-
పోరాడి ఓడిన బోపన్న–జేమీ ముర్రే జంట
మోంటెకార్లో ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టెన్నిస్ టోర్నీలో రోహన్ బోపన్న (భారత్)–జేమీ ముర్రే (బ్రిటన్) జంట పోరాటం ముగిసింది. పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో బోపన్న–జేమీ ముర్రే ద్వయం 6–3, 6–7 (4/7), 9–11తో టాప్ సీడ్ జో సాలిస్బరీ (బ్రిటన్)–రాజీవ్ రామ్ (అమెరికా) జోడీ చేతిలో ఓడింది. బోపన్న–జేమీ ముర్రే జంటకు 76,560 యూరోల (రూ. 63 లక్షల 19 వేలు) ప్రైజ్మనీతోపాటు 360 పాయింట్లు లభించాయి. -
వెల్లువలా మద్దతు: బ్రిట్నీ స్పియర్స్కు భారీ ఊరట
Britney Spears తండ్రిని సంరక్షణ బాధ్యతల నుంచి తప్పించాలని చేస్తున్న న్యాయ పోరాటంలో పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్ ‘సగం గెలుపు’ సాధించింది. తండ్రి జేమీ స్పియర్స్కు వ్యతిరేకంగా ఆమె కోర్టులో పోరాడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తన లాయర్(అటార్నీ)ను తానే నిర్ణయించుకునే హక్కు ఆమెకు ఉందని కోర్టు వెల్లడించింది. సుమారు మూడువారాల తర్వాత బుధవారం(జులై14న) జరిగిన వాదనల టైంలో లాస్ ఏంజెల్స్ కోర్టుకు ఫోన్ కాల్ ద్వారా విచారణకు హాజరైన బ్రిట్నీ.. ‘నన్ను చంపే ప్రయత్నం జరుగుతోంది’ అని కన్నీరు పెట్టుకుంది. గార్డియన్షిప్ నుంచి తన తండ్రిని తప్పించాలని.. ఆయన వ్యవహారశైలి క్రూరంగా ఉందని, కనీసం ఈ వ్యవహారంలో వాదనల కోసమైన తనకు స్వేచ్ఛను ప్రసాదించాలని ఆమె న్యాయమూర్తికి విజ్ఞప్తి చేసింది. ఈ విజ్ఞప్తికి స్పందించిన జడ్జి బ్రెండా పెన్నీ.. స్పియర్స్ తరుపున ఇంతకు ముందు అటార్నీ రాజీనామాను ఆమోదిస్తూనే, కొత్త అటార్నీ మాథ్యూ రోసెన్గార్ట్ను నియమించుకునే హక్కును బ్రిట్నీకి కల్పిస్తున్నట్లు తీర్పు ఇచ్చారు. జేమీ స్పియర్ను బ్రిట్నీ సంరక్షణ నుంచి తప్పించాలన్న పిటిషన్పై ఇక నుంచి వాదనలు వినిపించబోతున్నారు రోసెన్గార్ట్. గతంలో స్టీవెన్ స్పీల్బర్గ్, సీన్ పెన్ లాంటి ప్రముఖుల తరపున వాదించారు. Coming along, folks ... coming along 🖕🏻!!!!! New with real representation today ... I feel GRATITUDE and BLESSED !!!! Thank you to my fans who are supporting me ... You have no idea what it means to me be supported by such awesome fans !!!! God bless you all !!!!! pic.twitter.com/27yexZ5O8J — Britney Spears (@britneyspears) July 15, 2021 ఈ వ్యవహారంలో ఆమెకు మద్దతుగా భారీ ఎత్తున ఫ్రీబిట్నీ ‘#FreeBritney’ సైన్ పిటిషన్ను రన్ చేస్తున్నారు. లక్షల మంది సంతకాలు చేపడుతున్నారు. అయితే ఆమె మానసిక స్థితి దృష్ట్యా తండ్రిని తప్పించలేమని కోర్టు గత వాదనల టైంలో స్పష్టం చేసింది. అయితే తదనంతర పరిణామాలు ఆమెకు పూర్తి వ్యతిరేకంగా మారాయి. స్పియర్స్కు చాలాకాలంగా మేనేజర్గా వ్యవహరించిన లారీ రుడోల్ఫ్తో పాటు ఆమె అటార్నీ సామ్యుయెల్ ఇన్గ్హమ్ కూడా తప్పుకున్నాడు. ఇదిలా ఉంటే మేనేజర్ లారీ తప్పుకోవడంతో 39 ఏళ్ల బ్రిట్నీ.. తన కెరీర్కు గుడ్బై చెప్పబోతోందంటూ పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి కూడా. -
నేటి నుంచి ఎల్లారమ్మ జాతర
జామి : ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు, భక్తుల కొంగు బంగారమైన జామి ఎల్లారమ్మ జాతరకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. శనివారం తొలేళ్లు, ఆదివారం జాతర నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ జాతరకు ఉత్తరాంధ్రలోని వివిధ ప్రాంతాలతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన భక్తులు కూడా అధిక సంఖ్యలో వస్తుంటారు. ప్రతి ఏడాదీ ఫాల్గుణ శుద్ధ అష్టమి రోజున జాతర నిర్వహిస్తారు. తొలేళ్లు.. జాతర అనువంశిక అర్చకుడు ఇంటి నుంచి ప్రారంభమవుతుంది. శనివారం రాత్రి 11.15 గంటలకు పూజారి ఇంటి వద్ద అమ్మవారిని గద్దె నుంచి దింపి ఊరేగింపు చేపడతారు. గ్రామ పురవీధుల గుండా సాగిన ఊరేగింపు ఆలయానికి చేరుకున్న తర్వాత అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయంలోకి తీసుకువెళ్తారు. ఈ సమయంలో అమ్మవారి చరిత్రను జముకుల కళాకారులు కథా రూపంలో వివరిస్తారు. మొదటి రోజు ఉత్సవంలో కోలాటం, నృత్య ప్రదర్శనలు, తదితర సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. ఆదివారం జరగనున్న జాతరలో భారీఎత్తున బాణసంచా కాలుస్తారు. ఏర్పాట్లు పూర్తి : ఈఓ వినోదీశ్వరరావు జాతరకు సంబంధించి అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశామని ఈఓ వినోదీశ్వరరావు తెలిపారు. భక్తులకు ఇబ్బంది కలుగకుండా బారికేడ్లు ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటికే ఆలయానికి రంగులు వేసినట్లు చెప్పారు. కమిటీ ఆధ్వర్యంలో సుమారు 300 మందికి వీఐపీ పాస్లు మంజూరు చేసినట్లు ఆలయ కమిటీ చైర్మన్ కొత్తలి శ్రీనివాస్ తెలిపారు. -
రోజుకో ఫొటో...
ఇప్పుడంటే ఫొటో తీయడం చాలా సులువు. సెల్ ఫోన్ ఉంటే చాలు సెల్ఫీల వర్షం కురిపించొచ్చు. కానీ ఇవేవీ పెద్దగా అందుబాటులో లేని రోజుల్లో మాత్రం ఫొటో తీసుకోవాలంటే చాలా కష్టమైన పని. సెల్ ఫోన్లు, సెల్ఫీ లేని రోజుల్లో జామీ లివింగ్ స్టన్ అనే వ్యక్తి గత 30 ఏళ్లుగా రోజుకో ఫొటో తీసుకున్నాడు. ఈ పని ఆయన చనిపోయే రోజు వరకూ చేశాడు. ఇందుకోసం పాతకాలం నాటి పోలరాయిడ్ కెమెరా ఆయన ఉపయోగించాడు. న్యూయార్క్కి చెందిన ఈ ఫొటోగ్రాఫర్ తన ఫొటోలన్నిటినీ జాగత్తగా భద్రపరచి ఉంచుకున్నాడు. బ్రెయిన్ ట్యూమర్తో ఈ మధ్యే జామీ చనిపోయాడు. అతని మిత్రులు హ్యూ క్రాఫోర్డ్, బెట్సీ రీడ్లు ఈ ఫొటోలన్నిటినీ ప్రదర్శనగా ఉంచారు. జామీ జీవితంలోని వివిధ ఘట్టాలను, మిత్రులతో, బంధువులతో గడిపిన క్షణాలను మరోసారి రీప్లే చేయించింది ఈ ప్రదర్శన.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- వైఎస్ భాస్కర్రెడ్డికి బెయిల్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
Advertisement