breaking news
Jaya nageswara reddy
-
ఎన్నికలకు రెండేళ్ల ముందే.. టీడీపీలో టిక్కెట్ల లొల్లి!
సాక్షి ప్రతినిధి కర్నూలు: ఎన్నికలకు రెండేళ్ల ముందే టీడీపీలో టిక్కెట్ల లొల్లి మొదలైంది. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితి, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు అవకాశాలను బేరీజు వేసుకుని ఎక్కడి నుంచి పోటీ చేస్తే బాగుంటుంది? అందుకు ఇప్పటి నుంచే ఎలా సన్నద్ధం కావాలి? అనే దిశగా టీడీపీ నేతలు పావులు కదుపుతున్నారు. టీడీపీ అత్యంత బలహీనంగా ఉన్న జిల్లాలపై చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. కనీసం కొన్ని స్థానాలైనా గెలిచి ఉనికి కాపాడుకోవాలని, అందుకు తగ్గట్లు ఎలాంటి మార్పులు చేస్తే బాగుంటుందని ఇటీవల పార్టీ ముఖ్యులతో చర్చించినట్లు తెలుస్తోంది. చదవండి: సీఎం జగన్ స్పీచ్ ప్రారంభం కాగానే.. ఇందులో భాగంగా కర్నూలు పార్లమెంట్ పరిధిలో టిక్కెట్ల కేటాయింపుపై మాజీ ఎంపీ కోట్ల సూర్యప్రకాష్రెడ్డితో చంద్రబాబు చర్చించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాయలసీమలో టీడీపీ అత్యంత బలహీనంగా ఉన్న జిల్లాలలో వైఎస్సార్, కర్నూలు మొదటిస్థానంలో ఉన్నాయి. జిల్లాలో 2004 నుంచి జరిగిన ఎన్నికల్లో టీడీపీ అత్యధికంగా గెలిచిన ఎమ్మెల్యే సీట్లు కేవలం నాలుగు మాత్రమే. గత ఎన్నికల్లో టీడీపీ ఉనికి లేకుండా పోయింది. ఆ పార్టీ సర్వే ప్రకారం వచ్చే ఎన్నికల్లో కూడా ప్రతికూల ఫలితాలే తప్పవని తేలినట్లు తెలుస్తోంది. దీంతో మార్పులు, చేర్పులపై చర్చించి నియోజకవర్గాలకు బాధ్యులను నియమించి పూర్తి స్వేచ్ఛ ఇస్తే బాగుంటుందని చంద్రబాబు భావించారు. ఎమ్మెల్యేగా పోటీచేసే యోచనలో కోట్ల కాంగ్రెస్ పార్టీలో ఉన్న రోజుల్లో కర్నూలు పార్లమెంట్ స్థానంలో కోట్ల సూర్యప్రకాశ్రెడ్డి తిరుగులేని నేత. తమకు పార్టీ బలం కాదని, పార్టీకి తామే బలమనే యోచనలో ఆయన ఉండేవారు. 2014లో కాంగ్రెస్, 2019లో టీడీపీ నుంచి పోటీ చేసిన కోట్ల ప్రస్తుతం ఉనికి కాపాడుకునే ప్రయత్నంలో ఉన్నారు. రెండు దఫాలుగా ఓటమి ఎదురవడంతో స్వతహాగా తనకు గెలిచే శక్తి లేదని, పార్టీ బలం కీలకమనే వాస్తవంలోకి వచ్చారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో 2024లో కూడా కర్నూలు పార్లమెంట్లో వైఎస్సార్సీపీ ప్రభంజనం ఉంటుందని గ్రహించారు. అత్యధిక అసెంబ్లీ సీట్లు ఆపార్టీ గెలుస్తుందనే నిర్ణయానికి వచ్చారు. పైగా టీడీపీ 40ఏళ్ల చరిత్రలో 1984లో ఏరాసు అయ్యపురెడ్డి, 1999లో కేఈ కృష్ణమూర్తి మినహా కర్నూలు పార్లమెంట్ స్థానంలో టీడీపీ గెలిచిన దాఖలాలు లేవు. 2004 నుంచి జరిగిన నాలుగు ఎన్నికల్లోనూ ఘోర పరాభవం తప్పలేదు. ఈ క్రమంలో ఎంపీగా పోటీచేస్తే ఓటమి తప్పదని, అదే జరిగితే రాజకీయంగా ఇక శుభం కార్డు పడినట్లే అని కోట్ల ఆత్మరక్షణలో పడ్డారు. అసెంబ్లీకి పోటీచేస్తే కనీసం నియోజకవర్గంపై శ్రద్ధపెట్టి గెలిచేందుకు ప్రయతి్నంచొచ్చని ఎమ్మిగనూరు బరిలో నిలిచేందుకు సిద్ధమయ్యారు. కుటుంబానికి ఒకే టిక్కెట్ కోటాలో సుజాతమ్మ ఔట్ కుటుంబానికి ఒకే టిక్కెట్ ఇస్తామనే నిర్ణయాన్ని టీడీపీ అమలు చేస్తే కోట్ల సుజాతమ్మ ఆలూరు నుంచి తప్పుకోక తప్పదు. ఇప్పటికే ఆలూరు టిక్కెట్ రేసులో ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్, వీరభద్రగౌడ్ కూడా ఉన్నారు. వీరితో పాటు వైకుంఠం మల్లికార్జున చౌదరి కూడా టిక్కెట్ ఆశిస్తున్నారు. నియోజకవర్గంలో బలమైన సామాజికవర్గాలు బోయ, కురబ. ఈ క్రమంలో బోయ సామాజిక వర్గానికి టిక్కెట్ ఇవ్వాలని టీడీపీ భావిస్తే వీరిని కాదని చివరి నిమిషంలో కొత్త ముఖాన్ని తెరపైకి తీసుకొచ్చే అవకాశం ఉంది. కర్నూలు టిక్కెట్ మైనార్టీలకే ఇచ్చే యోచన కర్నూలు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్గా టీజీ భరత్ ఉన్నారు. రాజకీయంగా చురుగ్గా లేకపోవడం, టీజీ వెంకటేశ్ బీజేపీలో, భరత్ టీడీపీలో ఉంటూ రాజకీయంగా ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయారు. పైగా వైఎస్సార్సీపీ కర్నూలులో అత్యంత బలంగా ఉంది. ఈ క్రమంలో టీజీ కుటుంబానికి టిక్కెట్ ఇస్తే ఓటమి తప్పదని, తాము కూడా మైనార్టీ నేతను బరిలోకి దింపితే కనీసం గట్టిపోటీ అయినా ఇవ్వగలమనే యోచనకు చంద్రబాబు వచ్చినట్లు తెలుస్తోంది. డీసీసీ మాజీ అధ్యక్షుడు అహమ్మద్ అలీఖాన్ను కర్నూలు బరిలో నిలిపేందుకు దాదాపు నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. కోట్ల చొరవతోనే అహమ్మద్ అలీఖాన్ కాంగ్రెస్ పారీ్టకి రాజీనామా చేశారని తెలిసింది. ఈ క్రమంలో ఐదునెలల కిందట కర్నూలు అసెంబ్లీ సీటుపై చంద్రబాబుతో జరిగిన సమీక్షలో భరత్ ఈ విషయాన్ని ఆరా తీసినట్లు తెలుస్తోంది. అయితే చంద్రబాబు నుంచి భరోసా రాలేదు. దీంతో భరత్ నిరాశగా వెనుదిరిగారు. టీజీ వెంకటేశ్ కూడా టీడీపీలో చేరితే అప్పుడు కర్నూలు ఎంపీ లేదా రాజ్యసభ ఇచ్చి, అసెంబ్లీ నుంచి పక్కనపెట్టే యోచనకు టీడీపీ వచ్చినట్లు తెలుస్తోంది. ఎమ్మిగనూరు టీడీపీ వర్గాన్ని కలుపునేలా పావులు ఎమ్మిగనూరులో గత డిసెంబర్లో టీడీపీ కార్యాలయాన్ని కోట్ల ప్రారంభించారు. మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి లేకుండానే ఈ కార్యక్రమాన్ని చేశారు. జయనాగేశ్వరరెడ్డి వ్యతిరేక వర్గీయులైన గోనెగండ్ల మాజీ ఎంపీపీ కృష్ణారెడ్డి, సింగిల్విండో మాజీ అధ్యక్షుడు పరమేశ్వరరెడ్డి, మాజీ సర్పంచ్ రంగమునితో పాటు పలువురిని ఆహ్వానించారు. పైగా పార్టీ ఆదేశిస్తే ఎవ్వరైనా పోటీ చేయొచ్చని కోట్ల ప్రకటన చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ లద్దగిరిలోని ఆయన నివాసానికి వచ్చేవారిలో అత్యధిక శాతం ఎమ్మిగనూరు నేతలు, కార్యకర్తలే ఉంటున్నారు. జయనాగేశ్వరరెడ్డి కూడా నియోజకవర్గానికి అందుబాటులో లేకుండా హైదరాబాద్లో మకాం వేశారు. ఈ క్రమంలో రానున్న ఎన్నికల్లో కోట్లనే బరిలోకి దిగుతారని ఎమ్మిగనూరులోని కీలక టీడీపీ నేతలు బాహాటంగానే వ్యాఖ్యానిస్తున్నారు. -
ఎమ్మిగనూరులో ఎమ్మెల్యే రాజ్
ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాజ్ నడుస్తోంది. నియోజకవర్గంలో అటు పుల్ల ఇటు జరగాలన్నా ఎమ్మెల్యే అనుమతి తప్పనిసరనే రీతిలో వ్యవహారం సాగుతోంది. అంగన్వాడీ పోస్టుల నుంచి నీరు–చెట్టు కాంట్రాక్టుల వరకు అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి గ్రీన్సిగ్నల్ ఇస్తేనే అడుగు ముందుకు పడే పరిస్థితి నెలకొంది. నియోజకవర్గంలో కోట్లాది రూపాయల విలువైన నీరు–చెట్టు పనులను చేపట్టారు. అన్ని పనులను ఒక పెద్ద కాంట్రాక్టర్కు అప్పగించి 20 శాతం మేర కమీషన్ తీసుకున్నారన్న విమర్శలున్నాయి. ఇక వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఎమ్మెల్యే పీఏ డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఫిర్యాదులు ఉన్నాయి. ఈ విషయంలో ఏకంగా జిల్లా ఇన్చార్జ్ మంత్రికి నేరుగా ఒక బాధితురాలు ఫిర్యాదు చేశారు. మరోవైపు పార్టీని నమ్ముకున్న తమకు కనీస ప్రాధాన్యత ఇవ్వడం లేదని, తమ మాట చెల్లుబాటు కాకుండా చేస్తున్నారని పార్టీ నేతలు అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. తమ వద్ద ఎమ్మెల్యే డబ్బులు తీసుకుని తిరిగి చెల్లించడం లేదంటూ అధికార పార్టీకే చెందిన నేతలు మంత్రి లోకేష్ను కలిసి విన్నవించారు. మరోవైపు జిల్లా పరిషత్ వైస్ చైర్పర్సన్ పుష్పావతి... ఎమ్మెల్యే తనకు నీరు–చెట్టు పనులు ఇవ్వలేదంటూ ఏకంగా సీఎం దృష్టికి తీసుకెళ్లి ప్రత్యేకంగా రూ.4 కోట్ల పనులు మంజూరు చేయించుకున్నారు. సాక్షి ప్రతినిధి, కర్నూలు :మొదటి సారి ఎమ్మెల్యేగా గెలిచారు. తమ సమస్యలను పరిష్కరించి ‘చేనేత పురి’ని అభివృద్ధి పథంలో నడిపిస్తారని నియోజకవర్గ ప్రజలు ఆశించారు. ప్రజలు ఒకటి తలిస్తే.. ఎమ్మెల్యే మరొకటి తలిచారు. పదవి మళ్లీ వస్తుందో, లేదో అనుకున్నాడేమో గానీ.. ‘సొంత’ వ్యవహారాలు చక్కబెట్టుకోవడంలోనే బిజీ అయిపోయారు. ‘ఇందుగలడు అందులేడని సందేహము వలదు’ అన్నట్లుగా అన్నింటా ‘స్వప్రయోజనాలకే’ పెద్దపీట వేస్తున్నారు. తన వ్యవహారాలను చక్కబెట్టడానికి ఏకంగా ఆరుగురితో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసుకున్నారు. మంచి స్థానంలో పోస్టింగ్ వేయిస్తానంటూ ఉద్యోగుల నుంచి, నామినేటెడ్ పదవులు ఇప్పిస్తానంటూ నాయకుల నుంచి వసూళ్లకు పాల్పడుతున్నట్లు విమర్శలున్నాయి. అప్పుగా తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వకపోవడం, అభివృద్ధి పనుల్లో ‘వాటా’ దండుకోవడం కూడా నైజంగా మార్చుకున్నారన్న అపవాదును ఎదుర్కొంటున్నారు. మొత్తంగా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి తీరు చూసి ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. ఆయన బాటలోనే అనుచర గణం, సొంత పార్టీ నేతలు కూడా పయనిస్తుండడం గమనార్హం. నీరు– చెట్టు.. ఒక్కరికే కట్టబెట్టు! ఎమ్మిగనూరు నియోజకవర్గంలో నీరు–చెట్టు పథకం కింద రూ. 50 కోట్లను మంజూరు చేశారు. ఈ పనులను పార్టీ నేతలు, కార్యకర్తలకు ఎమ్మెల్యే ఇవ్వలేదు. ఒక పెద్ద కాంట్రాక్టరుకు ఇచ్చి ఆయన వద్ద నుంచి కమీషన్ దండుకున్నారని సొంత పార్టీ నేతలే విమర్శిస్తున్నారు. పార్టీని నమ్ముకున్న తమకు కనీసం ఒక్కటంటే ఒక్క పనీ ఇవ్వలేదని వారు వాపోతున్నారు. ఇందులో కనీసం 20 శాతం కమీషన్ ఎమ్మెల్యే తీసుకున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక జెడ్పీ వైస్ చైర్పర్సన్ పుష్పావతి వర్గం కూడా ప్రత్యేకంగా రూ.4 కోట్ల విలువైన నీరు–చెట్టు పనులను మంజూరు చేయించుకుంది. ఈ పనులన్నీ తూతూ మంత్రంగా కానిచ్చి పైసలు దండుకున్నారు. నందవరం మండలంలోని వంకలో మట్టిపెళ్లలు పైకి తీసి నిధులు భోంచేశారు. నీరు–చెట్టు కింద గాజులదిన్నె ప్రాజెక్టు చుట్టూ మట్టి కట్టడాన్ని మరింత గట్టిగా చేసే పని (బండింగ్) చేశారు. రెండు నెలలు కూడా గడవకముందే అప్పుడే మట్టి మొత్తం కిందకు పడిపోతోంది. ఈ విధంగా తూతూమంత్రంగా చేసిన పనుల ద్వారా నిధులు కొల్లగొట్టగా.. ఇందులో ఎమ్మెల్యే ఏకంగా రూ.10 కోట్ల మేర ఆర్జించినట్లు తెలుస్తోంది. ఇక కొన్ని పనులను కిందిస్థాయి నేతలు కూడా నేరుగా తెచ్చుకున్నారు. ఆంజనేయుని భూములపై ‘అధికార’ గద్దలు నందవరం మండలంలోని నదికైరవాడి గ్రామంలో శ్రీ ఆంజనేయస్వామి దేవాలయానికి సర్వే నెం. 4లో 23.89 ఎకరాల భూమి ఉంది. ఈ భూమి విలువ ఎకరా రూ.15 లక్షలపైమాటే. నదికైరవాడి, ఇబ్రహీం కొట్టాల గ్రామాలకు చెందిన టీడీపీ నేతలు దేవాలయ భూమిని కబ్జా చేశారు. తమ పేరు మీద పాసు పుస్తకాలు చేయించుకున్నారు. పట్టాదారు ఖాతానెం. 2లో వీరభద్రప్పకు 5.97 ఎకరాలు, అదే ఖాతా నెంబర్లో ఎకరా ఉంది. ఖాతా నెం.45లో ఆర్.కృష్ణమూర్తికి 3 ఎకరాలు, ఖాతా నెం.88లో తిమ్మప్పకు 6 ఎకరాలు, ఖాతా నెం.5100లో సత్యనారాయణకు 2.95 ఎకరాలు, 5145లో షణ్ముఖకు 5.9 ఎకరాలు ఉన్నట్లు పాసు పుస్తకాలు జారీ చేశారు. టెన్వన్ అడంగల్లోనూ వీరి పేర్లు నమోదు చేశారు. ఆన్లైన్లోనూ చేర్చేశారు. అయితే.. సర్వే నెం.4లో 23.89 ఎకరాల మెట్ట భూమి శ్రీ ఆంజనేయస్వామికి చెందినదిగా రెవెన్యూ సర్వీసు రికార్డు (ఆర్ఎస్ఆర్)లో ఉంది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోని రికార్డుల్లో కూడా దేవాలయం భూమిగానే ఉంది. వసూళ్లకో టీం ఎమ్మిగనూరు నియోజకవర్గంలో అధికారపార్టీ నేతలు వసూళ్ల దందాకు కొత్త విధానాన్ని తీసుకొచ్చారు. అధికార పార్టీ ముఖ్యనేత పీఏ, రిటైర్డు డీఈ, ప్రస్తుత డీఈ, ఎల్ఐసీలో పనిచేసే ఉద్యోగితో పాటు పోలీసుశాఖలోని ఓ ఉద్యోగి కూడా ముఖ్యపాత్ర పోషిస్తుండటం గమనార్హం. ఏయే శాఖలోని ఉన్నతస్థాయి ఉద్యోగులు ఎంత మేర అక్రమంగా ఆర్జిస్తున్నారనే వివరాలను ఈ టీం సేకరిస్తోంది. ఈ నేపథ్యంలో అన్ని శాఖలకు చెందిన ఉన్నతాధికారులు నెలవారీగా అధికార పార్టీ నేతలకు మామూళ్లు అందించాల్సిన ప్రత్యేక దుస్థితి ఈ నియోజకవర్గంలో మాత్రమే నెలకొంది. ఇక ఎమ్మెల్యే సొంత పార్టీ నేతల నుంచి డబ్బు తీసుకుని.. తిరిగి చెల్లించడం లేదన్న విమర్శలున్నాయి. అధికార పార్టీకే చెందిన మునిసిపల్ చైర్పర్సన్ సాయి సరస్వతి నేరుగా మంత్రి లోకేష్ను కలిసి ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ ఎటువంటి చర్యలూ తీసుకోలేదని, తమను మోసం చేశారని వారంతా వాపోతున్నట్లు అధికార పార్టీ నేతలే అంటున్నారు. మున్సిపల్ స్థలంపై ‘దేశాయి’ పడగ ఎమ్మిగనూరు పట్టణ నడిబొడ్డుగా పేర్కొనే గీతామందిరం వెనుక ఉన్న 33 సెంట్ల మున్సిపల్ స్థలం తమదేనంటూ టీడీపీ జిల్లా కార్యదర్శి మాధవ్రావు దేశాయి కబ్జాకు దిగాడు. దీని ప్రస్తుత మార్కెట్ ధర రూ.3 కోట్ల పైమాటే. ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి అండదండలున్నాయని, ఆర్థిక లావాదేవీలు పూర్తయ్యాయంటూ ఏకంగా మున్సిపల్ కార్యాలయంలోనే హల్చల్ చేశాడు. అందులో నిరుపేదలు వేసుకొన్న కొట్టాలు తొలగించి తనకు స్థలం అప్పగించాల్సిందిగా ఆదేశాలు జారీచేస్తున్నాడు. కానీ రికార్డుల మేరకు ఎల్పీసీ 420 నెంబర్తో మున్సిపల్ స్థలంగా నమోదయ్యింది. ఎమ్మెల్యే పీఏపై ఫిర్యాదులు ఎమ్మిగనూరు నియోజకవర్గ అధికార పార్టీ ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి వ్యక్తిగత సహాయకుడు (పీఏ)పై అనేక ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఉద్యోగాలు ఇప్పిస్తామని తమ నుంచి భారీగా డబ్బు వసూలు చేశారని పలువురు ఆరోపిస్తున్నారు. డీఆర్డీఏ–వెలుగులో ఏపీఓ ఉద్యోగం ఇప్పిస్తానంటే పీఏకు రూ.3 లక్షలు ఇచ్చానంటూ ఓ బాధితురాలు ఏకంగా జిల్లా కేంద్రానికి వచ్చి మరీ ఫిర్యాదు చేశారు. ఇందుకు అనుగుణంగా కొన్ని ఆధారాలను కూడా బయటపెట్టారు. ఇతర విషయాల్లో కూడా పీఏపై అనేక ఆరోపణలు వచ్చినప్పటికీ ఎమ్మెల్యే వెనకేసుకురావడం గమనార్హం. వాస్తవానికి ఎమ్మెల్యే పీఏ కూడా ఒక అధికార కేంద్రంగా మారిపోయారు. ఆయన కనుసన్నల్లోనే ఎమ్మెల్యే కదలికలు ఉంటాయనే రీతిలో పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలకు సందేశాలు పంపారు. పీఏకు అనుకూలంగా ఉంటేనే ఎమ్మెల్యే కూడా తమకు సహాయపడతారనే రీతిలో వ్యవహారం సాగింది. ఈ వ్యవహారంపై విజిలెన్స్కు కూడా ఫిర్యాదులందాయి. విజిలెన్స్ అధికారులు ప్రాథమికంగా విచారణ చేపట్టినట్టు తెలుస్తోంది. మరోవైపు నియోజకవర్గంలోని వ్యవసాయ పాలిటెక్నిక్ కాలేజీలో ఉద్యోగాల పేరుతో అధికారపార్టీ నేతలు భారీగానే దండుకున్నారన్న విమర్శలున్నాయి. ఒక్కో పోస్టుకు రూ.3 లక్షల మేర వసూలు చేసినట్టు తెలుస్తోంది. 10వ తరగతి పాసైన వారు కూడా పాలిటెక్నిక్ కాలేజీకి వెళ్లి.. ఏమైనా ఉద్యోగాలు ఉన్నాయా చెప్పండని అక్కడి సిబ్బందిని అడుగుతున్నారు. అధికార పార్టీ నేతలకు రూ.3 లక్షలు ఇచ్చి లేఖ తెస్తామని అంటున్నారు. ఈ విధంగా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఏ వ్యవహారం చూసినా అధికార పార్టీ నేతల అండదండలు లేనిదే ముందుకు సాగని పరిస్థితి నెలకొంది. పుష్పావతిపై కబ్జా ఆరోపణలు నందవరం మండలం జోహరాపురం గ్రామంలో 3.5 ఎకరాల పోరంబోకు స్థలాన్ని జిల్లాపరిషత్ వైస్ చైర్ప ర్సన్ పుష్పావతి కబ్జా చేసినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దశాబ్దాల కాలంగా తమ పొలాలపక్కన ఉన్న పోరంబోకు స్థలాన్ని సాగుచేస్తున్నామని, ఏకంగా జిల్లా కలెక్టర్ పేరు చెప్పి జెడ్పీ వైస్ చైర్పర్సన్ ఈ స్థలాన్ని ఆక్రమించుకున్నారని రైతులు వాపోతున్నారు. దందా ఇలా.. ♦ ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఏ పనైనా అధికారపార్టీ నేతలకు మామూళ్లు ముట్టనిదే ముందుకు సాగడం లేదు. మునిసిపాలిటీలో కాంట్రాక్టు కార్మికుల నియామకం మొదలు.. అక్రమ వెంచర్ల వరకూ మామూళ్ల వ్యవహారం నడుస్తోంది. ♦ మున్సిపల్ కాంట్రాక్టు కార్మికుల నియామకం కోసం 70 మంది దగ్గర రూ.80,000 చొప్పున మొత్తం రూ.56 లక్షలు తీసుకున్నారు. ♦ ఎమ్మిగనూరు తహసీల్దార్గా పనిచేసేందుకు ఒక్కొక్కరి నుంచి రూ.10 లక్షల చొప్పున మొత్తం రూ.30 లక్షలు సేకరించగా.. ఇక సీఐ పోస్టింగ్ కోసం రూ.10 లక్షలు తీసుకున్నారు. ♦ ఎమ్మిగనూరు పట్టణంలో వెలుస్తున్న అక్రమ లే–అవుట్లను కూడా ఆదాయ వనరుగా మార్చుకున్నారు. నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఇంతవరకూ ఒక్క అధికారిక లేఅవుట్ కూడా వేయలేదు. వేసినవన్నీ అక్రమమే. అధికార పార్టీకే చెందిన ఒక నేత పీఏ వేసిన పొలంలో అక్రమ లే–అవుట్లకు అనుమతులు ఇచ్చినందుకు రూ.25 లక్షలు వసూలు చేసినట్టు తెలుస్తోంది. ♦ ఎద్దుల మార్కెట్ దగ్గర వేసిన వెంచర్ యజమానుల నుంచి రూ.24 లక్షలు, మంత్రాలయం రోడ్డులో వెలసిన అక్రమ వెంచర్ కోసం రూ.28 లక్షల మేర వసూలు చేశారు. ఇవే కాకుండా మరో 12 అక్రమ వెంచర్లకు గాను రూ.1.20 కోట్లు అధి కార పార్టీ నేతల జేబుల్లోకి చేరాయి. ♦ నామినేటెడ్, ప్రధాన పాలనా పదవులకు రేట్లు కట్టడం ఇక్కడ పరిపాటిగా మారింది. మార్కెట్యార్డు చైర్మన్ పోస్టుకు గతంలో రూ.40 లక్షలు, ఇప్పుడు రూ.30 లక్షలు వసూలు చేశారనే విమర్శలున్నాయి. టౌన్బ్యాంక్ చైర్మన్ పోస్టును రూ.25 లక్షలకు ఇచ్చారనే ఆరోపణలూ ఉన్నాయి. ♦ మండల పరిషత్ షాపింగ్ కాంప్లెక్స్ కేటాయింపునకు రూ. కోటికిపైగా వసూలు చేశారు. ఇక ఎంపీపీ కాంప్లెక్స్లోని మరో రెండు షాపులకు రూ.25 లక్షలు అధికారపార్టీ నేతలకు ముట్టచెప్పినట్టు తెలుస్తోంది. ♦ విద్యుత్ సబ్స్టేషన్లలో ఆపరేటర్ల నియామకానికి 18 పోస్టులకు గాను ఒక్కొక్క పోస్టుకు రూ.3,00,000 చొప్పున మొత్తం రూ.54 లక్షలు వసూలు చేశారు. -
ఫ్రోగ్రెస్ రిపోర్ట్ ఎమ్మెల్యే బి. జయనాగేశ్చర రెడ్డి
-
నేత... మేత
అధికార పార్టీ ఎమ్మెల్యేకు అవినీతి మరక! రూ.5 లక్షలు తీసుకున్నా ఉద్యోగం తిరిగి ఇప్పించలేదని ఆరోపణ అధికార పార్టీ వర్గపోరులో తొలగింపు ఫిర్యాదు చేసేందుకు పార్టీ కార్యాలయం వద్దకు వెళితే అడ్డుకున్న నేతలు అనంతరం డిప్యూటీ సీఎంను కలిసి ఎమ్మిగనూరు ఎమ్మెల్యేపై ఫిర్యాదు ఆరా తీసిన అధిష్టానం? కర్నూలు: అధికార పార్టీకి చెందిన ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డికి అవినీతి మరక అంటుకుంది. ఉద్యోగం తిరిగి ఇప్పిస్తానంటూ తన నుంచి రూ.5 లక్షలు వసూలు చేసి.. ఇప్పటి వరకు న్యాయం చేయలేదని గతంలో ఏపీఓగా పనిచేసిన సీతమ్మ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తిని కలిసి ఫిర్యాదు చేశారు. అధికార పార్టీ నేతల వర్గపోరులో తనను ఉద్యోగం నుంచి ఎమ్మెల్యే తీసేయించారని.. తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవాలంటే రూ.5 లక్షలు అడిగారన్నారు. అయితే, తీరా రూ.5లక్షలు ఇచ్చినప్పటికీ ఉద్యోగం మాత్రం తిరిగి ఇప్పించలేదని వాపోయారు. తనకు న్యాయం జరిగేలా చూడాలని ఆయనను వేడుకుంది. మరోవైపు అంతకుముందు ఈ విషయంలో హైడ్రామా నడిచింది. టీడీపీ కార్యాలయం వద్ద ఎమ్మెల్యేతో పాటు డిప్యూటీ సీఎంను కలిసి విన్నవించేందుకు ఆమె ప్రయత్నించగా అక్కడి నుంచి ఆమెను అధికార పార్టీ నేతలు నెట్టేశారు. అనంతరం గెస్ట్హౌస్ వద్ద డిప్యూటీ సీఎంను కలిసి ఆమె తన గోడు వినిపించింది. మొత్తంగా ఎమ్మెల్యేపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఈ విషయాన్ని ఆ పార్టీ అధిష్టానం కూడా ఆరా తీసినట్టు సమాచారం. వివరాల్లోకి వెళితే.... నందవరం మండలంలో ఉపాధి హామీ పథకం ఏపీఓగా సీతమ్మ పని చేస్తోంది. అయితే, అధికార పార్టీకే చెందిన జెడ్పీ వైస్-చైర్పర్సన్ పుష్పావతమ్మకు అనుకూలంగా పనిచేస్తున్నారనే భావనతో అవినీతి ఆరోపణలు సాకుగా చూపి తనను ఎమ్మెల్యే డిసెంబర్ 31, 2014న సస్పెండ్ చేశారని బాధితురాలు చెబుతోంది. అనంతరం ఆగస్టు 18, 2015లో ఏకంగా తనను ఉద్యోగం నుంచి టెర్మినేట్ చేశారని వాపోయింది. అయితే, తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవాలంటే ఎమ్మెల్యేకు రూ.5 లక్షలు ఇవ్వాలంటూ ఎమ్మెల్యే పీఏ సురేష్తో పాటు ఎంపీపీ నరసింహారెడ్డి తనను అడిగారని ఆమె ‘సాక్షి’కి వివరించింది. మొదట ఎమ్మెల్యే క్వార్టర్స్లో రూ. 2 లక్షలు ఇచ్చానని.. మిగిలిన రూ. 3లక్షలు ఎమ్మిగనూరులో ఇచ్చానని తెలిపారు. అయితే, డబ్బులు తీసుకున్నప్పటికీ ఉద్యోగం తిరిగి ఇప్పించలేదని.. ఇదే విషయాన్ని డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్లానన్నారు. ఎమ్మెల్యేనే ఉద్యోగం నుంచి తొలగించారు నందవరంలో గతంలో ఏపీఓగా పనిచేస్తున్న సీతమ్మను ఉద్యోగం నుంచి ఎమ్మెల్యేనే సస్పెండ్ చేయించిన మాట వాస్తవం. కేవలం నాతో అనుకూలంగా ఉన్నారన్న ఆరోపణలతోనే ఉద్యోగం నుంచి తొలగించారు. అయితే, ఉపాధి పనులు రైతులందరికీ జరిగాయి. ఇదే విషయాన్ని రైతులు కూడా చెప్పారు. అయితే ఆడిట్ వాళ్లపై కూడా ఎమ్మెల్యే ఒత్తిడి తెచ్చి.. అవినీతి జరిగిందని రాయించారు. ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి ఇప్పించకపోవడం దారుణం. - పుష్పావతమ్మ, నందవరం జెడ్పీటీసీ సభ్యురాలు వర్గ పోరుతో ఉద్యోగం ఊడింది వాస్తవానికి అధికార పార్టీ నేతల మధ్య నెలకొన్న వర్గపోరుతోనే ఈ మొత్తం వ్యవహారంలో సదరు ఉద్యోగి ఉద్యోగం ఊడిందని తెలుస్తోంది. ఇదే విషయాన్ని అటు బాధితురాలితో పాటు ఇటు అధికార పార్టీ నేత జెడ్పీ వైస్-చైర్పర్సన్ పుష్పావతమ్మ కూడా చెబుతుండటం గమనార్హం. నందవరం జెడ్పీటీసీ సభ్యురాలు పుష్పావతమ్మకు, ఎమ్మెల్యేకు మధ్య ఉన్న వర్గపోరులో ఏపీఓ బలిపశువు అయినట్లు తెలుస్తోంది. కేవలం తన పనులు మాత్రమే చేస్తున్నారనే ఆరోపణలతో ఆమెను ఉద్యోగం నుంచి తొలగించారని పుష్పావతమ్మ కూడా చెబుతున్నారు. మొత్తంగా అధికార పార్టీలోని వర్గపోరులో కొద్దిరోజుల క్రితం ఏకంగా నంద్యాలలో మునిసిపల్ ఉద్యోగిపై దాడి జరగగా... తాజాగా ఉద్యోగం ఊడిన వ్యవహారం బయటపడటం చర్చనీయాంశమవుతోంది. -
కోర్టుకు హాజరైన టీడీపీ ఎమ్మెల్యే
ఎమ్మిగనూరు టౌన్: ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసులో కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు టీడీపీ ఎమ్మెల్యే డాక్టర్ బి.వి.జయనాగేశ్వరరెడ్డి సోమవారం ఎమ్మిగనూరు జూనియర్ సివిల్ జడ్జి కోర్టుకు హాజరయ్యారు. గత మార్చి 30న మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పట్టణంలోని ఆదిఆంధ్ర పాఠశాలలోని పోలింగ్ బూత్కు సమీపంలో ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఓటర్లతో చర్చిస్తుండటంతో పట్టణ పోలీసులు ఆయనపై కోడ్ ఉల్లంఘన కేసు నమోదు చేశారు. సోమవారం ఈ కేసు వాయిదా ఉండటంతో ఎమ్మెల్యే కోర్టుకు హాజరయ్యారు. తదుపరి విచారణను స్థానిక జూనియర్ సివిల్ జడ్జి రవిశంకర్ ఆగస్టు 25వ తేదీకి వాయిదా వేశారు.