breaking news
Kamakhya
-
వందే భారత్ స్లీపర్కు ఫుల్ డిమాండ్..
భారతీయ రైల్వే ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వందే భారత్ స్లీపర్ రైలుకు ప్రయాణికుల నుంచి విశేష స్పందన లభించింది. కామాఖ్య –హౌరా మధ్య గురువారం నుంచి పరుగులు తీయయనున్న వందే భారత్ స్లీపర్ రైలు తొలి కమర్షియల్ జర్నీకి సంబంధించి టికెట్లు కొన్ని గంటల్లోనే అమ్ముడుపోయాయి. సోమవారం(జనవరి 19) ఉదయం 8:00 గంటలకు రిజర్వేషన్లు ప్రారంభమవ్వగా.. కేవలం 24 గంటల లోపే అన్ని తరగతుల టిక్కెట్లు పూర్తిగా బుక్ అయ్యాయి. ఈ సెమీ హై-స్పీడ్ ట్రైన్ను 17 జనవరి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ వందే భారత్ స్లీపర్ రైలులో ప్రపంచ స్థాయి ఇంటీరియర్స్, సెన్సార్ ఆధారిత లైటింగ్, మెరుగైన బెర్తులు, ఆధునిక బయో-టాయిలెట్లు ఉన్నాయి. అంతేకాకుండా హౌరా, కామఖ్య మధ్య నడిచే ఈ వందే భారత్ స్లీపర్ రైలు ప్రయాణీకులకు దాదాపు 3 గంటల సమయం ఆదా చేస్తుంది. ఈ కారణాలతో ప్రయాణికులు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు.ఛార్జీలు ఎలా ఉన్నాయంటే?ప్రయాణికులు కనీసం 400 కిలోమీటర్ల దూరానికి కనీస ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. కామాఖ్య నుంచి హౌరా మధ్య ప్రయాణానికి ఫస్ట్ ఏసీలో రూ.3,855, సెకెండ్ ఏసీలో రూ.3,145, థర్డ్ ఏసీలో రూ.2,435 ఖర్చు అవుతోంది.నో వెయిటింగ్ లిస్ట్!సాధారణ రైళ్లలో లాగా ఇందులో ఆర్ఎసీ(RAC) లేదా వెయిటింగ్ లిస్ట్ టిక్కెట్లు ఉండవు. కేవలం కన్ఫర్మ్ అయిన టికెట్ ఉన్న ప్రయాణికులను మాత్రమే అనుమతిస్తారు. దీనివల్ల రైలు లోపల రద్దీ లేకుండా ప్రశాంతంగా ఉంటుంది. -
కామాఖ్య ప్రారంభం
సమైరా, సముద్ర ఖని, అభిరామి ప్రధానపాత్రల్లో నటిస్తున్న మిస్టీరియస్ థ్రిల్లర్ సినిమా ‘కామాఖ్య’. అభినయ కృష్ణ దర్శకత్వంలో శ్రీ వాణీనాథ్, యశ్వంత్ రాజ్ నిర్మిస్తున్న ఈ సినిమా ప్రారంభోత్సవం హైదరాబాద్లో జరిగింది.ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై, ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ ఇచ్చారు. ఈ సినిమాకు చెందిన ఇతర వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని చిత్రయూనిట్ తెలిపింది. ఆనంద్, శరణ్య ప్రదీప్, వైష్ణవ్, ధనరాజ్, రాఘవ, ఐశ్వర్య ప్రధానపాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు సంగీతం: గ్యానీ, కెమెరా: రమేశ్ కుశేందర్ రెడ్డి. -
కామాఖ్య మాతను ప్రార్థించిన గోగోయ్!
గౌహతిః అసోం అధికార కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ముఖ్యమంత్రి తరుణ్ గోగోయ్ తెల్లవారుజాము కామాఖ్య దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అసోం ఎగ్జిట్ పోల్స్ సర్వేలను బట్టి బీజేపీకే విజయం కలిసొచ్చే సూచనలు కనిపిస్తున్న నేపథ్యంలో... వెనుకబడిపోతున్న కాంగ్రెస్ కు విజయాన్ని చేకూర్చాలని కోరుతూ గోగోయ్ కామాఖ్య మాతను దర్శించి ప్రార్థించారు. మొత్తం 126 అసెంబ్లీ స్థానాలున్న అసోంలో పదిహేనేళ్ళుగా పాలనలో ఉన్న తమ పార్టీని ఈసారి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లోనూ గట్టెంకించమని గోగోయ్ ఉదయం కామాఖ్య మాతను కోరుకున్నారు. ఫలితాల లెక్కింపు నేపథ్యంలో గురువారం ఉదయం ఆలయాన్ని దర్శించిన అనంతరం... ప్రజలే నిర్ణయాన్ని తీసుకుంటారని, ఫలితాలు ఎలా ఉన్నా శిరస్సావహించాల్సిందేనని అన్నారు. అయితే ప్రస్తుతం తమ విజయంతోపాటు, ప్రజలను రక్షించేందుకు కామాఖ్య మాత తప్పనిసరిగా సహాయపడుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.


