breaking news
Jyothi Surekhha
-
జ్యోతి సురేఖ డబుల్ ధమాకా
ఎస్–హెర్టోజెన్బాష్ (నెదర్లాండ్స్): కొన్నేళ్లుగా అంతర్జాతీయస్థాయిలో నిలకడగా రాణిస్తున్న ఆంధ్రప్రదేశ్ ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖ ప్రపంచ చాంపియన్షిప్లోనూ అదరగొట్టింది. విజయవాడకు చెందిన 22 ఏళ్ల జ్యోతి సురేఖ ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్లో రెండు కాంస్య పతకాలను సొంతం చేసుకుంది. తొలుత ముస్కాన్ కిరార్, రాజ్ కౌర్లతో కలిసి జ్యోతి సురేఖ మహిళల కాంపౌండ్ టీమ్ విభాగంలో కాంస్యం దక్కించుకోగా... ఆ తర్వాత వ్యక్తిగత విభాగంలో మరో కాంస్యం గెల్చుకుంది. కాంస్య పతక పోరులో జ్యోతి సురేఖ, ముస్కాన్, రాజ్ కౌర్ బృందం 229–226తో యెసిమ్ బోస్టాన్, గిజెమ్ ఎల్మాగాక్లి, ఇపెక్ టామ్రుక్లతో కూడిన టర్కీ జట్టుపై గెలిచింది. భారత జట్టు విజయంలో జ్యోతి సురేఖ కీలకపాత్ర పోషించింది. ఆమె సంధించిన ఎనిమిది బాణాల్లో ఆరు ‘10’ షాట్లు ఉండటం విశేషం. యెసిమ్ బోస్టాన్ (టర్కీ)తో జరిగిన వ్యక్తిగత విభాగం కాంస్య పతక మ్యాచ్లో జ్యోతి సురేఖ ‘షూట్ ఆఫ్’లో పైచేయి సాధించింది. నిర్ణీత 15 బాణాల తర్వాత ఇద్దరూ 145–145 పాయింట్లతో సమంగా నిలిచారు. విజేతను నిర్ణయించేందుకు ఇద్దరికీ ఒక్కో బాణం అవకాశం ఇచ్చారు. ఇందులో జ్యోతి సురేఖ గురికి 10 పాయింట్లు రాగా... యెసిమ్ బాణానికి తొమ్మి ది పాయింట్లే వచ్చాయి. నేడు పురుషుల రికర్వ్ టీమ్ విభాగంలో తరుణ్దీప్ రాయ్, రమేశ్ ప్రవీణ్ జాదవ్, అతాను దాస్లతో కూడిన భారత జట్టు స్వర్ణం కోసం తలపడనుంది. చైనా జట్టుతో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. 24: తన ఎనిమిదేళ్ల కెరీర్లో జ్యోతి సురేఖ సాధించిన అంతర్జాతీయ పతకాల సంఖ్య. ఇందులో మూడు స్వర్ణాలు, 11 రజతాలు, 10 కాంస్యాలు ఉన్నాయి. ‘రెండేళ్ల క్రితం టీమ్ విభాగంలో మేం రజత పతకం సాధించాం. ఈసారి కాంస్యం దక్కినా ఎలాంటి నిరాశ లేదు. ఎందుకంటే వరుసగా రెండో ప్రపంచ చాంపియన్ షిప్లోనూ టాప్–3లో నిలిచాం. ఈ పతకం మా అందరికీ ఎంతో ప్రత్యేకం. ఇక వ్యక్తిగత విభాగంలో నాకిది తొలి ప్రపంచ చాంపియన్షిప్ పతకం. ఒకదశలో కొంచెం నెర్వస్గా ఫీలయ్యాను. కానీ నా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలని ప్రయత్నించాను. నా ప్రత్యర్థి నుంచి కూడా గట్టిపోటీ ఎదురుకావడంతో కాస్త ఒత్తిడికి లోనయ్యాను. షూట్ ఆఫ్లో మాత్రం కంగారు పడకుండా గురి చూసి కొట్టాను. ’’ –జ్యోతి సురేఖ -
సురేఖకు స్వర్ణం
సాక్షి, హైదరాబాద్: జాతీయ సీనియర్ కాంపౌండ్ ఆర్చరీ చాంపియన్షిప్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన అమ్మాయి వెన్నెం జ్యోతి సురేఖ మెరిసింది. పుణేలో గురువారం జరిగిన ఈ టోర్నీలో వ్యక్తిగత ఒలింపిక్ రౌండ్లో స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. ఫైనల్లో సురేఖ 145–143తో త్రిషా దేబ్ (ఆర్ఎస్పీబీ)పై గెలుపొంది విజేతగా నిలిచింది. గత ఆరేళ్లలో జాతీయ చాంపియన్గా నిలవడం సురేఖకు ఇది నాలుగోసారి. ఉత్తరప్రదేశ్కు చెందిన సాక్షి వేద్వాన్ కాంస్యాన్ని సాధించింది. మరోవైపు ర్యాంకింగ్ రౌండ్లో నిర్ణీత 720 పాయింట్లకు గానూ, 701 పాయింట్లు సాధించి సురేఖ రజతాన్ని గెలుచుకుంది. -
కాంస్య పతక పోరుకు జ్యోతి సురేఖ
హైదరాబాద్: చైనాలోని షాంఘైలో జరుగుతోన్న ప్రపంచకప్ స్టేజ్–1 ఆర్చరీ పోటీల్లో భారత బృందం రాణించింది. మిక్స్డ్ విభాగంలో తెలుగమ్మాయి జ్యోతి సురేఖ, అభిషేక్ వర్మ జోడీ కాంస్య పతక పోరుకు అర్హత సాధించింది. బుధవారం జరిగిన సెమీఫైనల్లో భారత జోడీ 152–158తో కొరియా చేతిలో పరాజయం పాలైంది. -
ఆర్చరీ ప్రపంచకప్కు జ్యోతి సురేఖ
హైదరాబాద్: విజయవాడకు చెందిన అంతర్జాతీయ ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖ మేలో జరగనున్న ఆర్చరీ ప్రపంచకప్ పోటీల్లో పాల్గొనే భారత జట్టుకు ఎంపికైంది. ఢిల్లీలోని యమునా స్పోర్ట్స్ కాంప్లెక్స్లో జరిగిన కాంపౌండ్ విభాగం సెలెక్షన్స్లో జ్యోతి 21 పాయింట్లకుగాను 16.5 పాయింట్లు స్కోర్ చేసి భారత జట్టులో చోటు దక్కించుకుంది. చైనాలో మే 16 నుంచి 21 వరకు జరిగే ప్రపంచకప్ స్టేజ్–1 పోటీలతో పాటు, జూన్ 6 నుంచి 11వరకు టర్కీలో జరిగే ప్రపంచకప్ స్టేజ్–2 పోటీల్లో జ్యోతి సురేఖ భారత్కు ప్రాతినిధ్యం వహిస్తుంది.