junior Civil judge posts
-
న్యాయపీఠంపై మహిళా తేజం
‘నాన్న జడ్జి. చెల్లి కూడా జడ్జే. వారే నాకు స్ఫూర్తి’ అంటుంది నిఖిషా. జడ్జి కావాలనేది కీర్తన హైస్కూల్ నాటి కల. ‘మా కుటుంబం, బంధువులలో న్యాయవాదులు, జడ్జీలు ఎవరూ లేరు. అందుకే జడ్జి కావాలనుకున్నాను’ అంటుంది మధులిక. ‘పట్టుదల గట్టిగా ఉంటే తొలి ప్రయత్నంలోనే బ్రహ్మాండంగా విజయం సాధించవచ్చు’ అంటుంది సాహితి....తెలంగాణ హైకోర్టు జూనియర్ సివిల్ జడ్జి పోస్ట్లకు ఎంపికైన విజేతలు వీరు. న్యాయమూర్తి కావాలనుకోవడానికి వారికి స్ఫూర్తి వేర్వేరుగా ఉండవచ్చు. అయితే పడిన కష్టం మాత్రం ఒక్కటే. ‘న్యాయవ్యవస్థలో ఉన్నత స్థానాల్లో మహిళల ప్రాతినిధ్యం పెరగాలి’ అని జాతీయ స్థాయిలో నివేదికలు నొక్కి చెబుతున్న నేపథ్యంలో ఈ మహిళల విజయం... ఆశా కిరణం – అరవింద్ గండ్రాతి, ‘సాక్షి’ నెట్వర్క్1. ఎన్నో సవాళ్లు... అయినా సరే...న్యాయవాది కావాలనేది నా చిన్నప్పటి కల. జూనియర్ సివిల్ జడ్జి పోస్టుకు ఎంపికైనందుకు సంతోషంగా ఉంది. మధ్యతరగతి కుటుంబాల్లో ప్రత్యేకంగా స్టడీ రూమ్స్ లేకపోవడం ఇబ్బందిగా ఉంటుంది. ఏకాంతంగా చదువుకునే అవకాశం ఉండదు. లైబ్రరీలలో రాత్రి ΄÷ద్దుపోయే వరకు చదువుకునే వీలు అమ్మాయిలకు ఉండదు. మెటీరియల్ కలెక్ట్ చేసుకోవడం నుంచి ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రిపేర్ కావడం వరకు...పేద, మధ్యతరగతి అమ్మాయిలకు ఎన్నో సమస్యలు ఉంటాయి. అయితే లక్ష్యాన్ని మాత్రమే చూస్తే ఆ సమస్యలు కనిపించవు. – గంగిశెట్టి ప్రసీద, వరంగల్ సిటీ2. పుట్టెడు దుఃఖంతో... తిరుగులేని పట్టుదలతో...తెలంగాణ ఉద్యమంలో నర్సంపేట పట్టణం నుండి ముందు వరుసలో ఉండి ఉద్యమాన్ని నడిపించారు నాన్న. 2020లో నాన్న హత్యకు గురయ్యారు. నా భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. నా కాళ్లపై నేను నిలబడి అమ్మకు అండగా ఉండాలనుకున్నాను. నాన్న ఆలోచనలకు అనుగుణంగా ఎల్ఎల్బీలో చేరినప్పటి నుంచి జడ్జి కావాలనే పట్టుదలతో చదివాను. మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించడం సంతోషంగా ఉంది. – అంబటి ప్రణయ, నర్సంపేట, వరంగల్3. తొలి ప్రయత్నంలోనే... ‘లక్ష్యం ఏర్పర్చుకున్నప్పుడు ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురొచ్చినా పట్టుదలను వదలవద్దు. జూనియర్ సివిల్ జడ్జి పరీక్షల కోసం ప్రిపేర్ అయ్యేవారు సొంత నోట్స్ తయారు చేసుకోవడమే ఉత్తమం. ఇది ఒక హ్యాపీ మూమెంట్. నా పేరెంట్స్కు ఒక గిఫ్ట్.– సాహితి, నంగనూరు, సిద్దిపేట జిల్లా (తొలి ప్రయత్నంలోనే, 26 ఏళ్ల వయసులో జూనియర్ సివిల్ జడ్జి పోస్ట్కు ఎంపికైంది)ఇదీ చదవండి: నా డ్రీమ్స్.. కరియర్ : ఇపుడు కొత్తగా, ప్రతీక్షణం ఆస్వాదిస్తున్నా4.ఉద్యోగం కాదు... బాధ్యతమా కుటుంబంలో ఎవరూ న్యాయవాదులు, జడ్జిలు లేరు. అదే నన్ను న్యాయమూర్తి కావాలనే లక్ష్యం వైపు నడిపించింది. కొంతకాలం న్యాయవాదిగా చేసిన అనుభవం జేసీజే పరీక్షలో తోడ్పడింది. జడ్జి పోస్ట్ అనేది ఉద్యోగం కాదు. విలువైన బాధ్యత. – డాకన్నగారి మధులిక తేజ, హైదరాబాద్5. చిన్ననాటి కల... తొలి ప్రయత్నంలోనే చిన్ననాటి నుంచి జడ్జి అవ్వాలనేది నా కల. నా కల నెరవేరినందుకు సంతోషంగా ఉంది. హైకోర్టు, కరీంనగర్ కోర్టుల్లో న్యాయవాదిగా పలు కేసులు వాదించాను. రెండేళ్ల క్రితం నుంచి జేసీజే పరీక్షలకు సిద్ధమయ్యాను. ఎలాంటి కోచింగ్ తీసుకోకుండా క్రమపద్ధతిలో పరీక్షల కోసం ప్రిపేర్ అయ్యాను. – కట్ట కీర్తన, ఆరెపల్లి, కరీంనగర్జడ్జిల కుటుంబం...తండ్రి కె. ఖుషా హైదరాబాద్ సిటీ స్మాల్ కాజెస్ కోర్టు చీఫ్ జడ్జి. చెల్లి భావన మహబూబ్నగర్లో 4వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి. తాజాగా అక్క నిఖీషా జూనియర్ సివిల్ జడ్జి పోస్ట్కు ఎంపికైంది. తండ్రి, ఇద్దరు కూతుళ్లతో వారిది జడ్జిల కుటుంబంగా మారింది. ఐటీ ఉద్యోగం వచ్చినా చట్టంపై అవగాహన ఉండాలని న్యాయమూర్తి కె. ఖుషా తన కూతుళ్లను న్యాయ విద్య చదివించారు.అసలైన లక్ష్యం అదే...కోవిడ్ లాక్డౌన్ సమయంలో నిఖీషా వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగంలో చేరింది. ఐటీ రంగంలో అనుభవం కోసం ఉద్యోగంలో చేరింది. అయితే ఆ ఉద్యోగం ఆశించిన స్థాయిలో సంతృప్తి ఇవ్వలేదు. ఆ సమయంలోనే ‘నేను చేయాల్సిన ఉద్యోగం ఇది కాదు’ అనుకుంది. ‘నాన్నలాగే న్యాయమూర్తి కావాలి’ అని తనలో నిద్రాణంగా ఉన్న లక్ష్యంపై దృష్టి పెట్టింది.మానసిక స్థైర్యం... హరే కృష్ణ మంత్రంమెయిన్స్ ఎగ్జామ్స్ సమయంలో నిఖీషా తల్లి సర్జరీ చేయించుకోవాల్సి వచ్చింది. ఇంటర్వ్యూకు ముందు నాన్నకు బై΄ాస్ సర్జరీ జరిగింది. కవలబిడ్డలకు అప్పటికి సంవత్సరం కూడా నిండలేదు. ఇలా ఎన్నో ఒడిదొడుకులు వచ్చినా మానసికంగా కుంగిపోకుండా లక్ష్యాన్ని పదేపదే గుర్తు తెచ్చుకునేది. ‘హరే కృష్ణ మంత్రం జపిస్తూ మానసిక స్థైర్యాన్ని పొందాను. విజయం సాధించాను. మా కుటుంబం నుంచి నేను కూడా న్యాయమూర్తిగా అడుగుపెడుతున్నందుకు ఎంతో గర్వం ఉంది’ అంటుంది నిఖీషా. చదవండి : నిశ్చితార్థం రద్దు, ప్రేమ వివాహం, డైమండ్స్ షూస్ : ఎవరీ అందాల రాణి? -
సివిల్ జడ్జి నియామకాల్లో రూల్ 6 (ఎఫ్) రద్దు
సాక్షి, అమరావతి: జూనియర్ సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) పోస్టుల భర్తీ ప్రక్రియలో ఓసీ అభ్యర్థులతో సమానంగా బీసీ అభ్యర్థులు కూడా రాత పరీక్ష, వైవాలో కలిపి మొత్తం 60 శాతం మార్కులు సాధించాలన్న ఏపీ జ్యుడిషియల్ సర్వీసెస్ రూల్స్లోని రూల్ 6 (ఎఫ్)ను హైకోర్టు ధర్మాసనం రద్దు చేసింది. ఈ నిబంధనకు అనుగుణంగా జూనియర్ సివిల్ జడ్జి (జేసీజే) పోస్టుల భర్తీ నిమిత్తం 2019లో హైకోర్టు జారీ చేసిన నోటిఫికేషన్లో ఓసీ, బీసీ అభ్యర్థులు రాత పరీక్ష, వైవాలో 60 శాతం మార్కులు సాధించాలంటూ పెట్టిన క్లాజ్ 8ను కొట్టేసింది. ఈ నిబంధన చట్టవిరుద్ధమని హైకోర్టు తేల్చిచెప్పింది. ఈ నిబంధన వల్ల బీసీ అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందన్న పిటిషనర్ వాదనతో ఏకీభవించింది. ఈ నిబంధన వల్ల నష్టపోయిన పిటిషనర్ షేక్ నిషాద్ నాజ్కు జేసీజే పోస్టు ఇవ్వాలని హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం గురువారం తీర్పు వెలువరించింది. ఓసీ అభ్యర్థులతో సమానంగా బీసీ అభ్యర్థులు రాత పరీక్ష, వైవా కలిపి 210 మార్కులు సాధించాలన్న నిబంధనను రాజ్యాంగ విరుద్ధంగా, ఏపీ జ్యుడిషియల్ సర్వీసు నిబంధనలకు విరుద్ధంగా ప్రకటించి కొట్టేయాలని కోరుతూ గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన షేక్ నిషాద్ నాజ్ గతేడాది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై సీజే ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫున న్యాయవాది బాలాజీ వాదనలు వినిపిస్తూ.. జేసీజే పోస్టుల నోటిఫికేషన్లో ఇంటర్వ్యూలకు ఎంపిక కావాలంటే ఓసీ అభ్యర్థులు రాత పరీక్షలో 300 మార్కులకు గాను 180, వైవాలో 50 మార్కులకు గాను 30 మార్కులు కలిపి మొత్తం 210 మార్కులు సాధించాలని పేర్కొందన్నారు. అలాగే బీసీ అభ్యర్థులు రాత పరీక్షలో 165, వైవాలో 45 మార్కులు కలిపి మొత్తం 210 మార్కులు సాధించాలని నిబంధన విధించిందన్నారు. ఒక్కో పేపర్లో సగటున 50 మార్కులు సాధించాల్సి ఉంటుందని తెలిపారు. ఇక్కడే బీసీలకు అన్యాయం జరుగుతోందన్నారు. వైవాలో బీసీ అభ్యర్థులు ఏకంగా 95 శాతం మార్కులు సాధిస్తే తప్ప మొత్తం 210 మార్కులు సాధించడం సాధ్యం కాదని వివరించారు. -
జేసీజే పోస్టుల భర్తీకి హైకోర్టు నోటిఫికేషన్
సాక్షి, అమరావతి: జూనియర్ సివిల్ జడ్జి (జేసీజే) పోస్టుల భర్తీకి హైకోర్టు మంగళవారం నోటిఫికేషన్ జారీచేసింది. 68 పోస్టుల్లో 55 పోస్టులను ప్రత్యక్షంగా.. 13 పోస్టులను బదిలీల ద్వారా భర్తీచేస్తారు. దరఖాస్తుల సమర్పణకు ఆగస్టు 20 చివరి తేదీ. ఈనెల 20 నుంచి హైకోర్టు వెబ్సైట్ (https://hc.ap.nic.in/)లో దరఖాస్తులు అందుబాటులో ఉంటాయి. సెప్టెంబర్ 26న రాత పరీక్ష ఉంటుంది. అదే నెల 10న హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. వాస్తవానికి 2020లో 68 జేసీజే పోస్టుల భర్తీకి హైకోర్టు నోటిఫికేషన్ జారీచేసింది. ఈ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు మూడేళ్లపాటు న్యాయవాదిగా పనిచేసి ఉండాలన్న నిబంధన విధించింది. దీనిని సవాలు చేస్తూ పలువురు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. విచారణ జరిపిన హైకోర్టు, మూడళ్ల నిబంధన రాజ్యాంగ విరుద్ధమంటూ ఆ నోటిఫికేషన్ను కొట్టేసింది. తిరిగి నోటిఫికేషన్ ఇవ్వాలని ఆదేశించింది. దీంతో హైకోర్టు రిజిస్ట్రీ తాజాగా నోటిఫికేషన్ ఇచ్చింది. దరఖాస్తు ఫారాన్ని హైకోర్టు వెబ్సైట్లో ఉంచారు. ఆగస్టు 20వ తేదీ రాత్రి 11.59లోపు దరఖాస్తులు హైకోర్టుకు అందాల్సి ఉంటుంది. అలాగే.. ► దరఖాస్తులను ఆన్లైన్లోనే పూర్తిచేసి సమర్పించాలి. చేతిరాత, టైపు, జిరాక్స్, ప్రింట్ దరఖాస్తులను ఆమోదించరు. దరఖాస్తులను ప్రత్యక్షంగా, పోస్టు ద్వారా కూడా స్వీకరించరు. ► 2020లో జారీచేసిన నోటిఫికేషన్ ప్రకారం ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించిన స్క్రీనింగ్ టెస్ట్కు హాజరైన అభ్యర్థులు ఎలాంటి దరఖాస్తు సమర్పించకుండానే ప్రస్తుతం నిర్వహించనున్న జేసీజే పరీక్షకు హాజరుకావొచ్చు. స్క్రీనింగ్ పరీక్షకు హాజరుకాని వారు తిరిగి దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ► ప్రస్తుత జేసీజే పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులకు తప్పనిసరిగా లా డిగ్రీ ఉండి తీరాలి. ► ఓసీ, బీసీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజును రూ.800గా నిర్ణయించారు. ► ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.400 ఫీజుగా చెల్లించాలి. ఆంధ్రప్రదేశ్ నివాసితులు కాని ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.800 ఫీజు చెల్లించాలి. ► గుంటూరు, కర్నూలు, రాజమహేంద్రవరం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నంలను పరీక్ష కేంద్రాలుగా నిర్ణయించారు. వీటిల్లో మూడింటిని అభ్యర్థులు ఎంపిక చేసుకోవచ్చు. ► స్క్రీనింగ్ పరీక్షా ఫలితాల వెల్లడి తరువాత ఈ కేంద్రాల్లో ఆన్లైన్ రాత పరీక్ష ఉంటుంది. -
జేసీజే రాతపరీక్ష తాత్కాలికంగా నిలుపుదల
* హైకోర్టు న్యాయమూర్తుల కమిటీలో భిన్నాభిప్రాయాలు * సుప్రీంకోర్టు నుంచి స్పష్టత తీసుకోవాలని నిర్ణయం.. అప్పటివరకూ పరీక్ష నిలుపుదల సాక్షి, హైదరాబాద్: ఈ నెల 27న నిర్వహించ తలపెట్టిన జూనియర్ సివిల్ జడ్జి(జేసీజే) పోస్టుల రాత పరీక్షను హైకోర్టు తాత్కాలికంగా నిలుపుదల చేసింది. ఖాళీగా ఉన్న 97 జూనియర్ సివిల్ జడ్జీల పోస్టుల భర్తీకోసం హైకోర్టు ఫిబ్రవరి 1న నోటిఫికేషన్ జారీ చేసింది. దీనికి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. అయితే జూన్ 2వ తేదీ నుంచి రెండు కొత్త రాష్ట్రాలు ఏర్పడుతున్న పరిస్థితుల్లో జేసీజే పరీక్ష నిర్వహించడం సరికాదని, దీనిని వాయిదా వేయాలని కోరుతూ న్యాయవాదుల నుంచి డిమాండ్లు వచ్చాయి. మరోవైపు ఈ పరీక్షను వాయిదా వేయాలంటూ హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలైంది. ఈ నేపథ్యంలో కిందిస్థాయి న్యాయవ్యవస్థ విభజనపై ఏర్పాటైన ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని కమిటీ బుధవారం సమావేశమైంది. జేసీజే పరీక్ష వాయిదా వేయాలా? వద్దా? అనే అంశంపైనే దాదాపు 20 నిమిషాలపాటు చర్చించింది. పరీక్ష వాయిదాపై కమిటీలోని న్యాయమూర్తులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినట్లు తెలిసింది. దీంతో ఈ మొత్తం వ్యవహారంపై సుప్రీంకోర్టు నుంచి స్పష్టత లేదా ఉత్తర్వులు పొందాలని కమిటీ నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టు నుంచి స్పందన వచ్చేంత వరకు రాత పరీక్షను తాత్కాలికంగా నిలుపుదల చేస్తున్నట్లు హైకోర్టు రిజిష్ట్రార్(రిక్రూట్మెంట్) గురువారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు.