-
స్నేహితుల మధ్య యుద్ధం.. గెలుపు నీదా నాదా సై..!
వారిద్దరూ స్నేహితులు.. అంతేకాదు.. కుటుంబాల మధ్య కూడా సన్నిహిత సంబంధాలున్నాయి. రాజకీయంగా ప్రత్యర్థులైనా ఎప్పుడూ బయటపడి ఒకరినొకరు పెద్దగా విమర్శించుకోరు. ఆ సిటీలో రాజకీయవర్గాల్లో అందరికీ తెలిసిన విషయమే ఇది. తాజా ఎన్నికల్లో కూడా వారిద్దరూ చెరో పార్టీ తరపున తలపడుతున్నారు. ఇక తప్పనిసరిగా ఒకరినొకరు విమర్శించుకుంటున్నారు. నామినేషన్లు ముగిసి ప్రచారం ఊపందుకోవడంతో విమర్శల జోరు పెరుగుతోంది. తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్.. బీజేపీ ఎంపీ బండి సంజయ్ మంచి స్నేహితులు. సామాజికవర్గ లెక్కలు వీరిద్దరినీ ఒక్కటిగా పెనవేశాయనే టాక్ ఎలాగూ ఉంది. గతంలో ఒకింత తీవ్రస్థాయిలోనే ఒకరిపై ఇంకొకరు అటాక్ చేసుకున్న వీరిద్దరూ.. ఆ తర్వాత ఒక అండర్ స్టాండింగ్కు వచ్చారనే అభిప్రాయం కరీంనగర్ జనంలో ఉంది. ఇక అప్పట్నుంచీ వీరిద్దరూ పార్టీల పరంగా కౌంటర్స్ విసురుకుంటారే తప్ప.. వ్యక్తిగత విమర్శలు చేసుకునే పరిస్థితి రాలేదు. ఒక సుహృద్భావమైన వాతావరణంలో రెండు ప్రత్యర్థి పార్టీల నేతలు తమ రాజకీయాలను కొనసాగిస్తున్నారు. కానీ, ఇప్పుడు మళ్లీ ఎన్నికలు ముందుకు రావడంతో బీఆర్ఎస్ అభ్యర్థిగా నాల్గోసారి కూడా అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఓవైపు సిట్టింగ్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్.. మరోవైపు బీజేపీ అభ్యర్థిగా.. తన చిరకాల ప్రత్యర్థినెలాగైనా ఈ సారి ఓడించి తీరాలన్న కసితో.. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ బరిలో నిల్చారు. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరి మాటల యుద్ధం రకరకాల రాజకీయ చర్చలకు తావిస్తోంది. కేబుల్ బ్రిడ్డ్ కూలిపోతోంది.. కేబుల్ బ్రిడ్జ్ రోడ్డు చూసి జనం నవ్వుకుంటున్నారు.. ముందు అది చూసుకో.. ఆ తర్వాత నీ అభివృద్ధి గురించి చెప్పుకో అంటూ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్.. మంత్రి గంగులపై కామెంట్స్ చేయడంతో ఈ రాజకీయ కాక మొదలైంది. అంతేకాదు.. గంగుల ఓడిపోతాడనే భయంతోనే కేసీఆర్ ఇంతకాలం బీఫామ్ ఇవ్వలేదంటూ కూడా సంజయ్ చేసిన కామెంట్స్.. సహజంగానే మంత్రి గంగులకు కోపం తెప్పించాయి. దాంతో అసలు రేవంత్ పై బలి కా బక్రా అని సానుభూతి చూపించావు గానీ.. నువ్వూ, నీకోసం వచ్చిన రాజాసింగే అసలు బలి కా బక్రాలంటూ ఆయన ఘాటుగా సమాధానం చెప్పారు. కరీంనగర్ లో మూడో ప్లేస్ కే బండి సంజయ్ పరిమితం కాబోతున్నారన్నారు. అంతేకాదు.. తనకు బీఫామ్ ఇవ్వలేదనడం హాస్యాస్పదమని.. మరి నామినేషన్ వేసిన బీఆర్ఎస్ అభ్యర్థెవ్వరో బండి చెప్పాలన్నట్టుగా గత రెండు రోజులుగా గంగుల కౌంటర్ అటాక్ చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా అమలవుతున్న స్మార్ట్ సిటీ ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వానిది. ఈ ప్రాజెక్టు కింద ఖర్చు చేసే నిధులను కేంద్రమే ఇస్తోంది. కరీంనగర్ స్మార్ట్ సిటీ నిధులు కూడా కేంద్రానివే. నగరం అందంగా తీర్చిదిద్దే పనులన్నీ కేంద్ర నిధులతోనే జరుగుతున్నాయి. కాని బీజేపీ నేతలు ఈ విషయాన్ని ప్రజల్లో సమర్థవంతంగా చెప్పుకోలేకపోతున్నారనే టాక్ నడుస్తోంది. కాని అదే స్మార్ట్ సిటీ అభివృద్ధి కార్యక్రమాలను తమకనుకూలంగా మల్చుకుని.. తాము చేసిన అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా జనంలోకి తీసుకెళ్లుతూ బీఆర్ఎస్ పార్టీ నేతలు, మంత్రి గంగుల వర్గం జనంలోకి వెళ్లుతుండటం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మొత్తంగా గతంలో పరుష పదజాలం వాడి నాలుక్కర్చుకుని మళ్లీ తిరిగి ఒక అండర్ స్టాండింగ్ కు వచ్చిన ఇద్దరు మిత్రులు.. ఇప్పుడు ఎన్నికల వేళ నోటికి పని చెప్పి కౌంటర్ అటాక్స్ తో జనం మధ్య జరిగే చర్చల్లో భాగస్వాములవుతున్నారు. చదవండి: కేసీఆర్కు కొత్త కష్టాలు.. గులాబీ నేతల్లో టెన్షన్? -
కరీంనగర్ బరిలో ఇద్దరు బీజేపీ రెబెల్స్
సాక్షి, హైదరాబాద్: కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి శాసనమండలికి జరగనున్న ఎన్నికల్లో బీజేపీకి రెబెల్స్ బెడద తలనొప్పిగా మారింది. ఈ స్థానం నుంచి ఏకంగా ఇద్దరు రెబెల్స్ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయడం గమనార్హం. ఈ నియోజకవర్గం నుంచి బీజేపీ నుంచి ఏబీవీపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు రణజిత్ మోహన్, సుగుణాకర్ రావు, బీజేవైఎం నేత, అధికార ప్రతినిధి, న్యాయ వాది ఎడ్ల రవికుమార్ పటేల్ పోటీలో ఉన్నారు. అయితే ఈ స్థానం నుంచి సుగుణాకర్రావును పోటీకి దింపాలని బీజేపీ కోర్ కమిటీ నిర్ణయించింది. దీంతో రణజిత్ మోహన్, ఎడ్ల రవి రెబెల్స్గా శనివారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ స్థానం పరిధిలో బీజేపీ ఐక్యం గా నిలిస్తే గెలిచే అవకాశాలున్నా ఆ పార్టీకి చెందిన వారు ముగ్గురు బరిలో నిలుస్తుండటంతో ఓట్ల చీలిక తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో వీరితో మాట్లాడే బాధ్యతను కోర్ కమిటీ ఎంపీ బండారు దత్తాత్రేయ కు అప్పగించింది. పోటీ నుంచి తప్పుకోవాలని, పార్టీలో మంచి పదవి ఇస్తామని రణజిత్ మోహన్కు దత్తాత్రేయ, పార్టీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ నచ్చజెప్పే ప్ర యత్నం చేసినా ఒప్పుకోలేదు. గ్రాడ్యుయేట్ నియోజకవర్గ ఓటర్ల నమోదులోనూ రణజిత్, ఎడ్ల రవి చురుకుగా వ్యవహరించారు. వేల సంఖ్యలో కొత్త ఓటర్లను నమోదు చేయడంతో ఆయా వర్గాలమద్దతు పొందవచ్చుననే ఆశాభావంతో వారుఉన్నారు. రణజిత్కు ఆరెస్సెస్ అండ.. రణజిత్ మోహన్కు ఆరెస్సెస్లోని వివిధ శాఖలు, సరస్వతి విద్యాపీఠాలు, శిశుమందిర్ ఏబీవీపీ, బీఎంఎస్ పూర్వ విద్యార్థులు మద్దతు తెలుపుతు న్నారు. ఈ నియోజకవర్గం పరిధిలోని కొన్ని ప్రాంతా ల్లో తాము బీజేపీ అభ్యర్థికి మద్దతు తెలపడం లేదని, రణజిత్కే తమ మద్దతు అంటూ ఆయా విభాగాలు తీర్మానాలు కూడా చేసినట్టు సమాచారం. బీజేవైఎం నుంచి రవి.. ఈ ఎన్నికల్లో తనకు అవకాశమిస్తే యువకుడిగా, యువకుల గొంతుకగా నిలుస్తా... అని ఓటర్లకు ఎడ్ల రవి విజ్ఞప్తి చేశారు. నామినేషన్ వేశాక రవి మాట్లాడుతూ బీజేపీలో చిన్న కార్యకర్తగా రాజకీయ జీవితం ఆరంభమైందని, బీజేవైఎం అధికార ప్రతినిధిగా పని చేస్తున్నానని, బీజేవైఎం నేతగా, అడ్వొకేటుగా తనకు ప్రజలతో మంచి సంబంధాలున్నాయని పేర్కొన్నారు. ఎడ్ల రవికి ఈ జిల్లాల్లోని యువమోర్చా కార్యకర్తలు పరోక్షంగా మద్దతు పలుకుతున్నట్టు, ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నట్టు తెలుస్తోంది. -
కరీంనగర్ నియోజకవర్గంలో పార్టీల హోరాహోరీ..
తెలంగాణ ఉద్యమ కోట కరీంనగర్. సవాళ్లకు వేదిక. తెలంగాణ వాదానికి రెఫరెండంగా వరుస ఎన్నికల పరీక్షను ఎదుర్కొని దేశ ప్రజలందరి దృష్టిని ఆకర్షించిన నియోజకవర్గం ఇది. అందుకే కొత్త రాష్ట్రం ఆవిర్భావ సవుయుంలో జరుగుతున్న ఎన్నికలు కీలకం కానున్నాయి. తెలంగాణ సాధించిన చాంపియున్షిప్ తవుదేనని టీఆర్ఎస్, అవాంతరాలన్నీ అధిగమించి రాష్ట్రం ఏర్పాటు చేసిన ఘనత తవుకే దక్కుతుందని కాంగ్రెస్ ధీమాగా ఉన్నాయి. మరోవైపు ఇక్కడ తన పునర్వైభవాన్ని చాటుకోవాలని బీజేపీ తహతహలాడుతోంది. తొలిసారిగా వైఎస్సార్సీపీ కరీంనగర్ నుంచి బరిలోకి దిగింది. బొల్గం శ్రీనివాస్, కరీంనగర్: పార్టీ ఆవిర్భావం నుంచి కరీంనగర్ నియోజకవర్గం టీఆర్ఎస్కు కేరాఫ్ అడ్రస్గా నిలిచింది. 2004 నుంచి వరుసగా మూడుసార్లు కేసీఆర్ ఇక్కణ్నుంచి ఎంపీగా గెలిచి రికార్డు సొంతం చేసుకున్నారు. గత ఎన్నికల సవుయుంలో పాలమూరుకు వలస వెళ్లారు. దీంతో ఇక్కడి సీన్ మారిపోయింది. వెలవు ఆధిపత్యం కొనసాగే చోట 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ తొలిసారిగా బీసీ అభ్యర్థిని బరిలోకి దింపి ప్రయోగం చేసింది. ఆ పార్టీ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ 50వేల పై చిలుకు ఓట్లతో విజేతగా నిలిచారు. ఈ సెగ్మెంట్లోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కేవలం రెండుచోట్ల కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలుపొందినప్పటికీ క్రాస్ ఓటింగ్తో ఎంపీ సీటు కాంగ్రెస్ ఖాతాలో చేరింది. బరిలో పాతకాపులే... కరీంనగర్లో ప్రధాన పార్టీలు పోటీకి దింపిన వుుగ్గురు అభ్యర్థులు వూజీ ఎంపీలే. సిట్టింగ్ ఎంపీ పొన్నం ప్రభాకర్ను కాంగ్రెస్ పార్టీ వురోసారి బరిలోకి దింపింది. గత ఎన్నికల్లో గెలిపించిన బీసీ నినాదంతో పాటు... తెలంగాణ రాష్ట్ర సాధనలో పాలుపంచుకున్న ఘనత తనకు కలిసి వస్తుందనే ధీవూతో ఉన్నారు. టీఆర్ఎస్ వురోసారి వూజీ ఎంపీ బోరుునపల్లి వినోద్కువూర్కు టికెట్ ఇచ్చింది. గతంలో హన్మకొండ నుంచి వరుసగా రెండు సార్లు ఎంపీగా గెలిచిన వినోద్కు ఈ జిల్లాతో సంబంధాలు లేకపోవడమే గత ఎన్నికల్లో దెబ్బతీసింది. ఇప్పుడు పరిస్థితి తవుకు అనుకూలంగా ఉందని టీఆర్ఎస్ వురోసారి ఆయునకే అవకాశమిచ్చింది. బీజేపీ తరఫున కేంద్ర వూజీ వుంత్రి సీహెచ్.విద్యాసాగర్రావు పోటీలో నిలిచారు. గతంలో రెండుసార్లు ఇక్కడే ఎంపీ గా గెలిచిన అనుభవం ఉండడంతో పాత సమీకరణాలన్నీ కలిసొస్తాయుని ఆ పార్టీ భావిస్తోంది. లండన్ నుంచి ఇటీవలే తిరిగివచ్చిన ఎన్ఆర్ఐ మీసాల రాజిరెడ్డి వైఎస్సార్సీపీ నుంచి పోటీకి దిగుతున్నారు. ఎంపీ అభ్యర్థులు వినోద్, విద్యాసాగర్రావు, ఇదే సెగ్మెంట్లోని వేవుులవాడ అసెంబ్లీ స్థానంలో టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నవునేని రమేశ్బాబు బంధువులే. మారిన బలాలు గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి సెగ్మెంట్లో బలాబలాలు మారాయి. తెలంగాణ ఉద్యవు ఊపులో కరీంనగర్ నుంచి టీడీపీ తరఫున గెలిచిన గంగుల కమలాకర్ టీఆర్ఎస్లో చేరారు. చొప్పదండి నుంచి ఎమ్మెల్యే సుద్దాల దేవయ్యు ఇటీవలే కాంగ్రెస్లో చేరారు. హుస్నాబాద్లో కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రవీణ్రెడ్డి ఉన్నప్పటికీ సీపీఐకి పట్టు ఉంది. మానకొండూరు(ఎస్సీ)లో సిట్టింగ్ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ ఉండడంతో కాంగ్రెస్ బలంగా ఉంది. చొప్పదండి(ఎస్సీ)లో సిట్టింగ్ ఎమ్మెల్యే దేవయ్యు పార్టీలో చేరినప్పటికీ కేడర్ లేకపోవడం ప్రతికూలత. కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లలో కాంగ్రెస్ కూడా పట్టు సాధిం చింది. వేములవాడలో టీఆర్ఎస్, బీజేపీ ప్రాబల్యవుుంది. గతమంతా తెలం‘గానం’ 1952లో ఆవిర్భవించిన కరీంనగర్ నియోజకవర్గం ప్రత్యేక తెలంగాణ వాదానికి కంచుకోట. 1971లో తెలంగాణ ప్రజాసమితి తరఫున పోటీ చేసిన ఎమ్మెస్సార్ను గెలిపించడంతో పాటు ప్రత్యేక తెలంగాణ నినాదంతో టీఆర్ఎస్ ఆవిర్భవించిన తర్వాత ఆపార్టీకి పట్టం కట్టారు. 2004 ఎన్నికల్లో గెలిచిన కేసీఆర్ వరుస రాజీనామాలతో వచ్చిన 2006, 2008 ఉప ఎన్నికల్లోనూ అదే తీర్పు ఇచ్చారు. 1962 నుంచి ఇక్కడ ఇప్పటివరకు 15 సార్లు ఎన్నికలు జరగ్గా వాటిలో ఏడుసార్లు కాంగ్రెస్, ఒకసారి కాంగ్రెస్(ఐ), మూడుసార్లు టీఆర్ఎస్, ఒకసారి టీపీఎస్ గెలిచాయి. ఒక్కసారి గెలిస్తే: ఇక్కడ ఒక్కసారి ఎంపీగా గెలిస్తే... వరుసగా రెండోసారి, వుూడోసారి గెలిచే సెంటిమెంట్ ఆనవారుుతీగా అభ్యర్థుల తలుపు తడుతోంది. 1962 నుంచి ఒక్కసారి మినహా 14 ఎన్నికల్లో ఇదే తీర్పు పునరావృతమైంది. ఎమ్మెస్సార్ వుూడుసార్లు (1971, 1977, 1980 ఎన్నికల్లో), జువ్వాడి చొక్కారావు వుూడుసార్లు (1984, 89, 91 ఎన్నికల్లో), కేసీఆర్ వుూడుసార్లు (2004, 2006, 2008 ఎన్నికల్లో) గెలుపొంది హ్యాట్రిక్ సాధించగా, జె.రవూపతిరావు వరుసగా రెండుసార్లు, విద్యాసాగర్రావు రెండుసార్లు ఇక్కడ ఎంపీలుగా గెలిచారు. 1996లో ఎంపీగా గెలిచిన ఎల్.రవుణ (టీడీపీ) ఒక్కరికే ఈ అదృష్టం దక్కలేదు. ఈ నియోజకవర్గంలో ఇప్పటివరకు అత్యధిక మెజారిటీతో గెలుపొందిన అభ్యర్థి కేసీఆర్. 2006 ఉప ఎన్నికల్లో ఆయన 2,01,582 ఓట్ల ఆధిక్యంతో కాంగ్రెస్ అభ్యర్థి జీవన్రెడ్డిపై గెలుపొందారు. అప్పటిదాకా ఎమ్మెస్సార్ పేరిట ఈ రికార్డుండేది. లోక్సభ నియోజకవర్గం: కరీంనగర్ ఎవరెన్నిసార్లు గెలిచారు : కాంగ్రెస్ -9, టీఆర్ఎస్-3, బీజేపీ-2, కాంగ్రెస్(ఐ)-1, పీడీఎఫ్ -1, ఎస్సీఎఫ్-1, టీపీఎస్-1, టీడీపీ-1 తొలి ఎంపీ : బద్దం ఎల్లారెడ్డి(పీడీఎఫ్) ప్రస్తుత ఎంపీ : పొన్నం ప్రభాకర్ (కాంగ్రెస్) ప్రస్తుత రిజర్వేషన్: జనరల్ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే అసెంబ్లీ స్థానాలు: కరీంనగర్, చొప్పదండి (ఎస్సీ), వేవుులవాడ, సిరిసిల్ల, వూనకొండూరు (ఎస్సీ), హుజురాబాద్, హుస్నాబాద్. నియోజకవర్గ ప్రత్యేకతలు : తెలంగాణ ఉద్యవు కోట. బీడి కార్మికులు, సిరిసిల్ల నేతన్నలు, గల్ఫ్ బాధితులు, మెట్ట ప్రాంత రైతుల ప్రభావవంతమైన పాత్ర. జిల్లా కేంద్రంలో మైనారిటీల ఓటుబ్యాంకు, తెలంగాణలోనే అత్యధిక వ్యవసాయు పంపుసెట్లు ఉన్న మెట్టప్రాంతం. ప్రధాన అభ్యర్థులు వీరే : పొన్నం ప్రభాకర్(కాంగ్రెస్) బోరుునపల్లి వినోద్కువూర్ (టీఆర్ఎస్) చెన్నవునేని విద్యాసాగర్రావు(బీజేపీ) మీసాల రాజిరెడ్డి(వైఎస్సార్సీపీ) నే.. గెలిస్తే.. - తెలంగాణ మోడల్ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తా. - రైతులకు అండగా ఉండేందుకు ఫుడ్ ప్రాసెసింగ్, వ్యవసాయు అనుబంధ పరిశ్రవుల ఏర్పాటు. - పెండింగ్లో ఉన్న రైలు వూర్గాలు పూర్తి చేసి, రహదారులను అభివృద్ధి చేస్తా.. - జిల్లాలో మెడికల్ కాలేజీ ఏర్పాటు, యుూనివర్సిటీకి అనుబంధంగా ఇంజినీరింగ్ కాలేజీ, పాలిటెక్నిక్ కాలేజీ అప్గ్రేడేషన్. పీహెచ్సీలు, అన్ని ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందించే ఏర్పాట్లు చేస్తాం. - ఐటీ, ఫుడ్ ప్రాసెసింగ్, సిరిసిల్లలో టెక్స్టైల్ పరిశ్రవుల ఏర్పాటు. - పొన్నం ప్రభాకర్ (కాంగ్రెస్) - జిల్లాలో విత్తనోత్పత్తి కేంద్రాలు.. వ్యవసాయాధారిత పరిశ్రమల, పాటు ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తాను. - తెలంగాణకు ఇప్పటివరకు గ్యాస్ కేటాయింపులు లేవు. కొత్త రాష్ట్రానికి కేటాయింపులు ఇవ్వటం తప్పనిసరి అవుతుంది. ప్రథమ ప్రాధాన్యంగా నేదునూరు గ్యాస్ ఆధారిత విద్యుత్తు ప్రాజెక్టుకు పట్టుబడతాం. - ముంబాయి-విశాఖపట్నం వరకు నిర్మాణంలో ఉన్న జాతీయ రహదారిని కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల మీదుగా మళ్లించేందుకు ఒత్తిడి తెస్తాం. - జేఎన్ఎన్యూఆర్ఎం పథకాన్ని కరీంనగర్కు వర్తింపజేస్తాం. - వినోద్కువూర్ (టీఆర్ఎస్) - నియోజకవర్గంలో ప్రతి గ్రావూనికి గోదావరి నుంచి తాగునీరు.. సాగునీరు అందిస్తాం. - కరీంనగర్-నిజావూబాద్ రైల్వే లైన్ పూర్తి చేస్తాం. - శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి గోదావరిని కాకినాడ వరకు సవుుద్రానికి అనుసంధానం చేస్తాం. నౌకయానం జరిగే కార్యాచరణ చేపడతాం. - మహిళా సాధికారతకు ప్రత్యేక కార్యక్ర వూలు చేపడతాం. కోరుకున్న ఆసుపత్రుల్లో వుహిళలు ప్రసవించే హక్కు. ఖర్చులను ప్రభుత్వమే భరించాలి. ఆసుపత్రి యూజ వూన్యం నిరాకరించకుండా చట్టం చేయాలి. - పరిశ్రవుల స్థాపన. పారిశ్రామికాభివృద్ధి. కరెంటు కోత లేకుండా రైతులకు సోలార్ విద్యుత్తు ప్రాధాన్యం. - విద్యాసాగర్రావు (బీజేపీ) - మెట్ట ప్రాంత రైతులకు సాగునీటిని అందించాలనే వుహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాన్ని నెరవేర్చేందుకు కృషి చేస్తా. వరదకాల్వ నిర్మాణానికి పాటుపడుతాను. - ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయహోదాకు కృషి - నేత కార్మికుల అభ్యున్నతికోసం కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావటం. సిరిసిల్లలో మెగా టెక్స్టైల్ క్లస్టర్తో పాటు కరీంనగర్లో టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు. - బీడి కార్మికుల సంక్షేమానికి చర్యలు - కొత్తపెల్లి- మనోహరాబాద్ రైల్వే లైన్ ట్రాక్ ఎక్కిస్తా. కరీంనగర్, నిజామాబాద్ రైల్వేలైన్ పూర్తి చేయిస్తా. - ’మీసాల రాజిరెడ్డి (వైఎస్సార్సీపీ) జన తెలంగాణ దళితుల అభివృద్ధికి ప్రాధాన్యం.. గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలి. సాగునీటి ప్రాజెక్టులను త్వరితంగా పూర్తి చేయాలి.మహిళలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించడంతో పాటు మహిళా సంక్షేమం కోసం కృషి చేయాలి. విద్య, వైద్యం అవకాశాలను పెంచాలి. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలి. రైతు సుఖంగా ఉండే పాలన కావాలి. నిరుద్యోగులు లేని తెలంగాణ కావాలి. దళితుల అభ్యున్నతికి ప్రాధాన్యం ఇవ్వాలి. - దౌడు విజయ్కుమార్, పరకాల, వరంగల్ జిల్లా అసమానతల్లేని తెలంగాణ... ఆకలి, అసమానతలు లేని తెలంగాణ నిర్మాణం జరగాలి. అందుకు ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో కృషి చేయాలి. ఎన్నికల్లో ప్రలోభాలకు గురి కాకుండా నీతినిజాయితీ గల వారినే ఎన్నుకోవాలి. భూ సమస్యను పరిష్కరించాలి. మూతపడిన పరిశ్రమలను తెరవాలి. కొత్త పరిశ్రమలను ప్రారంభించాలి. గిట్టుబాటు ధరలేక, విద్యుత్ సరిగారాక రైతులు అల్లాడుతున్నారు. నవ తెలంగాణలో ఈ కష్టాలు కనిపించకూడదు. - బి. మురళి, సిరిసేడు, జమ్మికుంట మండలం, కరీంనగర్ జిల్లా కులవివక్ష అంతరించాలి.. తెలంగాణలో ఇంకా కొనసాగుతున్న కుల వివక్షను అంతమొందించాలి. వెనుకబడిన వర్గాలకు పక్కా ఇళ్లు నిర్మించాలి. విద్యావైద్య అవకాశాలు కల్పించాలి. పేదల సంక్షమాన్ని, సమగ్ర అభివృద్ధిని కాంక్షించే వారినే ఎన్నుకోవాలి. తెలంగాణ కోసం ప్రాణత్యాగాలు చేసిన అమరుల కుటుంబ సభ్యులకు రాజకీయ అవకాశాలు కల్పించాలి. - మహ్మద్ ఖుర్రమ్, భోలక్పూర్, ముషీరాబాద్, హైదరాబాద్
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు ప్రజాస్వామ్య పరిరక్షణ సభ
వేద విజ్ఞానం కలిగిన భూమి భారత్
కాంగ్రెస్లో మున్సిపల్ కౌన్సిలర్ల చేరిక
పేదల సంక్షేమానికి పెద్దపీట
కాంగ్రెస్ పార్టీతోనే పేదలకు న్యాయం
ఓటేసిన ఆర్వో
ధాన్యం దిగదు.. లారీ కదలదు
● జనసంద్రంగా ఐబీ చౌరస్తా ● మంచిర్యాలలో రోడ్షో
నేడు నీట్
డీఏవోగా సురేఖ బాధ్యతల స్వీకరణ
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement