breaking news
Joint replacement surgery
-
60 ఏళ్లు దాటితేనే మోకాలి శస్త్రచికిత్స!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: కీళ్ల మార్పిడి శస్త్రచికిత్స 60 ఏళ్లు దాటిన వారికి మాత్రమే మంచిదని... యువతకు ఇది మంచిదికాదని అహ్మదాబాద్లోని అడ్వాన్స్డ్ నీ అండ్ షోల్డర్ హాస్పిటల్ డైరెక్టర్, చీఫ్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ ప్రత్మేష్ జైన్ తెలిపారు. 60 ఏళ్ల వయసులోపు ఉన్న వారికి ప్రధానంగా మోకాళ్లకు, తుంటి కీళ్ల మార్పిడి శస్త్రచికిత్స (జాయింట్ రీ–ప్లెస్మెంట్ సర్జరీ) చేయడం కంటే... మోకా లిని సంరక్షించుకునే పద్ధతి మెరుగైనదని పేర్కొ న్నారు. ఈ కారణంగానే కేంద్ర ప్రభుత్వ ఆయుష్మాన్ యోజన పథకం కింద 60 ఏళ్ల లోపు వారికి జాయింట్ రీ–ప్లేస్మెంట్ సర్జరీలను చేయవద్దని స్పష్టంగా ఆదేశాలిచ్చిందని తెలిపారు. 60 ఏళ్ల లోపు వయసు ఉన్న వారికి మోకాలి, తుంటి సంరక్షణపైనే ప్రధానంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. వైర్లెస్ ఆర్థోస్కోపీ ద్వారా చేసే శస్త్రచికిత్సల వల్ల తక్కువ గాయం, రక్తస్రావంతో సర్జరీ చేసే వీలుందని, అయితే, భారతదేశంలో ఇప్పటివరకు కేవలం కొచ్చిలో మాత్రమే ఈ పద్థతి ద్వారా చికిత్స చేసినట్లు తెలిపారు. దీనిపై మరింతగా అధ్యయనం జరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. విశాఖపట్నంలో జరుగుతున్న ‘అడ్వాన్స్డ్ నీ ఆర్థోస్కోపీ కోర్స్’సదస్సుకు హాజరైన సందర్భంగా ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే...!యువత విషయంలో ఇది బెటర్..యువతకు గాయమైన సందర్భాల్లో మొత్తం మోకాలి మార్పిడికి పోకుండా పనితీరును పునరుద్ధరించడానికి ఉద్దే శించిన ఇతర పద్ధతులను ఆశ్రయించాల్సిన అవసరం ఉంది. ఫిజియోథెరపీ, పెయిన్ రిలీఫ్, యాంటీ–ఇన్ఫ్లమేటరీ మందులు, ఇంజెక్షన్లు వంటి వాటిని వినియోగించడం వంటి పద్ధతులపైనే ఆధారపడితే మంచిది. యూరప్కు ఎగుమతులుగతంలో మనం ప్రధానంగా ఎముకలకు సంబంధించిన సర్జరీలకు, చికిత్సలకు అవసరమైన పరికరాలను దిగుమతి చేసుకోవాల్సి వచ్చేది. అయితే, ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. మన అవసరాలకు మనం ఉత్పత్తి చేసుకోవడంతో పాటు యూరప్ వంటి దేశాలకు కూడా మనం పరికరాలను ఎగుమతి చేస్తున్నాం. ఇప్పటికే మనం నూరుకుపైగా దేశాలకు ఆర్థోపెడిక్ ఉపకరణాలను మనం దేశం నుంచి ఎగుమతి చేస్తున్నాం. ప్రపంచ మార్కెట్లో చైనాది కూడా మన తర్వాతి స్థానమే. ప్రధానంగా మేకిన్ ఇండియాలో భాగంగా స్థానికంగా ఉత్పత్తి చేయడం పెరుగుతోంది. పెరుగుతున్న క్రీడాగాయాలుమన దేశంలో క్రీడల ద్వారా జరుగుతున్న ప్రమాదాల వల్ల ఎముకల శస్త్రచికిత్సలు పెరుగు తున్నాయి. క్రీడాకారుల సంఖ్య పెరగడంతో పాటు సరైన శిక్షణ లేకుండా ఆటలు ఆడటం కూడా ఇందుకు కారణం. ఆంధ్రప్రదేశ్ విష యానికి వస్తే, మిగిలిన ప్రాంతాల కంటే విశాఖ లో క్రీడాగాయాల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. అందుకే ఇక్కడ సర్జరీలు కూడా ఎక్కువ. 2036 సంవత్సరంలో అహ్మదాబాద్లో జరగనున్న ఒలంపిక్స్ నేపథ్యంలో ప్రధానంగా ఈ క్రీడా గాయాలపై ఎక్కువ దృష్టి సారించి... మెరుగైన వైద్యసేవలను అందించాల్సిన అవసరం ఉంది. ఇటువంటి సదస్సులు యువ డాక్టర్లకు మరింతగా అత్యాధునిక వైద్యపద్ధతులకు తెలియజేసేందుకు ఉపయోగపడతాయి. -
కర్నూలు కిమ్స్ వైద్యుల అరుదైన శస్త్రచికిత్స
కర్నూలు : ఆటలు ఆడేటప్పుడు జరిగే గాయాల విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే ఎంత తీవ్రమైన సమస్యలు వస్తాయో చెప్పలేం. వాటిని పట్టించుకోకుండా వదిలేయడం వల్ల సమస్య మరింత ఎక్కువవుతుంది. ఇలా నాలుగైదేళ్ల క్రితం గాయపడి, ఇన్నాళ్లూ దాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల ఒక చేతి కదలికలు దాదాపు పూర్తిగా కోల్పోయిన వ్యక్తికి అత్యంత అరుదైన లెటార్జెట్ ప్రొసీజర్ అనే అరుదైన శస్త్రచికిత్స చేసి, అతడికి చేతి కదలికలను పూర్తిస్థాయిలో పునరుద్ధరించారు కిమ్స్ కర్నూలు జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ జీవీఎస్ రవిబాబు ఈ చికిత్స పద్ధతి గురించి, కేసు గురించిన పూర్తి వివరాలను ఆయన ఇలా వెల్లడించారు. (80 నిమిషాల్లో 560 కి.మీ ప్రయాణం) "అనంతపురం జిల్లాకు చెందిన గోపీచంద్(20) అనే యువకుడు నాలుగైదేళ్ల క్రితం క్రికెట్ ఆడుతూ జారిపడటంతో అతని కుడి చేతి ఎముక పక్కకు జరిగింది. మాములు నొప్పే అనుకుని నిరక్ష్యం చేసిన అతను కొన్ని రోజుల వరకు వైద్యులను సంప్రదించలేదు. తర్వాత కొంత కాలానికి కొందరు వైద్యుల వద్దకు వెళ్లినా, సమస్యను పూర్తిగా అర్థం చేసుకోకపోవడం వల్ల సరైన చికిత్స జరగలేదు. నాలుగైదేళ్ల పాటు ఇలాగే నిర్లక్ష్యం చేసి, క్రికెట్ ఆడటం సహా అన్ని పనులూ చేయడంతో ఈ మధ్య కాలంలో దాదాపు 30-40 సార్లు ఎముక పక్కకు జరిగింది. అది అతడికి చాలా బాధాకరంగా మారింది. (పర్యాటకంపై ఏపీ సర్కార్ కీలక ఆదేశాలు) అనంతపురం జిల్లాలో ప్రభుత్వాసుపత్రిలో స్టాఫ్ నర్సుగా పనిచేసే ఆ యువకుడి తల్లి.. తర్వాత అతడికి ఎంఆర్ఐ తీయించి కర్నూలు కిమ్స్ ఆసుపత్రికి పంపారు. అతడిని పూర్తిగా పరీక్షించినప్పుడు బంతిగిన్నెకీలు కూర్చునే ప్రాంతం (గ్లెనాయిడ్ కప్) అరిగిపోయినట్లు తెలిసింది. దీనివల్ల ఏమాత్రం కదిలించినా చేతి ఎముక జారిపోతుంది. గ్లెనాయిడ్ కప్లో నాలుగోవంతు పూర్తిగా అరిగిపోయింది. దీంతో ఎముక జారిపోతుందన్న భయంతో కొన్నాళ్లుగా అతడు కుడిచేతిని వాడటం మానేసి కేవలం ఎడమచేత్తోనే అన్ని పనులూ చేసుకుంటున్నాడు. పరిస్థితిని పూర్తిగా అంచనా వేసిన తర్వాత లెటార్జెట్ ప్రొసీజర్ అనే పద్ధతిలో అతడికి శస్త్రచికిత్స చేశారు. ఇది చాలా అరుదైన పద్ధతి. ఇందులో భుజంలోనే వేరే ప్రాంతం నుంచి ఎముకను, దాని చుట్టూ ఉన్న కండరాలతో కలిపి కొంత కట్ చేసి తీసుకొచ్చి, ఇక్కడ అతుకుతారు. ఈ కేసులో కొరకాయిడ్ ప్రాసెస్ ఎముకను, దాని కండరాలను తీసుకొచ్చి ఈ కప్ వద్ద కూర్చోబెట్టారు. దానివల్ల గ్లెనాయిడ్ కప్ మళ్లీ పూర్తి స్థాయిలో ఏర్పడింది. దీన్ని ఆర్మ్ స్లింగ్ ఎఫెక్ట్ అంటారు. అతడి చేతి కదలికలు సాధారణ స్థాయికి రావడంతో డిసెంబరు 24న డిశ్ఛార్జి చేసి ఇంటికి పంపేశారు. మధ్యమధ్యలో మళ్లీ ఫాల్ అప్ కోసం ఆసుపత్రికి వచ్చినప్పుడు పరీక్షించగా చెయ్యి బాగుందని తేలింది. దాంతో ఇప్పుడు అతడు మళ్లీ క్రికెట్ కూడా ఆడగలుగుతున్నాడు. ఈ తరహా చికిత్సలు చేయడం కర్నూలు ప్రాంతంలో ఇదే తొలిసారి" అని డాక్టర్ జీవీవీఎస్ రవిబాబు తెలిపారు. -
'మెదడుకు ఆపరేషన్ చేయించుకుంటే బాగుండేది'
గుంటూరు : ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వ ఆస్పత్రిలో మంత్రికి 'ప్రైవేటు' చికిత్సపై ఆయన మండిపడ్డారు. మంత్రిగారు మోచిప్ప మార్పిడి కన్నా మెదడుకు ఆపరేషన్ చేయించుకుంటే బాగుండేదని అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. శనివారం అంబటి రాంబాబు ఇక్కడ మాట్లాడుతూ 'మంత్రిగారు జీజీహెచ్లో శస్త్ర చికిత్స చేయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆయన బయట నుంచి ప్రయివేట్ వైద్యుల్ని తెప్పించుకుని ఆపరేషన్ చేయించుకున్నారు. రోగులకు, ప్రజలకు ప్రభుత్వ ఆస్పత్రుల మీద విశ్వాసాన్ని, నమ్మకాన్ని కలిగించడం కోసం సాక్షాత్తూ మంత్రిగారే ఆపరేషన్ చేయించుకున్నట్లు ప్రచారం చేస్తున్నారు. అయితే మంత్రిగారి నిర్వాకం వల్ల జీజీహెచ్ ప్రతిష్ట మరింత దిగజారిపోయింది. ఆయన బయట నుంచి డాక్టర్లను తెప్పించుకుని ఆపరేషన్ చేయించుకుంటున్నారు. డాక్టర్లేమో బయటవారు, బెడ్స్ మాత్రం గవర్నమెంట్వా? ఇలా చేస్తే ప్రభుత్వ ఆస్పత్రి పరువు ప్రతిష్టలు పెరుగుతాయా? గవర్నమెంట్ ఆస్పత్రుల పరువు ప్రతిష్టలు దిగజార్చేలా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ప్రవర్తించారు. జీజీహెచ్ ప్రతిష్ట ఈ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక ఎంతగా దిగజారిపోయిందో మనం చూశాం. పసిపిల్లల్ని ఎలుకలు కొరుక్కు తిన్నాయి. ఆ ఎలుకల్ని తినడానికి పాములు వచ్చాయి. ఒక జూ పార్కులా గవర్నమెంట్ ఆస్పత్రి దిగజారిపోయింది. మంత్రిగారి చర్యలో అది మరింత పడిపోయిందని' మండిపడ్డారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని అంబటి రాంబాబు మండిపడ్డారు. పోలీసులు ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, బియ్యం మధుసూదన్ రెడ్డిని అరెస్ట్ చేసి రకరకాల వేధింపులకు గురి చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. పనిగట్టుకుని విచ్చలవిడిగా అక్రమ కేసులు పెట్టి, ప్రధాన ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేయాలని, చంద్రబాబు, ఆయన ప్రభుత్వం పని చేస్తున్నట్లు తేటతెల్లం అవుతోందన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక పోలీసులకు వైఎస్ఆర్ సీపీ నాయకుల మీద కేసులు పెట్టడం తప్ప మరే పనేమీ కనిపించడం లేదని అంబటి రాంబాబు అన్నారు. వైఎస్ఆర్ సీపీ నాయకుల్ని అణచాలని, కేడర్ను భయపెట్టాలని చూస్తున్నారని, ఇది ఎక్కువ కాలం సాగదన్నారు. రేణిగుంట విమానాశ్రయం ఘటనలో ఆధారాలు ఉంటే బయటపెట్టాలని పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన సవాల్ చేస్తే ఏవో రెండు క్లిప్పింగ్స్ బయటపెట్టి, ఆధారాలు విడుదల చేశామని టీడీపీ నేతలు చంకలు గుద్దుకుంటున్నారని అంబటి విమర్శించారు. వాటిలో మిథున్ రెడ్డి కానీ, చెవిరెడ్డి కానీ లేరనే విషయాన్ని గుర్తించాలని ఆయన సూచించారు. -
'మెదడుకు ఆపరేషన్ చేయించుకుంటే బాగుండేది'
-
ప్రభుత్వ ఆస్పత్రిలో కామినేనికి శస్త్రచికిత్స
-
ప్రభుత్వ ఆస్పత్రిలో కామినేనికి శస్త్రచికిత్స
గుంటూరు : గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రిలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్కు శుక్రవారం మోచిప్ప మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ డీఎస్ రాజునాయుడు మాట్లాడుతూ.. ఆస్పత్రి చరిత్రలో ఈ రోజును సువర్ణాక్షరాలతో లిఖించవచ్చన్నారు. జీజీహెచ్ వైద్యులపై నమ్మకం ఉంచి.. ప్రజలకు ప్రభుత్వాస్పత్రులపై ఉన్న అపనమ్మకాలను పారద్రోలేలా స్వయంగా మంత్రి జీజీహెచ్లో ఆపరేషన్ చేయించుకున్నారని చెప్పారు.