breaking news
jabiullah
-
ప్రొద్దుటూరులో మున్సిపల్ వైస్చైర్మన్ వీరంగం
ప్రొద్దుటూరు క్రైం : అధికార పార్టీ నాయకుడు, మున్సిపల్ వైస్చైర్మన్ వైఎస్ జబీవుల్లా తన వర్గీయులతో కలసి వీరంగం సృష్టించారు. మైదుకూరు రోడ్డులో అందరూ చూస్తుండగా వారు వీధి రౌడీల్లా ప్రవర్తించారు. గురువారం 50 మందికి పైగా ఒక్కసారిగా హోటల్లోకి ప్రవేశించి అందులో ఉన్న అహ్లే హదీస్ కమిటీ కార్యదర్శి చాపాడు జిలానిబాషాతోపాటు మరి కొందరిపై దాడికి పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. జిలానిబాషా పట్టణంలోని దస్తగిరిపేటలో నివాసం ఉంటున్నాడు. అతను ప్రొద్దుటూరులోని మైదుకూరు రోడ్డులో హోటల్ నిర్వహించుకుంటూ క్యాటరింగ్ కూడా చేస్తున్నాడు. అతను మూడేళ్ల క్రితం జమాతే అహ్లే హదీస్ కమిటీకి కార్యదర్శిగా ఎన్నికయ్యాడు. బైపాస్రోడ్డులో ఉన్న ఈద్గా వద్ద కమిటీ తరపున రంజాన్, బక్రీద్ పండుగలకు ఏర్పాట్లు చేస్తుంటారు. ఇందుకయ్యే ఖర్చులను చందాల రూపంలో నమాజ్కు వచ్చే ప్రజల నుంచి వసూలు చేస్తుంటారు. ఈ క్రమంలో బక్రీద్ పండుగ సందర్భంగా బుధవారం ఈద్గా వద్ద జిలానిబాషాతో పాటు కమిటీ సభ్యులు జోలె పట్టుకొని చందాలు వసూలు చేస్తున్నారు. అయితే అక్కడే ఉన్న వైస్చైర్మన్ జబీవుల్లా సోదరుడు మైనుద్దీన్ చందాలు వసూలు చేయొద్దని చెప్పాడు. ఈద్గా పండుగ ఖర్చుల కోసం వసూలు చేస్తున్నాం వద్దని చెబితే ఖర్చులు ఎలా భరించాలని అతనితో అన్నారు. దీంతో మైనుద్దీన్ వారిని పరుష పదజాలంతో తిట్టాడు. వారి మధ్య వాగ్వాదం జరుగుతుండగా అక్కడున్న వారు వారించడంతో అందరూ ఇళ్లకు వెళ్లిపోయారు. జబీవుల్లా ఫోన్ చేసి బెదిరించాడు.. ఈ క్రమంలో గురువారం ఉదయం వైఎస్ జబీవుల్లా కమిటీ సభ్యులకు ఫోన్ చేసి బెదిరించాడు. ఈద్గాలో జరిగిన సంఘటన గురించి అందరికీ చెప్పావంట కదా.. నీవు ఎక్కడున్నావో చెప్పు వస్తున్నా అని అతను మందీ మార్బలంతో మైదుకూరు రోడ్డులోని హోటల్ వద్దకు వచ్చాడు. జబీవుల్లాతో పాటు సుమారు 50 మందికి పైగా హోటల్లోకి ప్రవేశించి రాడ్లు, కట్టెలు, అక్కడే ఉన్న పాలక్యాన్లను తీసుకొని విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డారు. అక్కడే ఉన్న కొందరు విడిపించడంతో జబీవుల్లా, అతని వర్గీయులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ సంఘటనలో జిలానిబాషా గాయ పడ్డాడు. దీంతో ఆగ్రహించిన జిలానిబాషా కుటుంబ సభ్యులు, బంధువులు వైస్ చైర్మన్ జబీవుల్లా దౌర్జన్యాన్ని నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించారు. అయితే పోలీసులు అక్కడికి చేరుకొని వారికి సర్ది చెప్పడంతో ఆందోళన విరమించారు. గాయపడిన జిలానిబాషాను చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విషయం తెలియడంతో అహ్లే హదీస్ కమిటీ æసభ్యులు పెద్ద ఎత్తున జిల్లా ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. సీఐలు వెంకటశివారెడ్డి, ఓబులేసు ఆస్పత్రికి చేరుకొని విచారించారు. జిలానిబాషా ఫిర్యాదు మేరకు జబీవుల్లాతో పాటు ముజాహిద్దీన్, ఆరిఫ్, జుబేర్, చక్రి మరి కొందరిపై కేసు నమోదు చేసినట్లు టూ టౌన్ ఎస్ఐ మధుమళ్లేశ్వరరెడ్డి తెలిపారు. తనను కులంపేరుతో దూషించి దాడి చేశారని జబీవుల్లా డ్రైవర్ చక్రీనాయక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జిలానిబాషా, ఆయన కుటుంబ సభ్యులపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
అభినయ ఖిల్లా ‘జబీవుల్లా’
గుంతకల్లు: అభినయంలో అందెవేసిన చేయి రిటైడ్ రైల్వే ఉద్యోగి జబీవుల్లా. జబీవుల్లా నటనకు ప్రతి ఒక్కరు తన్మయత్వం చెందాల్సిందే. తను స్టేజీపైకెక్కితే చాలు.. అవార్డుల తన చెంతకు రావాల్సిందే. ఎన్నో నాటకాల్లో ఇప్పటిదాకా ఏకంగా 50కి పైగా అవార్డులు, ప్రశంసా పత్రాలు, షీల్డులు దక్కించుకున్నారు. తాజాగా 2017కు అనంతపురం జిల్లా స్థాయి బళ్లారి రాఘవ అవార్డు ఎంపిక కావడం గమనార్హం. ఆగస్టు 3న బళ్లారి రాఘవ అవార్డును ఆయనకు అందజేయనున్నారు. గుంతకల్లు రైల్వే డివిజన్లో కేంద్ర కార్యాలయంలో క్రాప్ట్మెన్(సీనియర్ సెక్షన్ ఇంజనీర్)గా పని చేస్తూ మూడేళ్ల క్రితం ఉద్యోగవిరమణ చేసిన జబీవుల్లా పూర్తి పేరు మహమ్మద్ ఇస్మాయిల్ జబీవుల్లా. మద్రాస్ సదరన్ మరాఠా రైల్వేస్లో డ్రైవర్గా విధులు నిర్వహించిన సయ్యద్ జబీవుల్లా బషీరున్నీషా దంపతులకు రెండవ సంతానంగా 1954 ఏప్రిల్ 8వ తేదీన తమిళనాడులోని అరక్కోణంలో జన్మించాడు. జబీవుల్లా తండ్రి ఉద్యోగ రిత్యా ఆంధ్రాకు వచ్చి స్థిరపడ్డాడు. 1970లో రెండవ తరగతి పూర్తి చేసుకున్న అనంతరం తొలిసారిగా కడప జిల్లా నందలూరులో విశ్వాత్తాపం అనే నాటకంలో ప్రతి నాయకుడి పాత్రను పోషించి నాటక జీవితాన్ని అరంభించాడు. ఈ నాటకంలో ఇతర నటనకు ఉత్తమ విలన్గా అవార్డు వచ్చింది. 1971లో గుంతకల్లులో చంద్రయ్య అనే నటుడు నిర్వహిస్తున్న రవీంద్ర ఆర్ట్స్లో చేరి ఉత్తమ కళాకారులుగా రాణించిన సీపీ రామ్మూర్తి, కోటేశ్వరరావు ఆనంద్, పంజా ప్రసాద్రావు సహకారంతో అనేక నాటకాల్లో నటించారు. ముఖ్యంగా ప్రఖ్యాత హాస్యనటుడు దివంగత గురుమూర్తి వద్ద హాస్యం నుంచి ట్రాజడీకి వెళ్లే కళను నేర్చుకున్నాడు. ఇక నాటి నుంచి అనేక హృదయ విదారక సన్నివేశాల్లో నటించి ప్రేక్షకులను రంజింపజేశారు. ప్రధానంగా రైల్వే ఉద్యోగిగా రైల్వే ఆస్తుల భద్రత, ప్రయాణీకుల రక్షణపై, వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రమాదాలతో జరిగే నష్టాలు తదితర అంశాలపై అనేక నాటకాలు రచించడంతో పాటు ఏక పాత్రాభినయాలు చేసి అధికారులను మెప్పించారు. 2000లో రైలు మార్గాలపై ఉండే మనిషి కాపలా ఉండని లెవల్ క్రాసింగ్ గేట్ల వద్ద జరిగే ప్రమాదాలపై డాక్యుమెంటరీ చిత్రానికి అప్పటి దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ స్పందించి ఉత్తమ నటుడిగా ప్రశంసాపత్రాన్ని అందజేశారు. చాలా అనందంగా ఉంది బళ్లారి రాఘవ అవార్డు(2017)కు ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉంది. నాటకాల్లో అభినయించడం వల్ల జీవితం ఎంతో హాయిగా గడపడంతో పాటు మంచి నడవడిక అలవడింది. – జబీవుల్లా, రిటైడ్ రైల్వే ఉద్యోగి