breaking news
Just born baby
-
ప్లీజ్ పసిపిల్లలు ఏడవగానే అలా చేయొద్దు..!
ఎక్కువ మంది పేరెంట్స్ శిశువులు ఏడువగానే వెంటనే వారిని కంట్రోల్ చేయడానికి ప్యాసిఫైయర్ నోట్లో పెట్టేస్తుంటారు. దీంతో వెంటనే శిశువులు ఏడుపు మానేస్తారు. ఇది కొన్ని సందర్భాల్లో శిశువుకి, తల్లికి ఉపశమనం కలిగించినప్పటికీ.. అదే పనిగా ఉపయోగించడం మాత్రం అంతమంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు. ప్యాసిఫైయర్ నిత్యం సకింగ్ చేయడం వల్ల పిల్లల్లో దంతాల పెరుగుదలపై ప్రభావం పడుతుంది. పసివయసులో ఉపయోగిస్తే పెద్దగా సమస్య ఉండకపోయినా, 18 నెలల వయస్సు దాటిన తర్వాత కూడా వాడితే పళ్ల అమరిక దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. ప్యాసిఫైయర్ను ఎక్కువగా ఉపయోగిస్తే చెవి ఇన్ఫెక్షన్లతోపాటు సకింగ్ వల్ల చెవి సంబంధిత నాళాలపై ఒత్తిడి పడుతుంది. రాత్రి వేళల్లో ప్యాసిఫైయర్ ఊడిపోగానే పిల్లలు ఏడుస్తుంటారు. ఇది పిల్లలతో పాటు తల్లిదండ్రుల నిద్రను కూడా డిస్టర్బ్ చేస్తుంది. తప్పనిసరి పరిస్థితుల్లో వాడాల్సివచ్చినపుడు ఎప్పుడూ సింగిల్ పీస్వే ఎంచుకోవాలి. వాటిపై తేనె లేదా తియ్యటి పదార్థాలను రాయకూడదు. అలాగే వీటిని క్రమం తప్పకుండా స్టెరిలైజ్ చేస్తుండాలి. పగుళ్లు వస్తే వెంటనే మార్చేయాలి.ఇది ఒక ఆప్షనే కానీ తప్పనిసరి అవసరం కాదు. తల్లి పాలు ఇవ్వడం బాగా అలవాటైన తర్వాత అవసరమైతేనే ఉపయోగించాలి. పిల్లలు దీనిని సకింగ్ చేయడానికి ఇష్టపడకపోతే బలవంతంగా అలవాటు చేయడానికి ప్రయత్నించొద్దు. 12 నెలల వయస్సు దాటిన తర్వాత దీని వాడకాన్ని క్రమంగా తగ్గించడం శ్రేయస్కరం. (చదవండి: అధిక ప్రోటీన్ ఆహారంతో జస్ట్ 60 రోజుల్లో 22 కేజీలు..! సహాయపడిన డైట్ ఇదే..) -
Viral Video: ఇలా చేస్తారా..? పసి బిడ్డ ప్రాణాలతో చెలగాటం..!
-
కంగారు కేర్ గురించి విన్నారా..? తల్లులు తప్పక తెలుసుకోవాల్సింది..!
కంగారు తన పిల్లలను ఎలా సంరక్షిస్తుందో మనకు తెలుసు. అది తన శరీరంతో అతక్కునేలా బిడ్డను ఉంచుకుంటుంది. ఎక్కడకు వెళ్లినా వెన్నంటే బిడ్డను ఉంచుకుంటూ..అనుక్షణం రక్షించుకుంటుంది. ఇక్కడ తల్లులు నవజాత శిశువులను అలాగే సంరక్షించుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. ఇది తల్లి బిడ్డల అనుబంధానికి ఎంతగానో ఉపయోగపడుతుందని చెబుతున్నారు. అదీగాక సోషల్ మీడియాలో ఇది ఎక్కువగా ట్రెండ్ అవుతోంది. తల్లి బిడ్డల అనుబంధానికి కంగారు మదర్ కేర్ ఏ విధంగా ఉపయోగపడుతుందో సవివరంగా చూద్దాం..!.అప్పుడే పుట్టిన శిశువు తల్లి పొత్తిళ్లలోని వెచ్చదనానికి హాయిగా నిద్రపోతుంది. అదీగాక ఈ ఉష్ణోగ్రత బిడ్డను పలు వ్యాధుల బారినపడకుండా ఉండేలా చేస్తుందని చెబుతున్నారు నిపుణులు. ఇక్కడ కంగారు తన పిల్లలను తన పొట్ట మాదిరి సంచిలో చక్కగా ఉంచుకుని సంరక్షించుకుంటుంది. ఈ కేరింగ్ తక్కువ బరువుతో పుట్టే శిశువులకు ఆక్సిజన్ స్థాయిలను మెరుగుపరుస్తుంది. ఆహారం తీసుకునేలా చేస్తుంది. శిశువు పెరుగుదలకి, అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ప్రీమెచ్యూర్ బేబీలో ఈ కంగారు మదర్ కేరింగ్ విధానం పుట్టిన మొదటి ఆరు గంటల్లోనే కార్డియోస్పిరేటరీ సిస్టమ్లను స్థిరీకరిస్తుందని పరిశోధనలో తేలింది. అంతేగాదు ప్రపంచ ఆరోగ్య సంస్థ పుట్టిన వెంటనే కంగారు మదర్ కేర్(కేఎంసీ) ప్రారంభించడం వలన మరణాల రేటును తగ్గించవచ్చని పేర్కొంది. ఈ విధానాన్ని తొలిసారిగా అమెరికాలో బొగోటా వైద్యులు ప్రారంభించారు. ఇంక్యుబేటర్ కొరత, ఇన్ఫెక్షన్ల సమస్యకు పరిష్కారంగా ఈ విధానాన్ని తీసుకొచ్చారు వైద్యులు. ఈ కేరింగ్ల వల్ల కలిగే సత్ఫలితాలను చూసి అమ్మలు కచ్చితంగా ఈ విధానాన్ని పాటించేలా చేస్తున్నారు వైద్యలు. అంతేగాదు కొన్ని దేశాల్లో ఈ విధానాన్ని రోజువారీగా ఒక గంట పాటు చేయగా, మిగతా దేశాల్లో మాత్రం నిరంత సంరక్షణ చర్యగా ఈ విధానాన్ని అములు చేస్తారట. (చదవండి: టీచర్ కాస్త రేసర్గా..ఏకంగా నేషనల్ కారు రేసింగ్ ఛాంపియన్షిప్..!) -
‘పాప’పు లోకాన్ని విడిచి వెళ్లింది
మర్పల్లి: తనను కని చెత్తబుట్టలో పారేసిన ఈ పాడు లోకాన్ని చూడకుండానే ఓ పసికందు మృతిచెందింది. వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం పంచలింగాలలో అప్పుడే పుట్టిన పసికందును గుర్తు తెలియని వారు ముళ్లపొదల్లో పడేసిన సంఘటన విదితమే. ఆ పసికందును ఓ కుక్క ఎత్తుకుపోతుండగా గుర్తించిన ఓ రైతు ఆ కుక్కను తరిమివేసి పాపను తీసుకున్నాడు. వెంటనే పోలీసుల సహాయంతో హైదరాబాద్లోని నిలోఫర్ ఆస్పత్రికి తరలించారు. మూడు రోజులుగా చికిత్స పొందుతున్న ఆ పాప ఆదివారం మృతిచెందింది. మర్పల్లి ఎస్ఐ సతీశ్కుమార్ కేసు నమోదు చేసుకుని పంచనామా చేశారు. మృతదేహాన్ని హైదరాబాద్లోని మహిళ, శిశు సంక్షేమ శాఖ అధికారులకు అప్పగించారు. -
రోడ్డు పక్కన పసికందు లభ్యం
టంగుటూరు (ప్రకాశం జిల్లా) : ప్రకాశం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. అప్పుడే పుట్టిన పసికందును గుర్తుతెలియని వ్యక్తులు రోడ్డు పక్కన వదిలేసి వెళ్లారు. ఇది గుర్తించిన స్థానికులు శిశువును చేరదీసి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని శిశువును వైద్య చికిత్సల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. -
వాగులో పసికందు
-
వాగులో పసికందు
కందుకూరు అర్బన్ (ప్రకాశం) : అప్పుడే పుట్టిన పసికందును గుర్తుతెలియని వ్యక్తులు వాగులో పడేసి వెళ్లారు. రోడ్డు మీద వెళ్తున్నవారికి పాప ఏడుపు వినిపించడంతో.. వాళ్లు పాపను గుర్తించి ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటన ప్రకాశం జిల్లా కందుకూరు సమీపంలోని ఎర్రవాగు వద్ద ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. కాగా.. ఆస్పత్రి వర్గాలు మాత్రం శనివారం రాత్రి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన దంపతులే ఈ పని చేసి ఉంటారని అనుమానిస్తున్నారు.


