breaking news
IT Sector Gloom
-
నేలచూపులు చూస్తున్న ఐటీ సెక్టార్
ముంబై: విశ్లేషకులు భయపడ్డట్టుగానే ఐటీ సంస్థలు ప్రస్తుత క్వార్టర్ ఫలితాలు నిరాశాజనకంగా వెలువరించాయి. ముఖ్యంగా ప్రధాన ఐటీ సంస్థలు ఇన్ఫోసిస్, టీసీస్ ఆదాయాల్లో అంచనాలను కొద్దిగా అధిగమించినప్పటికీ ఇన్వెస్టర్లను గొప్పగా ప్రభావితం చేయలేక పోయాయి. ఇదే బాటలో విప్రో, మైండ్ ట్రీ ప్రకటించిన ఫలితాలు కూడా ఉండడంతో సోమవారం నాటి మార్కెట్లో ఐటీ సెక్టార్ నష్టాలను మూటగట్టుకుంటోంది. మైండ్ ట్రీ 5శాతం, విప్రో 4 శాతానికిపైగా ఇన్ఫోసిస్ 0.32, టీసీఎస్ ఒక శాతం నష్టాలను ఆర్జిస్తున్నాయి. దీంతో బీఎస్ఈలో ఐటి ఇండెక్స్ భారీగా నష్టపోతోంది. నిఫ్టీ50 ఇండెక్స్ లో 9 శాతం లాభంతో పోలిస్తే ఐటీ గత ఆరు నెలల్లో 10 శాతానికి పైగా నష్టపోయింది. ఈ ప్రభావం స్టాక్ మార్కెట్లపైనా పడింది. శుక్రవారం మార్కెట్ల ముగిసిన తరువాత ప్రకటించిన మూడవ అతిపెద్ద ఐటీ సేవల సంస్థ విప్రో, మరో సంస్థ మైండ్ ట్రీ ఆర్థిక ఫలితాలు కూడా అంతంత మాత్రంగానే ఉండడం ఐటీ రంగాన్ని ప్రభావితం చేస్తోంది. విప్రో రెండవ క్వార్టర్ ఫలితాల్లో లాభాల క్షీణత, ఇన్ఫోసిస్ పేలవమైన ఆదాయ వృద్ధి నమోదుతోపాటు, మూడు నెలల్లో రెండోసారి గైడెన్స్ కోత నిర్ణయంతో ఇన్వెస్టర్ల సెంటిమంట్ దెబ్బతింది. మరోవైపు మైండ్ ట్రీ కూడా నిరుత్సాహకర ఫలితాలు కూడా దీనికి తోడుకావడంతో భారీ అమ్మకాల ఒత్తిడి నెలకొంది. ఇదే బాటలో ఇతర ఐటీ మేజర్లన్నీ పయనిస్తున్నాయి. -
టీసీఎస్ సంచలన ప్రకటనతో ఐటీ ఢమాల్
ఐటీ సెక్టార్ అభివృద్ధికి సంబంధించి ఐటీ మేజర్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) సంచలన వ్యాఖ్యలు ఐటీ రంగాన్ని మరింత కుదిపేస్తున్నాయి. క్యూ 2 లో ఫలితాలు ఆశాజనకంగా ఉండకపోవచ్చనే అనుమానాలు వ్యక్తం చేసింది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్, ఇన్సూరెన్స్ సేవల(బీఎఫ్ఎస్ఐ) విభాగంలో ప్రతికూలతలు నమోదవుతున్నట్టు ముంబై కి చెందిన ఐటీ దిగ్గజం టీసీఎస్ వెల్లడించింది. ఈ ప్రభావం ఈ ఏడాది ద్వితీయ త్రైమాసికం(జూలై-సెప్టెంబర్)లో కనిపించనున్నట్లు హెచ్చరించింది. దీంతో మదుపర్లు భారీ అమ్మకాలతో గురువారం నాటి మార్కెట్ లో ఫ్రంట్ లైన్ ఐటీ రంగ షేర్లు భారీగా నష్ట పోతున్నాయి. ప్రధానంగా టీసీఎస్ షేర్ల అమ్మకాలు ఊపందుకున్నాయి. సుమారు 6.4 శాతం పతనమై ఆరునెలల కనిష్టానికి చేరింది. మరో ఐటీ మేజర్ విప్రో షేర్ కూడా ఇదే కోవలోకి చేరింది. భారీ అమ్మకాల ఒత్తిడితో 52 వారాల కనిష్టాన్ని నమోదు చేసింది. ఆగష్టు 2016 డేటా ఆధారంగా వరున నష్టాలు ఊపందుకుంటున్నాయనీ, ఆర్థిక సేవలు, బీమా (బిఎఫ్ఎస్ఐ) సేవల పరిణామల కారణంగా ప్రధానంగా కంపెనీ కస్టమర్ల వృద్ధిలో ఒక హెచ్చరిక గుర్తించబడిందని బీఎస్ కి అందించిన ఒక ప్రకటనలో తెలిపింది . అమెరికా ప్రాజెక్టులపై ఈ ప్రభావం కనిపిస్తోదని టీసీఎస్ పేర్కొంది. ఈ ప్రకటన స్టాక్ ప్రతికూల ప్రభావం చూపించిందనీ, తదుపరి 2-3 త్రైమాసికాల్లో టీసీఎస్ అండర్ ఫెర్ ఫార్మర్ గా ఉండనుందనీ మార్కెట్ నిపుణుడు అవినాష్ గోరాష్కర్ వ్యాఖ్యానించారు. ఇది ఊహించిన పరిణామమేని, మొత్తానికి ఐటీ రంగానికి ప్రతికూలమేనన్నారు. మరోవైపు బ్రెగ్జిట్ ఉదంతం నేపథ్యంలో కొన్ని ప్రాజెక్టులు క్యాన్సిల్ కావడం, ఆలస్యంకావడం తదితర సమస్యలు ఎదుర్కొంటున్నట్లు ఐటీ దిగ్గజాలు ఇన్ఫోసిస్, మెండ్ ట్రీ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతోపాటు క్యూ 1 ఆర్థిక ఫలితాలు కూడా ఐటీ రంగాన్ని దెబ్బతీశాయి. ఈ పరిణామాల నేపథ్యంలో హెచ్సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, విప్రో, ఒరాకిల్ ఫైనాన్షియల్ నేలచూపులు చూస్తున్నాయి.