breaking news
jet crash
-
Jaguar jet Incident మొన్ననే ఎంగేజ్మెంట్, త్వరలో పెళ్లి, అంతలోనే విషాదం
గుజరాత్లోని జామ్నగర్ సమీపంలో భారత వైమానిక దళానికి చెందిన జాగ్వార్ యుద్ధ విమానం కుప్పకూలిన ప్రమాదంలో 28 ఏళ్ల పైలట్ ఫ్లైట్ లెఫ్టినెంట్ సిద్ధార్థ్ యాదవ్ చనిపోయిన తీవ్ర విషాదాన్ని నింపింది. ఆయనకు కొద్దిరోజుల క్రితమే నిశ్చితార్థం జరిగింది, మరికొన్ని రోజుల్లో పెళ్లి పీటలెక్కాల్సిన తమ కుమారుడు ఇలా అర్థాంతరంగా చనిపోవడంతో పైలట్ కుటుంబంలో విషాదం నెలకొంది.జాగ్వార్ ఫైటర్ జెట్ ప్రమాదంలో సిద్ధార్థ్ యాదవ్ అపారమైన ధైర్యాన్ని ప్రదర్శించారు. తన ప్రాణాలను లెక్క చేయకుండా సిద్ధార్థ్ కో-పైలట్ ఇతరులు ప్రాణాలను కాపాడిన తీరు పలువురి చేత కంట తడిపెట్టించింది. అపారమైన ధైర్యం, త్యాగం ఎన్నటికీ మరువ లేమంటూ పలువురు ఆయనకు నివాళి అర్పించారు.గత నెలలో (మార్చి 23) సిద్ధార్థకు నిశ్చితార్థం జరిగింది. నవంబర్ 2న అతని వివాహం జరిపించేందుకు కుటుంబం సన్నద్ధమవుతుండగా, ప్రాణాలు కోల్పోవడం షాక్కు గురి చేసింది. గుజరాత్లోని సువర్ద గ్రామంలో జామ్నగర్ నుండి దాదాపు 12 కిలోమీటర్ల దూరంలో, ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుండి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ప్రమాదం చోటుచేసుకుంది. సాంకేతిక లోపం కారణంగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. అయితే సిద్ధార్థ్ అతి క్లిష్టమైన సమయంలో అపారమైన ధైర్యాన్ని ప్రదర్శించి, జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతం నుండి జెట్ను పక్కను మళ్లించడంతో పెను ప్రమాదం తప్పింది. విమానం కూలిపోయిన తర్వాత మంటలు చెలరేగాయి. స్థానికులు సహాయక చర్యలు చేపట్టి, సంబంధిత అధికారులకు సమాచారం అందించారు. ప్రస్తుతం తీవ్రంగా గాయపడిన కో-పైలట్ మనోజ్ కుమార్ సింగ్ చికిత్స పొందుతున్నాడు. హర్యానిలోని రేవారిలోని భల్ఖి-మజ్రా గ్రామానికి సుశీల్ యాదవ, నీలం దంపతుల ఏకైక సంతానం సిద్ధార్థ్. సిద్ధార్థ్ ఫైటర్ పైలట్గా శిక్షణ పూర్తి చేసి 2016లో NDA పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన తర్వాత భారత వైమానిక దళంలో చేరారు. రెండేళ్లలోపు, అతను ఫ్లైట్ లెఫ్టినెంట్గా పదోన్నతి పొందాడు. అతని మరణ వార్త అతని కుటుంబంలోని ప్రతి ఒక్కరితోపాటు రేవారీ వాసులను కూడా తీవ్ర దుఃఖంలో ముంచెత్తింది.చదవండి: రాత్రికి రాత్రే సెన్సేషన్గా మారిపోయింది.. ఎవరీ ఐపీఎల్ గర్ల్?రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ ఉద్యోగి, ప్రస్తుతం LICలో పనిచేస్తున్న సుశీల్ యాదవ్ తన కొడుకు ధైర్యాన్ని తనకు గర్వకారణంగా అభివర్ణించారు. సిద్ధార్థ్ భౌతికకాయానికి ఆయన స్వస్థలంలో పూర్తి సైనిక గౌరవాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కాగా సిద్ధార్థ్ ముత్తాత కూడా బ్రిటిష్ కాలంలో బెంగాల్ ఇంజనీర్లలో పనిచేశారు. మరోవైపు, అతని తాత పారామిలిటరీ దళాలలో సభ్యుడు. అతని తండ్రి భారత వైమానిక దళంలో పనిచేశారు. -
బయలుదేరిన కొద్దిసేపటికే..
మాడ్రిడ్: స్పెయిన్ రాజధాని మాడ్రిడ్ సమీపంలో మిలటరీ యుద్ధవిమానం కూలిన ఘటనలో పైలట్ చనిపోయాడు. టోర్రెజోన్ డి ఆర్డోజ్ ఎయిర్బేస్ నుంచి మంగళవారం ఉదయం ఎఫ్-18 ఫైటర్ జెట్ విమానం బయలుదేరిన కొద్దిసేపటికే కూలిపోయింది. దీంతో పైలట్ తీవ్రగాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. స్పెయిన్ జాతీయదినం సందర్భంగా ప్రదర్శించే జెట్ విమానల్లో ఇదీ ఒకటని అధికారులు తెలిపారు. మృతి చెందిన పైలట్ ముర్సియాకు చెందిన లెఫ్టినెంట్ ఫెర్నాండో పెరెజ్ సెరానో(26) అని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రమాద సమయంలో విమానంలో అతడొక్కడే ఉన్నాడని వెల్లడించింది. కాగా, స్పెయిన్లో వారం వ్యవధిలో జరిగిన రెండో విమాన ప్రమాద ఘటన ఇది. గత గురువారం ఆల్బాసెట్ మిలటరీ బేస్ నుంచి బయలుదేరిన యూరోఫైటర్ జెట్ విమానం కూలిపోగా పైలట్ మృత్యువాతపడ్డాడు. -
ఇళ్లపై కూలిన విమానం, 32 మంది మృతి
-
ఇళ్లపై కూలిన విమానం, 32 మంది మృతి
బిష్కెక్: కిర్జిస్థాన్లోని మనాస్ విమానాశ్రయం సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. సోమవారం ఉదయం టర్కీష్ ఎయిర్లైన్స్ కార్గోకు చెందిన విమానం జనావాసాలపై కూలిపోయింది. ఈ ప్రమాదంలో కనీసం 32 మంది మరణించారని కిర్జీ ప్రభుత్వం ప్రకటించింది. సహాయక సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి చర్యలు చేపట్టారు. ఓ పైలట్, మరో 29 మంది మృతదేహాలను వెలికితీశారు. ఇళ్లపై విమానం కూలిపోవడంతో ప్రాణనష్టం ఎక్కువగా జరిగింది. మృతుల్లో స్థానికులే ఎక్కువగా ఉన్నారు. ఈ ప్రమాదంలో చాలామంది గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. కాగా విమానంలో ఎంత ఉన్నారు, ఎక్కడకు వెళ్తోంది వంటి విషయాలు తెలియరాలేదు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది. -
రష్యాలో విమాన ప్రమాదం, 50 మంది మృతి
స్థానిక ఎయిర్ లైన్ కు చెందిన బోయింగ్ 737 విమానం ల్యాండింగ్ సమయంలో ప్రమాదానికి గురైన ఘటనలో 50 మంది మృతి చెందారు. ఈ విమానంలో 44 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నట్టు ప్రాథమిక సమాచారం. ఈ దుర్ఘటన వెస్టర్న్ తతర్స్ఠాన్ సమీపంలో చోటుచేసుకుంది. మాస్కో డమోదేద్వ్ ఎయిర్ పోర్ట్ నుంచి వస్తున్న విమానం కజన్ లోని ఓల్గాలో 7.25 ప్రమాదానికి గురైంది. రన్ వేను ఢికొట్టడంతో మంటలు అంటుకున్నాయని అధికారులు తెలిపారు. ప్రమాదానికి గురి కావడానికి ముందు మూడు సార్లు ల్యాండింగ్ అవటానికి ప్రయత్నం జరిగింది అని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు.