breaking news
Karfball Championship
-
రన్నరప్ ఉస్మానియా
సాక్షి, హైదరాబాద్: ఆలిండియా ఇంటర్ యూనివర్సిటీ కార్ఫ్బాల్ (మిక్స్డ్) చాంపియన్షిప్లో ఉస్మానియా యూనివర్సిటీ జట్టు రన్నరప్గా నిలిచింది. ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) గ్రౌండ్స్ వేదికగా సోమవారం జరిగిన ఫైనల్లో ఓయూ 3–8తో ఎండీయూ రోహ్తక్ యూనివర్సిటీ చేతిలో పరాజయం పాలైంది. విజేత జట్టులో అంజలి, సుమన్ ఆకట్టుకున్నారు. మూడో స్థానం కోసం జరిగిన పోరులో జమ్మూ యూనివర్సిటీ 4–3తో ఢిల్లీ యూనివర్సిటీపై గెలుపొందింది. జమ్ము తరఫున రుషాలి మెరుగైన ప్రతిభ కనబరిచింది. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో తెలంగాణ కార్ఫ్బాల్ సంఘం అధ్యక్షుడు కె. లక్ష్మణ్ పాల్గొని విజేతలకు ట్రోఫీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఓయూ రిజిష్ట్రార్ ప్రొఫెసర్ సీహెచ్ గోపాల్ రెడ్డి పాల్గొన్నారు. , , -
ఉస్మానియా యూనివర్సిటీ శుభారంభం
సాక్షి, హైదరాబాద్: ఆలిండియా ఇంటర్ యూనివర్సిటీ కార్ఫ్బాల్ చాంపియన్షిప్లో ఆతిథ్య ఉస్మానియా జట్టు శుభారంభం చేసింది. ఓయూ గ్రౌండ్స్లో శనివారం జరిగిన రెండు మ్యాచ్ల్లోనూ గెలుపొందింది. తొలి మ్యాచ్లో ఉస్మానియా 15–2తో వినాయక్ మిషన్ యూనివర్సిటీని చిత్తుగా ఓడించింది. రెండో మ్యాచ్లో ఉస్మానియా 7–5తో హరియాణా ఐజీ యూనివర్సిటీపై గెలుపొందింది. ఇతర మ్యాచ్ల్లో ఢిల్లీ యూనివర్సిటీ 10–4తో లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీపై, జమ్మూ యూనివర్సిటీ 9–8తో కాలికట్ యూనివర్సిటీపై, ఆర్టీఎం యూనివర్సిటీ 14–1తో సింఘానియా యూనివర్సిటీపై, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ 12–0తో బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీపై, కాలికట్ యూనివర్సిటీ 7–3తో సీఆర్ఎస్యూపై విజయం సాధించాయి. అంతకుముందు జరిగిన టోర్నీ ప్రారంభోత్సవంలో ఓయూ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ ఎస్. రామచంద్రం ముఖ్య అతిథిగా విచ్చేసి పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భారత కార్ఫ్బాల్ సమాఖ్య కార్యదర్శి కృషణ్ కుమార్ వర్మ, కోశాధికారి అశోక్ కుమార్, ఓయూసీసీ స్పోర్ట్స్ చైర్మన్ ఎల్బీ లక్ష్మీకాంత్ తదితరులు పాల్గొన్నారు.