-
కాళంగి నది తీర నిర్వాసితులకు అండగా వైఎస్ఆర్సీపీ..!
-
ఉప్పు ధార
సూళ్లూరుపేట సుజలస్రవంతి పథకం ద్వారా అన్ని వార్డుల్లో ప్రజలకు స్వచ్ఛమైన నీరు అందిస్తామన్నారు. అధికారంలోకి వచ్చాక అన్నీ మర్చిపోయారు. పాలకులకు ముందుచూపు కరువవడంతో ప్రజలకు ఉప్పునీరే గతైంది. భూ గర్భజలాలు ఉప్పు మయమయ్యాయి. రూ.కోట్లు వెచ్చించి నిర్మించిన నీటి పథకాలు నిరుపయోగంగా మారాయి. పట్టణ జనాభాకు సరిపడా నీరు సరఫరా చేయడంలో మున్సిపల్ యంత్రాంగంవిఫలమైంది. శివారు ప్రాంతాల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. బిందెడు నీళ్లు కూడా కష్టమయ్యాయి. చిత్రమేమిటంటే ప్రజలకు తాగునీరు దొరకదు కానీ వ్యాపారస్తులు పుష్కలంగా లభ్యమతున్నాయి. వారు మంచినీటితో రూ.కోట్లు గడిస్తున్నారు.ప్రజలను దోచేస్తున్నారు. నెల్లూరు, సూళ్లూరుపేట: పట్టణ ప్రజలు మంచినీటి కోసం దాహంతో తపిస్తున్నారు. మంచినీళ్లు దొరకడం గగనంగా మారింది. సుమారు 48 వేల మంది జనాభా అవసరాలకు తగినట్టుగా తాగునీటి వనరుల్లేవు. ఎటుచూసినా ఉప్పునీళ్లే లభిస్తుండడంతో గుక్కెడు మంచినీటికి గుటకలేస్తున్నారు. పులికాట్ సరస్సులోని ఉప్పునీళ్లు కాళంగి నదిలోకి ఎగబాకడంతో భూగర్భ జలాలు పూర్తిగా ఉప్పునీళ్లుగా మారిపోయాయి. సాధారణంగానే సూళ్లూరుపేట పట్టణ పరిధిలో భూగర్భంలో ఉప్పునీళ్లు లభ్యమవుతున్నాయి. పట్టణంలో పది ఓవర్హెడ్ ట్యాంకులు ఉన్నాయి. ఇందులో మన్నారుపోలూరు న్యూకాలనీ, ఇందిరానగర్, సూళ్లూరు, బాపూజీకాలనీల్లోని ఓవర్హెడ్ట్యాంకులు శిథిలమై ప్రమాదకరంగా మారడంతో కూల్చేశారు. సమ్మర్ స్టోరేజీ, ఇతర వనరుల నుంచి రోజుకు 16 లక్షల లీటర్ల నీటిని మాత్రమే అందిస్తున్నామని మున్సిపల్ అధికారులు లెక్కలు చెబుతున్నా.. ఆ స్థాయిలో నీటి సరఫరా జరడం లేదు. మున్సిపాలిటీ పరిధిలో ఒక మనిషికి రోజుకు 70 లీటర్ల వంతున నీరు సరఫరా చేయాల్సి ఉంది. ఈ లెక్కన పట్టణ జనాభా లెక్కల ప్రకారం 34 లక్షల లీటర్ల నీరు ఇవ్వాల్సి ఉంది. కానీ అందుబాటులో ఉన్న నీటి వనరుల నుంచి సరఫరా చేస్తున్న నీటి లెక్కలు చూస్తే కేవలం 10 లక్షల లీటర్ల నీటిని కూడా అందించడం లేదని తెలుస్తుంది. ప్రస్తుతం మున్సిపాలిటీలో నీళ్లు కేవలం 30 శాతం మందికి కూడా సరఫరా కావడం లేదు. పట్టణ శివారు ప్రాంతాల వారికి బిందెడు నీళ్లు అందడం కూడా గగనమవుతోంది. తాగునీటికి నెలకు రూ.కోటి వెచ్చింపు పట్టణ ప్రజలకు మంచినీళ్లు అందకపోవడంతో నెలకు రూ.కోటి వెచ్చించి మంచినీళ్లు కొనుగోలు చేస్తున్న పరిస్థితి నెలకొంది. తాగునీటి పథకాల నిర్వహణలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో కొందరు నీటిని దోచేస్తున్నారు. అక్రమంగా కుళాయిలు, సంప్లు నిర్మించుకుని వాటికి మోటార్లు ఏర్పాటు చేసుకుని తోడేయడంతో పట్టణ శివారు ప్రాంతాల్లో కుళాయిల్లో నీళ్లు రావడం గగనమైపోయింది. మన్నారుపోలూరు కేంద్రంగా తాగునీటి వ్యాపారం చేసే కంపెనీలు కోట్లాది రూపాయలు గడిస్తుంటే చెంతనే ఉన్న పట్టణ ప్రజలకు మాత్రం చుక్క నీరు అందాలంటే చుక్కలు కనిపిస్తున్నాయి. మున్సిపల్ లెక్కల ప్రకారం పట్టణంలో సుమారు 15 వేలు కుటుంబాలు ఉన్నాయి. కుటుంబానికి రోజుకు రూ.20 లెక్కన నీళ్లు కొంటే రోజుకు రూ.3 లక్షలు అవుతుంది. అంటే నెలకు సుమారు కోటి రూపాయలు నీళ్ల కోసం ఖర్చు చేస్తున్నారు. ఉప్పు నీళ్లుగా మారిన భూగర్భ జలాలు కాళంగి నదిలోకి పులికాట్ సరస్సు నుంచి ఉప్పు నీళ్లు రాకుండా నిర్మించిన గ్రాయిన్ శిథిలమైపోవడంతో నదిలో ఉన్న మంచినీళ్లు ఉప్పునీళ్లుగా మారిపోయాయి. దీంతో చుట్టు పక్కల బోర్లు, బావుల్లోని మంచినీళ్లు కూడా ఉప్పు నీళ్లుగా మారిపోయి ఎందుకు పనికి రాకుండా పోతున్నాయని పట్టణ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బావుల్లో, బోరుల్లో వచ్చే నీటిని మామూలుగా ఉపయోగించుకుంటూ తాగడానికి మాత్రం రోజువారీగా నీళ్లు కొనుగోలు చేస్తున్నారు. ఈ పరిస్థితి ఏటా తలెత్తుతున్నా.. కాళంగి నదిలోకి ఉప్పు నీళ్లు ఎగబాకకుండా గ్రాయిన్ నిర్మాణాన్ని పటిష్టం చేయాల్సిన పాలకులు నాలుగేళ్లుగా పట్టించుకోవడం మానేశారు. షార్ నిధులతో నిర్మిస్తామని ముందుకొస్తే వారికి అనుమతులు ఇవ్వకుండా కాలయాపన చేశారు. నిరుపయోగంగా మారిన సమ్మర్ స్టోరేజీ ట్యాంక్ సూళ్లూరుపేట దాహార్తిని తీర్చేందుకు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి శ్రీకారం చుట్టారు. వైఎస్సార్ రాజీవ్ పల్లెబాటకు వచ్చినప్పుడు స్థానిక ప్రజల బాధలను తెలుసుకుని సమ్మర్ స్టోరేజీ ట్యాంక్కు రూ.6 కోట్లు మంజూరు చేశారు. కోటపోలూరు పెద్దన్నగారి చెరువులో ఎస్ఎస్ ట్యాంక్ను నిర్మించారు. వైఎస్సార్ ఉన్నంత కాలం వర్షాలు పుష్కలంగా పడడంతో నీటికి ఇబ్బంది లేకుండాపోయింది. ఎస్ఎస్ ట్యాంక్కు నీళ్లు చేరేందుకు తెలుగుగంగ బ్రాంచ్ కాలువను తీసుకువస్తున్నామని, వైఎస్సార్ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, టీడీపీ పాలకులు ఏళ్లకు ఏళ్లే కాలయాపన చేస్తున్నారు. సూళ్లూరుపేట మేజర్ పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా రూపాంతరం చెందడంతో తాగునీటి పథకాలను ఆర్డబ్ల్యూఎస్ శాఖ నుంచి మున్సిపాలిటీకి అప్పగించారు. షార్ నిధులతో పట్టణ ప్రజల దాహార్తిని తీర్చేందుకు రూ.117 కోట్లతో 7.50 లక్షల లీటర్లు కెపాసిటీ కలిగిన ఐదు ఓవర్ హెడ్ట్యాంకులు, 18 కిలో మీటర్లు పైపులైన్లు విస్తరించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అయితే ఈ ప్రతిపాదనలు పైళ్లకే పరిమితమైపోయింది. 2013 ఏప్రిల్లో సూళ్లూరుపేటకు వచ్చిన అప్పటి సీఎం కిరణ్కుమార్రెడ్డి రూ.75 కోట్లు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. పడమటికండ్రిగ చెరువులోని ఆక్రమిత స్థలాన్ని, మంగళంపాడు చెరువులో స్థల పరిశీలన కూడా చేశారు. ఈ ప్రతిపాదన కూడా సీఎం కార్యాలయం నుంచి బయటకు రాలేదు. తాజాగా ఏషియన్ ఇన్వెస్టిమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాంక్ అనే సంస్థ నుంచి రూ.183 కోట్లు మంజూరు చేస్తారని, దీనికి కూడా అంచనాలు సిద్ధం చేశారు. దీనికి సంబంధించి ఏఐఐబీ సంస్థ ప్రతినిధులు ఇటీవల సూళ్లూరుపేటకు వచ్చి మంగళంపాడు చెరువును, పట్టణంలోని పలు ప్రాంతాలను పరిశీలించి వెళ్లారు. ఆ తర్వాత ప్రస్తావనే లేకుండా పోయింది. ఇది కూడా కొండెక్కినట్టేనా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. జోరుగా నీళ్లు వ్యాపారం పట్టణంలోని కళాక్షేత్రంలో స్వజల ధార కింద మున్సిపాలిటీ స్థలంలో ఏర్పాటు చేసిన డాక్టర్స్ వాటర్ అనే సంస్థ మున్సిపాలిటీ నీళ్లను అమ్ముకుంటూ వ్యాపారం చేస్తోంది. అన్ని సౌకర్యాలు మున్సిపాలిటీకి సంబంధించినవి వాడుకుంటూ బిందెనీళ్లు రూ. 4, 20 లీటర్ల క్యాన్ రూ.15లకు విక్రయిస్తున్నారు. మున్సిపాలిటీ వనరులను వాడుకుని పట్టణ ప్రజలకు నామమాత్రపు ధరలకు ఇవ్వాల్సింది పోయి అధికంగా విక్రయిస్తున్నా.. అడిగే నాథుడు లేకుండా పోయారు. -
ప్రాణం తీసిన ‘కోడిపందెం’
- పోలీసుల భయంతో పరుగులు - కాళంగినదిలో పడి వ్యక్తి మృతి - ఆలస్యంగా వెలుగులోకి... చేనిగుంట(తడ): కోడిపందేలపై ఆ వ్య క్తికి ఉన్న ఆసక్తి చివరకు ప్రాణాన్నే బలి తీసుకుంది. పందేల స్థావరంపై పోలీ సులు దాడి చేయడంతో తప్పించుకునే ప్రయత్నంలో కాళంగినదిలో పడి ప్రాణాలు కోల్పోయాడు. మూడు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. నాయుడుపేట బాలాజీనగర్కు చెందిన చిట్టేటి సుకుమార్(45) ఆటోడ్రైవర్గా జీవనం సా గిస్తున్నాడు. కోడిపందేలపై ఉన్న ఆసక్తితో మరో వ్యక్తితో కలిసి వినాయకచవితి రోజున టాటా ఏస్ ట్రాలీలో చేని గుంట సమీపంలోని పొలాల్లోకి వచ్చా డు. ఇంతలో పందేల స్థావరంపై పోలీసులు దాడి చేశారు. ఆందోళనకు గురైన సుకుమార్ తనతో వచ్చిన వ్యక్తితో కలిసి ట్రాలీలో పారిపోయేందుకు ప్రయత్నిం చాడు. వాహనం ఓ చోట పొలాల్లో ఇరుక్కుపోవడంతో దిగి పరుగుతీశారు. ఆ రోజు పందేలకు సంబంధించి ఎవరూ పట్టుబడకపోవడంతో పోలీసులు నాలుగు ఆటోలతో పాటు టాటా ఏస్ ట్రాలీని స్వాధీనం చేసుకుని వచ్చేశారు. అయితే పండగ రోజు నుంచి సుకుమార్ ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళనకు గురయ్యారు. సమాచారాన్ని బంధువులకు అందించడంతో వారు వివిధ ప్రాంతాల్లో ఆరా తీశారు. ఈ క్రమంలో సుకుమార్ కోడిపందేల వద్దకు వెళ్లాడని తెలియడంతో ఆదివారం చేనిగుంట పరిసర ప్రాంతాల్లో గాలించారు. కాళంగినదిలో మృతదేహం తేలుతూ కనిపించడంతో దుస్తుల ఆధారంగా గుర్తుపట్టి, పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై అబ్దుల్ రజాక్ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీయించారు. మృతదేహం ఉబ్బిపోయి ఉండడంతో ఘటనా స్థలంలోనే తడ వైద్యాధికారి ఎన్.కిశోర్ పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. నాయుడుపేటలో విషాదఛాయలు నాయుడుపేటటౌన్: చిట్టేటి సుకుమార్ మృతితో ఆయన నివాసం ఉంటున్న నాయుడుపేటలోని పాతవెంకటగిరి రోడ్డు ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతదేహాన్ని ఆదివారం సాయంత్రం ఇంటికి తీసుకురావడంతో కుటుంబసభ్యులు, బంధుమిత్రుల రోదనలు మిన్నంటాయి. వినాయక చవితి రోజు తమతో సరదాగా గడిపిన తండ్రి ఇక లేడనే విషయాన్ని ఆయన పిల్లలు జీర్ణించుకోలేకపోతున్నారు. మృతుడికి తల్లి బుజ్జమ్మ, భార్య రమణమ్మతో పాటు తొమ్మిదో తరగతి చదివే కుమార్తె మౌనిక, ఆరోతరగతి చదువుతున్న కుమారుడు చరణ్ ఉన్నారు.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
అమ్ముడుపోని లక్షలాది ఇళ్లు.. చైనా కీలక ప్రతిపాదన!
'హౌస్ ఆఫ్ డ్రాగన్స్' సీజన్ 2 ట్రైలర్ రిలీజ్
32 వీడియో లింకులను బ్లాక్ చేసిన యూట్యూబ్!
ఆ స్ఫూర్తితోనే ‘రాజు యాదవ్’ కథ రాశా: డైరెక్టర్ కృష్ణమాచారి
లైంగిక వేధింపుల కేసు: భారత్కు ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ!
రైతుల కష్టాలు రేవంత్కు కనిపించడం లేదా?: కేటీఆర్
నాన్స్టిక్ పాత్రలు వినియోగిస్తున్నారా? ఐసీఎంఆర్ స్ట్రాంగ్ వార్నింగ్!
'అత్తమ్మాస్ కిచెన్'పై విమర్శలు.. వివరణ ఇచ్చిన టీమ్
ఏపీ ఎన్నికలపై సీఈఓ ముకేశ్ కుమార్ కీలక ప్రెస్ మీట్
ఏపీలో 81.86 శాతం పోలింగ్ నమోదు.. అక్కడే అత్యధికం: ఎంకే మీనా
తప్పక చదవండి
- లైంగిక వేధింపుల కేసు: భారత్కు ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ!
- రేపటి నుంచి ఏపీ ఈఏపీ సెట్ పరీక్షలు.. అభ్యర్థులకు అలర్ట్
- సుచి లీక్స్.. నాకు ఆ ఫొటోలు త్రిషనే ఇచ్చింది: సుచిత్ర
- ‘మృతి చెందిన యువతికి వరుడు కావలెను’
- ఇవాళే అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం!
- చైనాకు ఒకేసారి రెండు దెబ్బలు.. షాకిచ్చిన బైడెన్, ట్రంప్!
- MS Dhoni: ఎల్లలు దాటిన అభిమానం.. వామ్మో ఇలా కూడా చేస్తారా?
- 4 రోజుల తర్వాత ఒక్కసారిగా.. మోత మోగించిన బంగారం!
- పరిచయం పెంచుకొని.. పాపను విడిచి
- ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై బీజేపీ ఫుల్ ఫోకస్.. మరో కొత్త ప్లాన్!
Advertisement