breaking news
Jobs Lost
-
2025..1.22 లక్షలు ఉద్యోగాలు ఔట్..
సాక్షి, స్పెషల్ డెస్క్: సాంకేతికరంగ కంపెనీల్లో ప్రపంచవ్యాప్తంగా లేఆఫ్స్ కొనసాగుతున్నాయి. ఏఐ చిచ్చు ప్రధానంగా ఐటీ రంగంపైనే ప్రభావం చూపుతోంది. కంపె నీలు నూతన సాంకేతికతను అందిపుచ్చుకోవడం, పునర్ వ్యవస్థీకరణ దిశగా అడుగులు వేస్తుండటంతో ఉద్యోగుల తీసివేతలు తప్పడం లేదన్నది పరిశ్రమ వర్గాల మాట. కోవిడ్–19 మహమ్మారి తర్వాత ప్రపంచవ్యాప్తంగా కొంత కాలంపాటు టెక్ కంపెనీలు ఇబ్బడిముబ్బడిగా నియామ కాలు చేపట్టాయి. అయితే స్థూల ఆర్థిక ఒత్తిళ్లతోకొన్నాళ్లుగా మార్కెట్ దిద్దుబాటుకు గురవుతోంది. ఇటీవలి కాలంలో ఏఐ, ఆటోమేషన్ వైపు పరిశ్రమ మళ్లుతోంది. దీని ఫలితంగా 2025లో ప్రపంచవ్యాప్తంగా 257 టెక్ సంస్థలు 1.22 లక్షల మందికి ఉద్వాసన పలికాయని ఉద్యోగుల తొలగింపులను ట్రాక్ చేస్తున్న లేఆఫ్స్. ఎఫ్వైఐ వెబ్సైట్ వెల్లడించింది. సిబ్బందిని ఇంటికి సాగనంపిన సంస్థల్లో అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటి ప్రపంచ దిగ్గజాలూ ఉన్నాయి. కానీ 2023తో పోలిస్తే ఈ తీసివేతలు సగానికంటే తక్కువే కావ డం గమనార్హం. మరో సాంకేతిక దిగ్గజం యాపిల్ సైతం డజన్లకొద్దీ సేల్స్ సిబ్బందిని కుదించింది. ద్రవ్యోల్బణం, సుంకాల కారణంగా పెరుగుతున్న ఖర్చుల నేపథ్యంలో కంపెనీలు వ్యయాలను తగ్గించుకోవడానికి మార్గాలను అన్వే షిస్తున్నాయి. తక్కువ మంది ఉద్యోగులతో కార్యకలా పాలను నిర్వహించడం, ఏఐపై ఆధారపడటం కంపెనీలకు ఆకర్షణీయమైన స్వల్పకాలిక పరిష్కారంగా కనిపిస్తోంది.లేఆఫ్స్కు ప్రధాన కారణాలు ఇవీ..1. ఓవర్ హైరింగ్–మార్కెట్ కరెక్షన్ కోవిడ్–19 సమయంలో ఈ–కామర్స్, క్లౌడ్ కంప్యూటింగ్, రిమోట్ వర్క్ టూల్స్కు డిమాండ్ పెరిగింది. దీంతో టెక్ పరిశ్రమలో భారీ నియామకాలకు దారితీసింది. ప్రస్తుతం మార్కెట్ యథాతథ స్థితికి చేరుకోవడం, డిమాండ్ వృద్ధి సాధారణం కావడంతో కంపెనీలు తాము అధిక సిబ్బందితో ఉన్నట్లు గుర్తించాయి. ప్రస్తుత డిమాండ్కు అనుగుణంగా శ్రామిక శక్తిని సరైన పరిమాణంలో ఉపయోగిస్తున్నాయి.2. పెట్టుబడిదారుల డిమాండ్స్ అధిక ద్రవ్యోల్బణం, పెరుగుతున్న వడ్డీ రేట్లు, మాంద్యం భయాలు వంటి ప్రపంచ ఆర్థిక ఎదురుగాలులు నిర్వహణ ఖర్చులను పెంచడంతోపాటు లాభాలను తగ్గించాయి. పెట్టుబడి దారులు ఇప్పుడు లాభదాయకత, ఆర్థిక క్రమశిక్ష ణను కోరుతున్నారు. ఖర్చులను తగ్గించడానికి, లాభాలను మెరుగుపరచడానికి తొలగింపులను కంపెనీలు తక్షణ మార్గంగా భావిస్తున్నాయి.3. ఏఐ, ఆటోమేషన్ వైపు పయనం ఏఐ, ఆటోమేషన్ విభాగాల్లో వేగవంతమైన అభివృద్ధి, స్వీకరణ ఉద్యోగుల తొలగింపులకు ప్రధాన కారణం. కంపెనీలు ఏఐ మౌలిక సదుపాయాలు, పరిశోధనలో కోట్లాది రూపాయలు పెట్టుబడి పెడుతున్నాయి. నిధులు సమకూర్చ డానికి ఇతర విభాగాల్లో సిబ్బందిని తగ్గిస్తున్నాయి. కస్టమర్ సపోర్ట్, డేటా ఎంట్రీ వంటి రంగాల్లో రోజువారీ పనులను ఏఐ ఆటోమేట్ చేస్తోంది. కార్మికుల అవసరాన్ని తగ్గిస్తోంది. ఐటీ పరిశ్రమలో నైపుణ్యాల పునఃసమీక్షకు దారితీస్తోంది.4. సమర్థతకు పెద్దపీట అనేక టెక్ దిగ్గజాలు నిర్వహణ సామర్థ్యం, వేగంపై దృష్టిసారించాయి. భవిష్యత్ వృద్ధి విభాగాలకు ప్రాధాన్యం ఇచ్చేందుకు వీలుగా అప్రాధాన్య ప్రాజెక్టులు, పేలవమైన పనితీరుగల యూనిట్లను తగ్గించుకుంటున్నాయి.5. నిర్దిష్ట రంగాల్లో తగ్గుతున్న డిమాండ్ వ్యక్తిగత కంప్యూటర్లు, గేమింగ్ కన్సోల్స్, సంప్రదాయ నెట్వర్కింగ్ హార్డ్వేర్ వంటి కొన్ని ఉత్పత్తులకు డిమాండ్ తగ్గింది. ఫలితంగా వాటితో ముడిపడి ఉన్న నిర్దిష్ట వ్యాపార యూనిట్లలో ఉద్యోగాల కోతలు ఏర్పడుతున్నాయి. -
డిమానిటైజేషన్ : ఉద్యోగాల ఊచకోత
సరిగ్గా ఏడాది కిందట ఉరుములేని పిడుగులా పెద్ద నోట్ల రద్దు దేశంమీద పడింది. ఏడాది తరువాత కూడా ప్రజలను పెద్ద నోట్ల రద్దు ప్రభావం వదిలిపెట్టడం లేదు. డిమానిటైజేషన్ ప్రభావం పడని రంగం లేదు.. అందులో ఉద్యోగాలు కూడా భాగమయ్యాయి. సాక్షి, న్యూఢిల్లీ : పెద్దనోట్ల రద్దు జరిగి నేటికి 12 నెలల పూర్తయ్యాయి. ఏడాది గడిచిన తరువాత కూడా ప్రభుత్వం ముందు వసూలు కానీ రుణాలు, నిరుద్యోగం ప్రభుత్వాన్ని సవాళ్లు విసురుతున్నాయి. దేశంలో పెరుగుతున్న శ్రామిక శక్తికి విలోమానుపాతంగా ఉపాధి మార్గాలు తగ్గుముఖం పడుతున్నాయని పలు సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) అంచనాల ప్రకారం 2017 జనవరి నుంచి ఏప్రిల్ మధ్య కాలంలో ఉద్యోగ, ఉపాధి మార్గాలు మందగించాయి. లేబర్ బ్యూరో ఆఫ్ ఎంప్లాయిమెంట్ సర్వే ప్రకారం పెద్ద నోట్ల రద్దు ప్రబావం రోజువారీ కూలీలు, ఉద్యోగులపై తీవ్ర ప్రభావం చూపింది. సంస్థల్లో ఉద్యోగస్తుల తగ్గింపు క్రమంగా కొనసాగుతూనే ఉంది. 2017 జనవరి-ఏప్రిల్ మధ్య కాలంలో సీఎంఐఈ వర్గాలు దేశవ్యాప్తంగా 5,19,285 మందిపై సర్వే నిర్వహించింది. ఈ సమయంలో మూడింటరెండొంతుల మంది నిరుద్యోగులుగా మరిపోయారు. ఈ సర్వే ప్రకారం జనవరి నుంచి ఏప్రిల్ మధ్య కాలంలో మొత్తంగా 1.5 మిలియన్ ఉద్యోగాలు ఊడిపోయాయి. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన (పీఎంకేవీవై) స్కీమ్ కింద 2017 జులై మొదటి వారంలో 30. 67 లక్షల మంది శిక్షణ పూర్తి చేసుకున్నారు. ఇందులో కేవలం 2.9 లక్షల మందికి మాత్రమే ఉద్యోగాలు లభించాయి. ఇతర సర్వేల ప్రకారం పెద్ద నోట్లరద్దు తరువాత సుమారు 107 సంస్థలు 14,668 మంది ఉద్యోగులను తొలగించాయి. దేశంలో భారీ సంస్థలుగా నిలిచిన ఎల్ అండ్ టీ (1888), హిందుస్తాన్ యూనిలీవర్ (1453), ఐడియా సెల్యులార్ (707), ఏసీసీ (535), టాటా మోటార్స్ (534), టాటా స్టీల్ (450), హిందాల్కో (439), టైటాన్ ఇండస్ట్రీస్ (422) మంది ఉద్యోగాలను తొలగించాయి. ఆలోమొబైల్, ఫార్మాస్యుటికల్స్ రంగాల్లోనూ భారీగా ఉద్యోగాల కోత పడింది. లేబర్ బ్యూరో క్వార్టర్లీ ఎంప్లాయిమెంట్ సర్వే అంచనా ప్రకారం 2016 అక్టోబర్ - డిసెంబర్ మధ్య కాలంలో 1.52 లక్షల క్యాజువల్ ఉద్యోగాలు, 46 వేల పార్ట్టైమ్ ఉద్యోగాల్లో కోత పడింది. -
రెండో క్వార్టర్లో 70వేల ఉద్యోగాలు ఫట్!
న్యూఢిల్లీ : సరుకు ఎగుమతులు దిగజారడంతో 2015-16 రెండో త్రైమాసికంలో దాదాపు 70వేల ఉద్యోగాలు గల్లంతు అయ్యాయట. అసోచామ్, థాట్ ఆర్బిట్రేజ్ సంయుక్త అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. ఎగుమతి యూనిట్లలో జీవనోపాధి అవకాశాలు తగ్గాయని, ఈ ప్రభావంతో 70వేల ఉద్యోగులను తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడిందని రిపోర్టు తెలిపింది. ముఖ్యంగా టెక్స్టైల్ రంగంలో ఈ ప్రభావం ఎక్కువగా ఉందని, సరుకు రవాణా పడిపోవడంతో ఈ రంగంలో ఉద్యోగాలు ఎక్కువగా కోల్పోయారని వెల్లడించింది. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ మందగించడం కూడా దీనికి ప్రధానమైన కారణంగా అధ్యయనం వెల్లడించింది. ఎగుమతి యూనిట్ ఎకానమీ ఎక్కువగా కాంట్రాక్టు ఉద్యోగులపై ఆధారపడి పనిచేస్తుందని, దీంతో కాంట్రాక్టు ఉద్యోగులపై ఈ ప్రభావం ఎక్కువగా ఉందని వివరించింది. దేశీయంగానే భారత్ ఎకానమీలో అదనంగా డిమాండ్ను సృష్టించుకోవాలని, అప్పుడైతేనే వృద్ధి బాటను పునఃప్రారంభించుకోవచ్చని అధ్యయనం సూచించింది. దేశీయ డిమాండ్తో ఉద్యోగవకాశాలు కల్పించడం కీలకమైన విషయంగా ఈ సర్వే పేర్కొంది. వరుసగా రెండో నెల ఆగస్టులో కూడా భారత్ ఎగుమతులు 0.3 శాతం క్షీణించి, 21.51 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. పెట్రోలియం, లెదర్ ఉత్పత్తుల షిప్మెంట్లు పడిపోవడంతో ఎగుమతులు క్షీణించాయి. బలహీనమైన గ్లోబల్ డిమాండ్, ఆయిల్ ధరల పతనంతో 2014 డిసెంబర్ నుంచి 2016 మే వరకు వరుసగా 18నెలల పాటు ఎగుమతులు కిందకు పడిపోతూనే వచ్చాయి. కేవలం జూన్ నెలలోనే పరిస్థితి కొంత మెరుగుపడినప్పటికీ, మళ్లీ జూలైలో నెగిటివ్ జోన్లోకి ప్రవేశించాయి.


