-
వీడు అసలు మనిషేనా! ఎముకలు విరిగేంత బలంగా 15 కత్తిపోట్లు..
తన ప్రేమను కాదందన్న అక్కసుతో మానవ మృగంలా మారిపోయి యువతిని దారుణంగా హతమార్చాడో దుర్మార్గుడు. కత్తిలో నరికి అత్యంత దారుణంగా అమాయకురాలిని పొట్టన పెట్టుకున్నాడు. ఉన్మాదిలా మారి తమ కూతురి ప్రాణం బలిగొన్న రాక్షసుడిని ఉరి తీయాలని హతురాలి కుటుంబీకులు డిమాండ్ చేస్తున్నారు. కాకినాడ క్రైం: ప్రేమోన్మాది గుబ్బల వెంకట సూర్యనారాయణ చేతిలో హతమైన కాదా దేవికపై జరిగిన దాడి అత్యంత పాశవికమైనదని ఫోరెన్సిక్ నిపుణులు నిర్ధారించారు. కాకినాడ జీజీహెచ్లో దేవిక మృతదేహానికి ఆదివారం పోస్టుమార్టం నిర్వహించి, కుటుంబ సభ్యులకు అప్పగించారు. వారి నివేదిక ప్రకారం.. దేవికను నిందితుడు కత్తితో విచక్షణా రహితంగా పొడిచాడు. దీంతో ఆమె ముఖం, మెడ భాగాల్లో లోతైన గాట్లు పడ్డాయి. సూర్యనారాయణ ఆమె కాలర్ బోన్లో కత్తి దింపి ఎడమ వైపునకు చీల్చేశాడు. రెండువైపులా నరకడంతో మెడలోని రక్తనాళాలు పూర్తిగా తెగిపోయాయి. దేవిక మరణానికి అదే కారణమని గుర్తించారు. విచక్షణారహితంగా కత్తితో పొడుస్తూండటంతో దేవిక రెండు చేతులూ అడ్డం పెట్టి రక్షించుకునే ప్రయత్నం చేసింది. అయితే అంతకు మించిన బలంతో అతడు కత్తితో పొడవడంతో దేవిక రెండు మోచేతుల పైభాగాల్లో లోతైన గాయాలయ్యాయి. ఈ క్రమంలోనే ఆమె ఎడమ చేతి ఎముకను సత్యనారాయణ నరికేశాడు. ఆమె రెండు భుజాలు శరీరం నుంచి వేరు పడ్డాయి. ఎడమ భుజానికి ఆధారమైన హ్యూమరస్ ఛిద్రమైంది. అక్కడి ఎముకలో సైతం కత్తి దిగింది. కత్తి నేరుగా మెడలో దించిన ఆనవాళ్లున్నాయి. దేవిక శరీరంలో మొత్తం 15 బలమైన గాయాలున్నట్టు పోస్టుమార్టం నివేదికలో పేర్కొన్నారు. ఆ రాక్షసుడిని ఉరి తీయాలి చదువు పూర్తి చేసుకుని, ఉద్యోగం చేసుకుంటుందనుకుంటే ఇలా దారుణంగా హత్యకు గురవుతుందని ఊహించలేదని దేవిక కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు. తమ వద్దే పెరిగి, చదువుకుంటోందని, ఉద్యోగం వస్తే కళ్లలో పెట్టుకుని చూసుకుంటుందని అనుకుంటే దేవుడు అన్యాయం చేశాడంటూ దేవిక అమ్మమ్మ బోరున రోదించింది. అమ్మమ్మ వద్ద ఉండి చదువుకుంటుందని హైదరాబాద్లో తాము నిశ్చింతగా ఉంటే కిరాతకుడి చేతిలో తమ కూతురు బలైపోయిందని దేవిక తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. తమ కుమార్తెని హత్య చేసిన రాక్షసుడిని ఉరి తీయాలని డిమాండ్ చేశారు. (క్లిక్: ప్రేమోన్మాది ఘాతుకం.. పట్టపగలే నడిరోడ్డుపై కిరాతకం) దేవిక కుటుంబానికి ప్రభుత్వం అండ: మంత్రి చెల్లుబోయిన వేణు రామచంద్రపురం/కె.గంగవరం: ప్రేమోన్మాది చేతిలో అత్యంత కిరాతకంగా హత్యకు గురైన కాదా దేవిక కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలబడి ఆదుకుంటుందని రాష్ట్ర బీసీ సంక్షేమం, సమాచార, పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు. కరప మండలం కూరాడలో హత్యకు గురైన కాదా దేవిక తల్లిదండ్రులను, ఇతర కుటుంబ సభ్యులను మంత్రి వేణు కె.గంగవరంలో ఆదివారం సాయంత్రం పరామర్శించి ఓదార్చారు. ఈ సందర్భంగా మంత్రి వేణు మాట్లాడుతూ ఆటవికంగా హత్యకు పాల్పడిన హంతకుడిపై ప్రభుత్వం తర్వతగతిన విచారణ పూర్తి చేసి కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు. ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు రాజకీయాలు ప్రస్తావించకూడదని, ప్రతి ఒక్కరూ ఇలాంటి దుశ్చర్యలను ఖండించాలన్నారు. ప్రభుత్వం మహిళలకు అండగా ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. రామచంద్రపురం ఎంపీపీ అంబటి భవాని, కె.గంగవరం మండల విప్ కొప్పిశెట్టి లక్ష్మణ్, శెట్టిబలిజ సంఘం అధ్యక్షుడు నరాల ఏడుకొండలు, వైఎస్సార్సీపీ నాయకుడు పంపన సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యోగం పేరిట బురిడీ
కరప: మంచి జీతంతో కూడిన ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పిన మాయమాటలకు ఒక యువకుడు మోసపోయి రూ.12.33 లక్షల వరకు పోగొట్టుకున్న ఘటన కరప మండలం వేములవాడ శివారు సిరిగలపల్లంకలో వెలుగులోకి వచ్చింది. ఉద్యోగం రాకపోయేసరికి మోసపోయినట్టు గ్రహించిన బాధితుడు కరప పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కరప ఎస్సై డి.రమేష్బాబు తెలిపిన వివరాల మేరకు... వేములవాడ శివారు సిరిగలపల్లంక గ్రామానికి చెందిన గుత్తుల లోవరాజు ఐటీఐ చదివాడు. ఏ ఉద్యోగం రాకపోయేసరికి స్థానికంగా రొయ్యల చెరువుల వద్ద పనిచేస్తున్నాడు. లోవరాజు ఏడాదిన్నర క్రితం వరసకు సోదరి అయిన విజయవాడ అడ్డరోడ్డులో ఉంటున్న మేడిశెట్టి దుర్గ ఇంటికి వెళ్లాడు. దుర్గ పొరుగున ఉండే దాసరి సువర్ణకుమారికి తమ్ముడు లోవరాజును పరిచయం చేసి, ఏదైనా ఉద్యోగం చూడాలని అడిగింది. తెలిసినవారున్నారని, వారితో మాట్లాడి, ఉద్యోగం వచ్చేలా చేస్తానని సువర్ణకుమారి నమ్మకంగా చెప్పింది. వీరి మాటలు నమ్మిన లోవరాజు రూ.1.90 లక్షలు దుర్గ ఖాతాకి, రూ.2.19 లక్షలు గోవాడ జాస్మిన్ ఖాతాకు, రూ.65 వేలు శ్రీరాముని శివరామకృష్ణప్రసాద్కు, రూ.50 వేలు నాగేంద్రకు, రూ.54 వేలు చిట్టూరి వెంకటేశ్వరరావుకి, రూ.80 వేలు బసువర్తుల శ్రీనివాస్నాయక్కు, రూ.25 వేలు చప్పిడి దుర్గాలక్ష్మి ఖాతాలకు ఫోన్పే ద్వారా దఫదఫాలుగా జమ చేశాడు. తర్వాత తన సోదరి దుర్గ సమక్షంలో రూ.5.50 లక్షలు సువర్ణకుమారికి చెల్లించాడు. ఇలా రూ. 12.33 లక్షలు చెల్లించిన తర్వాత ఉద్యోగం రాకపోయేసరికి దుర్గ, సువర్ణకుమారిలను అడగడంతో సమాధానం చెప్పకుండా విషయాన్ని దాటవేస్తూ వచ్చారు. చాలాసార్లు అడిగినా పట్టనట్టు వ్యవహరించారు. గతేడాది ఫిబ్రవరి నెల 22వ తేదీన బాలగంగాధర్ తిలక్ మేనేజ్మెంట్, ఏడీఎం ఏపీజెన్కో, విజ్జేశ్వరం పేరిట తప్పుడు జాయినింగ్ ఆర్డర్ తయారు చేసి, ఆఫీసు నుంచి కాల్ వచ్చిన తర్వాత ఉద్యోగంలో చేరాలని లోవరాజుకు చెప్పారు. వారి మాయమాటలు నమ్మిన లోవరాజు ఇంటికి వచ్చేశాడు. ఎంతకూ కాల్ లెటర్ రాకపోయేసరికి వారిచ్చిన ఆర్డర్ కాపీ అడ్రస్కు వెళ్లి అడగగా ఫోర్జరీ సంతకాలతో అపాయిమెంట్ లెటర్ ఇచ్చారని తెలుసుకుని నిర్ఘాంతపోయాడు. సొమ్ములు తీసుకున్నవారిని నిలదీయడంతో దుర్భాషలాడుతూ, దిక్కున్నచోట చెప్పుకోమంటూ నిర్లక్ష్యంగా చెప్పడంతో జరిగిన మోసాన్ని గ్రహించాడు. కరప పోలీసుస్టేషన్లో బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై రమేష్బాబు దర్యాప్తు చేస్తున్నారు. -
గ్రామ వలంటీర్ నుంచి సర్పంచ్గా..
కరప: గతనెల వరకు ఆమె గ్రామ వలంటీర్. నేటి నుంచి గ్రామ సర్పంచ్. తమ కళ్ల ముందు తిరుగుతూ కనిపించే అమ్మాయి సర్పంచ్ అయిందంటే ఆ గ్రామ ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. కరప మండలం గొర్రిపూడి గ్రామానికి చెందిన కానూరు రమాదేవి ఇంటర్ వరకు చదువుకున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి గ్రామవలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రయోజనం పొంది, గ్రామవలంటీర్గా విధుల్లోకి చేరింది. ఏడాదిన్నరగా తనకు కేటాయించిన 50 కుటుంబాలను కలసి, ప్రభుత్వ పథకాలను వారికి చేరువ చేస్తోంది. పంచాయతీ ఎన్నికలు రావడంతో గొర్రిపూడి గ్రామం బీసీ మహిళకు రిజర్వ్ అయ్యింది. వైఎస్సార్ సీపీ గ్రామకమిటీ అధ్యక్షుడు చీకాల సుబ్బారావు ప్రోత్సాహంతో రమాదేవి వలంటీర్ పదవికి రాజీనామా చేసి, పంచాయతీ ఎన్నికల్లో గ్రామ సర్పంచ్గా నామినేషన్ వేశారు. ఈ గ్రామంలో జరిగిన త్రిముఖపోటీలో 508 ఓట్ల మెజార్టీతో సర్పంచ్గా గెలుపొందారు. ఈ ఎన్నికలో మొత్తం 4,229 ఓట్లు పోలవ్వగా రమాదేవికి 2002, సమీప ప్రత్యర్థికి 1494 ఓట్లు, టీడీపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థికి 613 ఓట్లు రావడంతో 508 ఓట్ల మెజార్టీతో గ్రామవలంటీర్ రమాదేవి సర్పంచ్గా ఎన్నికయ్యారు. రాష్ట్ర వ్యవసాయ, సహకారశాఖల మంత్రి కురసాల కన్నబాబు, గ్రామపెద్దల సహకారంతో గ్రామాభివృద్ధికి కృషి చేస్తానని కొత్త ఎన్నికైన సర్పంచ్ రమాదేవి తెలిపారు. (చదవండి: 24ఏళ్లకే సర్పంచ్..) వీరికి లక్కుంది..! -
గ్రామ సచివాలయాలను ప్రారంభించిన సీఎం జగన్
-
తండ్రి విద్యనందిస్తే..తనయుడు ఉద్యోగమిచ్చాడు..
సాక్షి, కాకినాడ: ‘తండ్రి విద్యనందిస్తే...తనయుడు ఉద్యోగం అందించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి మా కుటుంబం ఎల్లప్పుడూ రుణపడి ఉంటుంది అలాంటి ఉద్యోగదాత జగనన్నకు నా హృదయపూర్వక నమస్కారాలు. మీ ద్వారా నాకు ఓ బంగారు భవిష్యత్ను అందించారని’ విలేజ్ సర్వేయర్గా ఎంపికైన విజయదుర్గ తెలిపింది. తూర్పు గోదావరి జిల్లా కరప గ్రామంలో గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థను ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో విజయదుర్గ మాట్లాడుతూ..‘మా నాన్నగారు సామాన్య ఆటో డ్రైవర్. నేను రెండో తరగతి చదువుతున్నప్పుడు మా నాన్నగారు చనిపోయారు. మా అమ్మ ఆస్తమా పేషెంట్ అయినా... ఆమె మందుల ఖర్చును పక్కనపెట్టి మా చదువుల కోసం వెచ్చించి పదో తరగతి వరకూ చదివించింది. ఇక పై చదువులు చదవలేనని అనుకుంటున్న సమయంలో... మహానేత వైఎస్ రాజశేఖర్రెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ద్వారా ఇంజనీరింగ్ పూర్తి చేశారు. తండ్రిగారు విద్యనందిస్తే...తనయుడు ఉద్యోగం అందించారు. ఎల్లప్పుడూ రుణపడి ఉంటా’ అని పేర్కొంది. నన్ను ఉద్యోగవంతుడిని చేశారు.. మహాత్మాగాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యంలో తాము భాగస్వామ్యులు కావడం ఆనందంగా ఉందని... గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా అవినీతిరహిత పాలనను అందించేలా తమ వంతు కృషి చేస్తామని వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్గా ఎంపికైన సాయి మణికంఠ తెలిపాడు. ‘తండ్రి విద్యకు సహకారం అందించి విద్యావంతుడ్ని చేస్తే... ఆయన తనయుడు జగనన్న సచివాలయ ఉద్యోగం ఇచ్చి... ఉద్యోగవంతుడిని చేశారు. దేశ, రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నాలుగు నెలల్లోనే ఇన్నివేల ఉద్యోగాలు ఇచ్చారు. ఉద్యోగులంతా ఆయనకు హృదయపూర్వక ధన్యవాదాలు చెబుతున్నాం. తూర్పుగోదావరి జిల్లాలో సుమారు 13వేలమందిమి ఎంపిక అయ్యాం. గత మూడేళ్లుగా పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్నా. లక్షల ఉద్యోగాలను ఎంతో పారదర్శకంగా చేపట్టిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిదే. ఆయన ‘చెప్పిందే చేస్తాను... చేసేదే చెబుతాను’ అంటూ... మేనిఫెస్టోనే భగవద్దీత, ఖురాన్, బైబిల్గా పేర్కొన్నారు. ‘నేను విన్నాను...నేను ఉన్నాను’ అని వైఎస్ జగన్ ఎలా చెప్పారో..అలాగే సచివాలయ ఉద్యోగులుగా మేము కూడా అలానే పని చేస్తాం.’ అని మణికంఠ స్పష్టం చేశాడు. నా బాధ్యత సక్రమంగా నిర్వర్తిస్తా.. డిజిటల్ అసిస్టెంట్ మంగాదేవి మాట్లాడుతూ...మా నాన్నగారు సాధారణ రైతు. మేం నలుగురు సంతాపం. చెల్లి, ఇద్దరు తమ్ముళ్లు. మా నాన్నగారు చదవించే స్థాయిలో లేనప్పుడు... వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా చదువుకున్నాం. గవర్నమెంట్ ఉద్యోగం చేయడం నా కల. దాన్ని సాకారం చేసుకోవడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సహకారం అందించారు. టాలెంట్ అందరికీ ఉంటుంది. అవకాశం కోసం వేచి చూస్తూ ఉంటారు. ఆ అవకాశం ఉపయోగించుకుని నేను మూడు ఉద్యోగాలకు ఎంపికయ్యాను. బాబు వస్తే జాబ్ వస్తుందని చెప్పి...మాట తప్పిన ముఖ్యమంత్రిని చూపాం. అయితే... చెప్పింది చేసి చూపించిన ముఖ్యమంత్రి మన ముందు ఉన్నారు. ఉద్యోగ నిర్వహణలో.. నిష్పక్షపాతంగా, ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా నా బాధ్యతను నిర్వర్తిస్తాను’ అని తెలిపింది. అనంతరం ఉద్యోగాలకు ఎంపికైన విజయదుర్గ, సాయి మణికంఠ, మంగాదేవికి ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు. చదవండి: సచివాలయ ఉద్యోగులకు సీఎం జగన్ శుభాకాంక్షలు
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
టీ20 వరల్డ్కప్కు ఐర్లాండ్ జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే?
మరో కుటుంబాన్ని ఆదుకున్న స్టార్ హీరో.. వీడియో వైరల్!
ఢిల్లీ బ్యాటర్లు ఊచ కోత.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్
రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాము: కాంగ్రెస్ నేత పవన్ ఖేరా
బాహుబలి కేవలం 10 కోట్ల మంది మాత్రమే: రాజమౌళి కామెంట్స్
బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
తెలంగాణను అసమర్థులు ఏలుతున్నారు: కేసీఆర్
క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
నెల ముందే ప్రమోషన్.. ఇప్పుడు జాబ్ పోయింది: అగ్రరాజ్యంలో టెకీ ఆవేదన
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement