breaking news
kamala nagar
-
సెల్ఫోన్ దుకాణంలో అగ్ని ప్రమాదం
అనంతపురం సెంట్రల్ : అనంతపురం కమలానగర్లో గురువారం మధ్యాహ్నం ఓ సెల్ఫోన్ దుకాణంలో అగ్ని ప్రమాదం జరిగింది. షాపులోని మొత్తం ఫర్నీచర్లు, సెల్ఫోన్లు కాలిబూడదయ్యాయి. కమలానగర్లో డీసీఎంఎస్ రోడ్డులో రామానాయుడు అనే వ్యక్తి ఇండియన్ మొబైల్స్ షాపు నిర్వహిస్తున్నాడు. మధ్యాహ్నం 2 గంటలకు భోజనానికి ఇంటికివెళ్లారు ఆ సమయంలో షాపులో షార్టు సర్కూ్యట్తో మంటలు వ్యాపించాయి. షాపులో నుంచి పొగలు రావడంతో స్థానికులు ఫైరింజన్కు సమాచారం అందించారు. వారొచ్చే సరికే విలువైన సెల్ఫోన్లు, ఫర్నీచర్ అగ్నికి ఆహుతయ్యాయి. సుమారు రూ.6.50 లక్షల ఆస్తినష్టం వాటిల్లి ఉంటుందని అగ్నిమాపక అధికారి లింగమయ్య తెలిపారు. -
పాతబస్తీలో పోలీసుల కార్డన్ సెర్చ్
హైదరాబాద్: భాగ్యనగరం విశ్వనగరంగా రూపొందుతున్న క్రమంలో నగరంలో అసాంఘిక శక్తులను గుర్తించడానికి పోలీసులు వరుస నిర్బంధ తనిఖీలు చేపడుతున్నారు. చాదర్ఘాట్ పోలీస్స్టేషన్ పరిధిలోని కమలానగర్లో తూర్పు మండల డిఫ్యూటీ కమిషనర్ వి. రవీందర్ ఆధ్వర్యంలో బుధవారం రాత్రి కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీల్లో 200 మంది పోలీసులు పాల్గొన్నారు. పలువురి అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం కార్డన్ సెర్చ్ కొనసాగుతోంది.