-
లండన్ నడిబొడ్డున జిహాద్ నినాదాలు.. రిషి సునాక్ ఆగ్రహం
లండన్: లండన్ నడిబొడ్డున జిహాద్ నినాదాలపై ప్రధాని రిషి సునాక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది యూదులతో పాటు ప్రజాస్వామ్య విలువలకు ముప్పులా పరిణమిస్తుందని అన్నారు. లండన్లో ఇలాంటి నినాదాలను సహించబోమని చెప్పారు. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం నేపథ్యంలో పాలస్తీనియన్లకు మద్దతుగా లండన్, బర్మింగ్హామ్, కార్డిఫ్, బెల్ఫాస్ట్ సహా ఇతర నగరాల్లో భారీ ఎత్తున నిరసనలు చేపట్టారు. ఇందులో కొందరు ఆందోళనకారులు జిహాద్ నినాదాలు కూడా చేశారు. 'ఈ శనివారం జరిపిన నిరసనల్లో వీధుల్లో ద్వేషాన్ని చూశాము. జిహాద్ పిలుపులు యూదు సమాజానికి మాత్రమే కాదు, మన ప్రజాస్వామ్య విలువలకు కూడా ముప్పు. మన దేశంలో యూదు వ్యతిరేకతను ఎప్పటికీ సహించము. తీవ్రవాదాన్ని ధీటుగా ఎదుర్కొనేందుకు అవసరమైన అన్ని చర్యలను పోలీసులు తీసుకోవాలని ఆదేశిస్తున్నాం.' అని రిషి సునాక్ అన్నారు. గ్రేటర్ లండన్ ప్రాంతంలో పాలస్తీనియన్లకు మద్దతుగా నిరసనలు చేలరేగగా.. ద్వేషపూరిత నినాదాలు వెలుగుచూశాయని పోలీసులు తెలిపారు. ఆందోళనలు అదుపుతప్పాయని చెప్పారు. ఈ ఘటనల్లో ఐదుగురు పోలీసులు కూడా గాయపడ్డారని వెల్లడించారు. జిహాద్ అంటూ నినాదాలు చేస్తున్న ఓ వ్యక్తి వీడియోను కూడా షేర్ చేశారు. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో రిషి సునాక్ ఇజ్రాయెల్ పట్ల నిలబడిన విషయం తెలిసిందే. హమాస్ ఉగ్రవాద సంస్థ ఆగడాలను నిలిపివేయాని పిలుపునిచ్చారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటంలో తాము తోడుగా ఉంటామని స్పష్టం చేశారు. ఇదీ చదవండి: ఇండోనేషియా రాయబారిగా ఇండో-అమెరికన్.. బైడెన్ కీలక నిర్ణయం -
పాక్లో జిహాద్ పేరుతో నిధులు సేకరించొద్దు
లాహోర్: పాకిస్తాన్లో జిహాద్ పేరుతో నిధులను సేకరించేందుకు ప్రజలను ప్రేరేపించొద్దని, అలా ఎవరు చేసినా అది రాజద్రోహం కిందికి వస్తుందని లాహోర్ హైకోర్టు స్పష్టం చేసింది. ఏదైనా యుద్ధాన్ని ప్రకటిస్తే అందుకు అవసరమైన డబ్బులు సేకరించడం దేశానికి సంబంధించిన పని అని వెల్లడించింది. నిషేధిత ఉగ్రవాద సంస్థ కోసం నిధులు సేకరించినందుకు దోషులుగా తేలి ఐదేళ్లు శిక్ష పడిన ఇద్దరు ఉగ్రవాదుల అప్పీళ్లను తోసిపుచ్చుతూ ఇటీవల తీర్పు నిచ్చింది. ‘తెహ్రీకీ తాలిబాన్ నిషేధిత సంస్థ. దేశానికి ఎంతో నష్టం చేసింది. దేశ ముఖ్య నాయకులు లక్ష్యంగా పని చేసింది. దేశంలో ఉగ్రవాదం పెంచడానికి ప్రయత్నింది. ఆర్థికంగా మద్దతు లేనిదే ఇదంతా సాధ్యం కాదు’ అని వ్యాఖ్యానించింది. ఉగ్రవాద కార్యకలాపాలకు డబ్బులు అందించారంటూ ఈ నెలలో అరెస్టయిన ఇద్దరు తెహ్రీకి తాలిబాన్ పాకిస్తాన్ ఉగ్రవాదులకు యాంటీ టెర్రరిస్టు కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. -
భారత్పై ఐసిస్ కుట్ర బట్టబయలు
సాక్షి, న్యూఢిల్లీ : భారత్కు వ్యతిరేకంగా ఉగ్ర సంస్థ ఐసిస్ కుట్రపూరిత ప్రణాళిక మరోసారి బట్టబయలైంది. భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయుధాలు చేబూని జీహాద్ చేపట్టాలని ఐసిస్ తన డిజిటల్ మ్యాగజైన్లో ఓ వర్గాన్ని రెచ్చగొడుతోందని ఓ జాతీయ వెబ్సైట్ పేర్కొంది. జాతి భద్రతకు ముప్పుగా ముంచుకొచ్చిన మ్యాగజైన్పై భద్రతా వర్గాలు ఆరా తీస్తున్నాయి. సీఏఏకు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగించాలని పిలుపు ఇచ్చిన ఐసిస్ డిజిటల్ మ్యాగజైన్ ఈ పోరాటానికి మద్దతుగా తాము నిలబడతామని హామీ ఇచ్చింది. రహస్య టెలిగ్రాం చానెల్స్, వెబ్ మీడియా ద్వారా ‘వాయిస్ ఆఫ్ ఇండియా’ పేరిట ఐసిస్ డిజటల్ మ్యాగజైన్ దేశ ప్రజల్లో విద్వేష భావాన్ని నూరిపోస్తోందని ఆ కథనం పేర్కొంది. బాబ్రీమసీదు విధ్వంసానికి ప్రతీకారం తీర్చుకోవాలని ఓ వర్గాన్ని ఈ మ్యాగజైన్ రెచ్చగొడుతోందని స్పష్టం చేసింది. సీఏఏపై తప్పుడు ప్రచారానికి పాల్పడుతూ కోర్టుల నిర్ణయాలకు కట్టబడిఉండరాదని ప్రజలను తప్పుదారి పట్టిస్తోందని పేర్కొంది. చదవండి : ఐసిస్ అడ్డాగా ఐటీ రాజధాని..! -
యూపీఎస్సీ జిహాద్ : ఎవరిపై కుట్ర?
సాక్షి, న్యూఢిల్లీ : దేశానికి స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు దాటుతున్నప్పటికి ఓ వర్గంపై మరో వర్గం బురదజల్లే ప్రయత్నాలు మాత్రం మానడంలేదు. భారత్ లౌకిక దేశమని నేతలంతా గర్వంగా రాజకీయ ప్రకటనలు చేస్తున్నా.. మైనార్టీ వర్గాలపై మాత్రం ఏదో ఒక విధంగా వివక్ష చూపుతూనే ఉన్నారు కొందరు. ఇటీవల ఓ మీడియా ప్రసారం చేసిన ఓ కథనమే దీనికి నిదర్శనం. సమాజంలో బాధ్యతగా వ్యవహరించాల్సిన మీడియా ఓ వర్గాన్ని కించపరుస్తూ కథనాలు టెలికాస్ట్ చేయడం సరైనది కాదని దేశ అత్యున్నత న్యాయస్థానం మెట్టికాయలు వేయడంతో అసలు కథ వెలుగులోకి వచ్చింది. దేశ రాజధాని ప్రాంతం కేంద్రంగా విధులు నిర్వర్తిస్తున్న టెలివిజన్ సంస్థ సుదర్శన్ టీవీ. ఇటీవల ఈ టీవీలో ఓ ఎపిసోడ్ ప్రసారమైంది. ‘యూపీఎస్సీ జిహాద్’ పేరిట ఆ సంస్థ ప్రసారం చేసిన కార్యక్రమం తీవ్ర వివాదాస్పదమైంది. దేశంలో మైనార్టీలుగా ఉన్న ముస్లింలు కేంద్ర సంస్థల్లోకి పెద్ద ఎత్తున రిక్రూట్ అవుతున్నారు అనేది ఆ కార్యక్రమం సారాంశం. దేశ జనాభాలో కేవలం 13 నుంచి 15 శాతం ఉన్న ముస్లింలు పెద్ద సంఖ్యలో కేంద్ర సంస్థల్లోకి ప్రవేశిస్తున్నారని, దీని వెనుక ఎవరికీ తెలియని ఓ రహస్యం దాగిఉందనేది నిర్వహకుల అభిప్రాయం. (బీజేపీకి ఊహించని షాకిచ్చిన మిత్రపక్షం) అయితే ఓ వర్గాన్ని కించపరుస్తూ సుదర్శన్ టీవీ నిర్వహిస్తున్న యూపీఎస్సీ జిహాద్ కార్యక్రమాన్ని నిషేధించాలని పలువురు సివిల్స్ అధికారులు సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. అప్పటికీ ఆ షో మూడు ఎపిసోడ్స్ని కూడా ప్రచారం చేసింది. దీనిపై రెండురోజుల క్రితం విచారణ చేపట్టిన జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం టీవీ యాజమాన్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. లౌకిక దేశంలో ఓ వర్గాన్ని నేరుగా టార్గెట్ చేసే విధంగా ప్రవర్తిస్తున్నారని, వెంటనే ఆ షోను నిలిపివేయాలని ఆదేశించింది. స్వతంత్ర ప్రతిపత్తి గల యూపీఎస్సీ ప్రతిష్ట దెబ్బతినే విధంగా షో ఉందని ఆక్షేపించింది. వాక్ స్వాతంత్రం పేరుతో ఇష్టం వచ్చిన విధంగా వ్యవహరిస్తామంటే ఊరుకునే ప్రసక్తేలేదని న్యాయస్థానం స్పష్టం చెప్పింది. ఇకపై తదుపరి షోలను టెలికాస్ట్ చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు సైతం జారీచేసింది. (30న బాబ్రీ కూల్చివేత తీర్పు) కాగా కేంద్ర ప్రభుత్వం గణాంకాల ప్రకారం.. 2019 సివిల్ సర్వీస్ పరీక్షల్లో మొత్తం 829 మంది అభ్యర్థులు సెలెక్ట్ అయితే వారిలో 42 మంది ముస్లిం కమ్యూనిటికి చెందిన అభ్యర్థులు ఉన్నారు. అంటే మొత్తంలో 5శాతం మంది కేంద్ర సర్వీసులకు అర్హత సాధించారు. ఇక 2018లో మొత్తం 759 మంది అభ్యర్థులు అర్హత సాధిస్తే వారిలో 28 మంది ముస్లింలు ఉన్నారు. ఇక 2012, 13,14లో వరుసగా 30,34,38 మంది చొప్పున అభ్యర్థులు ఎన్నికవుతూ వస్తున్నారు. కాగా జాతీయ స్థాయిలోనూ మైనార్టీల ప్రాతినిధ్యం పెరగాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అనేక చర్యలను తీసుకుంటున్న విషయం తెలిసిందే. ప్రత్యేక సివిల్స్కు ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల కోసం బీసీ, ఎస్సీ, ఎస్టీ స్టడీ సర్కిల్స్తో పాటు మైనార్టీలకూ ప్రత్యేకంగా స్టడీ సర్కిల్స్ను ఏర్పాటు చేస్తోంది. మరోవైపు ముస్లింలపై కుట్ర పన్నేవిధంగా షోలు నిర్వహించడం సరైనదికాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. -
నన్ను అరెస్టు చేసే దమ్ముందా?
సాక్షి, బెంగళూరు: దమ్ముంటే తనను అరెస్టు చేయాలని ఎంపీ, బీజేపీ నాయకురాలు శోభ కరంద్లాజే ప్రభుత్వానికి సవాలు విసిరారు. జిహాద్కు వ్యతిరేకంగా మాట్లాడినందుకే తనను జైలులో పెట్టాలని చూస్తున్నారని ఆమె ఆరోపించారు. హన్నావరలో సంఘ్ కార్యకర్త పరేశ్మేస్తా హత్యతోపాటు కావ్యా నాయక్ అనే విద్యార్థి పై జరిగిన దాడిని ఖండిస్తూ సోషల్ మీడియాలో శోభ పోస్టులు చేయడంతో ఆమెపై స్థానిక పోలీస్స్టేషన్లో ఎఫ్ఐఆర్ దాఖలయ్యింది. ఈ నేపథ్యంలో శనివారం బెంగళూరులోని పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆమె తీవ్ర ఆగ్రహావేశాలతో మాట్లాడారు. ‘రాష్ట్ర ప్రభుత్వం బెదిరింపులకు నేను భయపడబోను. నన్ను అరెస్టు చేస్తే తదుపరి పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి. కొన్ని మైనారిటీ వర్గాలు అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నా పట్టించుకోకుండా, భారత సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణ కోసం పోరాడుతున్న వారి పై కేసులు నమోదు చేస్తూ రాజకీయ ప్రయోజనం పొందాలని చూడటం ఎంతవరకూ సమంజసం’ అని మండిపడ్డారు. వీరశైవ– లింగాయత సముదాయం మధ్య చిచ్చుపెట్టి లింగాయత్ సముదాయానికి మైనారిటీ హోదా కల్పించాలని కాంగ్రెస్ పార్టీ భావించడం వెనుక రాజకీయ కుట్ర దాగుందని శోభ విమర్శించారు. మహదాయిపై రాహుల్ వైఖరేమిటి? మహదాయి సమస్య పరిష్కారం కోసం ట్రిబ్యునల్ పరిధిలోనే బీజేపీ రాష్ట్రాధ్యక్షుడైన యడ్యూరప్ప, గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ పనిచేస్తుంటే ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పాటు ఇరు రాష్ట్రాల కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజకీయాలు చేస్తున్నారని శోభ అన్నారు. గోవాలోని కాంగ్రెస్ నాయకులు కర్ణాటకకు చుక్క నీరుకూడా వదలమని చెబుతున్నారన్నారు. ఈ వ్యవహారంలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్గాంధీ, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మహదాయిపై వారి వైఖరి ఏమిటనేది చెప్పాలని కోరారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కాంగ్రెస్కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
ఇరాన్ నుంచి పారిపోయి కొచ్చికి భారత మత్స్యకారులు
పాఠశాల నేపథ్యంలో వస్తోన్న సత్య.. ఆసక్తిగా ట్రైలర్!
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (06-05-2024)
Video: కేసీఆర్ బస్సును తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు
'దేవర' షూటింగ్లో తేనెటీగల కలకలం.. 20 మందికి గాయాలు
ఎస్ఆర్హెచ్తో ముంబై కీలక పోరు.. కొత్త ప్లేయర్ ఎంట్రీ
వారితో భయంకరమైన అనుభవాలు ఎదుర్కొన్నా: హీరామండి నటి
కేజ్రీవాల్కు మరో షాక్.. ‘ఎల్జీ’ సంచలన నిర్ణయం
తప్పక చదవండి
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- ‘SRH కాదు.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement