breaking news
K Ramachandramurti
-
నారావారి సాము ‘గరుడ’లు!
కాదేదీ కవితకనర్హం అన్నాడు మహాకవి శ్రీశ్రీ. కాదేదీ ప్రచారానికనర్హం అంటున్నారు నారా చంద్రబాబునా యుడు. న్యాయవ్యవస్థ పనితీరు తెలిసినవారు ఎవరైనా రెండు రోజులుగా చంద్రబాబు, ఆయన సహచరులూ ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో మాట్లాడుతున్న తీరు చూస్తే వీళ్ళకి మతులు పోయాయని నిర్ధారించుకుంటారు. రాజ కీయం ఇంతగా దిగజారిపోయిందేమిటని బాధపడతారు. గోరంత విషయాన్ని కొండంత చేస్తున్నందుకు ఆగ్రహి స్తారు. న్యాయవ్యవహారాలు తెలియనివారు మాత్రం ప్రధాని నరేంద్రమోదీకీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికీ మధ్య భీకర సమరం సాగుతున్నదని భ్రమి స్తారు. మోదీ అన్ని పనులూ పక్కన పెట్టి, బీజేపీ అధ్యక్షుడు అమిత్షాను పిలిపించుకొని గంటలకొద్దీ సమాలోచనలు జరిపి, ఇద్దరూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్తో మాట్లాడిన ట్టూ, ఫడ్నవీస్ నాందేడ్ జిల్లాలోని ధర్మాబాద్లో ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్తో కలిసి రాజకీయకుట్ర చేసి చంద్ర బాబును అరెస్టు చేయడానికి పన్నాగం పన్నినట్టూ, అందులో భాగంగానే నాన్బెయిలబుల్ వారెంటు పంపి నట్టూ అపార్థం చేసుకొని అనవసరంగా ఆవేశపడతారు. ఇటువంటì వారెంట్లకూ, అరెస్టులకూ తాను భయపడేది లేదని కర్నూలు జిల్లా సున్నిపెంటలో ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఉపముఖ్యమంత్రి కెఈ కృష్ణమూర్తి, మంత్రులు కళావెంకటరావు, యనమల రామకృష్ణుడు, నారాయణ, పత్తిపాటి పుల్లారావు, కేంద్ర మాజీ మంత్రి అశోక్గజపతి రాజు, మాజీ ఎంపీ నామానాగేశ్వరరావు తక్కుంగల నేత లందరూ నాన్బెయిలబుల్ వారెంటు మోదీ పనేనంటూ ప్రకటించారు. తాను మరోసారి ప్రధాని కాకుండా చంద్ర బాబు అడ్డుకుంటారనే భయంతో మోదీ కుట్ర చేసి తమ నాయకుడిని వేధించాలని ప్రయత్నిస్తున్నారనీ, మోదీ ఆటలు సాగవనీ, అంతు చూస్తామనీ వారంతా ముక్తకం ఠంతో హెచ్చరించారు. అంతటితో ఆగకుండా, బాబ్లీ ప్రాజెక్టును వైఎస్ రాజశేఖరరెడ్డి సమర్థించారని చంద్ర బాబు ఆరోపించారు. వైఎస్ 2009లో దివంగతుడైన విష యం ముఖ్యమంత్రి మరచిపోయారు. మీడియా సహకారం చంద్రబాబుకు అరెస్టు వారెంట్ వార్తను మీడియా సమ ధికోత్సాహంతో పతాక శీర్షికలతో, పొలికేకలతో ప్రకటించి, ప్రసారం చేసి రెండు తెలుగు రాష్ట్రాలలో యుద్ధవాతా వరణం సృష్టించింది. చంద్రబాబును ఒక వైపు నరేంద్ర మోదీతోనూ, రెండో వైపు వైఎస్ జగన్మోహన్రెడ్డితోనూ, ఇంకోవైపు కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) తోనూ త్రిముఖంగా పోరాడుతున్న యోధానయోధుడుగా ప్రజలు గుర్తించి ఆయనను రాబోయే ఎన్నికలలో కూడా గెలిపిం చాలని బాబు మిత్రుల ఆకాంక్ష. అసలు విషయం ఏమి టంటే వడ్ల గింజలో బియ్యపు గింజ. పత్రికలూ, వార్తాచా నళ్ళూ నిర్వహించేవారికి నాన్బెయిలబుల్వారెంట్ (ఎన్బీ డబ్ల్యూ) కొత్తకాదు. నాకు అనేక సందర్భాలలో ఎన్బీ డబ్ల్యూ వచ్చింది. ఒకసారి ఇద్దరు పోలీసు అధికారులు సరాసరి మా కార్యాలయంలో నా గదిలోకి వచ్చి నాకు ఎదు రుగా కూర్చొని ఆశ్చర్యపరిచారు. ఎన్బీడబ్ల్యూ చూపిం చారు. మా లాయర్ నుంచి కానీ, రిపోర్టర్ నుంచి కానీ నాకు సమాచారం బొత్తిగా లేదు. మర్నాడు కోర్టుకు హాజ రవుతానని చెప్పి వారిని పంపించాను. కోర్టుకు హాజరై నాను. ఇతర సంపాదకులకూ, పత్రికాధిపతులకూ పరువు నష్టం దావాలలో కోర్టుకు హాజరు కాలేకపోయిన పరిస్థితు లలో ఎన్బీడబ్ల్యూ రావడం, దిరిమిలా కోర్టుకు హాజరు కావడం లేదా న్యాయవాదిచేత దరఖాస్తు చేయించడం, ఎన్బీడబ్ల్యూను ‘రీకాల్’ చేయించుకోవడం సర్వసాధా రణం. ఇది చాలా చిన్న విషయం. అటువంటి ఎన్బీడబ్ల్యూ ఒకటి చంద్రబాబుకీ, మరి కొంతమందికీ 37వ సారి వచ్చింది. ధర్మాబాద్ మెజిస్ట్రేట్ ఎన్ఆర్ గజఖియే జులై 5న తాజా వారెంట్ పంపించాలని ఆదేశించారు. దాని ప్రకారం ఆగస్టు 16 నిందితులు హాజరు కావాలి. కానీ తేదీని చేతితో కొట్టివేసి సెప్టెంబర్ 21న హాజరు కావాలని ఆదేశిస్తూ పంపిన తాఖీదు రెండు రోజుల కిందటే అందినట్టు ప్రచారం. 2010లో గోదావరి నదిపై మహారాష్ట్ర ప్రభుత్వం బాబ్లీ ప్రాజెక్టు నిర్మిస్తున్న సందర్భంలో అప్పుడు ప్రతి పక్షంలో ఉన్న చంద్రబాబు పార్టీ సహచరులతో వెళ్ళి ధర్నా చేశారు. మహారాష్ట్ర పోలీసులు టీడీపీ నాయకులను అరెస్టు చేసి పుణె జైలుకు తరలించారు. అక్కడి నుంచి విమానంలో హైదరాబాద్లో దింపారు. భారత శిక్షాస్మృతి కింద మహా రాష్ట్ర పోలీసులు కేసులు పెట్టారు. విచారణ 2013 ఆగ స్టులో ప్రారంభమైంది. నిందితులు కోర్టుకు హాజరు కావడం లేదనే కారణంపైన 2015 సెప్టెం» ర్ 21 మొద టిసారి ఎన్బీడబ్ల్యూ జారీ చేశారు. ఆ తర్వాత 35 సార్లూ ఎన్బీడబ్ల్యూ జారీ చేస్తూ వచ్చింది ధర్మాబాద్ కోర్టు. ఎనిమిదేళ్ళుగా అదే కోర్టులో కేసు నలుగుతూ ఉన్నది. ఎన్బీడబ్ల్యూ జారీ చేయడమే కానీ దాన్ని అమలు చేసే ఉద్దేశం కోర్టుకు ఉన్నట్టు లేదు. మన న్యాయవ్యవస్థ పని తీరుకు ఇది ప్రబల నిదర్శనం. టీడీపీకి చెందిన ఇద్దరు మంత్రులు ఎన్డీఏ భాగస్వాములుగా ఉన్న కాలంలోనే 35 ఎన్బీడబ్ల్యూలు వచ్చాయి. బుట్టదాఖలైనాయి. కానీ 37వ ఎన్బీడబ్ల్యూని రాజకీయంగా వినియోగించుకోవాలనే మెరుపులాంటి ఆలోచన చంద్రబాబుకి వచ్చినట్టుంది. తెలంగాణ కోణం నరేంద్రమోదీపైన వ్యతిరేకత సృష్టించడం ఒక్కటే లక్ష్యం కాదు. తెలంగాణ ఎన్నికలలో ఈ అంశాన్ని తురుపు ముక్కగా ఉపయోగించుకోవాలని సంకల్పం. 1995లో ఎన్టి రామారావును గద్దె దింపడానికి వైస్రాయ్ హోట ల్లో జరిగిన నాటకంలో సహకరించిన శక్తులు ఇన్నేళ్ళు గడిచినా చంద్రబాబుతోనే మరింత అంకితభావంతో కొన సాగడం విశేషం. అందుకే ఆయనకు ఏ ఆలోచన వచ్చినా వెంటనే అమలు చేసి ఫలితాలు సాధించగలుగుతున్నారు. ఆయన ‘తందానా’ అంటే ‘తానతందనానా’ అంటూ దరువు వేయడానికీ, బృందగానం చేయడానికి వెరపులేని మీడియా సిద్ధంగా ఉంటుంది. న్యాయవ్యవస్థలో కార్యసా ధనకు అవసరమైన శక్తియుక్తులున్నాయి. టీడీపీలో ఆయన మాటకు ఎదురు చెప్పే చేవ ఉన్నవారు ఎవ్వరూ లేరు. నాయకుడు ఏ పాట పాడమంటే ఆ పాట పాడుతారు. ఏ ఆట ఆడమంటే ఆ ఆట ఆడతారు. తెలంగాణలో ఆధిక్యాన్ని ప్రదర్శించుకోవడానికి చంద్రబాబు మరో ప్రయత్నం చేస్తున్నారు. ‘ఓటుకు కోట్ల’ కేసు తర్వాత బతుకుజీవుడా అంటూ ఉమ్మడి రాజధాని వదిలి అమరావతికి మకాం మార్చిన బాబు ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్నారు. తనపైన కేసీఆర్ది పైచేయి అయింది. అందుకు ప్రతీకారంగా కేసీఆర్ని ఓడించేందుకు కాంగ్రె స్తో చేతులు కలపాలని నిర్ణయించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభకు గడువు ప్రకారమే ఎన్నికలు జరుగుతాయి కనుక ముందస్తు ఎన్నికలకు వెడుతున్న తెలంగాణలో మరోసారి కాలుమోపడానికి ప్రయత్నం చేయాలని ఆరా టపడుతున్నారు. అందుకే వారం రోజుల కిందట హైదరా బాద్లో టీఆర్ఎస్లోకి వలస పోగా మిగిలిన కొద్దిమంది టీడీపీ నాయకులతో సమాలోచనలు జరిపి కమిటీలు వేసి హడావిడి చేశారు. తెలంగాణ ఎన్నికలలో టీడీపీ, కాంగ్రెస్, సీపీఐ కూటమికి తానే సారథ్యం వహిస్తున్నట్టు కనిపిం చడం చంద్రబాబు ఉద్దేశం. పెద్దపార్టీగా చొరవ తీసుకో వాలన్న అభిలాష ఉత్తమ్కుమార్రెడ్డికి లేదు. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు రమణకు బాధ్యతలు అప్పగించి చంద్ర బాబు అమరావతికి వెళ్ళిపోయారు. ఎందుకైనా పనికి వస్తుందని ఒక సైడ్షోను శివాజీ అనే నటుడితో ‘ఆపరేషన్ గరుడ’ అనే ఒకానొక ఊహాజనిత ప్రాయోజిత కార్యక్ర మాన్ని కొన్ని మాసాల కిందటే ఆరంభింపజేశారు. దాన్ని మహారాష్ట్ర కోర్టు నుంచి వచ్చిన ఎన్బీడబ్ల్యూకు ప్రచారం ఇవ్వడానికి వినియోగించుకున్నారు. ఈ విధంగా మేథోక్రీడ ఆడటం టీడీపీ అధినేతకు అలవాటే. అవే ఎత్తుగడలు, అవే వ్యూహాలు వైస్రాయ్ డ్రామాలో సైతం ఇదే రకమైన ఎత్తుగడలు అమలు పరిచారు. లేనిది ఉన్నట్టూ, ఉన్నది లేనట్టూ నమ్మించడం ఈ క్రీడలో ్రçపధానం. ఎన్టీఆర్ను భార్యా విధేయుడుగా, అసమర్థుడుగా, లక్ష్మీపార్వతిని దుష్టశక్తిగా నమ్మించడానికి వినియోగించిన తంత్రాన్నే ఇప్పుడు మోదీతో తాను యుద్ధం చేస్తున్నట్టు ప్రజలు విశ్వసించే విధంగా నాటకం రక్తికట్టించేందుకు యధాశక్తి ఉపయో గిస్తున్నారు. అన్నివేళలా వ్యూహాలు ఫలించవు. 1995లో ఫలించిన వ్యూహం 2004లోనూ, 2009లోనూ పారలేదు. 2014లో ఫలించి స్వల్ప మెజారిటీతో గెలుపొందారు. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. కడచిన నాలు గేళ్ళుగా ప్రజలు రకరకాల అనుభవాల నుంచి గుణ పాఠాలు నేర్చుకున్నారు. అందుకే ‘యాక్సిస్ మై ఇండియా’ ‘ఇండియాటుడే’ సంస్థ కోసం చేసిన సర్వేలో భావి ముఖ్య మంత్రి ఎవరనే ప్రశ్నకు 43 శాతం మంది వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అని బదులిస్తే 38 శాతం మంది మాత్రమే చంద్రబాబు అని చెప్పారు. శనివారంనాడు ఉభయ కమ్యూనిస్టు పార్టీలు నిర్వహించిన బహిరంగ సభకు గణనీయమైన సంఖ్యలో జనం హాజరు కావడం కూడా ప్రభుత్వ వ్యతిరేకత బలంగా ఉన్నదన డానికి నిదర్శనం. రాబోయే ఎన్నికల దృష్ట్యా బాబ్లీ బరాజ్ నిర్మాణం సమయంలో టీడీపీ చేసిన ధర్నాను తిరిగి ప్రజ లకు గుర్తు చేయడం అవసరమని చంద్రబాబు భావించి ఉంటారు. గోదావరిపైన మరో ప్రాజెక్టు వస్తే ఉత్తర తెలంగాణ బీడైపోతుందన్న ఆవేదనతో ఆ నాడు తాను మహారాష్ట్ర వెళ్ళి ఆందోళన చేశానని చెప్పుకోవడానికి ఎన్బీడబ్ల్యూ ఆయనకు ఒక సందర్భాన్ని ప్రసాదించింది. ఒక వైపు ఆపరేషన్ గరుడ, మరోవైపు ఆపరేషన్ ఎన్బీడబ్ల్యూ కొనసాగిస్తూనే ఇంకోవైపు ఆపరేషన్ ఇంటెలిజెన్స్కు తెరలేపారు. సిబ్బందితో సహా హైదరాబాద్లో మకాం వేసి ఏయే నియోజకవర్గాలలో టీడీపీ అభ్యర్థులు గెలిచే అవ కాశం ఉన్నదో పరిశీలించమని ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ విభాగం అధిపతి వెంకటేశ్వరరావుకు పురమాయించారు. టీడీపీ ఓటు బ్యాంకు 31 శాతం చెక్కు చెదరలేదంటూ మొన్న హైదరాబాద్ సందర్శన సందర్భంగా రమణ చేత ఒక ప్రకటన చేయించారు. కనీసం 50 నియోజకవర్గాలలో టీడీపీ అభ్యర్థులు గెలిచే అవకాశాలు కనిపిస్తాయంటూ వెంకటేశ్వరరావు చేత నివేదిక ఇప్పించుకుంటారు. ఈ రెండు అంశాలు ప్రాతి పదికగా కాంగ్రెస్తో సీట్ల బేరం పెడతారు. అమరుల ఆకాంక్షల ఆధారంగా ఎజెండా తయారు చేసుకొని కోదండరామ్ కూడా ఈ కూటమిలో భాగస్వామి కావ డానికి సిద్ధంగా ఉన్నట్టున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోకుండా ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చినట్లయితే టీఆర్ఎస్కు గట్టిపోటీ ఇస్తాయి. ఈ పరి ణామాలను కేసీఆర్ చూస్తూ ఊరుకుంటారా? కాంగ్రెస్ నాయకుడు జగ్గారెడ్డిపైన, రేవంత్రెడ్డిపైన కేసులు తిరగ దోడటంలోని ఆంతర్యం ‘ఓటుకు కోట్ల’ కేసు గురించి చంద్రబాబుకి సంకేతం పంపడమేనని ఒక వాదన. ‘తెలం గాణలో నువ్వు వేలు పెడితే ఆంధ్రప్రదేశ్లో నేను కాలు పెడతా’ అంటూ ఇప్పటికే కేసీఆర్ చంద్రబాబుని హెచ్చ రించారంటూ రాజకీయవర్గాలలో చెప్పుకుంటున్నారు. కాంగ్రెస్ అధి ష్ఠానంలో కూడా రెండు రకాల అభిప్రాయాలు ఉన్నాయి. టీడీపీ ఎక్కువ సీట్లు అడిగితే ఇవ్వకూడదనీ, కాంగ్రెస్కి విజయావకాశాలు ఉన్న సీట్లను వదులు కోకూడదనీ మొన్న రాహుల్గాంధీ తెలంగాణ కాంగ్రెస్ నాయకులతో స్పష్టంగా చెప్పారు. ఒక వేళ టీడీపీ పొత్తుకు నిరాకరిస్తే కాంగ్రెస్కి నష్టం లేదనీ, టీఆర్ఎస్కు వెళ్ళ వలసిన నాయకులందరూ వెళ్ళిపోయారనీ, మిగిలినవారు కాంగ్రె‹ Üలో చేరి కాంగ్రెస్ ఎన్నికల చిహ్నంపైన పోటీ చేయడమే మేలు అనే అభిప్రాయంలో ఉన్నారనీ కొందరు తెలంగాణ కాంగ్రెస్ నేతలు రాహుల్తో చెప్పారు. తెలంగాణలో అస్తి త్వంకోసం, రెండు కళ్ళ సిద్ధాంతం కొనసాగించడంకోసం చంద్రబాబు తక్కువ స్థానాలతో సరిపెట్టుకుంటే కూట మిలో ఉండటానికి కాంగ్రెస్కి అభ్యంతరం ఉండదు. జాతీయ పార్టీ అయినప్పటికీ కాంగ్రెస్ బిహార్, ఉత్తర ప్రదేశ్, తమిళనాడు వంటి రాష్ట్రాలలో జూనియర్ భాగ స్వామిగా సర్దుకుపోతున్నది. తెలంగాణలో మిగిలిన ఇద్దరు టీడీపీ ఎంఎల్ఏలలో ఎల్బీనగర్ శాసనసభ్యుడు కృష్ణయ్య సొంత పార్టీ పెట్టుకుంటానంటున్నారు. సత్తుపల్లి ఎంఎల్ఏ సండ్రవెంకటవీరయ్య మాత్రమే మిగిలారు. ఆయన కూడా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రాబల్యంతో గెలిచారు. రక రకాల పనికిమాలిన ‘ఆపరేషన్లు’ నడిపిస్తూ అలవి కాని చోట అధికులమనడం అవివేకమని టీడీపీ అధినేత గుర్తిస్తే ఆయనకే మంచిది. -కె. రామచంద్రమూర్తి -
నీతిలేని రాజకీయం
త్రికాలమ్ వెంకయ్యనాయుడు అపారమైన అనుభవం కలిగిన జాతీయ నాయకుడు. తాను రాజకీయాలలో ఎన్నడూ రాజీపడలేదని శుక్రవారంనాడు హైదరాబాద్లో జరిగిన ఆత్మీయ సభలో సగర్వంగా ప్రకటించారు. లౌక్యం పక్కన పెట్టి పార్టీ ఫిరాయింపుల పరంపరను నిలిపివేయాలని చంద్రబాబునాయుడికీ, కేసీఆర్కీ గట్టిగా హితవు చెప్పగలిగితే వెంకయ్య నాయుడి స్థాయికి తగినట్టు ఉండేది. కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో వెంటనే స్పందించాలి. వెంకయ్యనాయుడు చొరవ తీసుకోవాలి. గమ్యం, మార్గం రెండూ ముఖ్యమేనన్నాడు మహాత్మాగాంధీ. మార్గం ఏదైనా గమ్యం చేరడం ప్రధానమని భావిస్తున్నారు పదవీ రాజకీయాలలో ఆరితేరిన ఈ తరం రాజకీయ నాయకులు. సుఖేందర్రెడ్డి, తదితర నల్లగొండ జిల్లా కాంగ్రెస్ నాయకులను తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)లో చేర్చుకుంటూ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్య మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) ఒకానొక రహస్యాన్ని వెల్లడిం చారు. 2014 ఎన్నికలలో తన పార్టీకి 119 స్థానాల అసెంబ్లీలో 63 స్థానాలతో మెజారిటీ వచ్చిన అనంతరం కూడా తనను పదవీ స్వీకారం చేయనీయకుండా అడ్డుకొని రాష్ట్రపతి పాలన విధించేలా చూసేందుకు కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ (టీడీపీ)లు కుట్ర చేశాయనీ, తనకు ఈ విషయం ఎంఐఎం నాయకుడు అస దుద్దీన్ ఒవైసీ సకాలంలో చెప్పి ఆదుకున్నారనీ చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోతుందంటూ ఆ రోజుల్లో పీసీసీ బాధ్యుడు భట్టి విక్రమార్క వ్యాఖ్యానించి నట్టు కూడా గుర్తు చేశారు. ఈ కుట్రను ఛేదించే క్రమంలో పార్టీని బలోపేతం చేయడానికి ఇతర పార్టీ శాసనసభ్యులను టీఆర్ఎస్లో చేర్చుకుంటున్నామంటూ కేసీఆర్ సమర్థించుకున్నారు. పొరుగున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్ర బాబునాయుడు సైతం యథాశక్తి ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నప్పటికీ చట్ట ఉల్లంఘనను సమర్థించుకునే ప్రయత్నం చేయలేదు. పార్టీ ఫిరాయింపులు కొత్తకాదు. ఇది టీడీపీ లేదా టీఆర్ఎస్లు కనిపెట్టిన కొత్త విద్య కాదు. ‘ఆయారాం, గయారాం’ సంస్కృతి 1960-70లో కాంగ్రెస్ హయాంలోనే వేళ్ళూనుకుంది. ఈ దుష్ట సంస్కృతిని అంతం చేయడానికి 1985లో రాజీవ్గాంధీ ప్రభుత్వం, 2003లో అటల్ బిహారీ వాజపేయి సర్కార్ చేసిన రాజ్యాంగ సవరణలు సరిపోవడం లేదు. 1985 నాటి 52వ రాజ్యాంగ సవరణ చట్టంలోని లోపాలను రాజకీయవాదులు యథేచ్ఛగా వినియోగించు కొని భ్రష్ట రాజకీయాలను అందలం ఎక్కించిన తర్వాత 2003లో 91వ రాజ్యాంగ సవరణ చట్టం వచ్చింది. ఇందులో ఉన్న ప్రధానమైన లోపాన్ని రాజకీయవాదులు పూర్తిగా వినియోగించుకుంటున్నారు. కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ సభ్యులను టీఆర్ఎస్లో చేర్చుకోవడాన్ని రాజకీయ పునరేకీకరణగా అభివర్ణిస్తూ, లోగడ 16 మంది టీఆర్ఎస్ శాసనసభ్యులలో 10 మందిని కాంగ్రెస్ పార్టీలోకి వైఎస్ రాజశేఖరరెడ్డి చేర్చుకున్నప్పుడు ఎందుకు మాట్లాడలేదని ప్రతిపక్ష నేత జానారెడ్డిని కేసీఆర్ ప్రశ్నించారు. నాడు వైఎస్ చేశారు కనుక, కాంగ్రెస్, టీడీపీలు కుట్ర చేశాయి కనుక ప్రతిపక్షాల నుంచి శాసనసభ్యులను పార్టీ ఫిరాయించేందుకు ప్రోత్సహిస్తే తప్పులేదని కేసీఆర్ అభిప్రాయం. దెబ్బకు దెబ్బ తీయడం, రాజకీయ ప్రతీకారం తీర్చుకోవడం, ప్రతిపక్షం కుట్రను ఛేదించడం కోసం ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని ఉల్లంఘిం చినా పర్వాలేదనే భావన. చట్టాలలోని లొసుగులను ఉపయోగించు కోని రాజకీయ నాయకులు ఈ రోజుల్లో ఎక్కడా కనిపించరు. ఆపద్ధర్మం చట్టసభలలో మెజారిటీ లేనప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి రాజకీయ పార్టీలు ప్రయత్నించకూడదు. కొన్ని పార్టీలు కలసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగితే మంచిదే. మెజారిటీ లేకపోయినా ప్రభుత్వం ఏర్పాటు చేసి ప్రభుత్వం వెలుపల ఉండే రాజకీయ పక్షాల మద్దతు తీసుకున్న సందర్భాలూ ఉన్నాయి. వీపీ సింగ్, చంద్రశేఖర్, దేవెగౌడ, ఐకె గుజ్రాల్ ప్రధానులుగా ఒక్కొక్కరు సంవత్సరం కూడా పూర్తి చేయకపోవడానికి కారణం సొంతబలం లేకపోవడం, అరువుబలంపైన ఆధారపడటం. ఇటువంటి పరిస్థితులలో ఆపద్ధ ర్మంగా చట్టాన్ని ఉల్లంఘించిన సందర్భం కూడా ఉంది. 1991లో రాజీవ్గాంధీ హత్య తర్వాత పీవీ నరసింహారావు ప్రధానమంత్రిగా కాంగ్రెస్ పార్టీ మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం పెట్టిన ప్రతిసారీ పీవీ ఫిరాయింపులను ప్రోత్సహించారు. మైనారిటీ ప్రభుత్వాన్ని అయిదేళ్ళపాటూ నడిపించాలనే సంకల్పంతో పీవీ టీడీపీ పార్లమెంటరీ పార్టీని చీల్చారు. జార్ఖండ్ ముక్తి మోర్చా సభ్యులనూ సుముఖులను చేసుకున్నారు. నీతిబాహ్యమైన రాజకీయం ఎందుకు చేశారని ప్రశ్నించినప్పుడు దేశంలో ఆర్థిక సంస్కరణలు ప్రవేశ పెట్టాలంటే రాజకీయ సుస్థిరత అత్యవసరమంటూ పీవీ సమర్థించుకున్నారు. టీఆర్ఎస్ శాసనభ్యులను ఎందుకు కాంగ్రెస్లో చేర్చుకు న్నారని వైఎస్ను అడిగితే తెలంగాణ రాష్ట్ర సాధనే ఎజెండాగా ఉన్న టీఆర్ఎస్ను బలహీన పరచడానికి ఆ పని చేశానని చెప్పారు. అదే టీఆర్ఎస్తో అధిష్టానం ఒత్తిడి మేరకు 2004లో పొత్తు పెట్టుకున్న వైఎస్ 2009లో అధిష్టానం ఎంత గట్టిగా చెప్పినా అంగీకరించకుండా టీఆర్ఎస్తో పొత్తు లేకుండా ఒంటరిగా పోటీ చేశారు. అది రిస్కు అని తెలిసినా సమైక్యవాదిగా టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోకూడదని వైఎస్ గట్టిగా భావించారు. అప్పుడు చంద్రబాబునాయుడు నాయకత్వంలోని టీడీపీ టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుంది. పీవీ, వైఎస్ల నిర్ణయాలు సరైనవని సమర్థించడం ఉద్దేశం కాదు. వారు చేసింది రాజ్యాంగ ఉల్లంఘనే. వారు అనుసరించిన మార్గం అక్రమమైనదే. కానీ పార్టీ ఫిరాయిం పులను ప్రోత్సహించడానికి వారికి మంచో చెడో ఒక లక్ష్యం అంటూ ఉంది. అటువంటి లక్ష్యం ఈ రోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ముమ్మరమైన ఫిరాయింపుల వెనుక కనిపించదు. ఎన్నికలలో మెజారిటీ సాధించి ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకున్నవారికి ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయాలన్న తాపత్రయం ఎందుకు? ప్రతిపక్షం లేకపోవడం అధికారపక్షానికీ నష్టదాయకమే. లాభదా యకం కానేకాదు. విమర్శలను స్వాగతించినప్పుడే విధానాలలోనూ, ఆచరణ లోనూ దొర్లుతున్న పొరపాట్లు తెలుస్తాయి. దిద్దుబాటుకు అవకాశం ఉంటుంది. స్వపక్షంలో భజనపరులు అధికం. మంత్రివర్గ సహచరులు డూడూ బసవన్నలే. మీడియా సంస్థలది వీరవిధేయత. ప్రతిపక్షాన్ని శత్రుపక్షంగా భావిస్తున్నారు. ఇక నిజానిజాలు తెలుసుకునే అవకాశం పాలకులకు ఎక్కడ? ఫిరాయింపుల విషయంలో నైతికత ఒక అంశమైతే రాజ్యాంగ స్ఫూర్తి మరో అంశం. చంద్రబాబునాయుడు ఫిరాయింపుల వంటి కార్యక్రమం 1995లో ఎన్టీఆర్ను గద్దె దించినప్పుడే ప్రారంభించారు. రాజ్యసభ ఎన్నికలలో ప్రతి పక్షాన్ని దెబ్బతీయాలనో, మరో ఉద్దేశంతోనో వందల కోట్లు ఖర్చు చేసి ఇరవై మంది వైఎస్ఆర్సీపీ ఎంఎల్ఏలకు కండువా కప్పారు. నియోజకవర్గాలలో పాత నాయకులూ, కొత్త నాయకులూ కొట్టుకుంటున్నారు. ఫిరాయింపుల వల్ల టీడీపీ సాధించింది ఏమిటో అర్థంకాదు. ప్రతిపక్ష సభ్యులను కొంతమందిని పార్టీకి దూరం చేసినంత మాత్రాన ప్రజలలో వ్యతిరేకత సమసిపోతుందా? ఎన్నికల వాగ్దానాలు అమలు చేయకుండా ప్రతిపక్ష ఎంఎల్ఏలను ఆకర్షించేందుకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం ప్రజలకు ఎటువంటి సంకేతాలు పంపుతుంది? 175 స్థానాల అసెంబ్లీలో వందకుపైగా సీట్లతో మెజారిటీ ఉన్నప్పుడు పరిపాలనపైన దృష్టిపెట్టకుండా, ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను పరిష్కరించేం దుకు కృషి చేయకుండా, నిరర్థకమైన ఫిరాయింపుల వ్యవహారం నెత్తికెత్తుకోవ డాన్ని ప్రజలు ఎట్లా అర్థం చేసుకుంటారు? ఫిరాయించిన ఎంఎల్ఏల చేత రాజీనామా చేయించి టీడీపీ టికెట్టుపైన గెలిపించి ఉంటే రాజ్యాంగాన్ని గౌరవిం చినట్టు అయ్యేది. ప్రజల ఆమోదం పొందినట్టయ్యేది. ఆ దమ్ము ఫిరాయించిన వారికీ లేదు. వారిని ప్రోత్సహించినవారికీ లేదు. చారిత్రక స్పృహ తెలంగాణ రాష్ట్ర సాధనకు పద్నాలుగు సంవత్సరాలు అలుపెరుగని పోరాటం అహింసాత్మకంగా సాగించిన సారథిగా, కొత్త రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్కి చరిత్రలో ఇప్పటికే ప్రత్యేక స్థానం ఉంది. పార్టీ ఫిరాయింపులకు తెగబడకుండా సుస్థిర పాలన అందిస్తూ, ప్రతిపక్షాలను కలుపుకొని సాగుతూ బంగారు తెలంగాణ స్వప్న సాకారానికి కృషి చేస్తే ఆయన రాజనీతిజ్ఞుడుగా ఎదిగి, ఆదర్శ ముఖ్యమంత్రిగా నిలిచే అవకాశం ఉండేది. ఎంఎల్ఏల సంఖ్య పెరిగినంత మాత్రాన టీఆర్ఎస్కు వచ్చిన ప్రయోజనం ఏమీ లేదు. చట్టంలోని లొసుగులను ఉపయోగించుకోవడంలో ఎవ్వరూ వెనకాడరు కనుక, చట్టాలలోని లోపాలను సవరించుకోవాలి. రాజ్యాంగం పదో షెడ్యూ లులో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఏడవ పేరాలో పార్లమెంటు, శాసన సభ, శాసనమండలి నిర్ణయాలలో న్యాయస్థానం జోక్యం చేసుకోకూడదంటూ స్పష్టంగా ఉన్నది. చట్టసభల సభ్యులు తమ అధికారాలను న్యాయస్థానాలకు అప్పగించడం ఇష్టం లేనికారణంగా పెట్టిన నిబంధన ఇది. వాస్తవానికి స్పీకర్ది రాజ్యాంగపరమైన పదవి (constitutional office) కాగా, ఇప్పుడు పూర్తిగా రాజకీయ పదవి (political office)గా మారింది. అధినేతల అభీష్టానికి భిన్నంగా సభాపతులు వ్యవహరించే రోజులు ఎప్పుడో పోయాయి. అందుకే స్పీకర్ పదవిలో ఉన్నవారు మంత్రి పదవికోసం అంగలార్చడం. రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడాలంటే పార్టీ ఫిరాయించిన సభ్యులపై అనర్హత వేటు వేసే విషయంలో స్పీకర్ నిర్ణయాన్ని సమీక్షించే అధికారం న్యాయవ్యవస్థకు ఉన్నదంటూ సుప్రీం కోర్టు రాజ్యాంగపీఠం 2007లో రాజేంద్రసింగ్ రాణా వర్సెస్ స్వామిప్రసాద్ మౌర్య కేసులో స్పష్టం చేసింది. స్పీకర్ నిర్ణయం తీసుకుంటే కదా న్యాయవ్యవస్థ సమీక్షించేది. స్పీకర్ నిర్ణయం తీసుకోకుండా పాలకపక్షానికి సానుకూలంగా వ్యవహరిస్తే న్యాయస్థానాలు చేయగలిగింది ఏమీ లేదు. అందుక నే స్పీకర్లు నిర్ణయం తీసుకోవడం లేదు. ప్రలోభాలకు ఆశపడి ఎవరు పార్టీ ఫిరాయించినా అది రాజ్యాంగ ఉల్లం ఘనే. కారణాలు ఏమైనా అది ప్రజాస్వామ్య వ్యవస్థపైన ఖడ్గప్రహారమే. ప్రమా దకరమైన ఈ ధోరణిని అరికట్టాలంటే పార్టీ మారిన ఎంపీలపైనా, ఎంఎల్ఏ లపైనా, ఎంఎల్సీలపైనా అనర్హత వేటు వేసే అధికారాన్ని స్పీకర్ నుంచి ఎన్ని కల సంఘానికి బదిలీ చేయాలి. ఎన్నికల సంఘం సైతం పారదర్శకంగా, కాలవ్యవధికి లోబడి వ్యవహరించే విధంగా విధివిధానాలు రూపొందించాలి. వెంకయ్యకో విన్నపం వెంకయ్యనాయుడు అపారమైన అనుభవం కలిగిన జాతీయ నాయకుడు. తాను రాజకీయాలలో ఎన్నడూ రాజీపడలేదని శుక్రవారంనాడు హైదరాబాద్లో జరిగిన ఆత్మీయ సభలో సగర్వంగా ప్రకటించారు. లౌక్యం పక్కన పెట్టి పార్టీ ఫిరాయింపుల పరంపరను నిలిపివేయాలని చంద్రబాబునాయుడికీ, కేసీఆర్కీ గట్టిగా హితవు చెప్పగలిగితే వెంకయ్యనాయుడి స్థాయికి తగినట్టు ఉండేది. పార్టీ ఫిరాయించిన క్షణంలోనే పదవి పోవాలంటూ ఆయన చెప్పిన మాటలను చట్టబ ద్ధం చేస్తూ పార్లమెంటు వ్యవహారాల మంత్రి హోదాలో మరో రాజ్యాంగ సవరణ తెచ్చేందుకు నడుం బిగిస్తే ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రాణదానం చేసిన వారవుతారు. పదవులకోసం, డబ్బు కోసం, కాంట్రాక్టుల కోసం పార్టీ ఫిరా యించే ధోరణి యథేచ్ఛగా కొనసాగుతున్న కారణంగా ప్రతిపక్షాల మనుగడ ప్రశ్నార్థకం అవుతోంది. ప్రజాస్వామ్యం అపహాస్యం పాలు అవుతోంది. కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో వెంటనే స్పందించాలి. వెంకయ్య నాయుడు చొరవ తీసుకోవాలి. - కె.రామచంద్రమూర్తి