breaking news
janakiramaiah
-
‘నాకు, నా ఆస్తులకు రక్షణ కల్పించాలి’
కృష్ణా జిల్లా: తనకు, తన ఆస్తులకు ప్రభుత్వం రక్షణ కల్పించాలని దివంగత పారిశ్రామికవేత్త యెర్నేని జానకిరామయ్య పెద్ద కుమార్తె శ్రీరాజరాజేశ్వరి కోరారు. శనివారం కృష్ణా జిల్లా గంగూరులో విలేకరులతో ఆమె మాట్లాడుతూ.. తన తండ్రి యెర్నేని జానకిరామయ్య నుంచి తనకు గోడౌన్లు, ఇతర ఆస్తులు సంక్రమించాయని చెప్పారు. గంగూరులో 1988 నుంచి ఆస్తులు తన స్వాధీనంలో ఉన్నాయని, ప్లాన్లు, విద్యుత్ బిల్లులు కూడా తన పేరుతోనే ఉన్నాయని తెలిపారు. తన సోదరీమణులు అమరేశ్వరి, విజయేశ్వరి (ఈనాడు రామోజీరావు కోడలు) తన ఆస్తులు కాజేయాలని దౌర్జన్యం చేయిస్తున్నారన్నారు. గోడౌన్లు పగులగొడుతున్నారని తెలియటంతో తాను ఈ నెల 14న వచ్చి చూసి పోలీసులకు ఫిర్యాదు చేశానని, పోలీసులు అసలు పట్టించుకోలేదని తెలిపారు. పైగా తనతో వచ్చిన వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ఆరోపించారు. బంధువైన బీజేపీ నాయకుడు దిలీప్ కొందరిని తీసుకొచ్చి తన మనుషులపై దాడులు చేయించాడని, తనను బెదిరిస్తున్నాడని అన్నారు. గంగూరులోని స్థలంలో ఈనాడు, ప్రియా ఫుడ్స్ పెట్టడానికి యత్నిస్తున్నారని చెప్పారు. ఫిలింసిటీ నుంచి 70 మందిని తీసుకు వచ్చి పనులు చేయిస్తున్నారని పేర్కొన్నారు. తాను పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని చెప్పారు. తాను క్యాన్సర్తో బాధపడుతున్నానని, ప్రభుత్వం తనకు రక్షణ కల్పించి న్యాయం చేయాలని శ్రీరాజరాజేశ్వరి కోరారు. -
‘మండవ’కే విజయ డెయిరీ పగ్గాలు
నిర్ణయించిన సీఎం నేడు ఎన్నిక లాంఛనం విజయవాడ : కృష్ణా మిల్క్ యూనియన్(విజయ డెయిరీ) చైర్మన్ పదవిని మళ్లీ మండవ జానకిరామయ్యకే అప్పగించాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. నగరంలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో మంగళవారం రాత్రి ముఖ్యమంత్రి సమక్షంలో విజయ డెయిరీ చైర్మన్ నియామకంపై సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రస్తుత చైర్మన్ మండవ జానకిరామయ్యతోపాటు 14 మంది పాలకవర్గ డైరెక్టర్లు, పలువురు మంత్రులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. గంటన్నర చర్చల అనంతరం మళ్లీ మండవ జానకిరామయ్యకే విజయ డెయిరీ పగ్గాలు అప్పగించాలని నిర్ణయించారు. బుధవారం జరిగే ఎన్నికల్లో మండవను చైర్మన్గా ఎన్నుకోవాలని డైరెక్లర్లను సీఎం ఆదేశించారు. వేర్వేరుగా భేటీలు.. ముందుగా పాలకవర్గ డైరెక్టర్లతో సీఎం భేటీ అయ్యారు. ఆ తర్వాత జానకిరామయ్యతో సుమారు అర్ధగంట ఏకాంతంగా చర్చలు జరిపారు. అనంతరం జిల్లా మంత్రులు, నాయకులతోనూ చర్చించారు. మండవ ప్రత్యర్థులు ఆయన్ను వ్యతిరేకించారు. అయితే 24 ఏళ్లు ఆ పదవిలో ఉన్న మండవకు మరో ఏడాది చైర్మన్ పదవి అప్పగించాలని మెజార్టీ పాలకవర్గ సభ్యులు సూచించారు. ఈ క్రమంలో సీఎం కూడా మండవకు మద్దతు తెలిపారు. ఏడాది మాత్రమే మండవకు పదవి ! మండవ జానకిరామయ్యకు ఏడాది మాత్రమే చైర్మన్ పదవి ఇవ్వాలని లోపాయికారి ఒప్పందం కుదరిందని సమాచారం. ఏడాది తర్వాత చైర్మన్ నియామకంపై చర్చిద్దామని మంత్రులకు సీఎం చెప్పినట్లు టీడీపీ వర్గాలు వెల్లడించాయి. ఈ సమావేశంలో జిల్లా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, టీడీపీ అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు, చైర్మన్ పదవి కోసం ప్రయత్నించిన చలసాని ఆంజనేయులు, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.


