breaking news
Kanhayiya Kumar
-
కన్హయ్యకు ఢిల్లీ హైకోర్టులో ఊరట
న్యూఢిల్లీ: జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయ (జేఎన్యూ) విద్యార్థి సంఘం నేత కన్హయ్య కుమార్కు ఢిల్లీ హైకోర్టు ఊరటనిచ్చింది. కన్హయ్యతో పాటు మరో 14 మంది విద్యార్థులపై విశ్వవిద్యాలయం తీసుకున్న క్రమశిక్షణ చర్యలను తప్పుపడుతూ ఇది సహజ న్యాయ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని జస్టిస్ వి.కామేశ్వర్రావు వ్యాఖ్యానించారు. ఈ అంశంపై వర్సిటీ అప్పిలేట్ అథారిటీ పునఃపరిశీలించాలని ఆదేశించారు. విద్యార్థుల నుంచి వివరణ తీసుకుని ఆరువారాల్లోగా విద్యార్థులపై చర్యలకు తగు కారణాలను వెల్లడించాలని సూచించింది. -
ఇది 15 ఏళ్ల అమ్మాయి ఛాలెంజ్..!
రాజద్రోహం కేసులో అరెస్టయి విడుదలైన జేఎన్యూ విద్యార్థి నాయకుడు కన్హయ్యకుమార్.. భావప్రకటన స్వేచ్ఛ అంశంపై బహిరంగ చర్చకు రావాలంటూ 15 ఏళ్ల అమ్మాయి సవాల్ విసిరింది. ఏవిషయమైనా మాట్లాడేముందు ఓసారి ఆలోచించుకోవాలని కన్హయ్యకు సలహా ఇచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని సూచించింది. కన్హయ్యకు సవాల్ చేసిన అమ్మాయి పేరు జాహ్నవి బెహల్. లుథియానాకు చెందిన జాహ్నవి.. భాయ్ రణ్ధీర్ సింగ్ నగర్లో డీఏవీ పబ్లిక్ స్కూల్లో చదువుతోంది. స్వచ్ఛ్ భారత్ అభియాన్లో పాల్గొన్నందుకు గాను జాహ్నవి.. రిపబ్లిక్ డే రోజున కేంద్ర ప్రభుత్వం నుంచి సత్కారం అందుకుంది. ఎన్జీవో రక్షా జ్యోతి ఫౌండేషన్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటుంది. ఓ జాతీయ పత్రికతో జాహ్నవి మాట్లాడుతూ.. రాజ్యాంగం భావప్రకటన స్వేచ్ఛ కల్పించిందని, దీని అర్ధం హద్దులు దాటి మాట్లాడం కాదని చెప్పింది. కన్హయ్య తదితరులు రాజకీయ లబ్ధి కోసం ఈ ప్రాథమిక హక్కును దుర్వినియోగం చేశారని ఆరోపించింది. 'జేఎన్యూలో భావప్రకటన స్వేచ్ఛ పేరుతో జరిగిన ఘటనను ఏ భారతీయుడు సహించడు. పాకిస్తాన్ ప్రోత్సహిస్తున్న ఉగ్రవాదులను ఎదుర్కొనేందుకు భారత సైనికులు తమ జీవితాలను త్యాగం చేస్తుంటే.. మరోవైపు జేఎన్యూ విద్యార్థులు దేశ వ్యతిరేక నినాదాలు చేశారు. ఈ చర్య ప్రపంచంలో భారత్ ప్రతిష్టతను మసకబారుస్తుంది' అని జాహ్నవి అంది. జాహ్నవి గతంలో పలు సమస్యలను ప్రస్తావించింది. పెద్దల చిత్రాలు, సోషల్ మీడియాలో నీలిచిత్రాలను నిషేధించాలని కోరుతూ చండీగఢ్ హైకోర్టును పిటిషన్ దాఖలు చేసింది. స్కూల్ డ్రెస్లోనే కోర్టుకు హాజరైంది. కోర్టు తీర్పు జాహ్నవికి అనుకూలంగా వచ్చింది.