-
ప్రైవేటు ఆస్పత్రుల్లో ఉచిత చికిత్స..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విస్తృతంగా కరోనా పరీక్షలు నిర్వహించాలని, కార్పొరేట్, ఇతర ప్రైవేట్ ఆసుపత్రుల్లోనూ ఉచిత చికిత్స అందించాలని వైద్య శాఖ మంత్రి ఈటల రాజేందర్కు సీపీఎం నాయకులు జూలకంటి రంగారెడ్డి, బి.వెంకట్, టి.జ్యోతి విజ్ఞప్తిచేశారు. ఈ మేరకు మంగళవారం వారు మంత్రికి వినతిపత్రం సమర్పించారు. ఆక్సిజన్ అందుబాటులో ఉంచడంతో పాటు, బ్లాక్మార్కెట్ను అరికట్టాలని, కోవిడ్ పాజిటివ్ నిర్ధారణైతే కుటుంబసభ్యులందరికీ పరీక్షలు చేయాలని, కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని వారు కోరారు. పరీక్షల నిర్వహణలో, బాధితులకు వైద్య సహాయం అందించడంలో ప్రభుత్వం విఫలమైందని ఈ సందర్భంగా సీపీఎం నాయకులు ఆరోపించారు. కరోనా విభాగాన్ని ఏర్పాటు చేయండి: జూలకంటి నల్లగొండ జిల్లా మిర్యాలగూడలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ప్రత్యేక కరోనా విభాగాన్ని ఏర్పాటు చేయాలని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్కు సీపీ ఎం నేత, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి విజ్ఞప్తి చేశారు. ఇక్కడ వెంటనే కరోనా వైద్య కేంద్రాన్ని ప్రారం భించి, అవసరమైన వైద్య సిబ్బందిని నియమించాలని, ఆక్సిజన్, వెంటిలేటర్స్, ల్యాబ్లు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ నియోజకవర్గ పరిధిలో కరోనా కేసులు పెరుగుతున్నాయని, స్థానిక ఎమ్మెల్యే, అధికారులు ఇప్పటికే వైరస్ సోకి క్వారంటైన్లో ఉన్నారని, పట్టణంలోని వ్యాపారులు స్వీయ లాక్డౌన్ విధించుకున్నారని తెలిపారు. ఈ మేరకు మంగళవారం మంత్రి ఈటల రాజేందర్కు జూలకంటి వినతిపత్రం సమర్పించారు. -
పింఛన్ కేంద్రాలు పెంచండి: జూలకంటి
సాక్షి, హైదరాబాద్: సకాలంలో పింఛన్ అందక వృద్ధులు, వికలాంగులు, వితంతువులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, దీనిపై మానవతా దృక్పథంతో స్పందించి పింఛన్ కేంద్రాలను పెంచాలని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు బుధవారం సీఎం కేసీఆర్కు లేఖ రాశారు. పింఛన్ కేంద్రాలు దూరంగా ఉండటంతో లబ్ధిదారులు వ్యయప్రయాసలకోర్చి వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. చివరికి అక్కడకు వెళ్లాక సిబ్బంది వివిధ కారణాలతో పింఛన్లు ఇవ్వడం లేదన్నారు. పింఛన్ సెంటర్లలో మంచినీటి సౌకర్యం కల్పించటంతో పాటు సకాలంలో పింఛన్లు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. -
ఉద్యోగుల సమస్యలు పరిష్కరించండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా సర్వశిక్ష అభియాన్ పథకంలో భాగంగా కేజీబీవీ, అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది సమస్యలు పరిష్కరించాలని సీపీఎం నేత, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి కోరారు. ఈ మేరకు సోమవారం సీఎం కేసీఆర్కు లేఖ రాశారు. కేజీబీవీలలో పనిచేస్తున్న ఉద్యోగులంతా మహిళలేనని, వీరికి చెల్లిస్తున్న వేతనాలు చాలా తక్కువగా ఉన్నాయని తెలిపారు. రెగ్యులర్ ఉద్యోగులకు సమానంగా కాంట్రాక్టు ఉద్యోగులు పనిచేస్తున్నా వీరిమధ్య వేతనాల్లో ఏమాత్రం పోలిక లేదన్నారు. సెలవుల మంజూరీలోనూ వివక్ష కొనసాగుతోందని, ఉన్నతాధికారులకు ఈ సమస్యలను ఎన్నిసార్లు వివరించినా పరిష్కారం కావడం లేదన్నారు. దీంతో విధిలేని పరిస్థితుల్లో టీఎస్యూటీఎఫ్ ఆధ్వర్యంలో ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతున్నారని, ఈ పరిస్థితుల్లో జోక్యం చేసుకుని సమస్యలు పరిష్కరించాలని కోరారు. వారికి హెల్త్ కార్డులివ్వాలని, ప్రసూతి సెలవులు వర్తింప చేయాలని జూలకంటి తన లేఖలో సీఎంను కోరారు. -
సాగర్ ఆయకట్టుకు నీరివ్వాలి: జూలకంటి
సాక్షి, హైదరాబాద్: గత మూడేళ్లుగా నాగార్జునసాగర్ నుంచి నీరందక ఆయకట్టు భూములు బీడుగా మారాయని, ఈ రబీ సీజన్లోనైనా ఆయకట్టుకు నీరివ్వాలని సీపీఎం నేత జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. ఈమేరకు ఆయన సోమవారం సీఎం కేసీఆర్కు లేఖ రాశారు. ప్రస్తుతం శ్రీశైలం నుంచి సాగర్ ప్రాజెక్టుకు నీరు వస్తోందని, అయితే, సాగర్ పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరుకునే వరకు శ్రీశైలం నుంచి నీరు వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. నెల రోజులుగా దిగువకు నీటిని విడుదల చేయడం లేదని, శ్రీశైలం ఎగువ ప్రాజెక్టులకే నీరిస్తున్నారని అన్నారు. ఈ పరిస్థితుల్లో ఇపుడు సాగర్ పూర్తి స్థాయిలో నిండిన తర్వాతే మిగులు జలాలను పోతిరెడ్డిపాడు, హంద్రీ–నీవా, ముచ్చుమర్రి ప్రాజెక్టులకు వదలాలని కోరారు. నాగార్జున సాగర్పై నల్లగొండ, ఖమ్మం హైదరాబాద్ తాగునీటికోసం కూడా ఆధారపడి ఉన్నాయన్నారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం ఏపీ, కేంద్రం, కృష్ణా వాటర్ బోర్డుపై ఒత్తిడి తీసుకురావాలని జూలకంటి కోరారు. -
ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేసిన ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: ప్రజారోగ్యాన్ని గాలికొదిలేసిన ప్రభుత్వం మద్యం వ్యాపారంతో జనాల్ని బలి తీసుకుంటోందని సీపీఎం నేత జూలకంటి రంగారెడ్డి మండిపడ్డారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని నడిపేందుకు పూర్తిగా మద్యం ఆదాయంపైనే ఆధారపడుతున్నట్టు కనిపిస్తోందని పేర్కొంటూ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. అధికారంలోకి రాకముందు మద్యం మహమ్మారిపై విరుచుకుపడిన సీఎం కేసీఆర్.. అధికారంలోకి వచ్చాక మద్యాన్ని ఏరులై పారిస్తున్నారని దుయ్యబట్టారు. ఇది బంగారు తెలంగాణా.. మద్యం తెలంగాణా అని ప్రశ్నించారు. బార్లు, పబ్బుల పనివేళలను పొడిగించడం, వైన్సులకు సిట్టింగు రూములను పెంచడం వంటివి చూస్తుంటే ప్రభుత్వం మద్యం ఆదాయంపై ఎంతగా ఆధారపడిందో తెలుస్తోందని విమర్శించారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఫాప్, కోహ్లి విధ్వంసం.. గుజరాత్పై ఆర్సీబీ ఘన విజయం
విరాట్ కోహ్లి బుల్లెట్ త్రో.. గుజరాత్ బ్యాటర్ ఫ్యూజ్లు ఔట్! వీడియో
ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement