-
50 వసంతాల ‘సెస్’
అనేక సంక్షోభాలను సంస్కరణలను ఎదుర్కొని ఐదు దశాబ్దాలుగా కాలపరీక్షకు నిలిచి జాతీయస్థాయిలో పేరు ప్రతిష్టలను పొందిన సంస్థ సహకార విద్యుత్ సరఫరా సంఘం లిమిటెడ్ సిరిసిల్ల(కో–ఆపరేటివ్ ఎలక్ట్రిక్ సప్లై లిమిటెడ్, సిరిసిల్ల). సంస్థను ప్రారంభించి ఈ నవంబర్ 1 నాటికి 50 ఏళ్లు విజయవంతంగా పూర్తి చేసుకుం టోంది. ఈ సంస్థను సంక్షిప్తంగా సెస్ అని వాడుకలో పిలుస్తారు. సహకార రంగంలో విద్యుత్తును తన వినియోగదారులకు సరఫరా చేయడంలోనూ, ఉత్తమ సేవలను అందించడంలోనూ దేశంలోనే అత్యున్నత శిఖరాలకు చేరుకున్న సెస్ స్వర్ణోత్సవాల వైపు పరిగెడుతున్నది. సహకార శాఖ చట్టం పరిధిలో అక్టోబర్ 1969న రిజిస్ట్రేషన్ చేసుకొని, 1970 నవంబర్ 1 నుంచి ఆచరణాత్మకంగా ‘సెస్’ ఉనికిలోకి వచ్చింది. భారతదేశం గ్రామాల్లో నివసిస్తున్నది అన్న మహాత్మా గాంధీ.. అభివృద్ధికి గ్రామాలు పట్టుకొమ్మలని కూడా చెప్పారు. ఈ స్ఫూర్తితో వ్యవసాయ అభివృద్ధి, గ్రామాల ఉన్నతి, ప్రజల వికాసం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం గ్రామీణ విద్యుదీకరణ సంస్థ (ఆర్.ఇ.సి)ను 1969లో ప్రారంభించింది. దేశంలోని మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో 5 గ్రామీణ విద్యుత్ సరఫరా సహకార సంఘాలు ప్రారంభమయ్యాయి. ఆయా రాష్ట్రాల్లోని సంస్థల అభివృద్ధి ప్రణాళికలకు గ్రామీణ విద్యుదీకరణ సంస్థ ఆర్థిక సహాయాన్ని అందించింది. ఈ నేపథ్యంలోనే సిరిసిల్లలో సహకార విద్యుత్ సరఫరా సంఘం ఏర్పాటు అయినది. ఇది అప్పటి సిరిసిల్ల పాత తాలూకా ఇప్పటి రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన 13 మండలాలు 2 మున్సిపాలిటీల పరిధిలో తన కార్యకలాపాలను కొనసాగిస్తున్నది. దీని సాధన, స్థాపన వెనుక అప్పటి సిరిసిల్ల్ల శాసనసభ్యులు చెన్నమనేని రాజేశ్వరరావు పట్టుదల ఎన్నదగినది. ఉమ్మడి రాష్ట్రంలో సిరిసిల్ల ప్రాంతానికి ఏకైక సంస్థను తీసుకురావడం అంటే మాటలు కావు. అనంతరం సంస్థ మనుగడలో అప్పటి శాసనసభ్యులు జే నర్సింగరావు, గొట్టె భూపతిల పాలనా సామర్థ్యాలు, అప్పటి ఉన్నత అధికారులు, ఉద్యోగులు, విద్యుత్ ప్రమాదాల్లో మరణించిన సంస్థ ఉద్యోగుల త్యాగాలు, నిస్వార్థ సేవలు కీలక భూమిక వహించాయి. 50 ఏళ్లుగా సంస్థ ఎదురులేకుండా నిలబడడానికి కారణం వారి పటిష్ట ప్రణాళికల పునాది ఫలితమేనని చెప్పాలి. దీనికి నిదర్శనమే నాటి రాష్ట్ర విద్యుత్ బోర్డు నుండి కేవలం 4,720 సర్వీసులు సంస్థకు దఖలు పడగా, నేడు 2 లక్షల 55 వేల 830 కనెక్షన్లు వివిధ కేట గిరీలలో కలిగి, సంస్థ ఎన్నో వందల రెట్లు పురోగతి సాధించింది. నాడు కేవలం 2,299 వ్యవసాయ కనెక్షన్లు ఉండగా నేడు 76 వేల 306 వ్యవసాయ సర్వీసులున్నాయి. సంస్థ అయిదు దశాబ్దాల విజయగాథలో సభ్యులు, వినియోగదారులు, అత్యంత క్రియాత్మకంగా బాధ్యత వహించారు. నేడు సభ్యుల సంఖ్య 2 లక్షల 97 వేల 708 కలదు. వీరి వాటా ధనం 6 కోట్ల 14 లక్షల 81 వేల 587 రూపాయలు కలవు. అంటే సంస్థ ఆర్థిక హార్దిక పురోగతిలో వీరి సహాయ సహకారాలు ఎంత అమోఘంగా పని చేశాయో తెలుస్తుంది. ప్రారంభంలో విద్యుత్ లైన్ల నిర్మా ణంలో, ట్రాన్స్ఫార్మర్ల స్థాపనలో, పని ప్రదేశాలకు సామాగ్రి రవాణా చేయడంలో వీరి స్వచ్ఛంద శ్రమదానం ఇమిడి ఉంది. శ్రమదానం విలువ సుమారు ఒక కోటి 50 లక్షలు ఉంటుంది. వినియోగదారుల శ్రమదానం సంస్థలో 1995 వరకు సాగింది. ఇకపోతే సహకార రంగంలో సెస్ పురోగతి గణాంకాలను పరిశీలిస్తే సగటు తలసరి విద్యుత్ వినియోగం దాదాపు 1,600 విద్యుత్ యూనిట్ల వరకు ఉంది. అదే ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలో తలసరి విద్యుత్ విని యోగం 1,268 యూనిట్లుగా ఉన్నది. ఉద్యోగుల విషయానికి వస్తే సంస్థలో 666 సర్వీసులకు ఒక ఉద్యోగి క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నాడు. ఎన్పీడీసీఎల్లో 586.45 సర్వీసులకు ఒక ఉద్యోగి తన సేవలను అందిస్తున్నాడు. సెస్ సహకార రంగంలో విద్యుత్ పంపిణీ నిర్మాణ సంస్థ కాబట్టి, గతంలో ఇప్పుడు కూడా విద్యుత్తును అప్పటి విద్యుత్ బోర్డు నుంచి ,ఇప్పటి ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ నుంచి కొనుగోలు చేసి తన వినియోగదారులకు ప్రభుత్వ ఆదేశాల రేట్ల ప్రకారం వివిధ కేటగిరీల్లో నాణ్యమైన విద్యుత్ను అందజేస్తున్నది. విద్యుత్ సంస్కరణలలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం 1999లో ఏర్పాటుచేసిన రాష్ట్ర రెగ్యులేటరీ కమిషన్ విద్యుత్ నియంత్రణ మండలి (ఇ.ఆర్.సి) నిబంధనలు ఆదేశాలకు లోబడి సంస్థ పనిచేస్తుంది. 1970లో స్థాపించిన సెస్ పని విధానం, నిర్వహణ తీరు తెన్నులను చూసి, నాటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ ప్రాంతాలలో 13 సహకార విద్యుత్ సరఫరా సంఘాలను స్థాపించాయి. కానీ అందులో ఇప్పుడు తెలంగాణలో ఒకే ఒక్క సెస్ సంస్థ మిగిలిపోగా, ఆంధ్రప్రదేశ్లో నాలుగు సంస్థలు మాత్రమే పనిచేస్తున్నాయి. 8 సంస్థల నష్టాలను దృష్టిలో ఉంచుకొని నాటి ప్రభుత్వం సంబంధిత విద్యుత్ పంపిణీ వ్యవస్థలలో విలీనం చేసింది. ఉద్యోగవర్గాలకు, పాలకవర్గాలకు విని యోగదారులకు మధ్యనగల అవినాభావ సంబంధ బాంధవ్యాలు, సహకార మమకారాల వలననే సంస్థ గత 50 ఏళ్లుగా తన విజయయాత్రను అవి చ్ఛిన్నంగా కొనసాగిస్తున్నది. అనేక ఆటుపోట్లను ఎదుర్కొని కూడా వినియోగదారుల సహకారంతో దిగ్విజయంగా సాగిపోతున్నది. ముఖ్యంగా సంస్థ ప్రారంభమైన ఐదు దశాబ్దాలలో వ్యవసాయ రంగంలో స్వయం సమృద్ధినీ సాధించడమేకాక గణనీయమైన ఉత్పత్తి లక్ష్యాలను అధిగమించింది. తద్వారా రైతాంగం రైతు కూలీల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయి అంతేగాక సిరిసిల్ల నేత రంగం, అనుబంధ రంగాలు, కార్మికులు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న చేనేత పవర్లూమ్ పరిశ్రమకు 50 శాతం విద్యుత్ రాయితీ కల్పించడం వలన చేనేత కుటుంబాల బతుకులు మరింత సుభిక్షంగా ఉన్నాయి. అంతేకాక ఈ సంస్థ పరిధిలో సిరిసిల్ల టెక్సటైల్ పార్క్ కూడా కొనసాగుతున్నది. దీనితో ప్రభుత్వ సంక్షేమ చేయూతతో అనేక మంది నేత కార్మికులు వలసలకు విరామం చెప్పి సిరిసిల్లలోనే తమ వృత్తిని కొనసాగిస్తూ సరిపోయే జీవన భృతిని పొందుతున్నారు. సంస్థ స్వర్ణోత్సవాలు నిర్వహించుకోనున్న సంవత్సరంలో ఉత్తమ వినియోగదారులకు, ఉద్యోగులకు, గ్రామ ప్రతినిధులకు మధ్య మరింత సత్సంబంధాలను ఆదానప్రదానాలుగా కొనసాగాలి. మరో శతాబ్దం వరకు సంస్థ మనుగడ ఇంకా అద్వితీయంగా కొనసాగాలి. -జూకంటి జగన్నాథం వ్యాసకర్త కవి, విమర్శకులు ‘ 94410 78095 -
7 కోట్ల నష్టం అధికమించడం కోసం..
-
అతడు - ఆమె
కథ ఏంబా! ఎట్టుండావు? పిలకాయలు ఎట్టుండారు? బాగా సదవతాండారా? పెతి ఆదివారమూ ఆస్టలు కాడికి పోయి పిలకాయల్ని చూసి, మాటాడి, వోల్లకేం గావాల్నో అడిగి తీసిచ్చేసి వొస్తాండావు గదా! ఇంటికాడ... మనిద్దరి దెగ్గిరా ముదిగారంగా పెరగాల్సిన బిడ్డలు... అట్టా... దిక్కు మొక్కు లేని అనాదలు మాద్రి ఆస్టల్లో పడి వుండారు. తల్సుకొంటే బాదగా ఉంటాది గానీ తప్పదు గదా! వానదేముడు పగబట్టినట్టు వాన చినుకే ఇదల్చక పాయ! అప్పో సప్పో చేసి బూదేవమ్మ గుండికాయను ఎంత లోతుగా చీల్చినా సుక్క నీరు కనబడలా! కయ్యా, చేనూ బీడు పెట్టుకొని అంబోమని అల్లాడతాంటిమి. అదో! ఆ టైంలోనే ఆ దేముడే అంపించినట్టు సవుదీ నుండి మనూరి రెడ్డెప్ప కోడాలు రానెక్క వొచ్చింది. ఆ అక్క సానా మంచిది. పెగ్గి లేకుండా అందుర్నీ మాట్లాడిస్తాది. ఒగదినం మనింటికొచ్చి ‘ఏమ్మే! ఎట్టుండారు? బాగుండారా?’ అని అడిగే. ‘‘ఏం బాగులేకా! సావ లేక, బతక లేకా పీనుగుల మాదిరి పడుండాం. పిలకాయలకు మూడు పూట్లా బువ్వగ్గ్గడా కస్టమైపోతాండాది. బడికి సెలవంటే బయమేస్తాంది. బడుంటే మద్దేనం ఆడే తినేస్తారు గదా!’’ బోరోమని ఏడిస్తి. నా బాద, యింటి పరిస్తితులు, పిలకాయల్ని చూసి రానెక్క గడా చానా బాదపడింది. ‘‘పోనీ! నువు సవుదీ కొచ్చీగడదా?’’ అనింది. అక్క సీరలు, నగలు, వాళ్లింట్లో ఉండే బీరువాలు, మంచాలు, సోపాలు, కుర్చీలు, రకరకాల వొస్తువుల కన్వాగడా నాన్యంగా, సుఖంగా, ఆరోగ్గిరంగా, సంతోషంగా వుండే వాల్ల పిలకాయలు... అక్క అంపించే దుడ్లను భద్రంగా, చిక్కనంగా కర్సుపెడ్తూ వడ్డీలకు తిప్పి దుడ్లు సంపాదిస్తాండే రానెక్క ఇంటాయన... ఇయ్యన్నీ చూస్తాంటే ముందు నుంచీ నాగ్గడా సవుదీకి పావల్లని చానా ఆసగా వున్యాగడా నువ్వొప్పుకోవని గమ్మునుంటి. కాని అక్క అడిగేయాలకు ‘సరేకా’ అనేస్తి గబక్కన. కానీ... పొయ్యేదానికి దుడ్లు ఎట్ల? నెర్రెలిచ్చి బీడు పడుండే మన చేనును అడుమానమో, కొనేదో ఎవురు? అసలకు ముందు నువ్వొప్పుకోవల్ల గదా. ‘‘రానెక్కా! నా బిడ్లకు కూరా కూడు వొద్దు. వేలకు కడుపుకింత బువ్వ... పస్తుల్లేకుండా పెట్టుకొంటే సాలు. సావకుండా సాకేస్తే... మల్లా వాల్ల తలరాతలు ఎట్టుంటే అట్టా బతకతారు...’’ అంటాంటే దుక్కం ఎగదన్నుకొచ్చింది. ‘‘నువ్వే ఎట్లన్నా నన్ను తొడ్కోపోకా! మీ ఇంటాయనకు చెప్పి దుడ్లిప్పీకా! ఆడ పన్లో చేరినంక... నెల నెలా జీతం దుడ్లతో ముందు నీ అప్పే కడతాము.’’ ‘‘సర్లేమ్మే! నువు ఏడవగాకు. ముందు మీ ఇంటాయన్ని అడుక్కో. సవుదీకి పొయ్యే ఆడోల్లంటే ఆయనకు మంట గదా! నోటికొచ్చినట్టల్లా మాటాడతాంటాడు. ఒగ విసియం నువు గడా గ్యాపకం పెట్టుకో. మన అవుసరానికి, మనం దుడ్లు సంపాయించేదానికి అంత దూరం పోతాండాం. ఆడ వాల్లు ఏ పని చెప్పినా చెయ్యల్ల. ఏం చేసినా గమ్మున పడుండల్ల. అట్టగాదు, ఇట్టగాదు అనేదాన్కి లేదు. ముందుగానే నేను చెప్పలేదనీ అనొద్దు మల్ల. అన్నింటికీ సరేననుకొంటేనే ఎలబారల్ల! మల్ల నువు గాని, మీ ఇంటాయన గాని నన్నేమన్నా అంటే ఒప్పుకోను. అయినా గడా తలపెట్టేదే రోట్లోనే ఐతే రోకలి దెబ్బ తప్పదని తెలీదా యేంది?’’ రానెక్క గూడంగానే అన్నీ ఇప్పరించి చెప్పింది. ఏమన్నా గానీ... సవుదీకి పోవల్ల! నా బిడ్లు బాగుండల్లని నేను తెగాయిస్తి. వారం దినాలు యింట్లో ఒగటే కొట్లాట. నెత్తురు కారేట్లు, ఒల్లు వాసేట్లు కొడ్తివి. ‘‘ఆడది ఎట్లన్నా సంపాయించల్లనుకొంటే అంత దూరం పోవల్నా? ఈడగడా సంపాయించొచ్చులే!’’ అని బండ బూతులు తిడ్తివి. దాంతో నాకు యింగా మొండితన వచ్చేస. ‘నువు చూస్కో పోతే బిడ్లను మా అమ్మోల్లింట్లో ఒదిలేసి నేను పొయ్యేది పొయ్యేదే’నని పట్టుబడ్తి. ‘‘ఇన్ని దినాలు సవుదీకి పోయిన ఆడోల్లను కన్న బూతులు తిట్టి... ఇబ్బుడు నా పెల్లాన్నే అంపిస్తే నాకెంత అగుమానమో ఆలోసిత్తివా? నన్నంతా గేలి చెయ్యరా? నేనే మొగం పెట్టుకొని మందిలో తిరుగుడు’’ అంటూ కాల్లబేరానికొస్తివి. తప్పో ఒప్పో, నిజమో అపద్దమో... తెలిసీ తెలీకుండా ఎవుర్నన్నా నీచంగా మాటాడి అగుమానం చేస్తే... ఆ బాద ఎట్టుంటాదో... తన దాకా వస్తేనే గదా తెల్సేది? అందుకే పెద్దోలు ‘కాలు జారినా తీసుకోవచ్చు. నోరు జారితే తిరిగి తీస్కోలేం’ అంటారు. నీ బాద నాకర్థమైనా ఏం చేసేది! ‘‘సూడుబా! మంది కోసరమని, మానం కోసరమని కడుపున పుట్టిన బిడ్లను సంపుకొంటామా యేంది? అంటే అంటార్లే! ఎన్ని దినాలంటారు? ఐనా గడా ఆ అనేటోల్లలో ఒగరన్నా... మనకో పొద్దన్నా... ఒగ ముద్ద బువ్వన్నా పెడ్తారా? మన అగసాట్లేవో మనం పడల్లగనీ!’’ అని నేను నచ్చ చెప్పేయాలనుకున్నా నువు గమ్మునుండి పోతివి. గమ్మునుండక ఏం చేస్తావు మల్ల! నయా పైసా వరుమానం లేదు. ఆడా ఈడా వడ్డీలకు పెరక్కొచ్చిన అప్పులు దప్ప ఏముండాది తిని బతికేదానికి? పాల దుడ్లతో పానాలు నిలుపుకొంటుండాం. మేపు లేకుండా ఆవు గొడ్లు మాత్రం లీటర్లకు లీటర్లు పాలు ఎట్లిస్తాయి? సరి! మొండి ధైర్నంతో రానెక్క వాల్ల దెగ్గిరే అప్పు దీసుకొని సవుదీకి పోతి. రానెక్కే నన్నో సావుకారింట్లో పనికి పెట్టే! రాత్రింబవుళ్లు రెక్కలు ముక్కలయ్యే పనులు! ఎంత కస్టపడ్తినో... ఎంత బాదపడ్తినో... ఎంత ఏడిస్తినో... ఎంతగా మనుసు సంపుకొంటినో... నాకు... ఆ బగుమంతునికే దెల్సు. అన్నీ దెల్సి అద్దానంలో పడ్తినా అని అల్లాడి పోతి. బిడ్డల్ని, వాల్ల బవిస్యత్తును గ్యాపకం పెట్టుకొని మెలిమెల్లిగా అన్నిటికీ అలవాటు పడిపోతి. ‘కస్టపడల్ల! దుడ్లు సంపాయించి యింటికి అంపించల్ల! అంతే! ఇంగో ఆలోసనే వుండగూడద’ని గుండె రాయి చేస్కొంటి. అందుకే అప్పులన్నీ దీరిపోయి మన కుటుంబరం ఒక గాట్లో పడేదాంకా వ్రుదాగా దుడ్లు కర్సు పెట్టగూడదని... బిడ్ల పైన ఎంత కలవరమైనా, ఒగపారి వొచ్చి సూడల్లని మనుసు గింజకపోతున్నా... ఈ అయిదేండ్లు ఇంటికి రానేలేదు. నేనొచ్చేసిన తొలి దినాల్లో ‘పక్కన నువు లేకండా నిద్దరే రానంటాంది మే!’ అని నువు గుసగుసలాడ్తాంటే నా కండ్లు నీటి కడవలయ్యేటివి. పచ్చి మాదిరి ఎగిరొచ్చి నిన్ను వాటేసుకొని బొరోమని ఏడవాలన్పించేది. ‘నా మొగుడు సీరామచెందురుడ’ని మనుసు సంతోసపడేది. రాన్రాను నువు గడా నేను లేని బాదకు అలవాటు పడిపోతివేమో మల్ల ఎబ్బుడూ అంత ప్రీతిగా మాటాడలా! ఈ బాదలన్నీ ఇంగో ఐదేండ్లు కస్టపడ్తే తీరిపోతాయిలే! పిలకాయల సదువులు, పాప పెండ్లికి సంపాయించుకొంటే చాలు. ఇబ్బుడు నువు గడా పొట్లేండ్ల యాపారం చేస్తాండావుగదా. పిలకాయల బాద్దెతలు తీరిపోతే... మనకెంత గావల్ల! తిని ఆయిగా వుండొచ్చులే, అనుకొంటి! అంతా మనమనుక్నొట్లే జరిగిపోతే ఇంగేముంది? బగమంతున్ని ఎట్టా తలస్తాము? అవునుబా! అనుకోకండా... నడినెత్తిన పిడుగు పడినట్లు ఈ పెబుత్వం ‘నితాఖత్’ చట్టం చేసింది. నువ్వూ యినే వుంటావు ఈ పాటికి. టీవి వార్తల్లో గడా చూసింటావు. విజిట్ వీసాలో ఈ దేసానికొచ్చినవాల్లు ఏ పనన్నా చేస్కొనే అక్కు వుండేదంట. అదిబ్బుడు చెల్లదంట. కాబట్టి ఆ వీసాతో ఈడికొచ్చినోల్లంతా తిరిగెల్లి పావల్లని చెప్పినారు. దాంతో ఎంతోమంది గగ్గోలు పడిపోతాండారు. కొంతమందైతే పాపం... ఉన్న చెలకా, చేనూ అమ్ముకొచ్చినోల్లు, లచ్చలకు లచ్చలు అప్పులు చేసి వొచ్చినోల్లు... యింగా పనులకు కుదురుకోనేలేదు. ఒగ దీనారు గడా సంపాయించనే లేదు. తిరిగెల్లమంటే విమానం టికెట్ల కన్నా దుడ్లెట్లని దొల్లి దొల్లి ఏడస్తాండారు. మన పెబుత్వం గడా కొంచెం గడువిమ్మంటే ఒగ మూడు నెల్లు గడువిచ్చిందీ పెబుత్వం. ఆ వరకు అంతా తట్టా బుట్టా సద్దుకోవాల్సిందే! లేపోతే జైల్లో పెడ్తారంట. బయటే యిన్ని బాదలుండె. ఇంగా జైల్లో ఎన్ని నరక బాదలుంటాయో! తల్సుకొంటేనే బయమేస్తాంది. అయినాగడా... మనం ఎంత ఆసపడ్నా గానీ మనకు ఏది, ఎక్కడ, ఎంత రుణమో అంతే దక్కతాదని మనుసు నిమ్మలం చేస్కొంటి. ఏడ్చి... ఏడ్చి అల్సిపోతిమల్ల! నీకు ఎన్ని తూర్లు పోన్ చేస్తాన్నా... ఆ నెంబరే లేదని తిరుగు జవాబొస్తాంది. ఏమైంది నీ పోనుకు? రిపేరైతే... పోన్ బూతునుండన్నా చెయ్యల్ల గదా! ఎట్లా... ఇంటికొచ్చేస్తాండా గదా... నేనిన్ని దినాలు చెప్పల్లని... చెప్పలేకపోయిన విసయాలన్నీ జాబు రాద్దామనుకొంటి. ఇబ్బుడు నా మనుసు కొంచెం తేటపడింది. కొత్త ఇంటిలో, పిలకాయల్తో, నీతో కలిసి మల్లీ ‘కొత్త బతుకు’ ఆరంబించల్లని నా మనుసిప్పుడు ఆత్రపడ్తాంది. నీకు దెల్సు కదా... పెతి నెలా నాకొచ్చిన జీతమంతా... అట్లే నీకంపించేస్తాంటి గదా! నా దెగ్గిర ఒక్క రూపాయ గడా లేదు. నువ్వు బిన్నే దుడ్లు సరిచేసి అంపించు. విమానం టికెట్టు ముందుగానే తీసుకోవల్ల గదా! జనాలెక్కువ. మల్ల దొరకతాదో లేదో! కాబట్టి నువు ఈ జాబు అందిన వెంటనే పోనుచెయ్యి. దుడ్లంపించు. లేపోతే పోతే జైలుకు, వల్లకాకపోతే వల్లకాటికే పోవల్లంతే! ఇట్లు సుసీల సుసీలా! నన్ను చమించుమే! నేను నీకు ఒగ రూపాయి గడా అంపించలేను. నిజింగా నా దెగ్గిర లేదు. అవును సుసీలా! నువు దుడ్లే లోకమని ఆ దేసంలో వుండిపోతివి. నువు అంపించే దుడ్లు నాకీ లోకాన్ని, సుకాలను సూపించింది. అడిగే వోల్లు లేరు. అడ్డం చెప్పేవాల్లూ లేరు. చేతి నిండా దుడ్లు బుద్దిని గడ్డి తిన్పించి అన్ని అలవాట్లూ... అనుబోగంలోకి తెచ్చినాయి. అనుబగించిన సుకాలు... ఒంట్లో నోరిడిసి చెప్పుకోలేని రోగాల్ని దెచ్చినాయి. రానీ మల్లా నీకు చెప్తాదని వాల్ల అప్పు మాత్రమే తీర్చిన. మిగతా అప్పులట్లే వుండాయి. కొత్త బోరు ఎయ్యలా! పక్క మడి కొన్లా! ఇల్లు కట్లా! పిలకాయల పేర్లతో బేంకులో దుడ్లు ఎయ్యలా! ఏ చీటీలు కట్లా! ఆకిరికి పిలకాయల్ని ఆస్టల్లో గడా చేర్చలా! మనూరి బళ్లోనో సదవతాండారు. నీతో సెప్పద్దని వాల్లని బయపెట్టింటి. సుసీలా! నీ దుడ్లంతా తినేస్తారని మాయమ్మ, అయ్యల్ని తనీ కాపరం పెట్టమంటివి గాని... ఇబ్బుడు మాయమ్మే నా బిడ్లకింత బువ్వ పెడ్తాంది. సుసీలా! దుడ్లతో దునియాలో దేన్నన్నా కొనచ్చనుకొంటివి గానీ... కొనలేనివి వుంటాయి. ముక్యంగా ప్రేమల్ని, ఆరోగ్గిరాల్ని, ఆయుసును, గడ్సిపోయిన కాలాన్ని కొనలేమని తెలుసుకో! ఇయ్యన్నీ నీకు ఎట్టా చెప్పాలనుకొంటుండగనే గోరు సుట్టు మీద రోకటి పోటు మాదిరి ఈ ‘నితాఖత్’ చట్టం గురించి తెల్సి, నేను చాలా కుంగిపోయినాను. నువు పోను చేస్తే ఏమని చెప్పల్లో దిక్కు తోచక కార్డు తీసేస్తి. ఆ బగుమంతుడు నా ఒంట్లో ప్రానాన్ని తొరలోనే తీసేస్తాడని తెల్సుగానీ... నేను నీకు చేసిన అన్నీయానికి బదులుగా నా ప్రానాలు ఇబ్బుడే తీసేసుకొంటాండా! నన్ను చమించు సుసీలా! ఇట్లు, జగన్నాదం
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆది సాయికుమార్ కొత్త మూవీ.. గోవాలో మ్యూజిక్ సిట్టింగ్స్
కాంగ్రెస్కు శామ్ పిట్రోడా రాజీనామా
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
ఫ్రెండ్ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్ (ఫోటోలు)
ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
IPL 2024: సన్రైజర్స్, లక్నో మ్యాచ్.. లంక యువ స్పిన్నర్ అరంగేట్రం
ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
IPL 2024 SRH VS LSG: మరో మూడేస్తే..!
ఐసీఎంఆర్ విడుదల చేసిన ఆహార మార్గదర్శకాలు ఇవే..
తప్పక చదవండి
- ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
- ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
- ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో వివాదాస్పద మూవీ
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement