breaking news
Kanpur Test Match
-
గుట్కా మ్యాన్ అంటూ ట్రోలింగ్.. అసలు విషయం తెలిస్తే షాక్!
క్రికెట్కు సంబంధించి మ్యాచ్ గెలుపోటములు, ఆటగాళ్ల ప్రదర్శన, అభిమానుల తీరు అన్నింటిపై సోషల్ మీడియాలో ట్రోల్స్, మీమ్స్ ట్రెండ్ అవుతుంటాయి. అయితే భారత్లో ప్రస్తుతం పూర్తిస్థాయిలో క్రికెట్ ప్రేక్షకులను స్టేడియంలోకి అనుమతిస్తుంది. న్యూజిలాండ్ టీమిండియా పర్యటనలో భాగంగా కాన్పూర్ వేదికగా తొలి టెస్టు మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. Test matches in Kanpur. Pity the guy at the other end who has to decipher what this guy is saying pic.twitter.com/AOTYTnvQYR — Gabbbar (@GabbbarSingh) November 25, 2021 కాగా ఆట మొదటిరోజులో భాగంగా మ్యాచ్ వీక్షించడానికి వచ్చిన ప్రేక్షకుల వైపు కెమెరా తిరిగింది. స్టాండ్లో ఉన్న వ్యక్తిపైకి కెమెరా ఫోకస్ మరింత దగ్గరగా వెళ్లింది. అతను గుట్కా నములుతూ.. ఫోన్ సంభాషిస్తున్నట్లు కనిపించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారటంతో అతనిపై ఫన్నీగా మీమ్స్ క్రియేట్ చేసి ట్రోల్ చేశారు. మాజీ క్రికెటర్ వసీం జాఫర్ కూడా ఓ ఫన్నీ మీమ్ను ట్విటర్లో పోస్ట్చేశారు. "Abe Guddu, Guthka sath leke aana, idhar mehenga bech rahe." pic.twitter.com/9HyYg33S1U — Silly Point (@FarziCricketer) November 25, 2021 ఇక ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో నగరం పొగాకు, పాన్ మసాలాకు ప్రసిద్ధి చెందింది కావటంతో నెటిజన్లు అతనిపై విపరీతంగా జోకులు, మీమ్స్ పేల్చుతున్నారు. ఆ వీడియోలో ఉన్న వ్యక్తి శోభిత్ పాండేగా గుర్తించారు. అతను కాన్పూర్లోని మహేశ్వరీ మహల్లో నివాసం ఉంటున్నట్లు తెలుస్తోంది. అయితే శోభిత్ పాండే రెండో రోజు(శుక్రవారం) కూడా టెస్ట్ మ్యాచ్ చూడడానికి వచ్చాడు. 😅 #INDvNZ pic.twitter.com/JpRSwzk8RQ — Wasim Jaffer (@WasimJaffer14) November 25, 2021 అయితే అతనిపై మళ్లీ కెమెరా ఫోకస్ కాగా.. ‘గుట్కా నమలడం చెడు అలవాటు’ అని ఓ ప్లకార్డు కనిపించింది. అయితే శోభోత్ పాండే మీడియాతో మాట్లాడుతూ.. తనకు అసలు గుట్కా తినే అలవాటు లేదని తెలిపాడు. కేవలం తమలపాకు తింటూ మరోస్టాండ్లోని తన స్నేహితుడితో ఫోన్లో మాట్లాడుతున్నానని చెప్పాడు. అయితే సదరు వ్యక్తి బాధ ఏంటంటే.. సోషల్ మీడియాలో వైరల్గా మారిన వీడియోలో తన సోదరి తనతోపాటు ఉండటం, ఆమెపై కూడా కామెంట్లు రావడమని పేర్కొన్నాడు. తాను ఎలాంటి తప్పు చేయలేదని అందుకే చాలా ఇబ్బందికరంగా ఉందని తెలిపాడు. తన సోదరిపై కూడా కామెంట్లు చేశారని ఆవేదన వ్యక్తంచేశాడు. అదే విధంగా తనకు చాలా మీడియా సంస్థల నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయని దీంతో చాలా చిరాకుగా ఉందని తెలిపాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలి ఇన్నింగ్స్లో టీమిండియా 345 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్లో 296 పరుగులకు ఆలౌటైంది. దీంతో టీమిండియాకు 43 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ మూడోరోజు ఆట ముగిసేసమయానికి 5 ఓవర్లలో వికెట్ నష్టానికి 14 పరుగులు చేసింది. ప్రస్తుతం టీమిండియా 63 పరుగుల ఆధిక్యంలో ఉంది. -
ఇషాంత్ శర్మ బ్యాడ్ లక్
కాన్పూర్: టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ అనారోగ్యం కారణంగా న్యూజిలాండ్ తో జరగనున్న తొలి టెస్టుకు దూరమయ్యాడు. చికెన్ గున్యా బారిన పడడంతో అతడు చరిత్రాక టెస్టులో ఆడే అవకాశం కోల్పోయాడు. అతడి స్థానంలో మరో బౌలర్ కావాలని కోచ్ అనిల్ కుంబ్లే అడగలేదు. భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమి, ఉమేశ్ యాదవ్ జట్టులో ఉన్నారు. న్యూజిలాండ్ జట్టులోనూ ఆల్ రౌండర్ జేమ్స్ నిషామ్ పక్క ఎముక గాయం కారణంగా కాన్పూర్ టెస్టుకు దూరమయ్యాడు. ఫాస్ట్ బౌలర్ టిమ్ సౌతీ గాయం కారణంగా సిరీస్ నుంచి తప్పుకున్నాడు. స్వదేశానికి తిరిగి వెళ్లిపోయిన సౌతీ వన్డే సిరీస్ లో బరిలో దిగే అవకాశముంది. 72 టెస్టులు ఆడిన ఇషాంత్ శర్మ 36.71 సగటుతో 209 వికెట్లు పడగొట్టాడు. ఇటీవల వెస్టిండీస్ తో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్ లో అతడు 8 వికెట్లు తీశాడు. ఈ నెల 22నుంచి న్యూజిలాండ్తో కాన్పూర్లో జరిగే టెస్టు టీమిండియాకు 500వ మ్యాచ్ కావడంతో ప్రాధాన్యం సంతరించుకుంది.