-
జువనైల్ హోం నుంచి యువకుల పరారీ
సాక్షి దినపత్రిక వాహనం డ్రై వర్పై దౌర్జన్యం పారిపోతూ పట్టుబడిన వైనం మంగళగిరి : చిన్నతనంలోనే పలు నేరాలు చేసిన యువకులు జువనైల్ హోమ్ నుంచి తప్పించుకుని మళ్లీ నేరం చేసి పారిపోతూ పోలీసులకు పట్టుబడిన ఘటన ఇది. గుంటూరు జిల్లా మంగళగిరి రూరల్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు గుంటూరు జువనైల్ హోమ్లో శిక్ష అనుభవిస్తున్న ఐదుగురు యువకులు మంగళవారం అర్ధరాత్రి హోం తాళాలు పగులకొట్టి తప్పించుకున్నారు. వారు గుంటూరులోనే ఒక ద్విచక్రవాహనాన్ని దొంగలించి దానిపై విజయవాడ బయలుదేరారు. అర్ధరాత్రి 3 గంటల సమయంలో వినుకొండ వెళుతున్న సాక్షి పత్రిక ఆటోను చినకాకాని ఎన్ఆర్ఐ ఆస్పత్రి వద్ద నిలిపి ఆటో డ్రై వర్పై దాడి చేసి అతడి వద్ద ఉన్న రూ. వెయ్యి నగదు, సెల్ఫోన్ తీసుకున్నా. ఫోన్లో సిమ్ తీసిపడేసి మళ్లీ గుంటూరు వైపు వెళ్లారు.ఇంతలో ఆటో డ్రై వర్కు తెలిసిన వ్యక్తి అటుగా రావడంతో ఇద్దరు కలిసి వారిని వెంబడించారు. పోలీసులు అభి భావించిన యువకులు గుంటూరు వెళ్లి ద్విచక్రవాహనం అక్కడ వదిలేశారు. మళ్లీ ఆటోలో విజయవాడ బయలుదేరారు. హోం నుంచి తప్పించుకున్న విషయాన్ని పోలీసులు సెట్ ద్వారా అన్ని పోలీస్స్టేషన్లకు తెలపడంతో అప్రమత్తమైన తాడేపల్లి పోలీసులు వారధి వద్ద ఆటోను ఆపగా ఐదుగురు యువకుల ప్రవర్తన అనుమానస్పదంగా ఉండడంతో స్టేషన్కు తరలించారు. ఆటోడ్రై వర్ తన్నీరు శ్రీనివాస్ మంగళగిరి రూరల్ స్టేషన్కు చేరుకుని ఫిర్యాదు చేయడంతో ఆటోడ్రై వర్పై దాడి చేసింది తాడేపల్లి పోలీసుల అదుపులో ఉన్న యువకులేనని గుర్తించి వారిని మంగళగిరి స్టేషన్కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
జువైనల్ హోమ్లో బాలుడి అనుమానాస్పద మృతి
కడప: కడప జువైనల్ హోమ్లో విషాదం చోటు చేసుకుంది. ఓ బాలుడు అనుమానాస్పదస్ధితిలో మృతి చెందాడు. షేక్ ముస్తఫా(16) అనే బాలుడు హోమ్లో ఉన్న ఓ బాత్రూం నిర్జీవ స్థితిలో పడి ఉండటం గమనించిన స్థానికులు ఈ విషయాన్ని పోలీసులకు తెలియ జేశారు. అధికారులు పరిశీలించి చూడగా బాలుడి అప్పటికే మృతిచెందాడు. షేక్ ముస్తఫా స్వస్థలం ప్రొద్దుటూరు. నాలుగు నెలల క్రితం బంధువుల ఇంట్లో దొంగతనం చేయడంతో జువైనల్ హోమ్కు తరలించారు. -
తల్లి పనిచేసే ఇంట్లో చోరీ..
తల్లి పని చేసే ఇంట్లో దొంగతనానికి పాల్పడిన ఓ మైనర్ బాలికను కంచన్బాగ్ పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. ఆమె వద్ద నుంచి 26 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. కంచన్బాగ్ పోలీస్స్టేషన్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఇన్స్పెక్టర్ ఎన్.శంకర్ కేసు వివరాలను వెల్లడించారు. సంతోష్నగర్ యాదగిరినగర్ రోడ్డు నంబర్ 12 ప్రాంతానికి చెందిన విశ్రాంత ఉద్యోగులు రాజు, దయావతిలు దంపతులు. రాజు ఇంట్లో చంపాపేట్ చిలకల బస్తీ ప్రాంతానికి చెందిన ఓ మహిళ పని చేస్తోంది. దయావతి మూడు రోజుల క్రితం బీహెచ్ఈఎల్లోని బంధువుల ఇంటికి వెళ్లి ఆదివారం వచ్చి చూడగా అల్మారాలో ఉన్న 30 తులాల బంగారు ఆభరణాలు కనిపించకపోవడంతో కంచన్బాగ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పని మనిషితో పాటు ఆమె కూతురు(15)ని అదుపులోకి విచారించగా దొంగతనం విషయం బయట పడింది. దయావతి భర్త పని మనిషిని నమ్మి బయటికి వెళ్లడం....తల్లి ఇంటి పనిలో నిమగ్నమై ఉండడాన్ని గమనించిన సదరు బాలిక అల్మారాలో ఉన్న బంగారు నగలను తస్కరించింది. దర్యాప్తులో బాలికే దొంగతనానికి పాల్పడిందని తేలడంతో బాలికను జూవైనల్లో హోమ్కు తరలించారు. -
జువైనల్హోం నుంచి బాలుడు పరార్
సైదాబాద్(హైదరాబాద్): రాష్ట్ర బాలుర సంస్కరణల, సంక్షేమశాఖ ఆధ్వర్యంలో సైదాబాద్లో కొనసాగుతున్న బాలుర పరిశీలన గృహం నుంచి ఓ బాలుడు తప్పించుకున్నాడు. ఈ సంఘటన గత ఆదివారం జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాలివీ.. మహబూబ్నగర్ జిల్లా వనపర్తి మండలం బూర్లపాడుకు చెందిన ఓ బాలుడు(16) ఘర్షణలో పాల్గొన్నందుకు గాను అక్కడి పోలీసులు సైదాబాద్ జువైనల్హోంకు అప్పగించారు. కాగా, గత నెల 30న పరిశీలన గృహం బాలురు భోజనం చేయడానికి గాను ఆవరణలోకి వచ్చారు. ఆ సమయంలో అదను చూసుకుని సదరు బాలుడు అక్కడి గోడ దూకి పరారయ్యాడు. దీనిపై పరిశీలన గృహం సూపరింటెండెంట్ రామచంద్రమూర్తి సైదాబాద్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనపై రాష్ట్ర బాలుర సంస్కరణల, సంక్షేమశాఖ విచారణ చేపట్టింది. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకునే పనిలో పడ్డారు. -
అవును..మా అబ్బాయే
ఏడేళ్ల క్రితం తప్పిపోయిన కుమారుడిని గుర్తించిన తల్లిదండ్రులు బహదూర్పురా: ఏడేళ్ల క్రితం కన్పించకుండా పోయిన ఆంజనేయులు తమ కుమారుడేనంటూ అంబర్పేటకు చెందిన శివ, అంజమ్మ దంపతులు మంగళవారం చార్మినార్ పోలీసులను సంప్రదించారు. పోలీసుల కథనం ప్రకారం... 2003లో చార్మినార్ వద్ద తప్పిపోయిన ఆంజనేయులు అనే బాలుడు రెలైక్కి చెన్నై చేరుకొన్నాడు. అక్కడ అనుకోని విధంగా ఓ కేసులో ఇరుక్కొని జువైనల్ హోంలో మూడేళ్లు శిక్ష అనుభవించాడు. ఆత ర్వాత బయటకు వచ్చాక..ఎటు వెళ్లాలో తెలియక తనకు ఎవరూ లేరని చెప్పడంతో అధికారులు జువైనల్ హోంలోనే మరో నాలుగేళ్లు ఉంచారు. శిక్ష పూర్తయినా నాలుగేళ్లవరకు తల్లిదండ్రులు ఎవరూ రాకపోవడంతో స్పందించిన జడ్జి స్థానికంగా ఉన్న స్కోప్ ఇండియా స్వచ్ఛంద సంస్థ డిప్యూటీ డెరైక్టర్ సత్తిబాబుకు ఆ బాలుడి కుటుంబ వివరాలు తెలుసుకొని అప్పగించాలని పురమాయించారు. ఈ నేపథ్యంలో సదరు సంస్థ డిప్యూటీ డెరైక్టర్ స్పందించారు. బాలుడు ఆంజనేయులు చెప్పిన ఆనవాళ్ల ప్రకారం హైదరాబాద్లోని చార్మినార్ ప్రాంతానికి చేరుకొని సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆతర్వాత ఆయన చుట్టుపక్క ప్రాంతాల్లో ఆరా తీసినా ఏమీ తెలియకపోవడంతో ఆంజనేయులుని తీసుకొని చెన్నైకి వెళ్లి పోయాడు. ఈ క్రమంలో తల్లిదండ్రుల కోసం తపిస్తున్న బాలుడి ఫొటో పత్రికల్లో ప్రచురితం కావడంతో దాన్ని చూసిన శివ, అంజమ్మ దంపతులు మంగళవారం చార్మినార్ పోలీసులను సంప్రదించారు. 2003లో తమ కుమారుడు ఆంజనేయులు తప్పిపోయినట్లు అప్పట్లో చార్మినార్ పోలీసు స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదు (ఎఫ్ఐఆర్) కాపీని చూపడంతో పాటు బాలుడి చేతిపై ‘శ్రీ’ పచ్చబొట్టు గుర్తు ఉన్నట్లు చెప్పారు. ఆనవాళ్లన్నీ సరిగ్గా సరిపోవడంతో నిర్థారించుకొన్న పోలీసులు విషయాన్ని చెన్నైలోని స్కోప్ ఇండియా స్వచ్ఛంద సంస్థకు సమాచారం అందించారు. దీంతో ఆ సంస్థ డిప్యూటీ డెరైక్టర్ సత్తిబాబు ఈ నెల 11న ఆంజేయులును తీసుకొని హైదరాబాద్ వస్తున్నటు తెలిపారని చార్మినార్ ఇన్స్పెక్టర్ యాదగిరి వెల్లడించారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement