతున్నాయి. ఇటీవల చిత్ర ఫస్ట్లుక్ పోస్టర్లు విడుదలయ్యాయి. ఈ చిత్రానికి అరోల్ కొరెల్లి సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని వచ్చే నెలలో నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపారు. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ సంస్థ త్వరలో విడుదల చేయనుంది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- ఐపీఎల్లో ఇవాళ (మే 5) డబుల్ ధమాకా
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్కు సంబంధంలేదన్న జయశంకర్
- క్యాన్సర్తో పోరాటం.. ఇప్పుడేవీ సరిగా గుర్తుండట్లేదు: హీరోయిన్
- బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
Advertisement